Top Stories

కాల్పుల విరమణపై భారత్-పాక్ మరో కీలక నిర్ణయం

  భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని  డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ల సమావేశంలో నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. మే 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక బెల్లెట్ కూడా పేల్చకూడదని బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించాలని తీర్మానం చేసినట్లు పేర్కొంది. అయితే సింధూ జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగబోవని తేల్చి చెప్పింది. పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ, తదుపరి సమాచారం మీకు తెలియజేస్తాం అని అధికారులు పేర్కొన్నారు.  
కాల్పుల విరమణపై భారత్-పాక్ మరో  కీలక నిర్ణయం Publish Date: May 15, 2025 10:13PM

కాళేశ్వరం ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

  కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ సమగ్రాభివృద్ధికి అవసరమైతే రూ.200 కోట్ల వరకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సరస్వతీ పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మొట్టమొదటిసారిగా టెంట్ సిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు రానున్నాయని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించే అదృష్టం తనకు కలగనుందని అన్నారు. కాళేశ్వరం క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.  
కాళేశ్వరం ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి Publish Date: May 15, 2025 9:39PM

రాష్ట్రపతి గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు.. సర్వోన్నత న్యాయస్థానంకు ద్రౌపది ముర్ము ప్రశ్న

  దేశంలో ఏదైనా బిల్లును రాష్ట్రపతి  ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని 415 పేజీలతో కూడిన తీర్పును అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. రాజ్యాంగం లో అలాంటి నిబంధనలేవీ లేనప్పుడు కోర్టు అలా ఎలా తీర్పు ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు గా సమాచారం. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు తీర్పుపై 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలపై సలహా కోరారు. ఈ ప్రశ్నల్లో రాజ్యాంగ అధికారాలు, పరిమితులు, శాసన ప్రక్రియలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టు  నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మహాదేవన్‌ ధర్మాసనం తేల్చి చెప్పింది. భారత రాష్ట్రపతి ముర్ము అత్యున్నత ధర్మాసనంకు రాసిన లేఖపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె  స్టాలిన్ స్పందించారు. రాష్ట్రపతి ముర్ము కు మరో మూడు కీలక ప్రశ్నలు స్టాలిన్ సంధించారు.  
రాష్ట్రపతి గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు.. సర్వోన్నత న్యాయస్థానంకు ద్రౌపది ముర్ము  ప్రశ్న Publish Date: May 15, 2025 9:12PM

ఎల్లుండి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు

    హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎల్లుండి నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. సవరించిన నూతన ఛార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉండగా, దానిని రూ.12కి పెంచారు. అదేవిధంగా, గరిష్ఠ ప్రయాణ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరగనుంది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పెరిగిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి.  పెరిగిన ఛార్జీల వివరాలు     మొదటి రెండు స్టాప్‌లకు రూ.12     రెండు నుంచి 4 స్టాప్‌ల వరకు రూ.18     4 నుంచి 6 స్టాప్‌ల వరకు రూ.30     6 నుంచి 9 స్టాప్‌ల వరకు రూ.40     9 నుంచి 12 స్టాప్‌ల వరకు రూ.50     12 నుంచి 15 స్టాప్‌ల వరకు రూ.55     15 నుంచి 18 స్టాప్‌ల వరకు రూ.60     18 నుంచి 21 స్టాప్‌ల వరకు రూ.66     21 నుంచి 24 స్టాప్‌ల వరకు రూ.70     24 స్టాప్‌లు.. ఆపైన రూ.75  
ఎల్లుండి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు Publish Date: May 15, 2025 8:29PM

పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ లోకేష్ కు ప్రమోషన్?

కడపలో తెలుగుదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పసుపు పండుగ మహానాడులో కీలక నిర్ణయాలు వెలువడుతాయన్న సంకేతాలు వినవస్తున్నాయి. వాటిలో ప్రధానంగా పార్టీలో లోకేష్ కు అత్యంత కీలక పదవిని కట్టబెట్టనున్నారని గట్టిగా వినవస్తున్నది. లోకేష్ కు ప్రమోషన్ కోసం పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవిని సృష్టించి ఆ పదవిని లోకేష్ కు కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. పార్టీలో అత్యంత నిర్మాణాత్మకమైన, నిర్ణయాత్మకమైన బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   ఇక లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై కడప మహానాడు వేదికగా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంత వరకూ బానే ఉంది. పార్టీలో లోకేష్ ప్రమోషన్ సరే.. అయితే అటువంటి ప్రమోషనే లోకేష్ కు ప్రభుత్వంలో కూడా దక్కాల్సి ఉందని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే లోకేష్ ను ఉపముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపించింది. అయితే సంకీర్ణ ధర్మాన్ని, కూటమి పరిమితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు అటువంటి డిమాండ్ లు చేయవద్దంటూ చంద్రబాబు గట్టిగా మందలించడంతో ఆ డిమాండ్ సద్దుమణిగింది. అయితే ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఖాయమైన నేపథ్యంలో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరిస్తున్న లోకేష్ కు ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో జోరందుకుంటోంది.   మిత్రధర్మం పేరిట లోకేష్ కు ప్రభుత్వంలో  మూడో స్థానంలో ఉంచడం సరికాదన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి లోకేష్ కు ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ ఇవ్వకున్నా ఆయన స్థాయికి కానీ, హోదాకు కానీ వచ్చిన నష్టమేదీ లేదు. వాస్తవానికి పార్టీ మొత్తం చంద్రబాబుకు సక్ససర్ లోకేషే అని మక్తకంఠంతో చెబుతోంది. అదే పరిస్థితి ప్రభుత్వంలోనూ ఉండాలనీ, దానిని అధికారికంగా ప్రకటించాలనీ క్యాడర్ కోరుతోంది.  
పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ లోకేష్ కు ప్రమోషన్? Publish Date: May 15, 2025 5:05PM

భారత్‌కు ట్రంప్ యాపిల్ స్ట్రోక్

  భారత్‌కు ట్రంప్ యాపిల్‌తో స్ట్రోక్‌లు ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాపిల్‌ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకొన్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడి.. భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దని కోరారట. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. టిమ్‌ కుక్‌ భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని,  అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానని,  ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్‌ అంగీకరించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఖతార్‌లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ భేటీ అయ్యారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనాపై భారీగా టారిఫ్‌లు విధించడం.. అమెరికాతో దానికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండటంతో యాపిల్‌ అప్రమత్తమైంది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్‌లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మన దేశంలో ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఐఫోన్ అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.  అమెరికా మార్కెట్లో జూన్‌ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని.. అదే ఐపాడ్స్‌, మ్యాక్‌బుక్‌, యాపిల్‌ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకొంటామన్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా రకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు.  అమెరికాకు భారత్‌ ఓ డీల్‌ను ఆఫర్‌ చేసింది. ఇది ప్రాథమికంగా జీరో టారిఫ్‌లదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌-అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై  జోరుగా చర్చలు జరుపుతున్నాయి. వీటి పురోగతి గొప్పగా ఉందని ఏప్రిల్‌ 30వ తేదీ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే ఒప్పందానికి వస్తామని నాడు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటిదిప్పుడు యాపిల్‌ మన దేశం నోటి దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
భారత్‌కు ట్రంప్ యాపిల్ స్ట్రోక్ Publish Date: May 15, 2025 4:41PM

