Top Stories

పవన్ సినిమాలే కాపీ..పొలిటికల్‌గా కాదంటోన్న విజయ్

  డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ 'సీఎం కేండెట్ నేనే'నంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే ఆయన ఎవరితోనూ పొత్తులుండవ్. అంతా ఓన్ గా పవర్ లోకి రావడమే అంటూ కుండ బద్ధలు కొట్టేశారు. నా పార్టీ సీఎం అభ్యర్ధిగా నేనే ఉంటానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, కఠినమైన తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంత వరకూ రాణించగలరు? అన్నదొక డిబేట్. కారణం ఇక్కడ జయ తర్వాత ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. దానికి తోడు ఆమె నెచ్చెలి శశికళ సైతం రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. ఇక్కడొక వ్యాక్యూమ్ ఉన్న మాట నిజమే. అయితే స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో పొలిటికల్ మాస్ ఇమేజీని సొంతం చేసుకుని విజయ్ సీఎం పీఠం ఎక్కగలరా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. బేసిగ్గా దళిత సామాజిక వర్గానికి చెందిన 'విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్'(పూర్తి పేరు) ని ఇక్కడి ఓటర్లు ఎంత వరకూ ఆదరిస్తారు? అన్న క్వశ్చన్లు కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్ కులాలైన పన్నియార్లు, గౌండర్లు డీఎంకే, అన్నాడీఎంకేలుగా చీలిపోయాయి. ఇవిలా ఉంటే తమిళనాట గల కులాల వారీ శాతాలను పరిశీలిస్తే విజయ్ ప్రాతినిథ్యం వహించే దళిత ఓటు బ్యాంకు సుమారు ఇరవై శాతం మాత్రమే ఉంది. మిగిలిన 80లో అరవై శాతం బీసీలు, ఇంకో ఇరవై శాతం మరకూ ఇతర కులాలు ఉన్నాయి. కొంత కాలంగా దళిత పాంతర్స్ పార్టీ తమిళనాడు లో కూడా ఉంది. కానీ అది ఇప్పటి వరకూ ఏమంత ప్రభావం చూపించలేదు.ఇక వాటీజ్ విజయ్ ఆయన కెపాసిటీ ఏంటి? పూర్వాపరాలు ఎలాంటివని చూస్తే.. తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కాగా, తల్లి కర్ణాటక సంగీత కళాకారిణి. విజయ్ కి ఒక చెల్లెలు కూడా ఉండేది. పేరు దివ్య. అయితే ఆమె తన రెండో ఏటనే చనిపోయింది. ఆమె పేరిట దివ్య విజయ్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించడం మాత్రమే కాకుండా శుక్రన్ సినిమాలో ఆమె బొమ్మ కూడా చూపించాడు విజయ్.  తండ్రి తీసిన వెట్రి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఈ పదమే తన పార్టీ పేరులోనూ పెట్టుకున్నారాయన. విజయ్ పార్టీ పేరు 'తమిళిగ వెట్రి కళగం'. ఇక కమ్యూనికేషన్ లో పట్టా తీసుకుందాం అనుకున్న విజయ్ కి ఎలాగైనా సరే హీరో కావాలని ఉండేది. దీంతో డిగ్రీ మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసి వచ్చేశాడు. 18 ఏళ్ల వయసులో తండ్రి చంద్రశేఖర్ తీసిన 'నాలై తీర్పు' అనే చిత్రంలో తాను హీరోగా, కీర్తన హీరోయిన్ గా నటించారు. విచిత్రమేంటంటే తన తండ్రి చిత్రమే అయినా.. ఆడిషన్స్ లో పాల్గొని మరీ సెలెక్ట్ అయ్యాడు విజయ్. ఆ టైంలో విజయ్ కొట్టిన డైలాగ్ అన్నామలైలో రజనీకాంత్ డైలాగ్. అందుకే విజయ్ 'రజనీకాంత్ లేకుంటే తాను లేనని' అంటారాయన. ఇదిలా ఉంటే, తమిళనాట విజయ్ హవా.. 'రసిగన్' మూవీతో ఒక్కసారిగా పెరిగింది. విజయ్ కీ మన తెలుగు వారికీ ఉన్న అనుబంధం ఎలాంటిదంటే.. ఆయన గల్లి, పోకిరి, బద్రీ వంటి తెలుగు చిత్రాలు రీమేక్ చేసి మరీ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. వీటిల్లో పవన్ కళ్యాణ్‌ సినిమా బద్రి కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. "పవన్ కళ్యాణ్‌ ని తాను తెరపై కాపీ కొట్టానేమోగానీ తెరబయట- రాజకీయంగా కాదని" అంటున్నారాయన. తాను సొంత కాళ్లపై రాజకీయాల్లో నిలబడతానని అంటారు. 2017లో హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో 2వ స్థానంలో ఉన్న విజయ్ ప్రస్తుతం నెంబర్ వన్- తనే. మెర్సల్, తరీ, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలు వంద, నూట యాభై, రెండు వందల కోట్ల వరకూ వసూల్ చేశాయి. బీస్ట్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్సన్ల పరంగా విజయ్ కింగే అని నిరూపించింది. విదేశాల్లో రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్ విజయ్. బేసిగ్గా విజయ్ స్థానంలో అజిత్ ఇలాంటి పొలిటికల్ డయాస్ పైకి రావల్సింది. జయలతిత ఎంతో ముందు చూపుకొద్దీ.. 'తల' అజిత్ ని ఎంకరేజ్ చేయాలని చూశారు. కానీ ఆయనేమంత రియాక్ట్ కాలేదు. తానేంటో తన రేసింగ్ ఏంటో.. మూవీస్ ఏంటో.. అన్నట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతానికి కూడా అజిత్ నుంచి పెద్దగా పొలిటికల్ రియాక్షన్ లేదు.  కానీ తన తండ్రి ప్రేరణో లేక, మరొకటో తెలీదు కానీ.. విజయ్ మాత్రం అనూహ్యంగా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ దళిత్ కమ్యూనిటీ ఇక్కడ సిఎం పోస్టు వరకూ ఎదగలేదు. ఈ కొరత తీర్చడం కోసమైనా ఆయన ఈ పార్టీ, దాని నిర్వహణ చేయాలని భావించినట్టుగా కనిపిస్తోంది.అయితే తమిళ రాజకీయాల్లో కులాల ప్రస్తావన అధికంగా ఉంటుంది.  ఈ ప్రకారం చూస్తే ఆయన భారీ ఎత్తున అక్కడి లీడింగ్ క్యాస్ట్ లీడర్స్ ని తన పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న రోజా సైతం టీవీకేలోకి రావడానికి ఉత్సాహం చూపించగా.. అవినీతి మరక గల వారు మాకొద్దని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం. అయితే భర్త ఆర్కే సెల్వమణి దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కావడంతో.. ఆమెకు తలుపులు ఇంకా మూసుకుపోలేదని కూడా అంటారు. ఇదంతా ఇలాగుంటే అవినీతి మరక అంటని రాజకీయ నేతల్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించనలవి కాదు. అయితే విజయ్ తన తొలినాళ్లలో అభిమానులకే అధిక ప్రాధాన్యతనిచ్చేలా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు చూసుకున్న తర్వాత.. ఆయన రాజకీయ ధోరణిలో ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. అప్పటి వరకూ విజయ్ ఎన్ని కామెంట్లు చేసినా.. వాటికి పెద్దగా విలువనిచ్చేలా కనిపించడం లేదు. గతంలో అంటే, 2005లో తమిళ సినిమా ఫీల్డు నుంచి విజయ్ కాంత్ రూపంలో 'డీఎండీకే' అనే పార్టీ పెట్టడం.. ఆయన పెద్దగా ప్రభావం చూపలేక పోవడం అన్నది విజయ్ కి సవాల్ విసురుతోంది. దీన్నిబట్టీ చూస్తే తమిళనాట సినిమా వారి ప్రాధాన్యత.. ఒక ముగిసిన అధ్యాయం అనేవారున్నారు. అయితే అది అప్పుడు- ఇప్పుడు కాదంటారు విజయ్ ఫ్యాన్స్. విజయ్ కాంత్ పార్టీ పెట్టి ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. దానికి తోడు ఎక్కడో 'ఆంధ్ర సినీ పొలిటీషియన్ పవన్' మన వరకూ వచ్చేస్తున్నాడు. కాబట్టి మనం అలెర్ట్ కావాలి. ఇక్కడున్న లోకల్ పొలిటికల్ టాలెంట్ ని పబ్లిక్ ఎంకరేజ్ చేయాలన్న కోణంలో విజయ్ తమిళ రాజకీయ తెరపైకి దూసుకొస్తున్నారు. మరి చూడాలి.. ఈ కామెంట్లలోని దమ్ము తన రాజకీయాల్లో ఆయన ఏ విధంగా కొనసాగిస్తారో లేదో తేలాల్సి ఉంది  
పవన్ సినిమాలే కాపీ..పొలిటికల్‌గా కాదంటోన్న విజయ్ Publish Date: Jul 4, 2025 10:19PM

కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారం : మల్లికార్జున ఖర్గే

  గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడుతు ఆపరేషన్ సింధూర్‌కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఆయన అన్నారు.  దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలను అర్పించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించారని ప్రశంసించారు. మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో రైతులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రధాని మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.గత బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని ముఖ్యమంత్రి అన్నారు
కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారం : మల్లికార్జున ఖర్గే Publish Date: Jul 4, 2025 10:09PM

