English | Telugu

Guppedantha Manasu : వసుధార గతం విని కన్నీళ్లు పెట్టుకున్న రంగా.. సరోజకి డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1113 లో... రిషి గురించి వసుధార అక్కడున్న రంగ,  సరోజ వాళ్ళకి చెప్తుంది. ఆయన ఒక కాలేజీకి ఎండీ అంటూ రిషి గురించి గొప్పగా చెప్తుంది. ఒక దుర్మార్గుడి కుట్ర వాళ్ళ అయన నాకు దూరం అయ్యారు. ఆయన కోసం తను ఇచ్చిన బాధ్యతలు కూడా పక్కన పెట్టి వచ్చానని వసుధార చెప్తుంటే రంగాకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏంటి బావ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కొంపదీసి ఆ రిషి సర్ బావేనా అని సరోజ అనుకుంటుంది. ఇప్పటికైనా ఒప్పకొండి సర్ నా రిషి సర్ అని వసుధార అనగానే.. ఏదో మీరు చెప్తుంటే ఆటోమేటిక్ గా కళ్ళలో నీళ్లు వచ్చాయి. సినిమా స్టోరీలాగా ఉంది. అంత మాత్రాన నేను రిషి సర్ ని అయిపోతానా.. నేను రంగాని అని చెప్పి రంగా వెళ్ళిపోతాడు.

Brahmamudi : అనామిక చేష్టలకు రగిలిపోతున్న కళ్యాణ్ .. ఇదంతా ఆవిడ ప్లానే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -448 లో....నేనే మీడియా పిలిచి భాగోతం బయటపడేలా చేశానని అనామిక ఒప్పుకుంటుంది. దాంతో ధాన్యలక్ష్మి తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా అత్తగా భరించాను కానీ ఇప్పుడు నువ్వు నా కొడుకు పరువు తీసావని అనామికపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఇక్కడ అందరు కోపంగా ఉన్నారు.. నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్లడం మంచిదని అనామికతో సుభాష్ అనగానే తను లోపలికి వెళ్తుంది. అనామిక కేవలం నా ఆస్తులు చూసి పెళ్లి చేసుకుంది..  అందుకే ఆఫీస్ కి వెళ్ళమంది.. వెళ్ళనంటే ఇలా నిందలు వేస్తుంది. కానీ నేను తనతో కలిసి ఉండలేను విడాకులు ఇస్తానని కళ్యాణ్ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : వార్నింగ్ తో వణికిపోయిన సందీప్.. అత్తాకోడళ్ళలో గెలుపు ఎవరిది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -134 లో... సీతాకాంత్ కి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చినందుకు అందరు విష్ చేస్తారు. ఈ శుభ సందర్బంగా నాకు ఈ అటెండర్ పోస్ట్ కాకుండా కొంచెం హై లెవెల్ పోస్ట్ ఇప్పించమని మాణిక్యం అనగానే ప్రమోషన్ ఏగా ఇస్తాను. నువు సీనియర్ గా వర్క్ చేస్తున్నావని అందరితో చెప్పించమని సీతాకాంత్ అంటాడు. దానికంటే టూ ఇయర్స్ అగ్రిమెంట్ బెటర్ అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత సందీప్ కి మల్లేశ్ ఫోన్ చేసి.. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటే మీ అన్నయ్యకి నిజం చెప్తానని బెదిరిస్తాడు.

Guppedantha Manasu : దొంగల చేతుల్లోకి వెళ్ళకుండా కాలేజీని కాపాడిన మను.. పొగరు అని అనండి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1112 లో... ఎండీ ఎవరో మీరే ఏకగ్రీవంగా ఎన్నుకొని నిర్ణయం చెప్పండి.. లేదంటే మా గవర్నమెంట్ కాలేజీని హ్యాండోవర్ చేసుకుంటుందని మినిస్టర్ అనగానే.. ఇది మా కాలేజీ.. భూషణ్ ఫ్యామిలీ నుండే ఎవరో ఒకరు ఇన్ని రోజులు బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు నేను తీసుకుంటానని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు ఎండీ గురించి కొట్టుకుంటున్నారు.. మీరు ఎండీ అవ్వడం ఇష్టం లేని వాళ్ళున్నారు.. వాళ్ళు రేపు మీకు సహకరించపోవచ్చని మినిస్టర్ అంటాడు.