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్‌‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులలో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణీకుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని, వారిలో భయం లేకుండా నిరంతరంగా సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. భద్రతా దళాలు, జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణీకులను సురక్షితంగా తరలించగలిగామని ఆయన పేర్కొన్నారు.  విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను నేడు శ్రీనగర్ నుండి మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే, శ్రీనగర్‌లోని ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్‌ను కూడా సందర్శించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్లి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి మరియు పర్యాటకాన్ని మరల ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ గురించి వారికి హామీ ఇచ్చారు.శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
శ్రీనగర్ ఎయిర్ పోర్ట్‌‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Publish Date: May 15, 2025 4:32PM

కొడాలి నాని ఏరీ? ఎక్కడ? ఆరోగ్యం ఏలా ఉంది?

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని  వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే  దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.   కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయవంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ  గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు   తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి విషయాలేవీ బయటకు తెలియడం లేదు. కొడాలి నాని సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన ఇంకా ముంబైలోనే ఉన్నారని అంటున్నారు. కానీ ఆపరేషన్ విజయవంతమైన తరువాత నెలల తరబడి ఆయన ముంబైలో  ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం బదులు లేదు. ఆయన మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే సమాధానం దొరకదు.  అయితే కొడాలి నాని మాత్రం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తెలుగుదేశం తనను టార్గెట్ చేయదని భావిస్తున్నట్లుగా ఉందని, రెడ్ బుక్ నుంచి తన పేరు తొలగించేస్తారని ఆశిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లు తనకు సేఫ్ కాదనీ, అందుకే ముంబైలోనే ఉండిపోయారనీ కూడా అంటున్నారు.  ఎందుకంటే కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి బెజవాడకు తరలించుకుపోయారు. దాదాపు వంద రోజులుగా వంశీ కటకటాలు లెక్కిస్తూనే ఉన్నారు. తనకూ ఆ గతే పడుతుందన్న భయంతోనే కొడాలి నాని తెలుగు రాష్ట్రాలవైపు కన్నెత్తి చూడకుండా ముంబైని షెల్టర్ జోన్ గా భావించి అక్కడే ఉండిపోయారని అంటున్నారు. వైసీపీ అధినేత బెంగళూరు  షెల్టర్ జోన్ గా భావించి చుట్టపు  చూపుగా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ నే ఆదర్శంగా తీసుకున్న కొడాలి నాని.. కనీసం చుట్టపు చూపుగానైనా ఏపీవైపు రావడం లేదని అంటున్నారు.   
కొడాలి నాని ఏరీ? ఎక్కడ? ఆరోగ్యం ఏలా ఉంది? Publish Date: May 15, 2025 4:21PM

హైదరాబాద్‌‌లో రౌడీ షీటర్‌ దారుణ హత్య

  హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఒక రౌడీ షీటర్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ అనే వ్యక్తిపై రౌడీ షీట్ ఉంది. ఇతను ఒక కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళుతున్నాడు.ఈ క్రమంలో, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి వద్దకు రాగానే, అప్పటికే మాటు వేసి ఉన్న ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. మొదట దుండగులు ఖురేషీని క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారు.  అనంతరం కత్తులతో గొంతు కోసి, పొట్టలో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. నిందితులు హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను సంఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌‌లో రౌడీ షీటర్‌  దారుణ హత్య Publish Date: May 15, 2025 4:19PM

టీడీపీలో కొత్త పదవి.. నారా లోకేష్‌కి ప్రమోషన్?

కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న  ప్రచారం జోరందుకుంది. లోకేష్‌కు ప్రమోషన్‌పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. టీడీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమించే ఛాన్స్‌ ఉందంటున్నారు. నారా లోకేష్‌ కోసం పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ క్రియేట్ చేయబోతున్నారంట.  ఇకపై ఒక నేతకు ఒకే పదవి రెండు సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారంట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని లోకేష్‌ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు.  నారా లోకేశ్  యూత్‌కు కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలో పార్టీ సీనియర్లు ఉన్నారంట. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్‌ను మరింత ఎలివేట్ చేయడానికే ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకూ లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించారు. అటు పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేశ్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారంట. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా ఆయ‌న అడుగులు వేస్తున్నట్టు ప‌నితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతుల్ని ఆక‌ర్షించ‌డం ద్వారా, వాళ్ల కుటుంబాల్ని రాజ‌కీయంగా త‌మ‌వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.  లోకేష్ నేతృత్వంలో ఇప్పటి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 91వేల 839 కోట్ల పెట్టుబ‌డులు, ఒక లక్షా 41వేల 407 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో 5 ల‌క్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. సో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండిట్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న లోకేష్‌ను పార్టీపరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ దోహద పడుతుందనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారంట. మరి చూడాలి కడప మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారో?
టీడీపీలో కొత్త పదవి.. నారా లోకేష్‌కి ప్రమోషన్? Publish Date: May 15, 2025 3:44PM

విజయవాడలో రేపు తిరంగా ర్యాలీ.. చంద్రబాబు, పవన్‌కు బీజేపీ ఆహ్వానం

  ఆపరేషన్ సిందూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని ఈనెల మే 16న విజయవాడలో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి నిర్ణ‌యించారు. శుక్రవారం సాయంత్రం ఈ ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిస‌ర్కిల్ వ‌ర‌కు ర్యాలీ జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పురందేశ్వ‌రి ఆహ్వానించారు. కూటమి నేతలంతా యాత్రలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడం, భారత్‌తో కాల్పుల విరమణకు పాక్ దిగిరావడంతో భారతీయ జనతా పార్టీ  దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించింది. పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ బీజేపీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించనున్నారు.
విజయవాడలో రేపు  తిరంగా ర్యాలీ.. చంద్రబాబు, పవన్‌కు బీజేపీ ఆహ్వానం Publish Date: May 15, 2025 3:37PM

సొంత జిల్లాలో జగన్‌కు భారీ షాక్.. మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి గుడ్ బై

  వైసీపీ అధినేత జగన్‌కు సొంత జిల్లాలో  భారీ షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గతకొద్ది కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. అధినేత జగన్‌తో మాట్లాడించాల‌ని గ‌త మూడు నెల‌లుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా ప‌ట్టించుకోలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచ‌రుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చంద్ర తెలిపారు. ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తప్పుకున్నారు. జగన్ సొంత ఇలాఖలో ఆ పార్టీకి నాయకుల ఆదరణ కరువు అవుతోంది.  గత ఎన్నికల్లో జగన్ కు సైతం మెజార్టీ తగ్గింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కడప జిల్లాలో పార్టీ బలహీనం అయినట్లు జగన్‌కు ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అయినా సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగలడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇక‌, నిన్న వైసీపీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన‌ జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరారు.  ఆమె రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య‌ ఆరుకు చేరింది.
సొంత జిల్లాలో జగన్‌కు భారీ షాక్..  మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి గుడ్ బై Publish Date: May 15, 2025 2:43PM

