political-news-img

ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే .. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై చంద్రబాబు

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి జంతువుల కొవ్వుపై గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. . ఇటీవ‌ల ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) నివేదికలో తిరుమల శ్రీవారి అడ్డూ ప్రసాదంలో వినియోగించినది అసలు నెయ్యే కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతలు మాత్రం సిట్ చార్జిషీట్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆనవాళ్లే లేవని పేర్కొందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్ర‌బాబు తాజాగా స్పందించారు. గ‌తంలో నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పానని స్పస్టం చేశారు. జంతువుల కొవ్వు నెయ్యిలో క‌లిసింద‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింద‌న్నారు. దేశంలోనే అత్యంత విశ్వ‌స‌నీయ ఎన్‌డీడీబీ నివేదిక‌ను ఎవ‌రైనా చ‌దువుకోవ‌చ్చ‌న్న ఆయన త‌న‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. తాను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలోనే కాకుండా ఇంకా అనేక అంశాల్లో కూడా వైసీపీ హయాంలో అపచారాలు జరిగాయన్నారు.

Publish Date: Feb 2, 2026 10:05AM

political-news-img

స్కిల్ కేసు.. చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

స్కిల్ కేసులో చంద్రబాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఏపీ రాజకీయాలలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలూ లేవని విస్పష్టంగా పేర్కొంది. విశాఖలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ చార్జిషీన్ ను కోర్టు గత నెల 28న విచారణకు స్వీకరించింది. ఈ కేసులో డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను, ఆ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ తదితరులను నిందితులుగా పేర్కొన్న ఈడీ, చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే స్కిల్ కేసులో గత జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలను మిస్టేక్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ ఏపీ సీఐడీ గత నెలలోనే విజయవాడ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఐడీ క్లోజర్ రిపోర్టును కోర్టు ఆమోదించి కేసు ముగించిన సంగతీ విదితమే. సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు చేపట్టిన ఈడీ కూడా ఇప్పుడు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల తెలుగుదేశం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ను ఆయన గొప్ప నైతిక విజయంగా మంత్రి అచ్చన్నాయుడు అభివర్ణించారు.

Publish Date: Feb 2, 2026 9:46AM

political-news-img

అంబటిపై 16 క్రిమినల్ కేసులు

అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు ఉంది. ఈ విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన పలు సందర్భాలలో వివాదా స్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషణలు చేసిన విషయాన్ని కూడా ఆ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అంబటి తీరు, వ్యవహారశైలి కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టు లోని అంశాలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు అంబటి తరఫు న్యాయవాది వాదనలను పూర్వపక్షం చేస్తూ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

Publish Date: Feb 2, 2026 9:34AM

political-news-img

నోరు అదుపులో ఉండాలి కదా?.. అంబటి భార్య పిటిషన్ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషణను తప్పుపట్టింది. రాజకీయ నాయకులుు, ప్రజా జీవితంలో ఉండే నాయకులకు నోరు అదుపులో ఉండాలని వ్యాఖ్యానించింది. ఇతరులను కించపరచడం, వివాదాలకు దారి తీసేలా వ్యాఖ్యలు చేయడం సరి కాదని కుండబద్దలు కొట్టింది. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ అంబటి రాంబాబు భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటి వద్ద రక్షణ కల్పించాలని ఆమె ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అంబటి భాష సరికాదని పేర్కొంది. ఇష్టారీతిగా మాట్లాడతాం, రక్షణ కల్పించండి అంటే ఎలా అని పేర్కొంది. నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షిం చడమే పోలీసుల పని కాదన్న కోర్టు, సమాజంలో శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని పేర్కొంది. ఇలా ఉండగా అంబటి రాంబాబు కుటుంబానికి ఇప్పటికే తగిన భద్రత కల్పించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులు తెలియజేయడంతో, ఆ ఆధారాలను పరిశీలించిన కోర్టు అంబటి భార్య పిటిషన్ ను పరిష్కరించినట్లు పేర్కొంది.

Publish Date: Feb 2, 2026 9:24AM

political-news-img

అంబటికి 14 రోజుల రిమాండ్.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీసులు శనివారం (జనవరి 31) రాత్రి అదుపులోనికి తీసుకున్న సంగతి విదితమే. గోరంట్ల వద్ద తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై ‘మహాపాపం’ పేర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద టీడీపీ శ్రేణులు అంబటిని అడ్డుకున్నాయి. ఆ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్య వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై అంబటిపై తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లపాడు పీఎస్ లో తెలుగుదేశం గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంబటిని శనివారం (జనవరి 31) అర్ధరాత్రి అరెస్టు చేసి నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆదివారం (ఫిబ్రవరి 1) రాత్రి ఆయనను మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి అంబటికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి తరలించారు.

Publish Date: Feb 2, 2026 9:09AM

political-news-img

సీఎం రేవంత్ , మంత్రుల నివాసాల వద్ద బందోబస్తు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల నివాసాల ముట్టడికి బీఆర్‌ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో హైదరాబాద్‌లో భద్రతను కట్టదిట్టం చేశారు. తెలంగాణ భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిఘా పెంచడంతో పాటు ప్రధాన మార్గల్లో ఆంక్షలు విధించి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏ క్షణానైనా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉండటంతో సీఎం వద్ద పోలీసులు భద్రత పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే మూడు దారుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు

Publish Date: Feb 1, 2026 6:34PM

News Videos

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img