ఆయన ముందు.. అన్నీ సవాళ్లే

  తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం  పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది. అయితే,అసలు కథ ఇప్పుడే మొదలైందని, రాజకీయ పరిశీలకులు  భావిస్తున్నారు. ముఖ్యంగా,రామచంద్ర రావు ఎన్నిక లేదా ఎంపికలో బీజేపీ అధిష్టానం అనుసరించిన ప్రమాణాల విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.రామచంద్ర రావు, ఎన్నికతో, కమల దళంలో పాత – కొత్తల విభజన రేఖ మరో మారు ప్రముఖంగా చర్చకు వచ్చింది.  తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రం ఎపీలోనూ, అదే యార్డ్ స్టిక్’ ఆధారంగా’ పీవీ మాధవ్’కు పార్టీ పగ్గాలు అప్పగించారనే ప్రచారం జరగడంతో,ఇప్పడు పార్టీలో కొత్తగా చేరిన వారి పరిస్థితి ఏమిటి? ఎప్పటికీ, పల్లకీ మోయడ మేనా? అనే ప్రశ్నఇప్పుడు పార్టీ నేతల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన నాయకులలో, ‘కొందరు’ ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.   అయితే, ఇదేమీ కొత్తగా తెచ్చిన నిబంధన కాదని, పార్టీ రాజ్యాంగంలో ఉన్నదే అని పార్టీ నేతలు చెపుతున్నారు.పార్టీలో పదేళ్ళ క్రియాశీల సభ్యత్వంతో పాటుగా క్రియాశీల పాత్ర పోషించిన వారికి మాత్రమే పార్టీ సంస్థాగత ఎన్నికల్లోపోటీ చేసే అర్హత ఉంటుందని, వివరణ ఇస్తున్నారు. అలాగే, అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన నాయకులు నొచ్చుకోవడం, సహజమే అంటున్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న పెద్దలు అంటున్నారు.   మరోవంక,పార్టీ లోపల వెలుపల కూడా,రామచంద్ర రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఎవరూ పెద్దగా తప్పు పట్టడంలేదు. ఆయనకు, అధ్యక్షుడు అయ్యేందుకు,అవసరమైన అర్హతలు అన్నీ  ఉన్నాయి. అయితే, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో,ఆయనకంటే దూకుడుగా వెళ్ళగలిగే, ప్రత్యర్ధులు ఒకటంటే నాలుగు అనగలిగే, ‘నోటి దురుసు’ ఉన్న నాయకుడు అయితే బాగుండేదని అంటున్నారు. అలాగే, అలాక్లు వహించిన నాయకులు కూడా మెల్లమెల్లగా  సర్దుకుంటున్నారని అంటున్నారు. చివరకు, పోటీలో ప్రముఖంగా వినిపించిన మల్కాజ్ గిరి ఎంపీ  ఈటల రాజేందర్ కూడా, మొదట్లో కొంత నొచ్చుకున్నా,ఆ తర్వాత సర్డుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే, పార్టీ క్యాడర్’లో ఒక వర్గం మాత్రం బీజేపే సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.అలాగే సోషల్ మీడియాలోనూ రామచంద్ర రావును, ‘డమ్మీ’ ప్రెసిడెంట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.  అయితే, రామచంద్ర రావు అందరూ అనుకుంటున్నట్లుగా సౌమ్యుడు కాదని, ఆయన గత చరిత్ర తెలిసిన వారు చెపుతున్నారు. నిజానికి ఎవరో చెప్పడం కాదు, స్వయంగా ఆయనే, ‘‘మీరు అనుకుంటున్నట్లు నేను సౌమ్యుణ్ని కాను. ఉస్మానియా క్యాంప్‌సలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్లొచ్చా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా. జితేందర్‌రెడ్డిని హత్య చేసిన నక్సలైట్లను అరెస్టు చేయాలని నాడు అసెంబ్లీ ముందు ధర్నా చేశా. అప్పుడే లాఠీచార్జిలో నా చెయ్యి విరిగింది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చెయ్యడం కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలి’’ అని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు రాంచందర్‌రావు సవాలు విసిరారు. అయితే ఇవ్వన్నీ ఎలా ఉన్నా, రామచంద్ర రావు తన ముందున్న సవాళ్ళను ఎలా, ఎంత సమర్ద వంతంగా ఎదుర్కుంటారనే, దానిపై  ఆయన భవిష్యత్’తోపాటుగా పార్టీ భైశాయ్త్ కూడ ఆధార పడి ఉంటుందని అంటున్నారు. నిజానికి,రామచంద్ర రావు ముందు, సవాలక్ష సవాళ్ళున్నాయి. ముఖ్యంగా, ఓచేత్తో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, మరో చేత్తో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు 2008 అసెంబ్లీ ఎన్నికలవరకు, ఎన్నికల సమరంలోపార్టీని విజయ పథంలో నడిపించడం వరకు, ఎన్నో సవాళ్ళు అయన ముందున్నాయని అంటున్నారు. అలాగే, ఈ అన్నిటినీ మించి, ఆయన ఎన్నికతో పస్పుటంగా పైకొచ్చిన పాత కొత్త విభజన రేఖను తుడిచేసి, సమన్వయంతో పార్టీని ముదుకు తెసుకుపోవడం  రామచంద్ర యో మున్డునన్ అతి పెద్ద సవాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.  
ఆయన ముందు.. అన్నీ సవాళ్లే Publish Date: Jul 4, 2025 9:40PM

బండి సంజయ్ బర్త్‌డే కానుకగా...20 వేల సైకిళ్ల పంపిణీ

    ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు  భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే.... కరీంనగర్ జిల్లాలో పదో తరగతి చదువుకునే బాలబాలికలు 3096 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్లలో 3841, జగిత్యాల జిల్లాలో 1137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది వెరసి 9348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.  అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అట్లాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు.  ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్ కు వచ్చాయి. తొలి దశలో ఐదు వేల సైకిళ్లను  ఈనెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక  సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే ఒక్కో సైకిల్ ను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు. టెన్త్ విద్యార్థులకే ఎందుకంటే.... ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.
బండి సంజయ్ బర్త్‌డే కానుకగా...20 వేల సైకిళ్ల పంపిణీ Publish Date: Jul 4, 2025 9:29PM

అధికారం పోయినా చెవిరెడ్డిలో ఇంకా అహంకారం తగ్గలేదు : ఎమ్మెల్యే పులివర్తి

  అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణకు సహకరించాల్సింది పోయి... మీ అంతు తేలుస్తా, సిట్ కార్యాలయం ముందు ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్కొక్కరి తాట తీస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన తీరు ఆయన అహంకార దోరిణికి నిదర్శనం. విచారణ చేస్తున్న అధికారులపై ఈ రకమైన దురుసు ప్రవర్తన వైసీపీ నాయకుల సైకో విధానాన్ని తెలియజేస్తోంది. అధికారం పోయినా ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అహంకారం దగ్గలేదు.  ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చెవిరెడ్డిలాంటి మూర్ఖుల్లో ఇంకా మార్పు రాలేదు. ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నాడు. జైలు జీవితం తప్పదని తెలిసే విజయవాడ జైలులో చెవిరెడ్డి రంకెలు వేస్తూ చిందులు తొక్కుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టే చెవిరెడ్డిలో ఈ విధమైన భయం, ఆందోళనలు కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకొని, ఎన్నికల్లో తప్పుడు పద్దతిలో గెలిచేందుకు తరలించాడు. సిట్ అధికారులు 200 ప్రశ్నలు వేసినా ఒక్క సమాధానం కూడా చెవిరెడ్డి నుంచి రాలేదంటే... ఐదేళ్ల పాటు మద్యం కుంభకోణంలో ఏ రేంజ్ లో సొమ్ములు పక్కదారి పట్టించారో అర్థమవుతుంది. మద్యం కుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం విడిచిపెట్టదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు  
అధికారం పోయినా చెవిరెడ్డిలో ఇంకా అహంకారం తగ్గలేదు : ఎమ్మెల్యే పులివర్తి Publish Date: Jul 4, 2025 9:18PM

జూబ్లీలో ఉప ఎన్నికలో.. కూటమి పోటీ?

  సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. నిజానికి, ఉప ఎన్నిక  ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. కానీ, నియోజక వర్గంలో ఎన్నికల సందడి మాత్రం అప్పుడే మొదలైంది. ప్రధానంగా, ఆధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటుగా బీజేపీ కూడా  బరిలో దిగేందుకు రెడీ అవుతున్న నేపధ్యంలో సహజంగానే నియోజక వర్గం, అందరి దృష్టిని, మరీ ముఖ్యంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదాల ఉంటే. జూబ్లీహిల్స్’ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పునుందా? రాజకీయ సమీకరణలను మార్చివేస్తుందా, కొత్త పొత్తులకు తెర తీస్తుందా,? రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందా? ఇలా అనేక కోణాల్లో, అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  దీన్ని బట్టి చూస్తే ఏమి జరిగిన ఏమి జరగక పోయినా,జూబ్లీ ఉప ఎన్నికరాజకీయ ఊహాలకు,వ్యూహాగానాలకు వేదిక అవుతుందనిపిస్తోందని అంటున్నారు.  నిజానికి ఇప్పటికే, అనేక ఉహాలు, వ్యూహాగానాలు సోషల్  మీడియా మొదలు మెయిన్’ స్ట్రీమ్’ మీడియా వరకు కథలు కథలుగా చక్కర్లు కొడుతన్నాయి. అయితే, ఈ ఉహాలను, వ్యూహాగానాలను పూర్తిగా కొట్టివేయడం కుదరదని,, రాజకీయ పండితులు అంటున్నారు. అవును,ఉప ఎన్నిక జరుగుతున్నది, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గం కాకుండా మరో నియోజక వర్గం అయితే, ఆ లెక్క వేరుగా ఉండేది. కానీ, జూబ్లీ హిల్స్’  నియోజక వర్గానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత  దృష్టా, తెలంగాణలోనే కాకుండా,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ జూబ్లీ ఉప ఎన్నిక గురించిన చర్చ జరుగుతోంది. ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నియోజక వర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే,అందులో ఒకొంతు ఓటర్లకు కొంచెం అటూ ఇటుగా, ఆంధ్రా మూలాలున్న, సెట్ల్లెర్స్’ ఉన్నారు.అఫ్కోర్స్,అంతకంటే ఎక్కువగా, ఒక లక్షా 20 వేల వరకు ముస్లిం, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అయినా జూబ్లీ నియోజక వర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించేది, సెట్లర్’ ఓటర్లే అంటారు.   అదొకటి అయితే, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన, తెలంగాణ తొలి శాసన సభ ఎన్నికల్లోనూ జూబ్లీ నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన  మాగంటి గోపీనాథ్’ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్’లో చేరినా, వరసగా 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని గెలిపించింది మాత్రం సెట్లర్స్’ ఓట్లే అంటారు. ఈ నేపథ్యంలో, తెలంగాణలో రీ-ఎంట్రీకి ప్రయత్నిస్తునట్లు చెపుతున్న,తెలుగు దేశం పార్టీ, జూబ్లీ ఉప ఎన్నికను లాంచింగ్ ప్యాడ్’ చేసుకుంటుందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 ఎన్నికల్లో,జనసేన మద్దతుతో పోటీచేసిన బీజేపీ, టీడీపీ కూటమి,20 అసెంబ్లీ స్థానాలు( టీడీపీ 15, బీజేపీ 5) గెలుచు కుంది. 2018లో కాంగ్రెస్’ జట్టుకట్టి పోటీచేసినా టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తెలంగాణలో పోటీచేయలేదు. అయితే,ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, టీడీపీ తెలంగాణలో తిరిగి కాలు మోపేందుకు సిద్డమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్’ లో సక్సెస్ అయిన, టీడీపీ. జనసేన, బీజేపీ కూటమి ఫార్ములాను తెలంగాణాలో కొనసాగించాలని కూటమి నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూబ్లీ ఉప ఎన్ని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే, కూటమి తరపున, ఏపార్టీ పోటీ చేయాలి, అభ్యర్థి ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు.
జూబ్లీలో ఉప ఎన్నికలో.. కూటమి పోటీ?  Publish Date: Jul 4, 2025 9:08PM

చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన

  భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి  ఘన సంప్రదాయ స్వాగతం పలికింది. 29 జూన్ బో’నెస్ టౌన్ హాల్‌లో ఆయన తొలి స్కాట్లాండ్ ఉపన్యాసాన్ని 500 మందికి పైగా భక్తుల సమక్షంలో నిర్వహించారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో  సంస్థ  వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి తాజా పూలమాల సమర్పించగా, అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి (విజయ్ కుమార్ రాజు పర్రి కుమారుడు) స్కాటిష్ కళ ఐనటువంటి బ్యాగ్‌పైప్ ప్రదర్శనను స్థానిక కళాకారులతో కలిసి ఆకట్టుకునేలా ప్రర్శించారు తరువాత ప్రసాద్ మంగళంపల్లి మరియు ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయబద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం నిజరూపం దాల్చడంలో రాజశేఖర్ జాల JET UK వారితో సమన్వయం చేస్తూ ముఖ్యభూమికను పోషించారు.వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన  కార్య‌క్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి. ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు. కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు మరియు ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం యొక్క చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి మరియు ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు.జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంశా పత్రరూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు. "ఏడు కొండల (తిరుపతి) నుండి ఏడు కొండల (ఎడింబర్గ్) వరకు" అని భువన విజయం వారు అందులో పోల్చుతూ ప్రచురించిన తీరు అద్భుతం.“ఇది స్కాట్లాండ్ మరియు బో’నెస్‌ను రంగులతో నింపిన అద్భుత సంప్రదాయ వేడుక” అని ఒక వీక్షకుడు పలికిన మాట ఈ ఘనతను మరింత విస్మయపరుస్తోంది.   
చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్  సందర్శన Publish Date: Jul 4, 2025 7:58PM

జ‌ర్న‌లిస్టుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జ‌ర్న‌లిస్ట్‌లకు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వాల‌ని అధికారులకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, కొలుసు పార్ధ సార‌ధి, నారాయ‌ణ‌ల‌తో ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థలాలపై విధివిధానలను రూపోందించనుంది. వాటిని సమర్పంచనుంది. ఆ తర్వాత ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  రెవెన్యూ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వారసత్వ భూములకు సచివాలయంలోనే సక్సెషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షల లోపు విలువైన భూములకు రూ.100 రుసుముతో సర్టిఫికెట్లు పొందవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఆగస్టు 2లోగా, రెవెన్యూ సమస్యలు అక్టోబర్ 2 నాటికి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   
జ‌ర్న‌లిస్టుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ Publish Date: Jul 4, 2025 7:40PM

నిర్మలమ్మకు.. కమలం పార్టీ పగ్గాలు ?

  ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 21 న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని, బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వచ్చే వారం పది రోజుల్లో, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడు ఎవరో తేలిపోతుందని, బీజేపీ వర్గాల విశ్వసనీయ సమాచారం.  అయితే, ఈసారి బీజేపీ జతేఅయ్ అధ్యక్షుని ఎన్నికలో బిగ్ ట్విస్ట్’ ఉంటుందని అంటున్నారు.  బీజేపే జాతీయ అధ్యక్ష పదవి దక్షణాది రాష్ట్రాలకు, అందునా  మహిళా నాయకురాలికి  దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారంగా,మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే, అధ్యక్ష రేసులో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్’తో పాటుగా,ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి,తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  అయితే దక్షణాది మహిళకు అధ్యక్ష పీఠం అప్పగించాలనే నిర్ణయంలో మార్పు లేకుంటే నిర్మలా సీతారామన్’కు బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, గత ఏప్రిల్’లోనే నిర్మలా సీతారామన్ పేరు తెరపైకొచ్చింది. కాగా ఇప్పడు తాజాగా, కొద్దిరోజుల క్రితం జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌తో నిర్మలా సీతారామన్ భేటీ అయిన నేపధ్యంలో ఆమె పేరు మరో మారు తెరపైకి వచ్చింది.అదలా ఉంటే, ఇంచుమించుగా 45 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, పార్టీ అధ్యక్ష బాధ్యతలు మహిళ అప్పగించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం, ‘వ్యూహాత్మక’ ముందడుగుగా పరిశీలకులు పేర్కొంటున్నారు. రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల నాటికకి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తున్నందున, బీజేపే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అలాగే, దక్షణాది రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు, దక్షణాది మహిళకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడ  ఉభయ తారకంగా ఉంటుందని  అంటున్నారు.  అలాగే, ఇంతవరకు, బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్  సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు.కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళానేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  అదే జరిగితే, నిర్మల సీతరామన్’కు పదవి దక్కితే, అది పార్టీ చరిత్రలోనే కాదు, ‘ఫస్ట్’ విమెన్ డిఫెన్స్’ మినిస్టర్, (ప్రప్రధమ మహిళా రక్షణ మంత్రి ) ‘ఫస్ట్’  ఫుల్ టైమ్’  ఫైనాన్సు మినిస్టర్’తో  పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్’ ప్రవేశ పెట్టిన తొలి’ అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్’ రాజకీయ జీవితంలో మరో మెయిలు రాయిగా నిలిచి పోతుందని అంటున్నారు. అలాగే,ఆమె ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు. అనేకాకుండా, దక్షణాది  కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా  మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్’లోనూ మాట్లాడ గలరు. సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నదే, నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలున్న  నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు. అయితే, ఫైనల్’గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్’ తప్పదు..   అలాగే, ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు.ఎకడమిక్’ పర్సన్’. ఎకనమిక్ లేడీ.  ఒక విధంగా ఆమె లేడీ మనోహన్’ సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు. అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు.అంతేకాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే, ఆర్ఎస్ఎస్’ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి.సో.. చివరాకు ఏమి జరుగుతుంది అనేది ..వేచి చూడవలసిందే అంటున్నారు.
నిర్మలమ్మకు.. కమలం పార్టీ పగ్గాలు ? Publish Date: Jul 4, 2025 7:22PM

ఆసుపత్రి నుంచి కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష

  సాధారణ వైద్యల పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ప‌రామ‌ర్శించేందుకు పార్టీ నేతలు ప‌లువురు వచ్చారు. ఈ సందర్భంలో వారితో గులాబీ బాస్ ఇష్టాగోష్టి నిర్వహించారు.  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి వంటి అంశాలను పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.  
ఆసుపత్రి నుంచి కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష Publish Date: Jul 4, 2025 7:09PM

