Illu illalu pillalu : శోభ మిస్సింగ్ కేసులో ధీరజ్ ని తీసుకెళ్ళిన పోలీసులు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -300 లో......ముగ్గురు కోడళ్ళు కొడుకులు కలిసి రామరాజు, వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత మూడు జంటలు పూజపై కూర్చుంటారు. వాళ్ళని అలా చూసి వేదవతి మురిసిపోతుంది. ప్రేమ బ్లౌజ్ కి, ధీరజ్ షర్ట్ ఇరుక్కుంటుంది. దాంతో షర్ట్ కొంచెం చిరుగుతుంది. అది చూస్తే నాన్న ఫీల్ అవుతాడని ధీరజ్ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత కాసేపటికి ఇంటికి పోలీసులు వస్తారు.