Read more!

English | Telugu

మా అమ్మే నాకు మళ్ళీ కూతురిగా పుట్టాలి అంటూ ఏడ్చేసిన సౌమ్య

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. ఆదికి పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బుల్లితెర యాంకర్స్, నటీనటులు చాలామంది ఈ షోలో కనిపించారు. వర్షంలో గొడుగులు వేసుకుని మరీ ఆది పెళ్ళిచూపులకి వచ్చారు. ఆది పెళ్ళికొడుకు గెటప్ లో సూటు వేసుకుని వచ్చాడు. ఐతే ఆది పెళ్ళికొడుకు  అని తెలియక అంకుల్ అని అనేసింది వర్ష. దానికి ఆది హర్ట్ అయ్యాడు. "అంకుల్ ఏంటి నేనే పెళ్ళికొడుకుని" అనేసరికి చెవులు చిల్లులు పడేలా జారీచేసింది. ఇక వర్షంలో తడిచి వచ్చిన యాంకర్ సౌమ్యను తుండుతో తుడిచాడు ఆది. "ఎంతేశావమ్మా మేకప్ టవల్ లోకి మొత్తం వచ్చేసింది" అన్నాడు ఆది.

ఇక ఇంద్రావతి చౌహాన్ ఫోక్ సాంగ్ పాడితే ఆర్జే కాజల్ మంచి మెలోడీ సాంగ్ పాడింది. ఇక సౌమ్య, ఆది ఇద్దరూ కలిసి "వాన వల్లప్పా వల్లప్పా ఒళ్లప్పగించే " అనే రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక పెళ్లి కానీ అమ్మాయిలంతా కలిసి మంచి సాంగ్స్ పాడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఆది సౌమ్య కోసం ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. వాళ్ళ అమ్మ ఫోటోని లామినేషన్ చేసి ఇచ్చాడు. అది చూసేసరికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.  అలాగే వాళ్ళ అమ్మ బ్రెయిన్ కాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్ ఉన్నప్పుడు వీడియోని ప్లే చేశారు. " మా అమ్మ ఈ పొజిషన్ లో ఉండగా మూడున్నరేళ్లు ఆమెకు సేవలు చేసాను. కానీ ఆమె నన్ను గుర్తుపట్టే పొజిషన్ లో లేరు. దేవుడు ఆమెకు ఇలాంటి పరిస్థితిని ఇస్తాడని అస్సలు అనుకోలేదు.  మా అమ్మే నాకు మళ్ళీ కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా" అని ఏడ్చేసింది సౌమ్య.