జగన్ ఇలాకాలో చరిత్రలో నిలిచిపోయేలా పసుపు పండుగ

జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కడపలో టీడీపీ మహానాడు మూడు రోజుల  పాటు నిర్వహించడానికి నిర్ణయించింది.  2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవ్వడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లకు రంగం సిద్దమవుతోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఈసారి మహానాడు విశేషం ఏంటంటే  టీడీపీ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహానాడుకు కడప జిల్లాను ఎంచుకుంది టీడీపీ.  ఇప్పుటికే ఏర్పాట్లను మొదలుపెట్టేసింది.  వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకాలో పసుపు పండగను ఘనంగా నిర్వహించేందుకు యాక్షన్‌లోకి దిగింది. గతంలో ఎన్నడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ...మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో మహానాడుని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మహానాడు నిర్వహిస్తారనే ప్రచారం కూడా నడించింది. కానీ జిల్లా నాయకుల సూచనలతో కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో  బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. గెలిచిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు ఇదే కావడంతో అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఒక వైపు అమరావతి పున:నిర్మాణ పనులు మొదలుపెట్టి, అభివృద్ధి పనులకు వరసగా శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఎటు చూసినా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా టీడీపీకి అంతా కలసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహనాడు నిర్వహించాలని భావిస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు వసతి, రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ సిద్దాంతాలు, నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలు, నేడు ప్రభుత్వ విజయాలు మహానాడులో విస్తృతంగా చర్చించనున్నారు.  మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై, రెండోరోజు  ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. మూడో రోజు లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమవో ఈ నెల 18, 19, 20వ తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహిస్తారు. 22, 23 వ తేదీల్లో పార్లమెంటు వారీగా మినీ మహానాడు జరుగుతుందంటున్నారు.   నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా మహానాడు వేడుక నిర్వహించడానికి యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. ఇక జగన్ జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయంగా గట్టి సంకేతాలు ఇవ్వాలనే ప్లాన్‌లో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ జిల్లాలో పట్టభద్రల ఎమ్మెల్సీ స్ధానాన్ని గెలుచుకోవడం,తర్వాత జరిగి సార్వత్రిక ఎన్నికల్లో  కూటమి జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు స్థానాలు గెలుచుకుని జగన్ సొంత జిల్లాలో సత్తాను చాటింది. ఇలాంటి తరుణంలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. సీమకు సాగు నీళ్లిచ్చింది, ఫ్యాక్షన్ ను అంతం చేసింది టీడీపీనే. పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో సీమ సీను మారిపోయింది.  ఈ నేపథ్యంలోనే చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడుతో రాయలసీమ పార్టీ శ్రేణులో నూతనోత్సాహం నెలకొంది.  పులివెందులలో మహానాడు ఎందుకు నిర్వహించడంలేదు అంటే అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదు  అంటున్నారు. కడప నుంచి సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు ఏపీ అంతటా రీసౌండ్ ఇచ్చేలా చేయాలనే కడపను ఎంచుకున్నారని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి
జగన్ ఇలాకాలో చరిత్రలో నిలిచిపోయేలా పసుపు పండుగ Publish Date: May 15, 2025 2:20PM

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు..ఎందుకంటే?

    టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ట్రాఫిక్‌లో రాంగ్ రూట్‌లో వెళ్ల‌డ‌మే కాకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆయ‌న‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కాగా, జూబ్లీహిల్స్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ వ‌ద్ద బెల్లంకొండ త‌న కారులో రాంగ్ రూట్‌లో వచ్చాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విష‌యం తెలిసిందే. కాగా, సదరు హీరోను ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని హెచ్చ‌రించారు. రాంగ్ రూట్‌లో ఎలా వ‌స్తారంటూ కానిస్టేబుల్ ప్ర‌శ్నించ‌డంతో శ్రీనివాస్ అక్క‌డి నుంచి వెన‌క్కి వెళ్లిపోయారు. ఇక‌, ప్ర‌స్తుతం ఈ యువ హీరో నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. భైర‌వం, టైస‌న్ నాయుడు, హైంద‌వ‌, కిష్కింధ‌పురి చిత్రాల్లో న‌టిస్తున్నారు. 
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు..ఎందుకంటే? Publish Date: May 15, 2025 2:07PM

యర్రగొండపాలెం వైపు ఆదిమూలపు చూపు

సిట్టింగ్ స్థానంలో వైసీపీ పాలిట్రిక్స్  ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన యర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారంట. అందులో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు పొగ పెట్టే పనిలో పడ్డారంట. పార్టీ అధికారం కోల్పోయినా తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ మాజీ మంత్రి పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూస్తున్నారంట.  ఆ క్రమంలో ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం తిరిగి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీలో ఉన్న తన అనుచరుల్ని టీడీపీలో చేర్చడమే లక్ష్యంగా ఆదిమూలపు సురేష్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జిల్లా  రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  2024 ఎన్నికల సమయంలో తనకు కాకుండా పోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా ఫ్యాన్ పార్టీని వీక్ చేసి తిరిగి అక్కడ పాగా వేయాలని సురేష్ ప్రయత్నిస్తున్నారంట. ఆ క్రమంలో ఆదిమూలపు సురేష్ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చినీయంశంగా మారింది. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గానికి మారి వైసీపీ నుండి గెలుపొందారు. 2019లో తిరిగి తన నియోజక వర్గమైన ఎర్రగొండపాలెం వెళ్లిన సురేష్ ఆ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలోనూ ఆదిమూలపు సురేష్‌కి రెండో సారి మంత్రిగా అవకాశం లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో సురేష్‌తో పాట మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని మూడేళ్ళకే పక్కన పెట్టినా.. సురేష్‌ని ఐదేళ్ళ పాటూ కొనసాగించారు. దానిపై అప్పట్లో బాలినేని అలకపాన్పు ఎక్కడంతో వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది.  మంత్రిగా ఆదిమూలపు సురేష్‌పై అంత నమ్మకం ఉంచిన జగన్ టికెట్ దగ్గరకు వచ్చే సరికి మరోసారి ఆయనకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ని కొండపి నియోజక వర్గానికి మార్చారు. తప్పనిసరి పరిస్థితులలో ఆయన కొండేపి నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే సురేష్ సిట్టింగ్ స్థానమైన ఎర్రగొండపాలెంలో పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి హవాలోను వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెగ ఫీల్ అవుతున్నారంట.  కొండపి నియోజకవర్గంలో ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఆదిమూలపు సురేశ్  తిరిగి ఎర్రగొండపాలానికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే  తాటిపర్తి చంద్రశేఖర్ పరపతిని తగ్గించడమే మార్గమని భావిస్తున్న ఆదిమూలపు సురేష్ ఆ పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా  ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంలో తన ముఖ్య అనుచరులుగా ఉన్న వారిని తెరచాటు రాజకీయం నడిపి సైకిల్ ఎక్కిస్తున్నారన్న టాక్ నడుస్తోందట. ఇటీవల  త్రిపురాంతకం ఎంపిపి  స్థానానికి, పుల్లలచెరువు మండల పరిషత్ వైఎస్ ప్రెసిడెంట్ స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా తన అనుచరులతో కలిసి తెరచాటు రాజకీయం నడిపారని ప్రచారం జరుగుతోంది.  ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ స్కెచ్ తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయన్ని పిలిచి మందలించారంటున్నారు. ఒక వైపు టీడీపీలోకి తన అనుచరులను పంపుతూ యర్రగొండపాలెంలో వైసీపీని వీక్ చెయ్యాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే ఆదిమూలపు సురేష్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం యర్రగొండపాలెంలో గుప్పుమంటోందట. ఈనేపథ్యంలో ముందస్తుగా తన అనుచరుల్ని సురేష్ వైసీపీ నుండి టీడీపీలో చేరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.  అయితే నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలతో తనకు సంబంధం లేదని ఆదిమూలపు సురేష్ పార్టీ పెద్దలకు వివరణ ఇస్తున్నా...సురేష్ పై మాత్రం రోజురోజుకీ ప్రచారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. చంద్రశేఖర్‌ని వీక్ చేసి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చేపట్టాలనే వ్యూహంలో ఆదిమూలపు సురేష్ ఉన్నారంటున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.  
యర్రగొండపాలెం వైపు ఆదిమూలపు చూపు Publish Date: May 15, 2025 2:06PM

