English | Telugu

Eto Vellipoyindhi Manasu : కొడుకును మోసం చేసిన తల్లి !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -128 లో.....శ్రీలత, సందీప్ లు ప్రొద్దునే మాట్లాడుకుంటే ఉంటే అది చూసి రామలక్ష్మి ఏమైంది ఇంత ప్రొద్దున్నే ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. అప్పుడే ఒక స్వామి శ్రీలత దగ్గరికి వస్తాడు. అతనికి శ్రీలత డబ్బులు ఇస్తుంది. అది చూసిన రామలక్ష్మి వీళ్ళు ఎందుకు అతనికి డబ్బులు ఇస్తున్నారు.. ఏదో ప్లాన్ చేస్తున్నారు అది వినిపించడం లేదని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత, సందీప్ లు సీతాకాంత్ దగ్గరికి వెళ్లి.. నీ కోసం స్వామి ప్రసాదం పంపించారని శ్రీలత చెప్తుంది. ఆ ప్రసాదం శ్రీలత డబ్బులు ఇచ్చిన అతను తీసుకొని వస్తాడు.

Guppedantha Manasu : రిషి సర్ ఇష్టాలేంటో నాకు తెలుసు.. ఎండీ పదవి కోసం శైలేంద్ర డీల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1106 లో.....నాకు ఎండీ కావాలని ఏంతుందో నీకు తెలుసు కదా ప్లీజ్ నాకు అడ్డురాకు.. ఇన్నిరోజులు ఎన్ని తప్పులు మోసాలు చేసినా.. అది కేవలం ఎండీ పదవి కోసమే కదా అని మనుని రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. నీకు ఎండీ అయ్యే అర్హత లేదు. ముందు అది సాధించమని మను అంటాడు. అయితే ఒక డీలింగ్ కుదర్చుకుందామా అని శైలేంద్ర అంటాడు. ఏంటని మను అడుగుతాడు. నీ కన్నతండ్రి ఎవరో నేను కనుకున్నాను. నువ్వే కనుక్కో అన్నావ్ కదా అని శైలేంద్ర అనగానే.. ఎవరు నా తండ్రి అంటూ ఎక్సయిట్ మెంట్ తో మను అడుగుతాడు. 

గర్భసంచి లోపం ఉంది.. పిల్లలు పుట్టరు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -75 లో.....శోభ ప్రెగ్నెంట్ అని అనసూయ, నర్సింహలు హ్యాపీగా ఫీల్ అవుతూ హాస్పిటల్ కి తీసుకొని వస్తారు. అక్కడే దీప ఎదురవుతుంది. శోభ ప్రెగ్నెంట్ అన్న విషయం అనసూయ చెప్పబోతుంటే.. వద్దని నర్సింహ అంటాడు. ఇలాంటి విషయాలు అందరికి చెప్పుకోవాలని శోభ అనగానే.. తన కోడలు తల్లి కాబోతున్న విషయం అనసూయ చెప్తుంది. నేను నానమ్మ కాబోతున్నానని అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతు చెప్తుంది. నా మనవడు వస్తాడు. వాడే నా కొడుకు.. వారసుడు. అయిన నీ కూతురికు తండ్రిని అంటు ఎవరైనా సంతకం పెడుతారులే అని అనసూయ అనగానే.. దీప కోప్పడుతుంది.​    

Eto Vellipoyindhi Manasu : అత్త ప్లాన్ ఫెయిల్.. కోడలి పూజ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -127 లో.. పూజకి టైమ్ అవుతుంది. వచ్చిన వారితో పూజలో కూర్చొమని పంతులు గారు చెప్తారు. ఎవరు రాలేదని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఎవరు రాకపోవడం ఏంటని అప్పుడే వచ్చిన సుజాత అడుగుతుంది. పిలిచావ్ కదా రాకపోవడం ఏంటని శ్రీలత అంటుంది. వాళ్లతో కలిసి పూజ చేస్తేనే వ్రతం ఫలితం ఉంటుందని పంతులు అంటారు. సరే అయితే ఇంకెప్పుడు అయిన చేసుకుందువని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీరు ఇప్పుడు పూజ చెయ్యలేదని బాధపడకండి అని సీతాకాంత్ తో శ్రీలత అంటుంది. పంతులు గారు మీరు వెళ్ళండని శ్రీలత చెప్తుంది.