English | Telugu

కవల పిల్లలకు జన్మనిచ్చిన కరుణా భూషణ్...

బుల్లితెర నటి కరుణా భూషణ్ రీసెంట్ గా కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ డైరెక్టర్ ని  పెళ్లి చేసుకున్న ఈమెకు ఆల్రెడీ  పదేళ్ల వయసున్న ఒక బాబు ఉన్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కరుణ్ భూషణ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. జగపతి బాబు నటించిన ఆహా మూవీతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన కరుణ.. కాస్త గ్యాప్ తీసుకుని శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు లాంటి కొన్ని  సినిమాల్లో నటించింది. మరోవైపు 'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు ఎన్నో సీరియల్స్ లో కూడా నటించింది.

రాజీవ్ ని ఏ ఫ్రూట్ తో పోల్చాలో ....

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఈ వారం ఎలాంటి మూవీ ఓపెనింగ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ ఐతే రాలేదు..సీరియల్స్ అండ్ మూవీస్ లో నటించిన సీనియర్ నటీమణులు వచ్చి అలరించారు. వాళ్ళే రాగిణి, శివ పార్వతి, శ్రీప్రియ, హరిత.. వీళ్ళ నలుగురు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి అటు మూవీస్ లో ఇటు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఈ షోలో సుమతో కలిసి సందడి చేశారు. రాగానే సుమ వెరైటీగా ఒక ప్రశ్న వేసింది "శివపార్వతి గారు మిమ్మల్ని మీరు ఏ ఫ్రూట్ తో కంపేర్ చేసుకుంటారు" అని అడిగింది. దానికి ఆమె "ఉల్లిపాయ" అని ఆన్సర్ ఇచ్చేసరికి అందరూ నవ్వేశారు. ఇక అదే ప్రశ్నని హరితని కూడా అడిగింది సుమ "జాక్ ఫ్రూట్" అని చెప్పింది.

Karthika Deepam2 : నా మనసు దీపకి అర్థమైంది.. శౌర్యకి పేరెంట్స్ మీటింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -71 లో.. దీప శౌర్యకి పాటలు నేర్పిస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటి రౌడీ నన్ను చూసి పాట ఆపేసావని కార్తీక్ అంటాడు. నీ ముందు పాడితే నవ్వుతావ్ కదా.. అందుకే ఆపేసానని శౌర్య అంటుంది. రేపు స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ ఉందని దీపకి కార్తీక్ చెప్తాడు. అంటే ఏంటని దీప అడుగుతుంది. పిల్లలపై శ్రద్ధ పెట్టాలంటూ కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఎలా చదవాలని చెప్తారు నా ఫోన్ కి మెసేజ్ వచ్చిందని కార్తీక్ అంటాడు. రేపు వెళ్ళాక స్కూల్ లో మీ అమ్మ నెంబర్ ఇవ్వు ఇక నుండి మీకే మెసేజ్ వస్తుందని అనగానే మా అమ్మకి చదవడం రాదని శౌర్య అంటుంది. రేపు వెళ్ళండి అని కార్తీక్ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : కొత్త కోడలి సౌభాగ్యవ్రతం.. భార్యకి లవ్ ప్రపోజ్ చేసిన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు' ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -123 లో...నన్ను పట్టించుకోవడం లేదు. ప్రమాదం నుండి బయటపడితే కనీసం దిష్టి కూడా తియ్యలేదని రామలక్ష్మి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. దాంతో  చెయ్యలేక శ్రీలత వెళ్లి హారతి తీసుకొని రా అని శ్రీవల్లిని పంపిస్తుంది. అందరు కలిసి ఈ లేడీ విలన్ ని పనిమనిషి చేశారని శ్రీవల్లి నసుగుతు వెళ్తుంది. స్వామి గారు ఏం చెప్పారు సీతా అని శ్రీలత అడుగుతుంది. అత్తయ్య.. నా చుట్టూ కొన్ని దుష్టశక్తులున్నాయట జాగ్రత్తగా ఉండమన్నారు.. జాగ్రత్త గా ఉండడమేంటి వాటి భరతం పడతానని చెప్పానని రామలక్ష్మి అంటుంది.

Karthika Deepam2  : దీపకి నరసింహా వార్నింగ్.. ఆ విషయం కార్తిక్ కి తెలిసిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -70 లో....నర్సింహ మళ్ళీ దీపతో గొడవ పెట్టుకుంటాడు. నువ్వు ఒక ఆడదానివి అని నిన్నేం చేయకుండా వదిలేసానని నర్సింహా అనగానే.. నేనే నిన్ను వదిలేసాను నా కూతురు కోసం.. ఎందుకంటే తల్లి కూడా దూరం కాకూడదని దీప అంటుంది. నువు వచ్చి నా భార్యకి సారీ చెప్పి.. ఈ ఊరు నుండి వెళ్ళిపోమని దీపకి నరసింహా వార్నింగ్ ఇస్తాడు. తప్పు చేసింది నువ్వైతే ఏ తప్పు చేయని నేనెందుకు వెళ్ళాలని దీప పొగరుగా సమాధానం చెప్పేసరికి నర్సింహాకి ఇంకా కోపం వస్తుంది.

Eto Vellipoyindhi Manasu : మీ ఇద్దరికి దేవుడే ముడి వేశాడు.. నీ భర్తని కాపాడుకోవాల్సింది నువ్వే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -122 లో.. నా ముందు మాట్లాడానికి భయపడేది అలాంటిది ఎలా మాట్లాడుతుంది చూడు.. ఒకవేళ మనం అభితో కలిసి ప్లాన్ చేసి కిడ్నాప్ చేసిన విషయం తెలిసి ఉంటుందా.. ఒక్క రోజులోనే ఈ మార్పు ఏంటని సందీప్ తో  శ్రీలత అంటుంది. ఈ విషయం ఒక్క రామలక్ష్మి వరకే తెలిస్తే ఫుడ్ అయినా దొరుకుతుంది. అదే బావ గారి వరకు తెలిస్తే పరిస్థితి ఏంటని శ్రీవల్లి అనగానే.. నువ్వు నోరు మూసుకొని ఉండు అని శ్రీలత కోప్పడుతుంది. అసలు రామలక్ష్మి ఎందుకు ఇలా చేంజ్ అయిందో కనుక్కోవాలని సందీప్ కి శ్రీలత చెప్తుంది.

Guppedantha Manasu : రౌడీల నుండి వసుధారని కాపాడిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1100 లో.....నిజంగానే వసుధార కాలేజీ వదిలి వెళ్ళిపోయిందా.. లేక క్యాబిన్ లో కూర్చొని ఉందా అని శైలేంద్ర తన క్యాబిన్ లోకి వస్తాడు. వసుధర లేదు ఎంతైనా మాట మీద నిలబడే మనిషి కదా అని శైలేంద్ర ఎండీ చైర్ దగ్గరికి వెళ్లి ఈ సీటు చూస్తుంటే.. నా మనసు ఆగట్లేదని అనుకుంటాడు. అప్పుడే టేబుల్ పై ఒక లెటర్ కన్పిస్తుంది. అది వసుధార రాసిందా అని ఓపెన్ చూసి శైలేంద్ర చదువుతు షాక్ అవుతాడు. నిజంగానే వసుధార రాసిందా.. ఇంత పెద్ద నిజాన్ని ఇన్ని రోజులు మేనేజ్ చేస్తూ వచ్చారా అని లెటర్ ఎవరు చూడకుండా ప్యాకెట్ లో పెడతాడు.