నువ్విచ్చిన సెమినార్ మొదటిదేనా అని రిషిపై డౌట్ తో అడిగిన విశ్వనాథం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 815 లో.. కాలేజీ చైర్మెన్ విశ్వనాథం, ప్రిన్సిపల్, జగతి, మహేంద్రలు కలిసి సెమినార్ తర్వాత మాట్లాడుకుంటారు. మా కాలేజీలో సెమినార్ కి అటెంట్ అయ్యారు వెరీ థాంక్ ఫుల్ అని విశ్వనాథం అనగా.. అలాంటి ట్యాలెంటెడ్ లెక్చరర్స్ ని సత్కరించే అవకాశం దక్కడం మా అదృష్టమని జగతి అంటుంది. ఈ సెమినార్ వల్లే నా కొడుకిని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడగలిగానని తన మనసులో అనుకొని సంతోషపడుతుంది జగతి. ఇదంతా శైలేంద్ర కిటికీలో నుండి చూస్తాడు. కొడుకు కనపడకున్నా నిబ్బరంగా నిలబడింది. మన బెదిరింపులకు భయపడలేదు. అన్ని సమస్యలను దాటుకొని తన భర్తకు దగ్గరైంది. ఇన్ని సమస్యలను వేటాడుతూ వచ్చిన పిన్ని నిజంగా ఆడపులి అని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు.