ప్రైజ్ మనీ ఎగ్గొట్టారు.. ఓంకార్ షోపై సెన్సేషనల్ కామెంట్స్!
అప్పట్లో 'ఢీ' డాన్స్ షోకి ధీటుగా 'ఆట' అనే డాన్స్ షోని మొదలుపెట్టాడు యాంకర్ ఓంకార్. ఈ షోతోనే అతడికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. సుందరం మాస్టర్, అమ్మ రాజశేఖర్, నటరాజ్ తదితరులు జడ్జీలుగా వ్యవహరించిన ఈ షో అప్పట్లో మంచి టీఆర్పీ తీసుకొచ్చింది. భరత్, సన్నీ, సందీప్, తేజు లాంటి డాన్సర్లు ఈ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు.