దేశానికి తెలంగాణ మహిళలు ఆదర్శం : సీఎం రేవంత్

Publish Date:May 25, 2026

Advertisement

 

2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. “మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుంది.. కుటుంబం బలపడితే గ్రామం అభివృద్ధి చెందుతుంది.. గ్రామం అభివృద్ధి చెందితే తెలంగాణ మరింత శక్తివంతమవుతుంది” అని సీఎం పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించిందని, వడ్డీ లేని రుణాల కోసం ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించిందని సీఎం వెల్లడించారు. ఇకపై మహిళా సంఘాలు చిన్నచిన్న ఉపాధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా భారీ వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. రైస్ మిల్లులు, మండల స్థాయి గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని సూచించారు. 

అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్రను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మహిళా సంఘాలే నేరుగా వడ్లు కొనుగోలు చేసి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. మహిళల చేతుల్లో ఈ వ్యవస్థ ఉంటే పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో “మహిళా శక్తి సూపర్ బజార్లు” ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. డీమార్ట్‌, బిగ్‌బజార్‌లకు పోటీగా ఉండేలా అత్యాధునిక సూపర్ మార్కెట్లు ప్రారంభించాలని చెప్పారు. పట్టణాల్లో వీటి కోసం తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించడం, మహిళా సంఘాలకు ఆదాయం పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సూపర్ బజార్లలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు.

సోమవారం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇది చారిత్రాత్మక అడుగని సీఎం పేర్కొన్నారు. ఒకే రోజు, ఒకే సమయంలో 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని తెలిపారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు అంటే కేవలం సమావేశాల స్థలం కాదని, వారి ఆర్థిక కార్యకలాపాలు, శిక్షణ, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదిక అని వివరించారు. 

తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా ముందుకు సాగుతోందన్నారు. మహిళా సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేశామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పథకం కోసం ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల వరకు చెల్లించామని తెలిపారు. ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరిగినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని విమర్శించారు.

మహిళలను బస్సుల యజమానులుగా మార్చే లక్ష్యంతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఇందులో భాగంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీ రంగంలో కూడా మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నామని సీఎం చెప్పారు. 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసే ప్రణాళిక అమలులో ఉందన్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో సీఎం మాట్లాడారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా రూ.27 లక్షల వరకు ఆదాయం పొందామని చెప్పగా సీఎం వారిని అభినందించారు. కొన్ని మహిళా సంఘాలు నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను వందశాతం చెల్లించడంపై సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.

పెద్ద వ్యాపారులు వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఉదాహరణలు ఉన్నాయని, కానీ మహిళా సంఘాలు నిజాయితీగా రుణాలను తిరిగి చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా చిలకపచ్చ రంగులో రూపొందించిన కొత్త ఇందిరమ్మ చీరల నాలుగు డిజైన్లను కూడా సీఎం ఆవిష్కరించారు. గతంలో చీరల నాణ్యతపై విమర్శలు వచ్చాయని గుర్తుచేసిన సీఎం.. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు మహిళలను మరింత ఆకర్షణీయంగా నిలబెడుతున్నాయని అన్నారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
ఇప్పటివరకు తాము ఎన్నో విషయాలను ఓపికగా భరించామని, అయితే ఇకపై సహించే ప్రసక్తే లేదని జనసేన
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి.
రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.