English | Telugu

Karthika Deepam2 : ఆమెకు డబ్బు ఆఫర్ చేసిన పారిజాతం.. తను‌ ఒప్పుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.. జ్యోత్స్న చేసిన పనికి బాధపడుతుంటే.. శౌర్య వచ్చి ఎందుకు బాధపడుతున్నావని ఆడుగుతుంది.. ఆ తర్వాత న్యూస్ లో జ్యోత్స్న గురించి చెప్తుంటారు.. మిస్ హైదరాబాద్ కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు న్యూస్ లో చెప్పడం విన్న జ్యోత్స్న ఆవేశంగా లోపలకి వెళ్తుంది. తన వెంటే సుమిత్ర , పారిజాతం వెళ్తారు. అంత ఆ దీప.. నేను తప్పు చేసానని చెప్పడం వల్లేనని జ్యోత్స్న అంటుంటే.. ఇందులో దీప తప్పేంటని సుమిత్ర అంటుంది.  నువ్వు ఆ దీపకే సపోర్ట్ అని తెలుసంటు జ్యోత్స్న కోప్పడుతుంది..

Brahmamudi : కేసు విత్ డ్రా చేసిన అనామిక.. వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చిన అక్కాచెల్లెళ్ళు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -397 లో.. అనామిక చేసిన పనికి దుగ్గిరాల ఇంట్లోని వాళ్లందరిపై కనకం అరుస్తుంది. నాకు న్యాయం కావాలి కానీ నేను తగ్గును.. నా కూతురిని నాకు తీసుకొని రండి. ఆ లోపే ఇక్కడే నట్టింట్లో కూర్చొని ఉంటానని కనకం అంటుంది. మరొకవైపు అనామిక పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వస్తారు. నా కూతురికి ఎంత కష్టం వస్తే పోలీస్ స్టేషన్ వరకు వస్తుందంటూ అనామిక తండ్రి అంటాడు. నీ కూతురు అన్నిటిని భూతద్దంలో పెట్టి చూస్తుందని కావ్య అంటుంది.

ఫైమా, పటాస్ ప్రవీణ్ ల మధ్య మళ్ళీ ప్రేమ మొదలైందా?

చాలాకాలం తర్వాత కొంతమంది సెలెబ్రిటీలు కలిస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనిది. అలాంటిది వారిద్దరు కలసి రీల్ చేస్తే అది ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వారే ఫైమా, పటాస్ ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పటాస్ ప్రవీణ్,  ఫైమా జోడి ఒకటని చెప్పాలి. వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా పనిచేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ పలు సందర్భాలలో వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వారిద్దరు కలిసారని సోషల్ మీడియాలో వార్తలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

Guppedantha Manasu : రాజీవ్ చనిపోయాడా.. అసలేం జరిగింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1062 లో.. మను అందరికి ఆ రోజు ఏం జరిగిందని మొత్తం చెప్తాడు. నేను బుల్లెట్ మిస్ ఫైర్ చేసాను.. ఆ తర్వాత రాజీవ్ కి వార్నింగ్ ఇచ్చానని మను చెప్తాడు. అది విన్న ఇన్‌స్పెక్టర్.. ఇక చాలు.. కథలు బానే అల్లుతున్నావని అంటాడు. మీరే రాజీవ్ ని చంపారని అంటున్నారు కదా.. మరి రాజీవ్ బాడీ ఎక్కడ అని వసుధార అడగుతుంది. చంపినోడు బాడీని మాయం చెయ్యలేడా అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. బాడీ రేకవరీ చేసాక.. ఇంకా పక్క ఆధారాలు ఉంటాయి.. బుల్లెట్ లు దొరుకుతాయని ఇన్‌స్పెక్టర్ అంటాడు.