పెద్దిరెడ్డికి బిగుస్తున్న భూముల ఉచ్చు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో తన హవా చాటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి,  సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలను శాసించేవారు. ఆయనకు కావాల్సిన వారికి పదవులు.. కన్నెర్ర చేసిన వారికి కష్టాలు తప్పదని సొంత కొటరీ నాయకులు చెబుతుంటారు. ఇలా సాగిన ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్ల పై భూములు కనిపిస్తే కబ్జా చేస్తూ పోయారు. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై సామగ్ర విచారణలో లోతైన విషయాలు బయటపడ్డాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు సమీపంలోని అటవీ భూముల పై విచారణ ఇప్పటికే జరు గుతోంది.. మరో వైపు తిరుపతిలోని బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకుని కంచెను వేసుకుని ఆనుభువిస్తున్న దానిపై ఇటీవల దేవాదాయశాఖ, మఠం అధికారులు నోటీసులు పంపి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి అటవీ భూములు ఆనుకుని ఉన్న భూమికి మరింత స్వాధీనం చేసుకుని కూలీల కోసం విలాసవంతమైన భవనం చిత్తూరు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగంపేట లో నిర్మించారు. వీటితోపాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి పై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నది. మంగళంపేటలోని 27.98 ఎకరాల అటవీశాఖ భూమిని ఆక్రమించడంతో పాటు జీవవైవిధ్యంకు నష్టం కలిగించారని ప్రాథమిక నివేదికలో     అధికారులు పేర్కొన్నారు. దీనిలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ,   మరో ఇద్దరు సహా  మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయ్యింది త్వరలో పాకాల కోర్టు లో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు అనే దాని పై విచారణ జరుగుతోంది.
పెద్దిరెడ్డికి బిగుస్తున్న భూముల ఉచ్చు! Publish Date: May 15, 2025 12:52PM

ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. డిస్టలరీల నుంచి ముడుపులు వసూలు చేసే   నెట్ వర్క్ లో గోవిందప్ప కీలకంగా వ్యవరించారని రిమాండ్ రిపోర్ట్ లో  సిట్ స్పష్టం చేసింది. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను రెడీ చేశారని.. ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.  లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A 33గా ఉన్నారు. ఈయన అరెస్ట్‌తో లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ల సంఖ్య ఐదుకు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లూ సిట్ విచారణకు దూరంగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. చాణక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్దిదారుకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం.  గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడని, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారని చెబుతున్నారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేసి పట్టుకున్నాయి. ట్రాన్సిట్‌ వారంట్‌ కోసం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి, విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.  అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్‌ కెసిరెడ్డి బృందం ప్రతి నెలా 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్‌ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీల యజమానులూ సిట్‌కు వాంగ్మూలా లిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిల్లో తరచూ సమావేశమయ్యేవారని సిట్‌ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.  గైర్హాజరవడంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. గోవిందప్ప చార్టర్డ్‌ అకౌంటెంట్‌. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి.  సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి, భారత్‌కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్‌ 30 నుంచి భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కాంలో అంతిమ లబ్దిదారు ఎవరు అనే అంశాలపై సిట్‌ ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్సులతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది.
ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు Publish Date: May 15, 2025 11:21AM

ఇకపై తోక ఝాడిస్తే పాక్ పని దబిడిదిబిడే!

ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది.  తమ యుద్ధం ఉగ్రవాదంపైనే తప్ప.. పాక్ పౌరులపై కాదని విస్పష్టంగా ప్రకటించిన ప్రధాని, కాల్పుల విమరణ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ భారత్ పై పంజా విసరనంత వరకేననీ,  అటువైపు నుంచి ఒక్క ఉగ్రదాడి జరిగినా యుద్ధమేననీ విస్పష్ట హెచ్చరిక చేశారు.   అదే సమయంలో కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించామనీ, పాక్ తో దౌత్య సంబంధాల ప్రశ్నే లేదనీ తేల్చేసిన  ఆయన ఇండస్ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న తేల్చేశారు.  ఆపరేషన్ సిందూర్ ఆగలేదని పాకిస్తాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధ చర్యగానే భావించి ప్రతి దాడులు చేస్తామనీ హెచ్చరించారు.  ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిని ఉన్న పాకిస్థాన్ కు ఈ హెచ్చరిక చాలదా? మరోసారి భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించాలంటే వణుకుపుట్టడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇక పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే.. అవి  ఉగ్రవాద  నిర్మూలన,పీవోకే అంశాలపైనేననీ క్లియర్ కట్ గా చెప్పేశారు.   అలాగే పాక్,భారత్ మధ్య   ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రకటించడం ద్వారా పరోక్షంగా అమెరికాకు మీ మర్యాద మీరు కాపాడుకోండన్న హెచ్చరికా చేశారు.  పాక్  యుద్ధం ఆపమని కాళ్ల బేరానికి రావడం,అమాయక పౌరులు సంక్షోభంలో పడటం ఇష్టం లేక మాత్రమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని కుండబద్దలు కొట్టినట్లు మోడీ చెప్పారు. ఇక్కడ కొసమెరుపేంటంటే.. కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్థాన్ భారత్ కాళ్లా వేళ్లా పడుతోంది. సింధు జలాల ఒప్పందం రద్దు పునస్సమీక్షించండి ప్లీజ్ అంటూ బతిమలాడుకుంటోంది. ఈ ఒప్పందం రద్దు కారణంగా నీటి సమస్యతో  నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నామంటూ లేఖ రాసింది. దీనిని బట్టే మోడీ తన వ్యూహాలతో పాకిస్థాన్ ను చక్రబంధంలో బిగించేశారనీ, ఆ దేశం ఇక తోక జాడించే అవకాశాలు ఇంచుమించు లేవనీ అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  
ఇకపై తోక ఝాడిస్తే పాక్ పని దబిడిదిబిడే! Publish Date: May 15, 2025 11:12AM