Brahmamudi : అన్నకి శోభనం.. తన భార్యకి విడాకులిస్తానన్న తమ్ముడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -447 లో.....రాజ్, కావ్యలు వాళ్ళ రూమ్ కి వెళ్లేసరికి ఇందిరాదేవి, సీతారామయ్య వాళ్ళుంటారు. మీరేంటి మా గదిలో ఉన్నారని రాజ్ అడుగుతాడు. ఈ రోజు మేమ్ ఇక్కడే పడుకుంటాం.. మీరు మా గదిలో పడుకోండి అని ఇందిరాదేవి అంటుంది. ఈ రోజేంటి ఇంట్లో అందరు వింతగా ప్రవర్తిస్తున్నారని రాజ్, కావ్య ఇద్దరు అనుకుంటారు. ప్లాన్ సక్సెస్ అయిందంటూ ఇందిరాదేవి, అపర్ణ, స్వప్న, ప్రకాష్ సుభాష్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను వెలిగించిన అగ్గిపుల్ల ఇంక చిచ్చు పెట్టలేదు ఏంటని రుద్రాణి అనుకుంటుంది.

Karthika Deepam2 : నాన్న బొమ్మ పట్టుకొని శౌర్య ఎమోషనల్..  కార్తిక్ కి సారీ చెప్పిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -81 లో....దీప బాధపడుతుంటే కార్తీక్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఇప్పుడు నర్సింహా గురించి చెప్తే పోలీస్ స్టేషన్ అంటాడని దీప సైలెంట్ గా ఉంటుంది. మీ ప్రాబ్లమ్ అయితే చెప్పకండి కానీ శౌర్యకి ఏదైనా ప్రాబ్లమ్ అయితే మాత్రం కచ్చితంగా చెప్పండి. మీరు తనకి తల్లి నేను తనకి ఫ్రెండ్ ని.. తన బాధ్యత మీరు నాకు ఇవ్వలేదు.. నేనే తీసుకున్నానని కార్తీక్ చెప్పి వెళ్లిపోతుంటే.. ఆగండి బాబు అని దీప పిలుస్తంది. నన్ను అర్థం చేసుకొని మీ ప్రాబ్లమ్ చెప్తున్నందుకు థాంక్స్ అని కార్తీక్ అంటాడు. నేను నా ప్రాబ్లమ్ చెప్పడానికి పిలువలేదని దీప అంటుంది.

Guppedantha Manasu : రిషి అతనే అని వసుధార నిరూపించగలదా.. బోర్డు మీటింగ్ లో ఏమైందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1111 లో....నా బావని పట్టుకొని రిషి సర్ అంటున్నావేంటి? ఇక్కడ నుండి వెళ్ళిపోమని వసుధారతో సరోజ అనగానే.. వెళ్లిపోతాను పదిహేను రోజుల్లో నువ్వు బావ అంటున్న రంగానే నా రిషి సర్ అని నిరూపించి తన నోటితోనే రిషి సర్ అని చెప్పించి, తనని ఇక్కడ నుండి తీసుకొని వెళ్తానని వసుధార ఛాలెంజ్ చేస్తుంది. ఆమ్మో ఇదేంటి ఇలా అంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని సరోజ అనుకుంటుంది. ఆ తర్వాత ఏంజిల్ అన్న మాటలు గుర్తుకి చేసుకుని శైలేంద్ర తనని తాను బెల్ట్ తో కొట్టుకుంటాడు. అపుడే ధరణి వచ్చి ఆపుతుంది. ఏం చేస్తున్నారని ధరణి అడుగుతుంది. ఎప్పుడు ఎండీ చైర్ కి ఎవరో ఒకరు అడ్డువస్తున్నారు.. వసుధార ఇప్పుడు లేదు అయినా ఎవరో ఒకరు వస్తున్నారని శైలేంద్ర అంటాడు. మీకెప్పటికి అది దక్కదు అని ధరణి అంటుంది.