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష..రూ.6లక్షల జరిమానా

  ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి  నరసింహమూర్తి  తీర్పునిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 23/2019 కేసులో ఈ  ముద్దాయి అరెస్టయ్యారు. ఈ వ్యక్తి తమిళనాడుకు చెందిన వెల్లియన్ కాగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ నాగపట్ల బీట్, చామల రేంజి ప్రాంతంలో పట్టుబడ్డాడు.  వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమ ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని  అభినందించారు.
ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష..రూ.6లక్షల జరిమానా Publish Date: Jul 4, 2025 6:40PM

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే సీరియస్

  గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే నేతలను రాహుల్ గాంధీ, నేను పట్టించుకోమని ఖర్గే తెలిపారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసినవారికే పదవులు అని ఆయన స్పష్టం చేశారు. అందరు నిబంధనలను పాటించాలని అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దాంతోనే ప్రజల మద్దతు తమకు లభిస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి పదవుల పంపణీనే నిదర్శనమని అన్నారు. అగ్రవర్ణ నేతకు ముఖ్యమంత్రి పదవి, బీసీ వర్గానికి చెందిన తనకు పీసీసీ అధ్యక్ష పదవి, నలుగురు దళితులకు మంత్రివర్గంలో స్థానం, మరో దళిత నేతకు స్పీకర్ పదవి ఇవ్వడమే దీనికి నిదర్శనమని ఆయన వివరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మల్లికార్జున ఖర్గే సీరియస్ Publish Date: Jul 4, 2025 4:56PM

ఏపీలో ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారం : మంత్రి అనగాని

  ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా భూ సమస్యలు పరిష్కారస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నారు. గ్రీవెన్స్ ద్వారా 4.63లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి  మాట్లాడారు. భూములకు ఆధార్‌, సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు  
ఏపీలో ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారం : మంత్రి అనగాని Publish Date: Jul 4, 2025 4:32PM

సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్

  వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీలోనూ పోత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్నాది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదన్న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తెలిపారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, తమిళనాడులో ఆ పార్టీ విష రాజకీయాలు చెల్లవని విజయ్ తెలిపారు. అలాగే, వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. 
సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్ Publish Date: Jul 4, 2025 3:55PM

ప్యాంటు జేబులో పేలిన ఫోన్ ...యువకుడికి గాయాలు

  ప్యాంటు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్, అత్తాపూర్‌‌లో జరిగింది. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రోజూలాగే తన వివో స్మార్ట్‌ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకుని పనికి వెళుతుండగా, ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. క్షణాల్లోనే దాని నుంచి మంటలు వ్యాపించి బట్టలకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ మొబైల్ జేబులోంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతని తొడకు మంటలు తగిలి చర్మం కాలిపోయింది. స్థానికులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తొడపై చర్మం కాలిపోయిందని, శ్రీనివాస్ వెంటనే స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు.  
ప్యాంటు జేబులో పేలిన ఫోన్ ...యువకుడికి గాయాలు Publish Date: Jul 4, 2025 3:33PM

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి పై దాడి

    నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ  పాలన కేంద్రం ఆత్మకూరులో  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. ఆత్మకూరులో నంద్యాల ఎంపీ  శబరి  దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్న క్రమంలో ఏరాసు  కూడా ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఏరాసు ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రి ఏరాసు ఇంటి నుంచి  వెళ్లిన  మరుక్షణమే ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ముకుమ్మడి దాడి చేశారు. ఏరాసు గో బ్యాక్ అంటూ తెలుగు తమ్ముళ్లు   ఇంటి అద్దాలను  ధ్వంసం  చేశారు.  దీంతో ఆత్మ రక్షణకు  ప్రతాప రెడ్డిని ఆయన అనుచరులు ఇంటిలోకి తీసుకువెళ్లి తలుపులు మూసి వేశారు. కానీ  తెదేపా నాయకులు కార్యకర్తలు ఇంటిని చుట్టుముట్టి రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు  దారి తీయడంతో   పోలీసులు తాపీగా ఏరాసు ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలను  ఖాతరు చేయక తెలుగు తమ్ముళ్లు  రెచ్చిపోయారు.  ఏరాసు గో బ్యాక్, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిచ్చు  పెడుతున్నాడని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తూ  ఏరాసు ఇంటిని  చుట్టూ ముట్టారు. ఏరాసు  ప్రతాపరెడ్డిని తమ చేతికి అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.  పరిస్థితి విషమించడంతో  పోలీస్ అధికారులు ఏరాసూ ఇంటికి చేరుకొని ఆయనను ఆయన కారులోనే మరో మార్గంలో ఆత్మకూరు నుంచి  తరలించారు. ఇదిలా ఉంటే  ఇంటి నుంచి బయటకు వచ్చిన ఏరాసు తనపై జరిగిన దాడిని దాడికి  కారకులు  శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కారణమని చెప్పే క్రమంలో, ఏరాసు ప్రతాపరెడ్డిని మీడియాతో మాట్లాడానీయకుండా ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ కారును అతివేగంగా తీసుకువెళ్లారు.
మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి పై దాడి Publish Date: Jul 4, 2025 3:14PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఏకగ్రీవానికి బీఆర్ఎస్ బేరసారాలు?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన  మాగంటి గోపినాథ్  అనారోగ్యంతో ఇటీవల మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ లు పోటీకి రెడీ అవుతున్నాయి. అభ్య ర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించేశాయి.  అయితే బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ సీటు కావడంతో ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. త్రిముఖ పోటీలో విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో సెంటిమెంట్ ను తెరపైకి తీసుకు వచ్చి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది.  అయితే కాంగ్రెస్ ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో  విజయం సాధించి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లోనూ అదే రిపీట్ చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాగంటి కుటుంబంలోని వ్యక్తినే నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. మాగంటీ గోపీనాథ్   సతీమణి పోటీకి సుముఖంగా లేకపోవడంతో మాగంటి గోపీనాథ్  సోదరుడు వజ్రనాథ్ లేదా మాగంటి గోపీనాథ్ కుమారుడిని రంగంలోకి దింపాలని ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అయినా త్రిముఖ పోటీలో విజయం నల్లేరు మీద బండి నడక కాదన్న ఉద్దేశంతో ‘ఏకగ్రీవం’ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిస్టింగ్ ఎమ్మెల్యే మరణించి ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో  ఆ దివంగత  ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేది. దీనిని అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలూ పాటించాయి.  అయితే రాష్ట్ర విభజన తరువాత ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. వాస్తవానికి దానిని పక్కన పెట్టేసింది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పాలి.  అయితే ఇప్పుడు మళ్లీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి ఆ పాత సంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ దిశగా బీఆర్ఎస్ ఎంఐఎం, బీజేపీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తానే గండి కొట్టిన సంప్రదాయాన్ని ఇప్పుడు మళ్లీ తీసుకువచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమౌతాయన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే మాగంట గోపీనాథ్ కు అన్ని రాజకీయపార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కుటుంబం పట్ల సానుభూతి ఉంది. దీనినే బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  
 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఏకగ్రీవానికి బీఆర్ఎస్ బేరసారాలు? Publish Date: Jul 4, 2025 3:08PM

కేసీఆర్ ను ఆస్పత్రిలో పరామర్శించిన కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్వస్థతకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో గురువారం (జులై3 ) చేరిన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శుక్రవారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, అయితు రక్తంలో సుగర్ స్థాయిలు ఎక్కువగానూ, సోడియం లెవెల్స్ తక్కువగానూ ఉన్నాయని పేర్కొన్నారు. అవి సాధారణ స్థాయికి వచ్చేంత వరకూ మరో రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంటారని ఈ హెల్త్ బులిటిన్ లో పేర్కొన్నారు. ఆ తరువాత కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కూడా హెల్త్ బులిటిన్ లో డాక్టర్లు పేర్కొన్న అంశాలనే పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ... ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.  అదలా ఉంటే కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం (జులై 4) యశోదా ఆస్పత్రికి వచ్చి తండ్రిని పరామర్శించారు. ఇటీవలి కాలంలో కవిత పార్టీ లైన్ ను ధిక్కరించి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ.. జాగృతి బ్యానర్ కింద కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ముఖ్యంగా ఆమె తండ్రికి రాసిన లేఖ లీక్ అయిన తరువాత నుంచీ కేసీఆర్ ఆమె పట్ల ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న సమయంలో ఆయనను కలవడానికి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితను కనీసం పలకరించను కూడా పలకరించలేదని వార్తలు వినవచ్చిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
కేసీఆర్ ను ఆస్పత్రిలో  పరామర్శించిన కల్వకుంట్ల కవిత Publish Date: Jul 4, 2025 2:10PM