టార్గెట్ 60 డేస్.. రూ.41 కోట్ల విలువైన పనులు పూర్తి

కోటం రెడ్డి స్పీడే వేరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. అభివృద్ధి పనుల విషయంలో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ముందుకు కదులుతారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ లో దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఓకే రోజు ప్రారంభిస్తున్నారు. అందుకు మే 15 (గురువారం) ముహూర్తం పెట్టారు. ఈ పనులన్నిటీనీ రెండంటే రెండు నెలల్లో పూర్తి చేశారు. ముందుగానే 60 రోజుల టార్గెట్ ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగారు. రికార్డు సమయంలో పూర్తి చేసినా పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రానీయలేదు. ఇక వీటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా వినూత్నంగానే చేస్తున్నారు. మే 15న నెల్లూరు రూరల్ లో ఈ  పనులను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రారంభించనున్నారు. మంత్రి పొగూరు నారాయణ, కూటమి నేతలూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పెట్టుకున్న టార్గెట్ మేరకు కేవలం 60 రోజుల వ్యవధిలోనే మొత్తం 339 అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి లోకేష్ అభినందించారు.  
టార్గెట్ 60 డేస్.. రూ.41 కోట్ల విలువైన పనులు పూర్తి Publish Date: May 15, 2025 10:48AM

కాల్పుల విరమణకు అసలు కారణం ఏంటో తెలుసా?

ఆపరేషన్ సింధూర్  కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా భారత్,పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరగడం..కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలనూ అంగీకరింపచేయడం తన ఘనతేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుని, తనను తానే ఓ గొప్ప శాంతి దూతగా అభివర్ణించేసుకోవడం తెలిసిందే. అయితే భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. భారత్, పాక్ ల విషయంలో ట్రంప్ చేసిందేమీ లేదని మోడీ నిష్కర్షగా చెప్పేశారు. అయినా భారత్ అన్ని విధాలుగా అప్పర్ హ్యాండ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందా అన్న విస్మయం ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది.  ఇక దేశంలో అయితే  ప్రధాని మోదీ నిర్ణయంపై భారత్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. విమర్శలూ వెల్లువెత్తాయి.  ఇప్పుడిప్పుడే కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడానికీ, కాల్పులు ఆపండి మహప్రభో అంటూ పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.  భారత్ ఆపరేషన్లలో భాగంగా పాకిస్తాన్ అణు స్థావరమైన కిరానాహిల్స్ సమీపంలోని సర్గోదా ఎయిర్ బేస్ పై క్షిపణి దాడి చేసింది. కిరానా హిల్స్ నుంచి 20 కి.మీ వరకూ సోరంగాలు ఉన్నాయి.భారత్ క్షిపణీలు సర్దోదా ఎయిర్ బేస్ పక్కన ఉన్న సోరంగంలోని అణువార్ హెడ్స్ ను తాకాయి. దాంతో   రేడియేషన్ లీక్ అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతోనే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందనీ, భారత్ కు కాల్పుల విరమణకు అంగీకరించి.. రేడియేషన్ లీక్ ను ఆపుకునేందుకు తమకు  వెసులుబాటు కల్పించాలనీ బతిమ లాడుకుంది. ఆ కారణంగానే  భారత్ కాల్పులు విరమణకు అంగీకరించిందనీ తెలుస్తోంది. రేడియేషన్ లీక్  అయ్యిందనీ, ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండేవారంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ జీవో జారీ చేసింది. ఇదే విషయాన్ని భారత్ కు తెలియజేసి కాల్పుల విరమణకు ఒప్పించిందని తెలుస్తోంది.  పాక్ పౌరుల ప్రాణ రక్షణ కోసమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందన్న ప్రశంసలూ సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుద్ధరంగ నిపుణులు భారత్ పై ప్రశంసలు కురిపించడం, భారత్ సంయమనాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు.  
కాల్పుల విరమణకు అసలు కారణం ఏంటో తెలుసా? Publish Date: May 15, 2025 10:08AM

