English | Telugu

Illu illalu pillalu : శోభని బలవంతంగా తీసుకెళ్లిన తన ఫ్రెండ్స్.. ధీరజ్ కాపడగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -296 లో.....శ్రీవల్లి బట్టలు ఆరెస్తూ.. ఈ అమూల్య నా గురించి ఆ ప్రేమకి చెప్పినట్లుంది.. ఇప్పుడు ఆ ప్రేమ నన్ను ఏం అడుగుతుందోనని టెన్షన్ పడుతుంది. అప్పుడే ప్రేమ పక్కన వచ్చి నిల్చుంటుంది. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది. అక్కడికి కూడా ప్రేమ వెళ్తుంది. అమూల్యని జాతర లో ఎందుకు వదిలేసి వెళ్లావని ప్రేమ అడుగుతుంది. జాతర అంతా చూడమని వెళ్ళానని శ్రీవల్లి చెప్తుంది.

దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందని తెలిస్తే మాత్రం ఊరుకోనని శ్రీవల్లికి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు శోభ తన ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్తుంది. గౌతమ్ వాళ్ళు ఎక్కడ అని శోభ తన ఫ్రెండ్స్ అయిన బాయ్స్ ని అడుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారని అబద్దం చెప్తారు. శోభతో వాళ్ళు తప్పుగా బెహేవ్ చేస్తూ ఉంటే అది ధీరజ్ చూసి కార్ ఆగిపోయినట్లు అబద్ధం చెప్తాడు. ఆ ఇద్దరు బాయ్స్ ని కార్ తోయమంటాడు ధీరజ్. వాళ్ళు తొయ్యగానే ధీరజ్ ఆ అమ్మయితో కలిసి వెళ్ళిపోతాడు. వాళ్ళని చుస్తే డౌట్ గా ఉంది. అందుకే అలా చేసానని ధీరజ్ చెప్పగానే థాంక్స్ అన్నయ్య నేను ఇంటికి వెళ్తానని కార్ దిగుతుంది. ఆ తర్వాత కాసేపటికి శోభని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బలవంతంగా కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు.

ఆ తర్వాత ప్రేమ డ్రింక్ చేసి మళ్ళీ నన్ను ఎక్కడ కొడుతుందోనని శ్రీవల్లి ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ అన్నీ దాచేస్తుంది. మరోవైపు తిరుపతి, రామరాజు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.