Eto Vellipoyindhi Manasu : కొడుకును మోసం చేసిన తల్లి !
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -128 లో.....శ్రీలత, సందీప్ లు ప్రొద్దునే మాట్లాడుకుంటే ఉంటే అది చూసి రామలక్ష్మి ఏమైంది ఇంత ప్రొద్దున్నే ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. అప్పుడే ఒక స్వామి శ్రీలత దగ్గరికి వస్తాడు. అతనికి శ్రీలత డబ్బులు ఇస్తుంది. అది చూసిన రామలక్ష్మి వీళ్ళు ఎందుకు అతనికి డబ్బులు ఇస్తున్నారు.. ఏదో ప్లాన్ చేస్తున్నారు అది వినిపించడం లేదని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత, సందీప్ లు సీతాకాంత్ దగ్గరికి వెళ్లి.. నీ కోసం స్వామి ప్రసాదం పంపించారని శ్రీలత చెప్తుంది. ఆ ప్రసాదం శ్రీలత డబ్బులు ఇచ్చిన అతను తీసుకొని వస్తాడు.