నక్కజిత్తుల పాక్ నడ్డి విరిచిన భారత్

భారత్ పై టర్కీ డ్రోన్స్ తో పాక్   దాడి చేసింది. నాలుగురోజుల  ఆపరేషన్  సింధూర్ తో భారత్ గట్టి జవాబు ఇచ్చింది. వందల సంఖ్యలో టర్కీడ్రోన్స్ ను భారత్ కూల్చివేసింది.  2023 లో టర్కీలో వచ్చిన భూకంపానికి ఆ దేశం కకావికలం అయి దిక్కుతోచని స్థితిలో పడిన సమయంలో  ఏ దేశం ముందుకు రాని స్థితిలో భారత్  ఆపరేషన్ దోస్తు అంటూ ఆహారం,మందులు ఇతర సహాయం అందించింది. ఆపద సమయంలో ఆదుకున్న భారత్ పట్ల టర్కీ మిత్రద్రోహం చేసింది.  భారత్ మంచితనానికి డ్రోన్లతో రుణం తీర్చుకున్న ద్రోహబుద్ది టర్కీది అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాన్ టర్కీ ట్యాగ్ లైన్ తో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. భారత పర్యాటకులు తమ పర్యాటక ప్రదేశాల నుంచి టర్కీని తుడిచేశారు.  టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు భారత్‌  పట్ల నిలువెల్లా ద్వేషం. దాన్ని పలుమార్లు ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. పెహల్గామ్‌ ఉగ్రదాడిని మాట మాత్రంగా కూడా ఖండించలేదు ఎర్డోగాన్‌. ఇక ఇస్లామిక్‌ దేశాలకు సౌదీ అరేబియా నేతృత్వం వహిస్తోంది. అయితే ఇస్లామిక్‌ దేశాలకు నేతృత్వం వహించాలన్నది టర్కీ కల. దీనికి సౌదీ అరేబియా అడ్డు రావడం, ఆ దేశంతో భారత్ కు మంచి సంబంధాలు ఉండడమే ఆ దేశం భారత్‌ పట్ల విషం కక్కడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. భారత్ పై పాకిస్థాన్ దాడులు చేయడానికి టర్కీ ఐదు విమానాల్లో   ఆయుధాలను కూడా ఆదేశానికి పంపించింది. పాక్ కు ఆయుధాలతో విమానం పంపి ఇంధనం కోసం దిగిందని సమర్ధించుకుంది టర్కీ. అలాగే కరాచీ ఓడరేవుకు యుద్ధనౌక ను పంపింది. ప్రపంచం మొత్తం మీద పాకిస్తాన్ కు టర్కీ, అజర్ బైజాన్ లు మాత్రమే మద్దతు పలికాయి.  టర్కీ చేసిన ద్రోహాన్ని భారత్ ప్రజలు మర్చిపోరు.  ఇదిలా ఉండగా  గత నాలుగు రోజులుగా జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నా భారత్ కు భారీగా నష్టం కలిగించామని పాకిస్థాన్ అవాస్తవాలను ప్రచారం చేసుకుంటోంది.   సుదర్శన చక్ర-400 ను నిర్వీర్యం చేశామనీ, ఏయిర్ పోర్టులను నాశనం చేశానని, పౌర ప్రాంతాల్లో దాడి చేయలేదని, సైనిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామనీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరపడిపోతోంది.   కాని వాస్తవంగా పాకిస్థాన్ భారత్ కు ఏలాంటి నష్టం కలిగించలేకపోయింది. డ్రోన్స్, క్షిపణిలను భారత్ విజయవంతంగా తిప్పికొట్పింది. ఎల్వోసీ  సరిహద్దు వెంబడి ప్రాంతాలపై కాల్పులు జరిపి  16 మంది అమాయక పౌరుల ఉసురు తీసింది. జనావాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడి.. కనీస నీతి నియమాలకు తిలోదకాలొదిలేసింది.  భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోని  9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.   ఆ తరువాత పాక్ దాడులను భారత్ సమర్ధంగా తిప్పికొట్టడంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఆ దేశం.. భారత్ తో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఉనికి మాత్రంగా కూడా మిగలమన్న భయంతో కాల్పుల విరమణ అంటూ శరణు జొచ్చింది. శరణనన్నవారిపై ఆయుధ ప్రయోగం సరికాదన్న యుద్ధ నీతిని అనుసరించి భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.  నక్క జిత్తుల పాక్ ను నమ్మడం కష్టమన్న భావనతోనే.. ఇకపై ఎలాంటి ఉగ్ర  దాడి జరిగినా యుద్ధం కిందే పరిగణిస్తామన్న గట్టి హెచ్చరిక చేసిన భారత్.. పాక్ ఇప్పటిలో తేరుకోలేనంత గట్టి గుణపాఠమే చెప్పిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. 
నక్కజిత్తుల పాక్ నడ్డి విరిచిన భారత్ Publish Date: May 15, 2025 9:45AM

ప్రేమించడం తప్పు కాదు.. కానీ  రిలేషన్ నిలబడాలంటే ఇవి ముఖ్యం..!

   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
ప్రేమించడం తప్పు కాదు.. కానీ  రిలేషన్ నిలబడాలంటే ఇవి ముఖ్యం..! Publish Date: May 15, 2025 9:30AM

పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? Publish Date: May 15, 2025 9:30AM

‘స్థానిక’సుముహుర్తం ఎప్పుడో?

జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడవు ముగిసనా ఎన్నికలు జరగక పోవడం వలన స్థానిక సంస్థలకు రావలసిన కేంద్ర నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి.  అయితే.. తాజా పరిస్థితులను, ముఖ్యంగా హామీల అమలులో జాప్యం కారణంగా ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకతను  గమనిస్తే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించే సాహసం చేస్తుందా? అనే అనుమనాలు వ్యక్త మవుతున్నాయి.     అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఇందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. మంత్రులి సైతం అంగీకరిస్తున్నదే..  ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ  ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇవ్వడమే కాకుండా.. దానికి అదనపు ఆకర్షణగా వందరోజుల ట్యాగ్ లైన్ జోడించింది. ఇచ్చిన హమీలు అన్నింటినీ వంద రోజులల్లో అమలు చేస్తామని  కాంగ్రెస్ మ్యానిఫెస్టో భరోసా ఇచ్చింది. అయితే  వందర రోజులు కాదు, రెండు వందలు, మూడు వందలు, నాలుగు, ఐదు వందల రోజులు కూడా వెళ్లి పోయాయి. అయినా ఇంతవరకు హస్తం పార్టీ ఇచ్చిన హామీల్లో అమలు కానీ హమీలదే  పై ‘చేయి’ గావుంది. నిజమే ఇచ్చిన ప్రతి హమీనీ అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుతానికి మాత్రమే కాదు, మరే ప్రభుత్వానికి అయినా అయ్యే పనికాదు. అందుకే ప్రజలు కూడా సహజంగా నూటికి నూరు శాతం హామీలు అమలు అవుతాయని ఆశించరు. అలాగే వంద రోజులంటే వంద రోజుల్లోనే అమలు కావాలని కోరుకోరు. ఎన్నో కొన్ని అయినా అమలు  చేస్తే చాలని అనుకుంటారు.  కానీ  రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కూడా లేదని అంటున్నారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిపోయినా.. హామీల అమలు విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కదలిక లేక పోవడంతో సహజంగానే ప్రజలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రతి రోజు వినిపిస్తున్న ప్రవచనాలు హామీలు అమలవుతాయనే ఆశలను పూర్తిగా తుడిచేశాయని  క్షేత్ర స్థాయి సర్వేలు సూచిస్తున్నాయి.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, రాష్ట్రానికి ప్రపంచంలో ఎక్కడా రూపాయి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రే స్వయంగా  బహిరంగ ప్రకటన చేసిన తర్వాత  వేల కోట్ల రూపాయల విలువైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం  వంద రోజుల్లో కాకున్నా వెయ్యి రోజులకు అయినా అమలు చేస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. నిజానికి  హామీలను చెత్త బుట్టకు ఎత్తడం కోసమే ముఖ్యమంత్రి, ఆర్థిక విలాపం అలపిస్తున్నారనే అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో... సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అవిశ్వాసం రోజురోజుకు పెరిగి పోతోందని కాంగ్రెస్ వర్గాలే కలవర పడుతున్నాయి.   ముఖ్యంగా  స్థానిక సంస్థల ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఓటమి భయం గుబులు  రేపుతోందని అంటున్నారు. మరో ఒకటి రెండు నెలలలో (జూన్‌ లేదా జూలై) స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఉహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళన స్పీడ్ పెరుగుతోందని అంటున్నారు.  అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని, ఏప్రిల్ 15 జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో  ఆదేశించారు. నిజానికి అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మీనాక్షి నటరాజన్  అనేక సందర్భాలలో గ్రామాలకు వెళ్ళాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయితే  గ్రాలకు వెళితే  హామీల అమలు కోసం ప్రజలు నిలదీస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఒక విధంగా  క్షేత్రస్థాయి పర్యటనలు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.  ముఖ్యంగా సంక్షేమ పధకాలు అన్నిటికీ  మూలాధారం అయిన,రేషన్ కార్డుల విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గత ఏప్రిల్‌ 21న నిజామాబాద్‌లో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల స్వయంగా రైతు భరోసా సహాయం విడుదలలో జాప్యాన్ని అంగీకరించారు. చాలా మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అంగీకరించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దీంతో, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఇంచార్జి ఆదేశాలను  చాలా మంది నాయకులు  అంతగా పట్టించుకోవడం లేదు. అలాగే  కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర నాయకత్వంతో తమ ఆందోళనలను వ్యక్తిగతంగా తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను బయటపెట్టారు. పెండింగ్‌ బిల్లుల జాప్యం వల్ల పంచాయతీ కార్యదర్శులు తమ భార్యల బంగారం, మంగళ సూత్రాలను తాకట్టు పెడుతున్నారని మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాయడం గమనార్హం. అదలా ఉంటే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో ఆ సామాజిక వర్గాలను ఎలా ఒప్పించాలనేది కాంగ్రెస్‌ నాయకులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నదని పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించినా అది చెల్లుబాటు అవుతుందా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెకింపులో కులగణన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ గణన పూర్తయ్యే వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకు పోవాలనే చర్చ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సుముహుర్తం పైనా అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
‘స్థానిక’సుముహుర్తం ఎప్పుడో? Publish Date: May 15, 2025 9:18AM

