English | Telugu

ఆదిని కిడ్నాప్ చేసిన లేడీస్...పెళ్ళెప్పుడు అని అడిగిన మహిళా రైతులు

బుల్లితెర అంటే చాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ కి అస్సలు కొదువే ఉండదు. ఎన్నో షోస్ ఉన్నాయి. కానీ వాటిల్లో సూపర్ గా కామెడీతో కలిపి ఎంటర్టైన్ చేసేది జబర్దస్త్ ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో ఆది చేసే కామెడీ పంచెస్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి ఆది మీద లేడీస్ వైపు నుంచి చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి లేడీస్ అంతా కలిసి ఆది మీద తిరగబడ్డారు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో  చాలామంది సీనియర్ యాక్టర్స్ కనిపించారు.  జయవాణి, ప్రీతి నిగమ్, శిల్పా చక్రవర్తి, భావన లాంటి సీనియర్ యాంకర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ తో పాటు ప్రస్తుతం చేస్తున్న యాంకర్స్  కూడా ఉన్నారు. వీళ్లందరితో కలిపి చేసిన ఈ షో నెక్స్ట్ వీక్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. అది కూడా  ‘ఆది కిడ్నాప్’ అనే కాన్సెప్ట్ తో వస్తోంది.

మన భారత దేశం యూనిఫామ్ నైటీ అన్న సుమ

"సుమ అడ్డా" నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్  ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఆర్జే కాజల్, విజె సన్నీ, చలాకి చంటి, సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే చంటికి సమోసాలు ఆఫర్ చేసింది సుమ. "ఫ్రెష్ వేనా" అని అడిగేసరికి "నిజానికి లాస్ట్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేశారు క్యాన్సిల్ అయ్యింది" అనేసరికి "అది అలా చెప్పాలి కదా అప్పుడు తింటాం కదా" అని చంటి అనేసరికి "ఏమైనా అప్పటి మనుషులు అప్పటివే తింటారుగా" అని కామెడీ చేసింది సుమ. తర్వాత సన్నీ, కాజల్ తో గేమ్ షో ఆడించింది. అందులో "పల్లెటూరు అనగానే గుర్తోచ్చేదిమిటి" అనేసరికి కాజల్ "హాఫ్ సారీస్" అని చెప్పింది...ఐతే బోర్డు ఆన్సర్ రాంగ్ అని చెప్పడంతో సన్నీ షాకయ్యాడు. "ఏమిటి లంగా ఓణీలు వేసుకోవడం మానేసారా" అనేసరికి సుమ మధ్యలో వచ్చింది. "మన భారత దేశం యూనిఫామ్ ఏమిటో తెలుసా" అని అడిగింది "జీన్స్ , టి షర్ట్ ఆ" అని అడిగారు సన్నీ, కాజల్.. "కాదు నైటీ" అనేసరికి అందరూ నవ్వేశారు.

ఈ విషయాన్ని త్వరలో ఒక పెద్ద షోలో చెప్తాను అన్న వర్షా..అది బిగ్ బాసేనా ?

బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి జబర్దస్త్ కమెడియన్ వర్ష రెడీ ఐనట్టు తన మాటల ద్వారా అర్ధమయ్యి కానట్టుగా ఉంది. బిగ్ బాస్ లోగో రిలీజ్ ఐన దగ్గర వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అంటూ సోషల్ మీడియాలో  హడావిడి మొదలయ్యింది..రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన వర్షను యాంకర్ ఆమె చదువు గురించి అడిగారు..దానికి వర్ష గట్టిగా నవ్వుతూ  " ఇది ఇక్కడ చెప్పను..ఒక పెద్ద షో కి వెళ్తున్నాను నెక్స్ట్...ఆ షోలో చెప్తాను" అనేసరికి యాంకర్ " హో మాకు తెలుసు, మీరు ఏ షోకి వెళ్తున్నారో..రివీల్ చేసేయమంటారా" అని అడిగింది. దానికి వర్ష నవ్వేసి "వొద్దొద్దు" అని అంది. "ఏ పేమెంట్ రాదంటారా..అగ్గ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందంటారా" అని యాంకర్ అనేసరికి. " కొన్ని చెక్స్ ముందే ఇచ్చేసారు నాకు చెప్తే అవి వెనక్కి వెళ్ళిపోతాయని దాచి ఉంచా" అని చెప్పింది వర్ష.

కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్...హాస్పిటల్ బెడ్ పై కాళ్లకు కట్టుతో ...

కొంతకాలం నుంచి సెలబ్రిటీస్ ఏదో ఒక ఇన్సిడెంట్ లో గాయాల పాలై హాస్పిటల్ బెడ్ మీదో లేదా హ్యాండ్ స్టిక్స్ పట్టుకుని నడుస్తూ కనిపిస్తున్నారు...నవదీప్, వరుణ్ సందేశ్, రౌడీ రోహిణి ఇలా చాలా మంది కూడా కళ్ళకు గాయాలతో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బుల్లితెర మీద కాస్తో కూస్తూ పేరు తెచ్చుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న యాదమ్మ రాజు- స్టెల్లా జంట గురించి మనకు తెలుసు. జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు.  అటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ లోనో సందడి చేస్తూ ఉంటారు వీళ్ళు.  లాస్ట్ ఇయర్ స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక స్టెల్లా అమెరికా వెళ్లి వచ్చి రీసెంట్ గా "నీతోనే డాన్స్" షోకి వెళ్లారు. ఐతే అక్కడ ఎలిమినేట్ ఐపోయి ప్రస్తుతం మిగతా షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి యాదమ్మ రాజు   హాస్పిటల్ గౌన్ లో కాళ్లకు కట్టుతో కనిపించాడు.

పిజ్జాలో గోంగూర చట్నీ వేసుకుని తిన్నట్టుంది నీ లుక్...

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్" నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర నటీ నటులు ఫుల్ ట్రెండీ లుక్ లో అలాగే ట్రెడిషనల్ గెటప్ లో వచ్చేసారు. అదే ఈ వారం థీమ్ "ట్రెండీ బాయ్స్ వెర్సెస్ ట్రెడిషనల్ గర్ల్స్" పేరుతో రాబోతోంది  ఈ షో. ఇక శ్రీముఖి వచ్చి బ్రహ్మముడి సీరియల్ కావ్యతో "పైన ట్రెండీ కింద ట్రెడిషనల్ గా ఉన్నాను కదా" దీని మీద నీ ఒపీనియన్ అని శ్రీముఖి అడిగేసరికి "పిజ్జాలో గోంగూర చట్నీ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది" అని చెప్పింది. దానికి శ్రీముఖి షాకైపోయింది. తర్వాత బాయ్స్ దగ్గరకు వచ్చి "ట్రెండీ అమ్మాయిలు ఇష్టమా, ట్రెడిషనల్ అమ్మాయిలు ఇష్టమా" అని అడిగేసరికి "అమ్మాయి అంటే ఇష్టం" అని చెప్పాడు  బ్రహ్మముడి సీరియల్ లో విలన్ రోల్ లో చేసే రాహుల్ అలియాస్ శ్రీకర్ కృష్ణ. ఇక లేడీస్ దగ్గరకు వచ్చి "దీపికా నువ్వు ఒకసారి సిగ్గుపడు" అని బ్రహ్మముడి హీరోయిన్ కావ్యని అడిగింది.

ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అని రష్మీ కోసం పాట పాడిన బాబు

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నవ్వించడానికి వచ్చేసింది.  ఇందులో జోడీస్ వేసే స్కిట్స్ కొన్ని నవ్విస్తున్నాయి కానీ కొన్ని మాత్రం పేలడమే లేదు. అలాంటి స్కిట్స్ మధ్య ఇమ్ము-వర్ష స్కిట్స్ కొంచెం నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇక అలా ఈ వారం వర్ష-ఇమ్ము-బాబు మధ్య జరిగిన స్కిట్ లో బాబు రోడ్డు మీద కొరడాతో కొట్టుకుంటూ బిచ్చం అడిగే రోల్ లో నటించాడు. ఐతే ఇమ్ము తనకు ఈ స్కిట్ లో  ఒక కూతురుంది అని  ...ఆమెకు ఈమధ్యనే పెళ్లి చేశా అని చెప్పాడు. మరో వైపు బాబు - లేడీ కమెడియన్ బెగ్గర్ రోల్స్ లో కనిపించారు. తర్వాత  బాబు స్టేజి మీదకు వచ్చి రష్మీ మీద సీరియస్ అయ్యాడు.."రష్మీ గారు మీకు ముందే చెప్పాను..నేను ఈ లవ్ ప్యాక్ ని చేయను..ఇది దీని ముఖం" అని పక్కన ఉన్న లేడీ కమెడియన్ ని చూపించేసరికి "ఆమె కూడా సీరియస్ అయ్యి మా అన్నయ్య ఏమన్నాడో తెలుసా జబర్దస్త్ లో ఇంతమంది ఉండగా నిన్నే అంటగట్టారేమిటి అని అడిగాడు" అని ఆమె చెప్పేసరికి అందరూ నవ్వేశారు..బాబు తన చేతిలో ఉన్న కొరడాతో అటు వర్షని, ఇటు మరో లేడీ పిచ్చ కొట్టుడు కొట్టేసాడు

