ఆంధ్రప్రదేశ్ కు అదనంగా ఐపీఎస్ ల కేటాయింపు

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఓ వైపు జగన్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తన వంతు ప్రయత్నాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో  ఏపీకి నిధుల వరద పారింది. కేంద్రం ఏపీకి భారీ కేటాయింపుల వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్న సంగతి తెలిసిందే. మరో వైపు జగన్ పాలనలో అక్రమాలు, అన్యాయాలను కళ్లకు కట్టే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ జగన్ శిబిరంలో భూకంపం వచ్చేలా చేస్తున్నారు. అంతే కాకుండా జగన్ హయాంలో ప్రతిష్ట కోల్పోయిన పోలీసు శాఖను ప్రక్షాళన చేసే విషయంలో కూడా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ లను కూటాయించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఆయన వినతి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ లను కూటాయించేందుకు కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రానికి అదనంగా 30 మంది ఐపీఎస్ లు రాబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంక్త్ 144 కాగా ఆ సంఖ్యను 174కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు అదనపు ఐపీఎస్ ల కేటాయింపు ఇదే మొదటి సారి.  
Publish Date: Jul 27, 2024 10:20AM

దోపిడీ సొమ్ముతో విధ్వంసానికి కుట్ర!?

ఇటీవలి ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాన్ని వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు. త‌న రాజ్యాన్ని శ‌త్రువులు ఆక్ర‌మించుకున్నార‌న్న రీతిలో ఆయన వ్య‌వ‌హార‌శైలి ఉంది. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. ప్ర‌జ‌లు మ‌న ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను ఛీ కొట్టార‌ని జ‌గ‌న్ అంగీకరించలేకపోతున్నారు. తన రాజ్యాన్ని కబళించేశారన్న కక్షతో రగిలిపోతున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. అందుకు తగ్గట్టుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌ల‌హాలు ఇచ్చే నేత‌లు సైతం ఉండ‌టంతో ఆయ‌న‌ పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ప‌ నిండా రెండు నెల‌లుకాలేదు. అప్పుడే రాష్ట్రంలో ఏదో జ‌రిగిపోతుంద‌ని జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్ట‌డం చూసి జనం న‌వ్వుకుంటున్నారు. సాధార‌ణంగా కొత్త‌గా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. స‌ర్దుబాటు కావ‌టానికి క‌నీసం ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. గ‌త ప్ర‌భుత్వంలో చేసిన అప్పులు, రాబ‌డి త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న‌కు రావ‌డంతో పాటు.. శాఖ‌ల వారిగా అధికారుల‌ను స‌ర్దుబాటు చేసుకోవ‌టం, పాలనపై ప‌ట్టు సాధించడం కోసం స‌మ‌యం ప‌డుతుంది.  కానీ, జ‌గ‌న్ తీరు చూస్తుంటే.. కుర్చీ నాది, దానిలో కూర్చోవ‌డానికి చంద్ర‌బాబు ఎవ‌రు అనే ఆక్రోశంతో, ఆవేశంతో ఉడికిపోతున్నట్లు కనిపిస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఆ కుర్చీని లాక్కోవాల‌నే దుగ్ధతో  ఎంత‌కైనా తెగించేందుకు జ‌గ‌న్‌, ఆయ‌న టీం సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చు చేసేందుకు స‌న్న‌ద్ద‌మైన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో అరాచ‌కాల‌కు హ‌ద్దు లేకుండా పోయింది. ఆయ‌న అనుచ‌రులు రాష్ట్ర‌ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్ప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లపై అక్ర‌మ కేసులు పెట్టి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిని అక్ర‌మ కేసుల‌లో ఇరికించి మరీ జైళ్ల‌కు పంపించారు. మొత్తంగా చెప్పాలంటే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వైసీపీ నేత‌లు ఉన్మాదుల్లా వ్య‌వ‌హ‌రించారు. త‌మ‌ అరాచ‌క పాల‌న‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్న జ‌గ‌న్ వ్యూహాల‌కు జనం ఎన్నికలలో చెక్ పెట్టారు.  ప్ర‌జ‌లంతా ఏక‌మై వైసీపీని ఘోరంగా ఓడించారు. ఘోర ఓట‌మిని త‌ట్టుకోలేక జ‌గ‌న్ మాన‌సిక  ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ఆయన  ఆంత‌రంగికులే చెబుతున్నారు. నెల‌న్న‌ర రోజుల్లో స‌రైన తిండి, నిద్ర లేక జ‌గ‌న్ బ‌రువు కూడా త‌గ్గారంటున్నారు. 2019లో జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌భుత్వ భ‌వ‌నాలు కూల్చివేత‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌ల అక్ర‌మ అరెస్టుల‌తో అరాచ‌క పాల‌న‌కు తెర‌లేపారు. ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎక్క‌డా ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా ప్ర‌ణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. దీంతో ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వం తీరుప‌ట్ల సంతోషంగా ఉన్నారు. నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జల నుంచి వ‌స్తున్న మంచి స్పంద‌న‌ను చూసి జ‌గ‌న్ రగిలిపోతున్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా  రాష్ట్రంలో అల్ల‌ర్ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు   ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి , పోల‌వ‌రం ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన చంద్ర‌బాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా, కంపెనీలు ఏర్పాట‌య్యేలా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కూట‌మి ప్ర‌భుత్వంలో ప్ర‌శాంత పాల‌నకు స‌హ‌క‌రిస్తే  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు క్యూ క‌డ‌తాయ‌ని, త‌ద్వారా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మంచి పేరు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అదే జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ ఉనికిమాత్రంగా కూడా మిగిలే అవకాశం లేదని   జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో అరాచ‌కాలు, హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని, 36 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య‌లు చేశార‌ని జ‌గ‌న్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కూట‌మి ప్ర‌భుత్వం 50రోజుల పాల‌న‌లోనే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని, రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్టారు. ఢిల్లీలో ధ‌ర్నాకు కోట్లాది రూపాయ‌లు జ‌గ‌న్ ఖ‌ర్చు చేశారు.  కానీ, కూట‌మి పార్టీల నేత‌ల దాడుల వ‌ల్ల చ‌నిపోయిన 36 మంది వివ‌రాలు ఇవ్వాల‌ని కోరితే మాత్రం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు నీళ్లు నములుతున్నారు. కేవ‌లం రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకు రాకుండా ఉండాల‌నే జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని కూట‌మి పార్టీల నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించేలా జ‌గ‌న్, ఆయ‌న బృందం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప‌నిచేయ‌లేని ప‌రిస్థితి క‌ల్పించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల్లో, అన్ని ప‌ట్ట‌ణ కేంద్రాల్లో ధ‌ర్నాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆందోళ‌న‌లు, అల్ల‌ర్ల‌తో రాష్ట్రం మొత్తం అశాంతి సృష్టించాల‌న్న‌ది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఇందుకోసం జ‌గ‌న్ నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చుచేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ బాధ్య‌త‌ల‌ను మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి అప్ప‌గించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ధ‌నుజ‌య రెడ్డి, మిథ‌న్ రెడ్డితోపాటు జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌గా మెలిగిన వైసీపీ నేత‌లు వంద‌ల కోట్ల ప్ర‌జా సొమ్మును దోపిడీ చేశారు. ఆ సొమ్మును బ‌య‌ట‌కు తీసి జిల్లాల్లో అల్ల‌ర్లు సృష్టించేందుకు ఉప‌యోగించ‌బోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా తిప్పికొడుతుంద‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.
Publish Date: Jul 27, 2024 9:56AM

