English | Telugu
Karthika Deepam2 : గాయపడిన అత్త మనసు.. కార్తీక్ ఏం చేయనున్నాడు!
Updated : Oct 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -495 లో....సుమిత్ర గురించి దశరథ్ బాధపడతాడు. కార్తీక్ వచ్చి.. మావయ్య అత్త మనసు గాయపడింది. ఇప్పుడు రావడానికి ఇష్టపడడం లేదు.. కొంచెం అత్తకి టైమ్ ఇవ్వండి ఎక్కడున్నా వచ్చేస్తుందని కార్తీక్ దైర్యం చెప్తాడు. పాపం దశరథ్ ని చుస్తే జాలేస్తుంది. అయిన ఏదో కనుక్కుంటానని వెళ్లావు ఏమైంది అని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. మమ్మీ దీప దగ్గర ఉందో చుడడానికి వెళ్ళాను కానీ అక్కడ లేదు. . బావ కొత్త గేమ్ స్టార్ట్ చేసాడు.. అదేంటో కనుక్కోవాలని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత అసలు అమ్మమ్మ ఇక్కడ ఎందుకు ఉంది.. జ్యోత్స్న వస్తే ఎందుకు చెప్పొద్దన్నావని దీపని శౌర్య అడుగుతుంది. ఇది దాగుడు మూతల ఆట జ్యోత్స్న వస్తే అమ్మమ్మ దొరికిపోతుంది కదా అని దీప అంటుంది. మరొకవైపు నేను వేరొక ఇల్లుకి షిఫ్ట్ అవుతానని శ్రీధర్ తో కాశీ చెప్తాడు. వద్దని అన్నా కూడా కాశీ వినడు.. దాంతో నీ ఇష్టం కానీ మంచి ఇల్లు తీసుకోమని శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణకి జ్యూస్ తీసుకొని వస్తుంది జ్యోత్స్న. వద్దని శివన్నారాయణ అంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని జ్యోత్స్నని దశరథ్ అంటాడు. అసలు మమ్మీ వెళ్లడానికి కారణం నువ్వే కదా డాడీ అని జ్యోత్స్న అంటుంది. ఇద్దరిని విడగొట్టింది. నువ్వే అని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. శివన్నారాయణ బీపీ పెంచుకుంటుంటే.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు జ్యోత్స్న అని పారిజాతం అక్కడ నుండి పంపిస్తుంది.
ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి శౌర్య వచ్చి.. అమ్మమ్మ మీరు దాగుడుమూతలు ఆడుతున్నారంట కదా.. ఇందాక జ్యోత్స్న వచ్చింది.. నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పలేదు. తాత, ముద్దుల తాత కూడా వస్తాడా అని శౌర్య అనగానే నాకోసం ఎవరు రారని సుమిత్ర సమాధానం చెప్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి అమ్మమ్మ రెస్ట్ తీసుకుంటుందని శౌర్యని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.