English | Telugu

Karthika Deepam2 : పారిజాతం  పీకపట్టుకొని నిలదీసిన జ్యోత్స్న.. ‌ఆమె ప్రెగ్నెంట్, ఈమె షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -74 లో.... నేను కేవలం శౌర్య కోసం మాత్రమే అక్కడికి వెళ్తాను. అమాయకంగా తను పిలిచే పిలుపు బాగుంటుంది. నేను దీపతో మాట్లాడిన దీప దగ్గరికి వెళ్లిన అన్ని రౌడీ కోసమే అని కార్తీక్ జ్యోత్స్న కి క్లారిటీ ఇస్తాడు. మరొకవైపు శౌర్య స్కూల్ అయిపోయాక దీప కోసం చూస్తుంది. తన పక్కన ఒక పాప తన నాన్నని ఎందుకు లేట్ గా వచ్చావంటూ అడుగుతుంది. వాళ్ళ ప్రేమని చూసి నాకు నాన్న ఉంటే అలాగే ఉండేదాన్ని కదా అంటూ ఏడుస్తుంది.

ఆ తర్వాత పారిజాతం పీకపట్టుకొని ఎందుకు ఇదంతా చేసావని జ్యోత్స్న అడుగుతుంది. మీ బావని కూడ ఇలాగే అడిగావా అని పారిజాతం అనగానే.. గొంతు పట్టుకొని అడగలేదు కానీ ఇదే రేంజ్ లో అడిగాను. అప్పుడే అదంతా శౌర్య కోసమని చెప్పాడని జ్యోత్స్న అనగానే..‌నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావ్ కానీ నాకు ఎప్పుడో తెలుసని పారిజాతం అంటుంది. ఇప్పుడు నా ఆవేశమే నాకు ముఖ్యం. భర్త వదిలేసిన ఆడదానిగా దీపపై బావకి విపరీతంగా సింపతీ ఉంది. అలాంటి టైమ్ లో శౌర్య కోసం ఇద్దరు ఒకటి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ని రోజులు శౌర్యకి గార్డియన్ గా కార్తీక్ ఉన్నాడు.. ఇప్పుడు నేనున్నాను. ఏ ఇన్ఫర్మేషన్ అయిన ఇప్పుడు నాకు వస్తుందని జ్యోత్స్న అంటుంది. దీపని కార్తీక్ కలుస్తాడు కదా ఫోన్ కూడా కొనిచ్చాడని పారిజాతం అనగానే.. కథ అక్కడ నుండే మొదలు పెట్టాలని జ్యోత్స్న అంటుంది. మీ బావ మాటలో ఎక్కడ అయిన నిన్ను పెళ్లి చేసుకోవడం.. ఇష్టం లేదన్న అనుమానం కన్పించిందా అని పారిజాతం అనగానే.. ఎందుకు అలా అడుగుతున్నావ్? బావ నీతో ఏదైనా చెప్పాడా అని జ్యోత్స్న అడుగగా..‌ అదేం లేదని పారిజాతం అంటుంది.

ఆ తర్వాత శౌర్యని దీప నడిపించుకొని తీసుకొని వస్తుంటే.. అప్పుడే కార్తీక్ వచ్చి శౌర్యని కార్ లో తీసుకొని వెళ్తాడు. మరొక వైపు శోభ నర్సింహలు గొడవపడుతుంటారు. అప్పుడే అనసూయ వచ్చి.. ఎందుకే ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటావని అంటుంది అప్పుడే శోభ వాంథింగ్ చేసుకుంటుంది. ఏంటివి అవేనా అని అనసూయ శోభని అడుగుతుంది.. అవునని శోభ అనగానే.. అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను నానమ్మ కాబోతున్నానని అంటుంది. ఆ తర్వాత శోభని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు అప్పుడే దీప ఎదరుపడుతుంది. శోభ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.