English | Telugu

రమ్యకృష్ణని చూసి...సెట్ లో కింద పడి దొర్లిన జగపతిబాబు

జయమ్ము నిశ్చయమ్మురా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి రమ్యకృష్ణ వచ్చింది. ఇక ఆమెను చూసేసరికి ఒక రేంజ్ లో జగపతి బాబు ఫుల్ ఆన్ ఫైర్ తో వెల్కమ్ చెప్పారు. "వెల్కమ్ టు ఓజి రోజా ఆఫ్ ఇండియన్ సినిమా" అని చెప్పడం ఆమె వచ్చి జగ్గు భాయ్ డాన్స్ చేయడం జరిగిపోయాయి. "రమ్యకృష్ణ వచ్చేసింది వేడి పెరిగిపోయింది" అని చెప్పేసరికి ఆమె షాకయ్యింది. "ప్రపంచంలో ఎవరైనా ఫోన్ హలో అంటారు కానీ రమ్య కృష్ణ మాత్రం ఆ అంటుంది" అని చెప్పేసరికి ఆమె ఫుల్ గా నవ్వేసింది. "రమ్యకృష్ణ లాంటి హాట్ అమ్మాయి కార్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవడెక్కించుకోడు" అనేసరికి "నువ్వు  చాలా బ్యూటిఫుల్ పర్సన్ వి హీరోయిన్స్ తో చాలా మర్యాదగా ఉంటావ్" అంటూ జగ్గు భాయ్ గురించి చెప్పింది రమ్య కృష్ణ.

పృథ్వి కి ... ప్రపోజ్ చేసిన విష్ణుప్రియ

సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి నబీల్, సీత, విష్ణుప్రియ, ప్రిథ్వి వచ్చారు. ఇక మళ్ళీ విష్ణు ప్రియా, ప్రిథ్వి లవ్ స్టోరీ మొదలయ్యింది. ఇక విష్ణు ప్రియా రాగానే "చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకు ఒకటే సేమ్ గా ఉంటాయి..అవి కళ్ళు. మన ముక్కు పెరిగినట్టు మన కళ్ళు పెరగవు. ఇక విష్ణు ప్రియా కాన్సంట్రేషన్ ప్రిథ్వి మీద పడింది. ఆయన బుగ్గలు చూడండి గులాబీ జామూన్స్ లా ఉన్నాయి" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక సుమ ఐతే విష్ణు ప్రియా, ప్రిథ్వితో "మీరు ఇప్పుడు ఒక హాంటెడ్ హౌస్ కి టూర్ కి వెళ్ళబోతున్నారు" అని చెప్పింది. దాంతో విష్ణు అక్కడ దెయ్యం మీరేనా అంటూ సుమ మీద సెటైర్ వేసింది. దానికి సుమ వెంటనే కౌంటర్ ఇచ్చింది. "నువ్వు ఉండగా నేనెందుకు అవుతా దెయ్యం..ఐనా నీకు దెయ్యం కనపడినా కూడా హహహ అనే నవ్వుతావుగా " అంది. ఇక సుమ వీళ్ళతో రాపిడ్ ఫైర్ ఆడించింది.

Karthika Deepam2 : గాయపడిన అత్త మనసు.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -495 లో....సుమిత్ర గురించి దశరథ్ బాధపడతాడు. కార్తీక్ వచ్చి.. మావయ్య అత్త మనసు గాయపడింది. ఇప్పుడు రావడానికి ఇష్టపడడం లేదు.. కొంచెం అత్తకి టైమ్ ఇవ్వండి ఎక్కడున్నా వచ్చేస్తుందని కార్తీక్ దైర్యం చెప్తాడు. పాపం దశరథ్ ని చుస్తే జాలేస్తుంది. అయిన ఏదో కనుక్కుంటానని వెళ్లావు ఏమైంది అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. మమ్మీ దీప దగ్గర ఉందో చుడడానికి వెళ్ళాను కానీ అక్కడ లేదు. . బావ కొత్త గేమ్ స్టార్ట్ చేసాడు.. అదేంటో కనుక్కోవాలని జ్యోత్స్న అంటుంది.

Brahmamudi : బిడ్డని కంటే ప్రాణానికే ప్రమాదం.. వెక్కి వెక్కి ఏడ్చిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -858 లో.....కావ్య టపాసులు కాల్చాలని రాహుల్, రుద్రాణి కలిసి టాక్సిక్ కెమికల్స్ కలిపిన టపాసులు తీసుకెళ్తారు. వాటిని రాజ్ తీసుకొని వచ్చిన టపాసులలో కలుపుతారు. ఆ టపాసులని అప్పు, కళ్యాణ్ ఇద్దరు తీసుకెళ్ళి కాలుస్తారు. కావ్య కదా అవి కాల్చాల్సినవి అనుకొని రాజ్ దగ్గరికి రుద్రాణి వచ్చి కావ్య దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి నీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నావ్ కదా.. మరి కావ్య దగ్గరికి వెళ్లి తీసుకొని వచ్చి తనతో సెలబ్రేట్ చేసుకోమని రుద్రాణి చెప్తుంది.

కోటి రూపాయల లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటున్న...బిగ్‌బాస్ బ్యూటీ

బుల్లితెర మీద ప్రియాంక జైన్ - శివ్ కుమార్ గురించి తెలియని వారు లేరు. మౌనరాగం సీరియల్ తో ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ ఆన్ స్క్రీన్ జంట ఆఫ్ స్క్రీన్ లో కూడా జంట కాబోతున్నారు. వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళ కోసం ఒక కొత్త ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. కోటి రూపాయల లోన్ తో ఈ ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ డ్రీం హోమ్ విత్ కోటి రూపాయల లోన్ అనే వీడియోని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నాం అని చెప్పుకొచ్చారు. "ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మా ఫ్యూచర్ హోమ్ ని కట్టుకుంటున్నాం.