సింగయ్య భార్యతో జగన్ భేటీపై పోలీసులు సీరియస్

మాజీ సీఎం జగన్  రెంటపాళ్ల  పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే స్థానికుడి ప్రాణం పోయింది. ఆ వివాదం ముదిరింది. దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారీ.. మళ్లీ రాజుకుంటోంది. మొదటికొస్తోంది. ఈ కేసు విచారణలో ఉండగానే..  కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ స్వయంగా సింగయ్య భార్యతో భేటీ అవడం వివాదాస్పదమైంది. పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సింగయ్య భార్య లూర్ద్ మేరీతో జగన్ భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన భర్త ప్రమాదం తర్వాత బతికే ఉన్నాడనీ, మాట్లాడాడనీ..  కానీ అంబులెన్స్‌లోనే ఏదో జరిగిందనే అనుమానం వ్యక్తం చేసింది. అంతే కాదు టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటికి వచ్చి లోకేశ్ పేరు చెప్పి తమకు అనుకూలంగా మాట్లాడాలంటూ బెదిరించారని కూడా ఆరోపించింది. పోలీసులు కూడా తమపై ఒత్తిడి తెచ్చారంటోంది.  వాస్తవానికి జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాల కింద సింగయ్య పడిన దృశ్యాల వీడియో ఫుటేజ్ ఇప్పటికే వైరల్ అవుతోంది. అది మార్ఫింగ్ వీడియో అని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. ఆ వీడియోను అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు చేయించామని, ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని చెప్తున్నారు. సింగయ్య భార్యని జగన్ కలవడం, ఆమె మీడియాతో మాట్లాడటంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ కేసు విచారణలో ఉండగా.. నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాధితుల కుటుంబ సభ్యులను కలవడం, వారి ద్వారా తమకు అనుకూలంగా ప్రకటనలు చేయించడం చట్టవిరుద్ధమని అంటున్నారు. వైఎస్ జగన్ చర్యలు చట్టప్రకారం ఎంతవరకు సమంజసం అనే దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.  కేసు నుంచి తప్పించుకునేందుకే  సింగయ్య భార్యని మేనేజ్ చేసి, తమకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం తప్పుడు ప్రచారాలతో ఎప్పటికీ రాజకీయాలు చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు కింద పడిన వ్యక్తిని.. కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా?  కంపచెట్లలో పడేసి వెళ్లారంటే, మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. మరోవైపు.. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని కొట్టేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు, అరెస్ట్‌పై రెండు వారాల పాటు స్టే విధించింది న్యాయస్థానం. ఇది.. జగన్‌కి తాత్కాలికంగా ఊరటనిచ్చినప్పటికీ.. రాజకీయ రచ్చ మాత్రం కొనసాగుతోంది.
సింగయ్య భార్యతో జగన్ భేటీపై పోలీసులు సీరియస్ Publish Date: Jul 4, 2025 1:07PM

బంగారం ధరలు ఢ‌మాల్?.. కారణం ఏంటో తెలుసా?

ల‌క్ష క్రాస్ అయిన‌ట్టు క‌నిపించిన బంగారం ధ‌ర‌లు అనూహ్యంగా యాభై నుంచి డెబ్బై వేల‌కు ప‌డిపోనున్నాయా? అన్న‌ది డిబేట్ గా మారిందిప్పుడు. కొన్ని సంస్థ‌లు కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గు ముఖం ప‌ట్టే ఛాన్సుంద‌ని చెబుతున్నాయి. కార‌ణాలేంట‌ని చూస్తే..   ర‌ష్యా- ఉక్రెయిన్ త‌ప్ప పెద్ద గొప్ప‌గా.. యుద్ధాలేవీ లేవు. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, హ‌మాస్ వంటి ఘ‌ర్ష‌ణ‌లు త‌గ్గు ముఖం పట్టాయి. అంతే  కాదు భార‌త్- పాక్ మ‌ధ్య గొడ‌వ కూడా స‌ద్దు మ‌ణిగింది. కాబ‌ట్టి యుద్ధ వాతావ‌ర‌ణం లేన‌పుడు ఆటోమేటిగ్గా బంగారం  ధ‌ర‌లు దిగి వ‌స్తాయి.    ఆప‌రేష‌న్ సిందూర్ టైంలో.. బీజేపీ  నేత అన్నామ‌లై ఒక మాట అన్నారు గుర్తుందా? దేశం సుర‌క్షితంగా ఉంటేనే మ‌న‌మూ మ‌న ఇళ్లూ వాకిళ్లూ ఇత‌ర ఆస్తులు నిలిచి ఉంటాయి. అదే దేశం నిత్యం యుద్ధాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ఆటోమేటిగ్గా మ‌న ఆస్తులు అంత‌స్తులు అన్నీ నాశ‌న‌మై పోయి.. మ‌నం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేస్తానని అన్నారాయ‌న‌. ఈ మాట‌ల్లో ఎంతో అర్ధం ఉంద‌ని అంటారు నిపుణులు. అప్ప‌ట్లో ఇరాన్ ఇజ్రాయెల్లో ఇంట‌ర్నెట్ లేక చాలా వీడియోల‌ను మ‌నం చూడ‌లేక పోయాం కానీ ఇప్పుడిప్పుడే ఈ రెండు దేశాల్లో ఎంత‌టి విధ్వంసం జ‌రిగిందో తెలిపేలాంటి వీడియోలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కొస్తున్నాయి. ఇపుడీ ఆస్తుల‌న్నీ నిర‌ర్ధ‌క ఆస్తుల‌య్యాయి.  స‌రిగ్గా యుద్ధాల‌పుడు ఇన్వెస్టర్లు.. ఇలాంటి స్థిరాస్తుల మీద , షేర్ల మీద‌గానీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి బ‌దులు బంగారం మీద మ‌దుపు చేస్తే అది శాశ్వతంగా ఉంటుంద‌ని భావిస్తారు. దీంతో బంగారం డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది. త‌ద్వారా.. బంగారం ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయి. యుద్ధాల‌కూ స్టాక్ మార్కెట్ల‌కు కూడా అంతే లింకు ఉంటుంది. మీరు కావాలంటే చూడండి.. భార‌త్ పాక్ మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో పాక్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏకంగా 80 వేల కోట్ల మేర సంప‌ద ఆవిరైంది. దీంతో ఆ దేశం దివాలా తీసి.. ఐఎంఎఫ్ ని అడుక్కోవ‌ల్సి వ‌చ్చింది. ఇలా యుద్ధాలు, రాజ‌కీయ అనిశ్చితి, ద్ర‌వ్యోల్బ‌ణ స‌మ‌యాల్లో బంగారానికి గిరాకీ ఎక్కువ అవుతుంది. త‌ద్వారా.. వీటి రేట్లు పెరుగుతుంటాయి. ఒక్కోసారి ఇన్వెస్ట‌ర్లు చౌక‌గా ఉన్న బంగారాన్ని విప‌రీతంగా కొనేసి.. కృత్రిమ  కొర‌త  సృష్టిస్తారు. ఆపై ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఆకాశాన్ని అంటుతాయి. దీంతో త‌మ ద‌గ్గ‌రున్న బంగారం అధిక ధ‌ర‌ల‌కు అమ్మేస్తుంటారు. ఇలా బంగారం చుట్టూ ఎంతో మార్కెట్ మాయాజాలం న‌డుస్తూ ఉంటుంది. అందులో భాగంగా చూస్తే ప్ర‌స్తుతం ప్రపంచ‌మంతా ప్ర‌శాంతంగా ఉంది  కాబ‌ట్టి బంగారం ధ‌ర‌లు నేల‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నాయి కొన్ని గోల్డ్ రేటింగ్ కంపెనీలు.  దానికి తోడు భార‌త్ లో ఆషాడమాసంలో డిమాండ్ బాగా త‌క్కువ ఉంటుంది. ఈ జూలైలో బంగారం ధ‌ర 70 వేల‌ రూపాయలకు ప‌డిపోయినా  ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. ఇప్ప‌టికే 18 కేరెట్ల బంగారం 73 వేల ప‌లుకుతోంది. ఇక 22 కేరెట్లు సుమారు 89  వేలు, 24 కేరెట్ల బంగారం 97 వేల రూపాయల పై చిలుకు ప‌లుకుతోంది. జూన్ 28 నుంచి జూలై 1 మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర ప‌డిపోయింది. దీంతో ఇది ల‌క్ష లోపున‌కు వ‌చ్చేసింది. అందుకే అంటోంది.. ఈ డిమాండ్ స‌స్లై  చైన్ లో బంగారం ధ‌ర‌లు ఇలా హెచ్చు త‌గ్గుల‌కు లోన‌వుతున్నాయ‌ని.  అంతే కాదు  బ్యాంకుల వ‌డ్డీలు, అమెరికా ఫైనాన్షియ‌ల్ డేటాలు, యూఎస్- చైనా మ‌ధ్య ఒప్పందాలు, ఆపై గ‌నుల్లో త‌వ్వ‌కాల త‌గ్గుద‌ల వంటివి కూడా బంగారం ధ‌ర‌ల హెచ్చు తగ్గుల‌ను శాసిస్తుంటాయ‌ని అంటారు మార్కెట్ నిపుణులు. కాబ‌ట్టి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే ముందు.. ఎవ‌రైనా నిపుణుల‌ను అడిగి  పెట్టుబ‌డులు పెడుతుండాలి. సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటారు గోల్డ్ మార్కెట్ ఎక్స్ ప‌ర్ట్స్.
బంగారం ధరలు ఢ‌మాల్?.. కారణం ఏంటో తెలుసా? Publish Date: Jul 4, 2025 12:42PM

పైర‌సీని అరిక‌ట్టడం ఎలా?