డబ్బులిచ్చి ప్రమోట్ చేసుకోవడానికే బిగ్ బాస్ రియాలిటీ షో అన్న సరయు

బిగ్ బాస్ త్వరలో సీజన్ 7  twaralo తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ షో ద్వారా చాలా మంది చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద  సెలబ్రిటీస్ గా మారిపోయి మంచి మంచి అవకాశాలను కూడా తెచ్చుకుంటున్నారు. ఈ షోని పొగిడేవాళ్లు ఎంత మంది ఉన్నారో తిట్టేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చింది సరయు. ఈ బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ షో అంతా ఫేక్ అని చెప్పారు. కొంతమంది డబ్బులిచ్చి మరీ తమను ప్రమోట్ చేసుకోవడానికి ఈ షోకి వస్తారని చెప్పింది. జనాలందరినీ పిచ్చోళ్లను చేయడానికే ఉంటాయి ఈ రియాలిటీ షోస్ . అసలు ఈ షోని చూడకండి మీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పారు.

చిరు సాంగ్ కి రాధతో కలిసి స్టెప్పులేసి "బ్రో" తేజ్

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హిట్ పెయిర్ ఎవరు అంటే చాలు  రాధా, చిరంజీవి అనే యిట్టె చెప్పేస్తారు  ఆడియన్స్. వీళ్ళ డాన్స్ లో ఉండే గ్రేస్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. వీళ్ళ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా ఐనా సాంగ్ ఐనా హిట్ కొట్టాల్సిందే. ఐతే ఇప్పుడు "నీతోనే డాన్స్" షోలో రాధ, చిరు హిట్ సాంగ్ "అందం హిందోళం" సాంగ్ కి సాయి ధరమ్ తేజ్ తో కలిసి డాన్స్ చేశారు అందాల రాధా. ఇన్నేళ్ళైనా కూడా ఆమె డాన్స్ లో ఎంత మాత్రం ఆ హాట్ నెస్ తగ్గలేదు. ఇంకా చలాకీగా గంతులేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వీక్ "నీతోనే డాన్స్" షో ప్రోమోలో ఈ బిట్ ని చూడొచ్చు. పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఫస్ట్ టైం ఈ నెల  28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న మూవీ "బ్రో".

డాన్స్ కిచిడి ఐపోయిందన్న నటరాజ్ మాష్టర్..జనజన్మలకు నువ్వే భార్య కావాలన్న పవన్

"నీతోనే డాన్స్" ఈ శనివారం ఎపిసోడ్ రెట్రో థీమ్ తో మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. కాస్ట్యూమ్స్ కూడా అద్భుతమైనవి వేసుకొచ్చి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేశారు.  ఇందులో ఒక్కొక్కళ్ళు ఎంచుకున్న సాంగ్స్ కూడా ఆడియన్స్ ని మళ్ళీ ఆ కాలానికి తీసుకెళ్లిపోయాయి. ఇక ఫస్ట్ పవన్ - అంజలి వచ్చి "ఎల్లువొచ్చి గోదారమ్మ" సాంగ్ కి డాన్స్ చేసి చూపించారు. ఈ సాంగ్ ఐపోయాక జడ్జెస్ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఐతే  ఈ సాంగ్ కి అంత ఆక్రోబాటిక్స్ అవసరం లేదని చెప్పారు తరుణ్ మాష్టర్..ఇక మిగతా జడ్జెస్ కి కూడా ఈ పెర్ఫార్మెన్స్ అంతగా నచ్చలేదని అర్ధమయ్యింది. వీళ్లకు నటరాజ్ మాష్టర్ జోడి 6 మార్క్స్ ఇచ్చారు.