అమర్ రహే టు థౌజండ్ నోట్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోటుపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 30 తేదీ వరకే రూ. 2 వేల నోటు చెల్లుతుందని, ఆ లోపే తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు అని ప్రకటించింది. ఈ నోటు ఇక కనిపించదు అనే కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం ఒక వెరైటీ స్కిట్ ని ప్రెజంట్ చేశారు రాంప్రసాద్ అండ్ టీమ్...రాంప్రసాద్ 500 ల నోటులా, మహేష్ ఆచంట 2 వేల నోటులా, సన్నీ వెయ్యి రూపాయల నోటులా కాస్ట్యూమ్స్ వేసుకుని ఈ స్కిట్ చేశారు. ఆఫ్ట్రాల్ రెండు వేల రూపాయలు అని కొంతమంది కమెడియన్స్ అనడంతో దాని గురించి చాలా గొప్పగా చెప్పాడు మహేష్. "అరె అన్నయ్య నువ్వు త్వరలో వెళ్ళిపోతున్నావ్ కదా..