శత కోటి ద‌రిద్రాల‌కు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైర‌సీకి మాత్రం ఒక్క‌టంటే ఒక్క ఉపాయం కూడా క‌నుగొన‌లేక పోవ‌డం విచార‌క‌రం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే  ప్ర‌స్తుతం టాలీవుడ్ జ‌నాల‌ను వేధిస్తోన్న ప్ర‌శ్న‌.  ఒకే ఒక్క‌డు..  చిన్న‌పాటి సెల్ ఫోన్ కెమెరా వాడి హెచ్ డీ ప్రింట్ త‌ల‌ద‌న్నేలా సినిమాల‌కు సినిమాల‌ను పైర‌సీ చేస్తుంటే.. టాలీవుడ్ ఇంత టెక్నాల‌జీ సాయం ఉండి కూడా ఏమీ చేయ‌లేక పోవ‌డం విడ్డూరం. విచార‌క‌రం. విచిత్ర‌మేంటంటే సినిమాను బ‌ట్టి న‌ల‌భై నుంచి ఎన‌భై వేల మ‌ధ్య వ‌ర‌కూ ఇత‌డు వ‌సూలు చేయ‌డ‌మే కాకుండా ఇప్ప‌టి  వ‌ర‌కూ సుమారు 65 సినిమాల‌ను మూవీ  రూల్స్, ఐ బొమ్మ వంటి సైట్స్ కి అమ్మి సొమ్ము చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవ‌డ‌ం తప్ప మరే చేయలేకపోవడం ఏమిటి? ఈ పైర‌సీ మూవీ సైట్స్ ని ఎందుకు ఆప‌లేక పోతున్నాం.. ఒక సాధార‌ణ  టెక్నీషియ‌న్ కి తెలిసినంత కూడా ఇక్క‌డి సినీ జ‌నానికి తెలియకపోవడం ఏమిటి? పైరసీకి విరుగుడు ఎందుకు క‌నిపెట్ట‌లేక పోతున్నారు?  019 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ కి ఈ ఒక్క‌ పైరసీకారుడి ద్వారా ఏర్ప‌డ్డ న‌ష్టం ఏకంగా 3500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.  ఒకే ఒక్క‌డు ఎంద‌రో 24 క్రాప్ట్స్ కి చెందిన  క‌ళాకారుల క‌ళారూపాల‌ను వారి ఆశ‌లూ ఆశ‌యాల‌ను ఛిద్రం చేస్తుంటే చోద్యం చూస్తూ ఊరుకోవడమేంటన్నది అంతుపట్టని, సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతోంది.   త‌మపై వ్య‌క్తిగ‌తంగా త‌ప్పుడు క‌థ‌నాలు వ‌చ్చిన‌పుడు సినిమా స్టార్లు సైబ‌ర్ క్రైమ్ కి కంప్ల‌యింట్ చేస్తుంటారు. అదే త‌మ సినిమాల‌కు సంబంధించి ఎలాంటి  కంప్ల‌యింట్లు చేయ‌రు. అదీ తొలి రోజు తొలి ఆట పడీ ప‌డ‌క ముందే మూవీ రూల్స్ వంటి సైట్ల‌లో ఆయా సినిమాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటే.. ఆ సినిమాకు ప‌ని చేసిన వారు కూడా థియేట‌ర్ కి వెళ్ల‌కుండా ఈ పైరేట్ సైట్ల‌లో చూస్తుంటారు.  సినీ జ‌నాల్లో అత్య‌ధికులు త‌మ ప్ర‌త్య‌ర్ధి హీరోల, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ సినిమాలు ఎలా ఉంటాయో చూసేది ఈ విధానం ద్వారానే అంటారు. ఆ మాట‌కొస్తే పైర‌సీ అనేది వెలుగు చూసిందే వీరి వ‌ల్లనంటారు. అద‌లా పాకి పాకి.. నేడు ఇండ‌స్ట్రీకే అతి పెద్ద న‌ష్ట‌దాయ‌కంగా మారిందని చెప్పుకొస్తారు కొంద‌రు. సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఎన్నో సినిమాలు.. నేడిలా న‌ష్టాల బారిన  ప‌డుతున్నాయంటే అందుకు కార‌ణం ఈ పైర‌సీ  సైట్లే కాబ‌ట్టి.. వీటి నుంచి విముక్తి కోసం మార్గాల‌ను అన్వేషించాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సైట్లలో సినిమా చూస్తే వాటి ద్వారా ఒక వైర‌స్ పాకి.. ఆయా ఫోన్లు, టీవీ సెట్లు చెడిపోయేలాంటి కొన్ని ఏర్పాట్లు  చేయ‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో  టెక్నాల‌జీ  బాగా పెరిగింది. ఎథిక‌ల్ హ్యాకింగ్ వంటి కార్య‌క‌లాపాలు పెరిగాయి.. వీటి ద్వారా కూడా  క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. ఇలాంటి ఎన్నో అవ‌కాశాలున్నా.. సినిమా వాళ్లు ఇవేవీ వాడుకోవాల‌నుకోకపోవడానికి కారణమేంటి? ఇప్ప‌టికైనా మించి పోయింది లేదు.. యాంటీ పైర‌సీ సెల్ కి చెందిన మ‌ణీంద్ర అనే ఇత‌డు చేసిన ఈ ప్ర‌య‌త్నం వ‌ల్ల కిర‌ణ్ అనే ఒక పైరసీగాడు దొరికాడు. ఇత‌డి ద్వారా ఆ మొత్తం పైర‌సీ వ్య‌వ‌హారం గుట్టు అయ్యింది. వీళ్లు క్రిఫ్టో క‌రెన్సీ రూపంలో ఎలాంటి న‌గ‌దు లావాదేవీలు జ‌రుపుతారో గుర్తించి.. త‌ద్వారా ఈ మొత్తం పైర‌సీ ముఠా గుట్టు ర‌ట్టు చేయాల‌ని కోరుకుందాం. సేవ్ టాలీవుడ్- సే నోటు పైర‌సీ అని నిన‌దిద్దాం.
పైర‌సీని అరిక‌ట్టడం ఎలా? Publish Date: Jul 4, 2025 12:23PM

జూలై 5న జపాన్ ను ముంచెత్తనున్న సునామీ? .. న్యూ బాబా వంగా జోస్యం నిజ‌మ‌వుతుందా?

జ‌పాన్ మాంగా క‌ళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జ‌పాన్ కి భారీ సునామీ రానుంద‌ని చెప్ప‌డంతో.. ఎంద‌రో త‌మ జ‌పాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్క‌సారిగా  జ‌పాన్ టూరిజం ప‌డ‌కేసింది. జూన్ చివ‌రి వారం నుంచి జూలై ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కూ త‌మ త‌మ ప‌ర్య‌ట‌న‌లు పోస్ట్ పోన్ చేసుకున్నారు.  కార‌ణం.. న్యూ బాబా వంగాగా  పేరున్న టాట్సుకీ.. 2011 జ‌పాన్ సునామీని కూడా స‌రిగ్గా ఇలాగే అంచ‌నా వేశారు. దీంతో జ‌పాన్ ప్ర‌జ‌లు గుండెలు అర‌చేత ప‌ట్టుకుని తిరుగుతున్నారు. టాట్సుకి తన పుస్తకం "ది ఫ్యూచర్ ఐ సా"లో 2025 జూలై 5న జపాన్ లో భారీ సునామీ వస్తుందని అంచనా వేయ‌డంతో జ‌నం బెంబేలెత్తి పోతున్నారు. ఇక్క‌డ మ‌రో వింత ఏంటంటే జ‌పాన్ ప్ర‌జ‌ల‌క‌న్నా జ‌పాన్ రావాల‌నుకుంటున్న వారు ఈ వార్త తెలిసి హ‌డ‌లెత్తిపోతున్నారు. బేసిగ్గా ఇక్క‌డ ఈ సీజ‌న్లోని ప్ర‌కృతి అందాలు చూడ్డానికి పెద్ద ఎత్తున జులై నెల‌లో టూర్ గా వ‌స్తుంటారు జ‌పాన్ చుట్టుప‌క్క‌ల దేశాల వారు.  ఇంత‌టి ప్ర‌కృతి వినాశ‌నం  జ‌ర‌గబోతుంద‌ని న్యూ బాబా వంగా చెప్ప‌డంతో.. ఆ ప్ర‌కృతి ప్ర‌కోపంలో ప‌డి మ‌నం ఎందుకు ప్రాణాలు కోల్పోవ‌డం అంటూ స‌గానికి స‌గంపైగా టూరిస్టులు జ‌పాన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఎన్నో విమానాలు ర‌ద్ద‌య్యాయి. హోట‌ళ్ల బుకింగ్ కూడా భారీగా  ప‌డిపోయింది.   దీనంత‌టికీ కార‌ణం ఇలాంటి జోతిష్యులు చెప్పిన‌వి జరుగుతుండటమే. గ‌తంలో బెల్జియంకి చెందిన  బాబా వంగా కూడా స‌రిగ్గా ఇలాగే ముందే విప‌త్తుల‌ను ఊహించి చెప్పేవారు. ఆమె త‌ర్వాత జ‌పాన్ కి చెందిన టాట్సుకీ సైతం ఇలాంటి ముంద‌స్తు జోస్యాలు చెప్ప‌డం మొద‌లెట్టారు. గ‌తంలో ఇలాంటిదొక‌టి నిజం  కావ‌డంతో.. ఇప్పుడంద‌రూ అదే నిజ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. జులై ఐదున జ‌పాన్ లో ఏదో ఒక విప‌త్తు జ‌ర‌గ‌బోతుంద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. అయితే ఇక్క‌డ జ‌పాన్ ప్ర‌భుత్వం ఏం చెబుతోందంటే.. మీరు భ‌య  ప‌డుతున్నారు గానీ మా జ‌ప‌నీయులు భ‌య ప‌డ్డం లేదు.  అస‌లేం జ‌ర‌గ‌ద‌ని తెగేసి చెబుతున్నారు. ఒక వేళ జూలై ఐదున ఏదైన విప‌త్తు జ‌ర‌గుతుంద‌ని మా వాళ్లు న‌మ్మే ప‌నైతే ఈ పాటికే దేశం విడిచి పారిపోయేవాళ్లు క‌దా? ఇక్క‌డెవ‌రూ అలాంటి హ‌డావిడిలో లేరు కావాలంటే చూసుకోండ‌ని అంటున్నారు. సునామీ అంటే ఏమిటి? స‌ముద్ర గ‌ర్భంలో ఏర్ప‌డే భూకంపం.. తీర ప్రాంతాల్లోకి భారీ అల‌లు వ‌చ్చి ప‌డ‌తాయి. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటే అదే స‌ర్దుకుంటుంది. ఒక వేళ భూకంపం త‌మ‌ను ప్ర‌భావితం చేస్తే.. ఎలా అన్న‌ది వారు ఇప్ప‌టికే ఒక అవ‌గాహ‌న‌లోకి వ‌చ్చేశారు. త‌మ టెక్నాల‌జీ సాయంతో భూకంపాల‌ను త‌ట్టుకోవ‌డం ఎలాగో నేర్చేసుకున్నారు. కాబ‌ట్టి.. డోంట్ ఫియ‌ర్ పాల‌సీ  మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.
జూలై 5న జపాన్ ను ముంచెత్తనున్న సునామీ? .. న్యూ బాబా వంగా జోస్యం నిజ‌మ‌వుతుందా? Publish Date: Jul 4, 2025 12:10PM

మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకు ముందు గురువారం (జులై 3) హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే  కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఖర్గేకు స్వాగతం పలికిన వారిలో  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు. అదలా ఉంచితే  గాంధీ భవన్ లో జరిగే పీఏసీ భేటీలో మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ ఆఫీస్‌ బేరర్స్‌తో సమావేశమౌతారు. అంతే కాకుండా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఖర్గేతో భేటీ అయ్యారు.  ఇక   స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై పార్టీ కీలక నేతలతో ఖర్గే చర్చిస్తారు. 
మల్లికార్జున ఖర్గేతో  సీఎం రేవంత్ భేటీ Publish Date: Jul 4, 2025 11:06AM

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన   సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో కేసీఆర్ బాధపడుతున్నారు. రోజుల తరబడి టెంపరేచర్ కంట్రోల్ లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. యశోదా ఆస్పత్రిలో   వైద్యులు  కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు.  ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, జ్వరం తగ్గి,  వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను చూసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇలా ఉండగా అస్వస్థతతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో  అడ్మిట్ అయిన విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఫోన్ లో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.  
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం రేవంత్ Publish Date: Jul 4, 2025 10:46AM

హస్తినకు చేరిన ఓరుగల్లు వివాదం!

వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా? అంటే..  విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టుగా  హస్తం పార్టీ  రెండుగా చీలి పోయిందని  మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.  నిజానికి, ఒక్క వరంగల్ జిల్లా అనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పరిస్థితి కొంచెం అటూ ఇటూగా  ఇలాగే ఉందనీ ఏ ఒక్క జిల్లాల్లోనూ హస్తం పార్టీ ఒకటిగా లేదని, గాంధీ భవన్  సాక్షిగా గుసగుసలు వినిపిస్తున్నాయి.   అదలా ఉంచి  వరంగల్ విషయానికి వస్తే..  వరంగల్ జిల్లాలో పరిస్థితి  రోజు రోజుకు శృతి మించి రాగాన పడుతోందని, అంటున్నారు. ఇప్పటికే..  జిల్లా సరిహద్దులు దాటి గాంధీ భవన్ కు  చేరిన  వరంగల్ పచాయతీ తాజా సమచారాన్ని బట్టి ఢిల్లీకి చేరిందని అంటున్నారు. ఓ వంక హస్తం పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సాగుతున్న  కిస్సా కుర్సీకా  వివాదం ఇంకా ఒక  కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి సర్డుమణిగినట్లు కనిపిస్తున్నా.. మళ్ళీఎప్పుడైనా భగ్గుమనే ప్రమాదం ఉందని భావిస్తునారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజుకున్న వివాదాన్ని ఉపేక్షిస్తే ముందు ముందు మరంత ప్రమాదంగా పరిణమించే ప్రమాదం లేక పోలేదని..  అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని  గాంధీ భవన్ వర్గాల సమాచారం.  అదలా ఉంటే.. అధికారంలోకి వచ్చేందుకు, వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు   కాంగ్రెస్ పార్టీ  ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకులకు పదవులు  ఎరగా వేయడం వలన తలెత్తిన సమస్యలు, చిలికిచిలికి గాలివానగా మారి పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొండా సురేఖ ఫ్యామిలీ విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు  కొండా ఫ్యామిలీకి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. ఒకే టికెట్ తో సరిపెట్టారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ ప్రామిస్  చేశారు. కానీ.. అదీ నెరవేర్చలేదు. కొండా సురేఖకు మంత్రి పదవి అయితే ఇచ్చారు కానీ, గిట్టుబాటయ్యే శాఖలు ఇవ్వలేదన్న అసంతృప్తిని కొండా మురళీ  దాచుకోలేదు. మంత్రి సురేఖ శాఖల్లో ఎక్కడా పైసలు రాలడం లేదని..  ఇప్పటికీ  ఆమె నెల వారీ ఖర్చులకు తానే పైసలు పంపుతున్నాని మీడియా ఎదుటనే ప్రకటించారు. అంతేకాకుండా.. ఇప్పుడేమో ఇచ్చిన సురేఖ కుర్చీకి ఎసరు పెడుతున్నారు. అందుకే..  మంత్రి కొండా సురేఖ కుటుంబంలో అసంతృప్తి భగ్గుమంటోంది. వరంగల్ రాజకీయాల్లో రగులుతున్న వర్గ పోరుకు ఇదే ప్రధాన కారణంగా పరిశీలకులు పేర్కొం టున్నారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒరలో రెండు కాదు.. అంతకంటే ఎక్కువ కత్తులు ఇమిడ్చే ప్రయత్నం చేయడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మీనాక్షి నటరాజన్  ద్వారా సమాచారం తెప్పించుకున్న కాంగ్రెస్ అధిష్టానం  వరంగల్ వివాదాన్ని మొగ్గలోనే తుంచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే.. తాజాగా కొండా దంపతుల కుమార్తె, కొండా సుష్మిత పటేల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీచేస్తున్నానని సోషల్ మీడియా అకౌంట్‌  లో మార్పులు ద్వారా సంకేతాలు ఇవ్వడంతో వరంగల్ వివాదం మరో మలుపు తీసుకుందని అంటున్నారు. అదొకటి అయితే.. కొండా దంపతులు గురువారం (జులై  3) కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిశారు.  ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై ఆమెకు 16 పేజీల నివేదికను నివేదిక ఇచ్చారు. అలాగే.. తమ పై వచ్చి ఆరోపణలపై కొండా దంపతులు  మీనాక్షి నటరాజన్ కు సమాధానంలాంటి వివరణ ఇచ్చారు.   రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు.. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో..  వరంగల్ వివాదం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించిన మీనాక్షి నటరాజన్ అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శుక్రవారం (జులై 4) రాష్ట్రానికి వస్తున్న  నేపద్యంలో.. విషయాన్ని  అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఏమి చేస్తుంది? చూడవలసి వుందని అంటున్నారు.
హస్తినకు చేరిన ఓరుగల్లు వివాదం! Publish Date: Jul 4, 2025 10:24AM

కేసీఆర్ భోళా శంక‌రుడు.. కవిత కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు

ఈ శ‌తాబ్దానికే ఇది జోక్ కావ‌చ్చు. ఈ భూమ్యాకాశాల మ‌ధ్య కేసీఆర్ కి తెలియ‌ని రాజ‌నీతి లేదు. రెడ్డి, క‌మ్మ‌గా విడిపోయి కొట్టుకు ఛ‌స్తున్న ఉమ్మ‌డి ఆంధ్ర రాజ‌కీయాల్లో వెల‌మ‌ల పాత్ర‌ను తిరిగి తీసుకురావ‌డంలో అప‌ర చాణ‌క్యుడ‌న్న పేరు సాధించారాయ‌న‌. అంతేనా  కేసీఆర్ అన్నీ తెలిసే కావాల‌నే చేశారని అంటారు. అలాగ‌ని కులాభిమానం అయినా ఉందా? అంటే అదీ లేద‌ని చెబుతారు. అంత‌టి స్వార్ధ‌ప‌రుడు కేసీఆర్ అన్న పేరు ఈనాటిది కాద‌ని అంటారు. సాటి వెల‌మ‌కు మంత్రిత్వం ఇచ్చార‌ని కూడా చూడ‌కుండా.. ఏకంగా టీడీపీ బ‌య‌ట‌కొచ్చి... అప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయం లాంటి తెలంగాణ ఉద్య‌మాన్ని తిరిగి నిద్ర‌లేపి.. దాన్ని అంచ‌లంచెలుగా.. ముహుర్తాలు చూసుకుని మ‌రీ.. ఉద్య‌మాలు చేయ‌డంలో భోళాత‌నం ఎక్క‌డో ఎవ‌రికీ అర్ధం కాదని అంటారు. ముహుర్తాలంటే గుర్తుకొచ్చింది.. తాను డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి చేయ‌లేన‌ని అలిగి ఇంట్లో కూర్చున్న‌పుడు ఒక గోదారి జిల్లాల‌కు చెందిన బ్రాహ్మ‌డు కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చార‌నీ.. ఆయ‌న వ‌చ్చే పుష్క‌ర‌కాలం త‌ర్వాత మీకు అఖండ రాజ‌యోగం ప‌ట్ట‌నుంద‌ని.. స్పీక‌రేం క‌ర్మ‌.. ఏకంగా సీఎం అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌నీ.. పెద్ద పెద్ద రాజ‌నీతిజ్ఞులే మీ ముందు బ‌లాదూర్ అయిపోతార‌నీ.. చెప్పారనీ.. ఆ వెంట‌నే ఈయ‌న తెలంగాణ వాదాన్ని వెలికి తీసి ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ లాంటి వారి చేత తెలంగాణ పాఠాలు వ‌ల్లె వేయించుకున్న‌ట్టు ఒక స‌మాచారం. ఆపై కావాల‌నే ఉన్న ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం, అన‌వ‌స‌రంగా ఉప ఎన్నిక‌లొచ్చేలా చేయ‌డం.. అటు పిమ్మ‌ట అమాయ‌క పిల్ల‌ల ప్రాణాలు పోయేలా రెచ్చ‌గొట్ట‌డం. అందుకు అంద‌మైన బ‌లిదానం అంటూ పేర్లు పెట్ట‌డం వంటివి కూడా భోళా శంక‌రుడి లీల‌లేనా?. అక్కా అన్న‌ది కొంద‌రి ప్ర‌శ్న‌. ఎట్ట‌కేల‌కు తెలంగాణ వ‌చ్చీరావ‌డంతో ద‌ళితుల‌ను ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని అన్న మాట‌ను కాస్తా తీసి హుస్సేన్ సాగ‌ర్ గ‌ట్టు మీద పెట్టి.. ఉద్య‌మ‌కారుడు ఉద్యోగి అయ్యాడ‌ని చెప్పుకోవ‌డంలోనూ భోళాత‌న‌ముందా?  కవితక్కా..! కాళేశ్వ‌రం క‌థ‌ల నుంచి మొద‌లు పెడితే.. ప్ర‌తి దాన్లో రాజ‌కీయం. ఆఖ‌ర్న ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రికి ఇక్క‌డ ప‌దేళ్ల పాటు ఎక్క‌డ రాజ‌ధాని హోదా ఇవ్వాల్సి వ‌స్తుందోన‌ని ఆయ‌న్ను కాస్తా ఓటుకు నోటు కేసులో త‌న టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇరికించి మ‌రీ త‌ర‌మ‌గొట్ట‌డంలోనూ భోళాత‌న‌మేనా అక్కా.. అని నిల‌దీస్తున్నారు కొంద‌రు. కేసీఆర్ క‌థ‌లు.. చెబితే చారెడు.. వింటే మూరెడు అన్న‌ట్టు... లెక్క‌లేన‌న్ని లీల‌లు. పేప‌రు లీకేజీల ద‌గ్గ‌ర్నించి.. పేప‌రోళ్ల‌ను పాతాళంలో పాతి పెడ‌తా! అనే వ‌ర‌కూ ఎన్నో.. ఎన్నెన్నో..  అదేమంటే మాపై ఇంత నెగిటివ్ గా రాస్తున్న వారికి ఉచితాలు, వ‌రాలివ్వాలా? అంటూ నేరుగానే అన‌డ‌మొక‌టి. ఇదంతా కూడా భోళాత‌న‌మేనా అక్కా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర- తెలంగాణ తేడా లేకుండా  ఆయ‌న కోసం రాసినోళ్లు, క‌థ‌నాలు వండి వార్చినోళ్లు, అందులో భాగంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నోళ్లూ.. వీరంతా క‌ల‌సి మ‌ట్టి కొట్టుకు పోగా.. ఎక్క‌డో మీకోసం యాగాలు చేసిన స్వామీజీల‌కు రూపాయ లెక్క‌న స్థ‌లాలూ పొలాలూ ఇవ్వ‌డంలోనూ భోళా మ‌నిషినే చూసుకోవాలా అక్కా మేము.. మా ఖ‌ర్మ కాకుంటే అంటూ  కొంద‌రు ఆనాటి పాత జ్ఞాప‌కాల‌ను తిర‌గ‌దోడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో కేసీఆర్ స్పంద‌న ఎలాంటిద‌ని విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు.. క‌విత‌క్క చెప్పిన స‌మాధానం.. కేసీఆర్ ఒక భోళా శంక‌రుడు, ఆయ‌న కింది వారు ఇలాంటి ప‌నులు చేసి ఉంటారేమో అంటూ ఆమె చెప్పిన ఈ కొటేష‌న్ పై ఒక్కొక్క‌రు.. పై విధంగా కామెంట్లు చేస్తున్నారు.
 కేసీఆర్ భోళా శంక‌రుడు.. కవిత కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు Publish Date: Jul 4, 2025 10:09AM

తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు

తిరుమల కొండపై  ఏనుగులు హల్‌ చల్‌ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోనే ఏనుగుల గుంపు తిష్టవేసి ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. యువకులు గట్టిగా కేకలు వేయడంతో ఏనుగుల గుంపు కొద్దిగా వెనక్కు వెళ్లింది. గత కొద్ది రోజులుగా శేషాచలం అడవుల నుంచి ఏనుగులు సమీప గ్రామాలలోకి ప్రవేశించి పంటపొలాలను ధ్వంసంచేసిన ఘటనలు జరిగాయి. దీంతో వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేసేందుకు అధికారులు శతథా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏనుగులు ఏకంగా తిరుమల ఘాట్ రోడ్డు పైకి రావడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  అటవీ అధికారులు రంగ ప్రవేశం చేసి ఏనుగులను అడవిలోనికి తరిమివేయడంతో  భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. 
తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు Publish Date: Jul 4, 2025 9:49AM

పిల్లలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే  చెడుదారిలో పడ్డారని అర్థం..!

  పెద్దలు ఎల్లప్పుడూ స్నేహాలు మంచిగా ఉండాలని సలహా ఇస్తారు. దీని వెనుక వారి ఆలోచన ఏమిటంటే- 'స్నేహం ఎలా ఉంటుందో, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.' ఎవరైనా సరే ఏ రకమైన వ్యక్తులతో సమయం గడుపుతారో, వారి ఆలోచన, ప్రవర్తన,  అలవాట్లు క్రమంగా ఎదుటివారిలో  రావడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా  పిల్లలలో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. ఎందుకంటే వారు ఈ సమయంలో భావోద్వేగపరంగా పెళుసుగా ఉంటారు.   ఇతరుల వల్ల  సులభంగా ప్రభావితమవుతారు. పిల్లలు తప్పుడు స్నేహంలో పడితే, అది వారి ప్రవర్తన, నమ్మకం,  చదువులతో పాటు వారి భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. వారిలో కనిపించే కొన్ని అలవాట్ల కారణంగా వారు చెడుదారిలో పడ్డారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుల గురించి చెడుగా మాట్లాడటం.. ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా వారిని తక్కువ అంచనా వేయడం ప్రారంభించినప్పుడు,  పిల్లవాడు చెడు సహవాసంలో పడిపోయాడని అర్థం చేసుకోవాలి. ఇది పిల్లలకు చదువు మీద  చులకన భావం ఏర్పడేలా చేస్తుంది. చెడు స్నేహితుల సమర్థింపు.. పిల్లవాడు తన స్నేహితుల్లో ఎవరి తప్పుడు ప్రవర్తననైనా సమర్థించడం ప్రారంభిస్తే , ఆ పిల్లవాడు ఆ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యాడని స్పష్టమైన సంకేతం.  ఇది  హెచ్చరిక సంకేతం అవుతుందట.  ఇలాంటి వారు స్నేహితుల ద్వారా  ాలా దెబ్బ తింటారు. నెగెటివ్ గా మాట్లాడటం..  పిల్లవాడు అకస్మాత్తుగా తన గురించి ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా అతని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, అది అతని స్నేహితుల  యొక్క ప్రతికూల ప్రభావం కావచ్చు.  ఇది పిల్లవాడిని ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. రహస్యం.. పిల్లవాడు అకస్మాత్తుగా ఫోన్ దాచి స్నేహితులతో మాట్లాడటం,  లేదా చాట్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌ను దాచిపెట్టడం వంటివి చేస్తే  తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.  పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా తప్పు పనులు చేసే అవకాశం ఉంటుంది. చదువుకు దూరం కావడం.. పిల్లలు అకస్మాత్తుగా చదువుకు దూరం కావడం, హోంవర్క్ వాయిదా వేయడం, తరగతులకు హాజరు కాకపోవడానికి సాకులు వెతకడం లేదా అస్సలు చదువుకోకూడదని అనిపించడం ప్రారంభిస్తే, అది సోమరితనం వల్ల మాత్రమే కాకపోవచ్చు. చెడు సహవాసం వల్ల కూడా ఇలా చేసే అవకాశం ఉంటుంది.                                  *రూపశ్రీ.
పిల్లలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే  చెడుదారిలో పడ్డారని అర్థం..! Publish Date: Jul 4, 2025 9:30AM