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని చిన్ని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు  ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. శనివారం (జులై 27) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ భేటీలో  పాల్గొనేందుకు చంద్రబాబు  శుక్రవారం (జులై 26) సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో చంద్రబాబుకు ఎంపీ కేశినేని చిన్ని స్వాగతం పలికారు.  కాగా నీతి ఆయోగ్  సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం  కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు.
Publish Date: Jul 27, 2024 9:41AM

జగన్ కుర్చీలో నల్లులు!

జగన్ పెట్టక పెట్టక శుక్రవారం నాడు తాడేపల్లి ప్యాలెస్‌ పక్కనే వున్న పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌కి జర్నలిస్టులను ఆహ్వానించారు. కెమెరాలు మాత్రం వద్దన్నారు. ఎందుకంటే, జగనన్న ఏదేదో సొల్లు అంతా మాట్లాడతారు. ఆ ఫుటేజ్‌తో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటారు. అందుకని వేరే కెమెరాలేవీ వద్దు. మీరు మాత్రం రండి.. జగన్ చెప్పిందంతా విని వెళ్ళండి అని పిలిచారు. ప్రెస్‌మీట్‌లో జగన్ తాను చెప్పాలని అనుకున్న అబద్ధాలు రెండు గంటలపాటు చెప్పీ చెప్పీ బుర్ర తిన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌ని చక్కగా ఎడిటింగ్ చేసి, ట్రిమ్మింగ్ చేసి, జగనన్న తడబాట్లు, పొరపాట్లు, అలవాట్లు, గ్రహపాట్లు,  అన్నీ తీసేసి మిగిలిన ఫుటేజ్‌ని మీడియాకి విడుదల చేశారు. ఎంత ట్రిమ్ చేసినా, ఆ ఫుటేజ్‌లో జగనన్నయ్య లీలలు లేకుండా వుంటాయా? ఇప్పుడు విడుదల చేసిన ఫుటేజ్‌లో కూడా ట్రోలర్స్.కి, మీమర్స్.కి కావలసినంత ఫుటేజ్ వుంది. తెలుగు పండిట్ జగన్ గారు కనిపెట్టిన కొత్తకొత్త తెలుగు పదాలు వున్నాయి. ఇంకా ఎన్నెన్నో వింతలు, విశేషాలు వున్నాయి. వీడియో సంగతి అలా వుంచితే, జగన్ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. ఈలోపుగా ఈ జగన్ ఎప్పుడు సుత్తి ఆపుతాడా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుదామా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులు తమ ప్రశ్నలను ఆయన మీద సంధించారు. ఇద్దరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే, జగన్ వాటికి చెప్పాల్సిన సమాధానం కాకుండా వేరే రకమైన సమాధానాలు చెప్పారు. చివరికి సదరు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు కూడా తాము ఏ ప్రశ్నలు అడిగామో కూడా మర్చిపోయే పరిస్థితిని జగన్ తెచ్చారు. ఇంతలో ఒక లేడీ జర్నలిస్టు ‘‘రెండు ప్రశ్నలు సర్’’ అని అడగటం ప్రారంభించగానే, జగన్ తన కుర్చీలో నల్లులు కుట్టినట్టుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి, అక్కడున్న జర్నలిస్టులకి జగన్ని కుర్చీలో వున్న  నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది. కానీ ఆ తర్వాత జగన్ ఎక్స్.ప్రెషన్ చూసి నల్లులు కుట్టడం కాదు.. ఆయన మీడియా నుంచి పిల్లిలాగా పారిపోతున్నారని అర్థమైంది. చిట్టచివరికి, ఇంతకీ జగన్ తమని ఎందుకు పిలిచారో అర్థం కాని జర్నలిస్టులు బుర్రలు గోక్కుంటూ బయటపడ్డారు.
Publish Date: Jul 26, 2024 6:48PM

చంద్రబాబుపై కథనాలకు గౌరవ డాక్టరేట్

చంద్రబాబునాయుడు  తీసుకున్న నిర్ణయాలు సైతం ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాయి.తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలతో పాటు ఎన్నికల ముందు జనబాహుళ్యంలో అత్యంత ఆదరణ పొందిన చంద్రబాబు ఎక్స్ ఓ అనంత భావ జాలికుడు పుస్తకం లోని అంశాలు తనకు గౌరవం దక్కేందుకు దోహదపడ్డాయని  గుంటూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ అన్నారు. ఆయన కు గౌరవ డాక్టరేట్ లభించింది.  అమెరికాలోని సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ జర్నలిజం విభాగానికి సంబంధించి ఈ డాక్టరేట్ అందజేసింది. ఢిల్లీలోని హోటల్ సామ్రాట్ లో  జరిగిన కార్యక్రమంలో కెనడా కాన్సులేట్ జనరల్ డాక్టర్ జానీష్ దర్బియా చేతుల మీదుగా ఈ డాక్టరేట్ అందుకున్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ ట్రస్టీ డాక్టర్ కె ఎల్ కంజు, ప్రఖ్యాత గజల్ గాయకురాలు పద్మశ్రీ పెనాజ్ మసానీ, నేపాల్ కాన్సులెట్ జనరల్ డాక్టర్ కే ఎల్ శర్మ, సీనియర్ జర్నలిస్టు అభిషేక్ తదితర ప్రముఖులతో పాటు, పారిశ్రామిక, వ్యాపార, సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై రాసిన విశ్లేషణాత్మక కథనాలు, చంద్రబాబు X.O -  అనంత భావజాలికుడు పుస్తకం ను పరిగణలోకి తీసుకొని తనకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు భావిస్తున్నాను అని శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. తనకు ఈ  గౌరవం లభించటానికి ఎపి రేరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి మార్గదర్శనమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తనకు లభించిన ఈ గౌరవం డాక్టర్ రామనాథ్ కే దక్కుతుందని ఆయన చెప్పారు.
Publish Date: Jul 26, 2024 5:42PM