ఉగ్రవాదుల సోదరి కల్నల్ సోఫియా ఖురేషి.. బీజేపీ మంత్రి వాచాలత!

కల్నల్ సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్  మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషీ 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరారు.  2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా  టెర్రరిస్టుల సోదరి'గా పేర్కొంటూ ఆమెను కించపరచేలా మాట్లాడారు.  మహులోని  రాయ్‌కుంద గ్రామంలో జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ షా ఆపరేషన్ సిందూర్ విజయం, మోడీ గొప్పదనం గురించి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేసి పారిపోయిన ముష్కరులకు వారి సొంత సోదరితోనే గట్టి సమాధానం చెప్పామన్నారు.  విజయ్ షా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. దీంతో వెనక్కు తగ్గిన మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు కోరారు. అదలా ఉంటే.. మంత్రి విజయ్ షాపై తక్షణమే పోలీసు కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వ్యాఖ్యలపై సుమోటోగా మధ్య ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ సైతం సీరియస్ గా స్పందించింది. మంత్రి పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.  కాంగ్రెస్ పార్టీ అయితే విజయ్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేసింది. 
 ఉగ్రవాదుల సోదరి కల్నల్ సోఫియా ఖురేషి.. బీజేపీ మంత్రి వాచాలత! Publish Date: May 14, 2025 5:24PM

మసూద్ అజహర్ కు పాక్ భారీ నష్టపరిహారం.. పాక్ టెర్రర్ లింక్ కు ఇంతకంటే రుజువేంటి?

పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి ఉన్న నెక్సస్ ప్రతి సందర్బంలోనూ బయటపడుతూనే ఉందిద. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థల ప్రమేయం, వాటికి పాకిస్థాన్ ప్రభుత్వ, సైన్యం సహాయ సహకారాలు మద్దతు ఉన్నట్లు పదేపదే రుజువైంది. అయితే ప్రతి సందర్భంలోనూ పాకిస్థాన్ ఉగ్రదాడులతో సంబంధం లేదని బుకాయిస్తూనే వస్తోంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో కూడా పాక్ హస్తం ఉందన్న విషయం నిర్ధారణ అయ్యింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలను  ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్యా కొన్ని రోజుల పాటు అప్రకటిత యుద్ధం కొనసాగింది. ఆ సందర్భంగా కూడా పాకిస్థాన్ కు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు చేతులెత్తేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం బతిమలాడుకుంది. సరే ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకారించాయి.  అయితే ఇక్కడే పాక్ తన కుత్సితబుద్ధిని మరో సారి బయటపడింది. ఉగ్రవాదులతో సంబంధం లేదనీ, ఉగ్రవాదాన్నితాము ప్రోత్సహించడం లేదనీ, తామూ ఉగ్రబాధితులమేననీ బుకాయిస్తూ వస్తున్న పాక్  తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. పాక్ భూభాగంలోని 9 ఉగ్ర సంస్థలను భారత్ ధ్వంసం చేసిన సందర్భంగా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు పాకిస్థాన్ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అలా పాక్ ప్రకటించిన నష్టపరిహారం అందుకునే వారిలో అంతర్జాతీయ ఉగ్రవాది, నిషేధిత  జైషే అహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజహర్ కూడా ఉన్నాడు. బహావల్పూర్ ప్రాంతంలో భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించారు. వారందరికీ వారసుడు మసూద్ అజహారే. దీంతో పాక్ ప్రభుత్వం ఆయనకు 14 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించబోతున్నది. నిజంగా పాకిస్థాన్ కు ఉగ్ర సంస్థలతో బంధం లేకుంటే, నిజంగా ఆ దేశం కూడా ఉగ్రబాధిత దేశమే అయి ఉంటే.. తమ దేశంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ కు కృతజ్ణతలు చెప్పుకోవాలి. కానీ పాకిస్థాన్ ఆ పని చేయడం లేదు. పాక్ సైనికాధికారులు మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై ఉగ్రవాదుల శవాలపై వారి దేశ జెండా కప్పి అధికార లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతేనా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు భారీగా నష్టపరిహారం ఇస్తున్నారు.  నిషేధిత ఉగ్రవాద సంస్థ అధినేత, ప్రకటిత ఉగ్రవాది   మసూద్ అజార్‌కు ఇలా ప్రభుత్వం నేరుగా నష్టం పరిహారం ఇవ్వనుండటం వివాదాస్పదంగా మారింది. ప్రపంచ దేశాలకు పాక్ సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. 
మసూద్ అజహర్ కు పాక్ భారీ నష్టపరిహారం.. పాక్ టెర్రర్ లింక్ కు ఇంతకంటే రుజువేంటి? Publish Date: May 14, 2025 4:35PM

వంశీకి బెయిలొచ్చింది కానీ..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు దాదాపు 3 నెలల తరువాత బెయిలు మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదరించి ఆ కేసు ఉపసంహరించుకునేలా చేసిన కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్న వంశీకి ఎస్సీఎస్టీ కోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. ఇది వంశీకి ఒకింత ఊరటకలిగించే విషయమే అయినా.. ఈ కేసులో బెయిలు వచ్చినంత మాత్రాన ఆయన విడుదలయ్యే అవకాశాలు లేవు. అందుకే ఇంకా జైలులోనే ఉన్నారు. ఎందుకంటే వంశీపై మొత్తం నాలుగు కేసులు ఉణ్నాయి. సత్యవర్థన్ కిడ్నాప్ కేసు మాత్రమే కాకుండా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి, భూకబ్జా, అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి. వీటిలో సత్యవర్థన్ కిడ్నాప్, అక్రమ మైనింగ్ కేసులలో మాత్రమే వంశీకి బెయిలు లభించింది. ఇంకా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆయనకు కోర్టు మే 21 వరకూ రిమాండ్ విధించింది.  ఆ కేసులో వంశీకి ఈ నెల 22న బెయిలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలు, వంశీ అనుకూలురు అంటున్నారు. ఒక వేళ వారు ఆశిస్తున్నట్లు జరిగితే ఆయన బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.   
వంశీకి బెయిలొచ్చింది కానీ..! Publish Date: May 14, 2025 3:42PM

