పంజాబ్ పై ఢిల్లీ క్యాపిటల్ విజయం.. డీసీ ప్లేఆఫ్ ఆశలు సజీవం

Publish Date:May 11, 2026

Advertisement

ఐపీఎల్ లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. .  గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో  పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది.  ధర్మశాల వేదికగా   జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు సమష్టిగా రాణించి పంజాబ్‌  పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల స్కోరు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య, స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు.  

211 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన  ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది.   10 పరుగుల దగ్గర ఐదు పరుగులు చేసిన అభిషేక్ పోరెల్  అవుట్ కాగా..  కొద్దిసేపటికే కేఎల్ రాహుల్   కూడా 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  ఆ తర్వాత వచ్చిన సాహిల్ పరాఖ్ 11 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్12 పరుగులు కూడా  వెనుదిరగడంతో 74 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది.  అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మార్కస్ స్టోయినిస్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా  మూడు ఫోర్లు బాది జోరు పెంచిన అక్షర్ పటేల్ 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో56 పరుగులుచేశాడు.   

మరోవైపు   డేవిడ్ మిల్లర్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన మరుసటి బంతికే  పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠగా మారింది. చివరిలో  ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన వేళ అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ అద్భుతం చేశారు. 18వ ఓవర్‌లో: రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు రాబట్టగా, 19వ ఓవర్‌లో: ఏకంగా 22 పరుగులు బాది జట్టును విజయతీరాలకు చేర్చారు.   

By
en-us Political News

  
మంత్రి నారా లోకేష్ రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్-యూజీ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ నగరాన్ని 2023లో కుదిపేసిన సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇళ్ల దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దేశ ఆర్ధిక భద్రత విషయంలో కాలం మారుతున్నా కేంద్ర నిర్ణయాలు ఒకేలా ఉంటుండటం విశేషం.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణలో సొంతింటి లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న తర్వాత అదే క్రేజ్‌ రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
రైల్ రోకో కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితకు కోర్టు సమన్లు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.