పాక్ మిడిసిపాటుకి భారత్ చెక్.. అతలాకుతలమైన పాక్ ఎయిర్‌ఫోర్స్

అమెరికా, చైనా ఫైటర్‌ జెట్లను చూసుకుని తమ వాయుసేన బలంపై పాకిస్థాన్ మిడిసిపడింది. అయితే తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్‌ చావు దెబ్బ తీసింది. అత్యంత కచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాక్‌ వాయుసేనకు చెందిన దాదాపు ఐదోవంతు మౌలిక వసతులు, ఫైటర్‌ జెట్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను పాక్‌ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో  మన దేశం జరిపిన ప్రతిదాడిలో ఇవి దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్‌ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులను పాక్‌ ఆయుధాగారాలు, ఎఫ్‌-16, జేఎఫ్‌-17 వంటి విమానాలు దాచిన సర్గొదా, భోలారీ ఎయిర్‌ పోర్టులతోపాటు.. పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ఉన్న చక్లాలలోని నూర్‌కాన్‌ ఎయిర్‌ బేస్‌ను కూడా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మొత్తం 50 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.  సింధి రాష్ట్రంలోని జమ్సోరో జిల్లాలోని బోలారీ ఎయిర్‌ బేస్‌లోనే స్క్వాడ్రన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసఫ్‌, మరో నలుగరు ఎయిర్‌మెన్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నిలిపి ఉంచిన పలు ఫైటర్‌జెట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రతిదాడిలో భారత్‌ నూర్‌ఖాన్‌, రఫీకీ, షోర్కోట్‌, మురిద్‌, సుక్కోర్‌, సియాల్కోట్‌, పసురూర్‌, చునియన్‌, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్‌ బేస్‌ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి.  తమ కాల్పుల్లో పాక్‌ ఆర్మీ  దాదాపు 40 మంది  సైనికులను కోల్పోయి ఉండొచ్చని భారత్‌ చెబుతోంది.  మంగళవారం భారత మిలిటరీ ఈ దాడులకు సంబంధించిన ఫొటోలు సహా ఇతర ఆధారాలను 70 దేశాల ప్రతినిధులకు చూపించాయి. వీటిల్లో పాక్‌ క్షిపణి, డ్రోన్‌ శకలాలు కూడా ఉన్నాయి.  డిఫెన్స్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డీసీ డీఎస్‌ రానా ఈ ప్రెజెంటేషన్‌ నిర్వహించారు. తాము లక్ష్యాలను ఎలా ఎంచుకొంది.. ఎలా ధ్వంసం చేసిందీ కూడా తెలిపారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎక్స్‌ఖాతాలో వెల్లడించింది.
పాక్ మిడిసిపాటుకి భారత్ చెక్.. అతలాకుతలమైన పాక్ ఎయిర్‌ఫోర్స్ Publish Date: May 14, 2025 2:31PM

జగన్‌కి బుగ్గన ఝలక్?

వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని స్థాయిలో చక్రం తిప్పిన  ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. 2024 ఎన్నికలలో బుగ్గన  పరాజయం పాలయ్యారు. కర్నూలు జిల్లా డోన్ లో తెలుగుదేశం అభ్యర్థి కోట్ల విజయం సాధించారు. డోన్ లో తెలుగుదేశం జెండా ఎగరడం పదేళ్ల తర్వాత  ఇదే తొలిసారి. చంద్రబాబు వ్యూహం ఫలించి కోట్ల విజయం సాధించారు. బుగ్గన పరాజయం పాలయ్యారు.  వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పి, ఐదేళ్లూ వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన ఆ ఓటమితో డోన్ లో అడ్రస్ లేకుండా పోయారు.  అపర మేధావిలా అసెంబ్లీ లో వ్యవహరించిన ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యాపార వ్యవహారాల కోసం జగన్‌కి హ్యాండ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారంట. అయితే కూటమి పార్టీలు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో ఏం చేయాలో తోచక అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం తెలుగుదేశంలో  ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలే ప్రత్యర్ధులుగా కొనసాగాయి.  1978 నుంచి 2009 వరకు ఆ రెండు ఫ్యామిలీ మధ్యే ఎలక్షన్ వార్ నడుస్తూ వచ్చింది. 2014లో వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనూహ్యంగా కేఈ కృష్ణమూర్తిపై గెలుపొందారు. రెండోసారి కూడా గెలిచిన బుగ్గన ఆర్థిక మంత్రిగా అయిదేళ్లు చక్రం తిప్పారు  రాజకీయ ప్రత్యర్థులైన దిగ్గజ కుటుంబాలు కేఈ, కోట్ల కుటుంబాలు గత ఎన్నికల సమయానికి ఒకే గూటి కిందకు చేరడం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో బుగ్గనకు ఘోర పరాజయం తప్పలేదు. అదీ కాక నియోజకవర్గానికి అందుబాటులో ఉండకుండా అసెంబ్లీలో పిట్టకథలు చెప్తూ గడిపేసిన బుగ్గనపై డోన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఓటమి తర్వాత బుగ్గన డోన్ వాసులకు నల్లపూసై పోయారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన అక్రమాలపై కూటమి సర్కారు దృష్టి సారిస్తోందన్న ప్రచారంతో భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, వారి వ్యాపారాలను టార్గెట్‌ చేస్తూ బుగ్గన వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. అదే విధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు, అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ కేడర్‌ను కూడా బుగ్గన పట్టించుకోలేదని టాక్‌. వాటికి తోడు  సొంత మండలం బేతంచెర్లలోనే బుగ్గన తీవ్రస్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారంట.  ప్రస్తుతం కేసుల భయం వెంటాడుతుండటంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీని వీడి జగన్‌కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి అక్కడి పెద్దలతో అంతో ఇంతో పరిచయాలు పెంచుకున్న ఆయన.. బీజేపీలో చేరడానికి వారితో మంతనాలు సాగిస్తున్నారంట. అందుకే ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదనీ, ఎక్కువ టైమ్ ఢిల్లీలోనే గడుపుతున్నారని బుగ్గన అనుచరులు చెప్పుకుంటున్నారంట. బీజేపీలో చేరడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసి డోన్ కూటమి నేతలు తమ అధిష్టానాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారంట. దాంతో బుగ్గనకు కూటమి పార్టీల్లో ఎంట్రీకి డోర్స్ క్లోజ్ అయిపోయారంటున్నారు. ఆ క్రమంలో బుగ్గన ఆచూకీ ఆయన సొంత అనుచరులకే అంతుపట్టకుండా తయారైందంట.
జగన్‌కి బుగ్గన ఝలక్? Publish Date: May 14, 2025 2:15PM