రైల్ రోకో కేసులో కవితకు సమన్లు....రేపు కోర్టుకు హాజరు

Publish Date:May 12, 2026

Advertisement

 

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించిన రైల్ రోకో కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితకు కోర్టు సమన్లు జారీ చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్ సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి జారీ అయిన సమన్లలో, బుధవారం ఉదయం 10.30 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. 

రైల్వే చట్టం కింద నమోదైన కేసులో విచారణ కోసం ఈ సమన్లు జారీ చేయడం జరిగింది. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కవిత ఆధ్వర్యం లో రైల్ రోకో నిర్వహించారు తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలపా లని ఈ కార్యక్రమం చేపట్టారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైల్ రోకోలో పాల్గొన్న కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

రైల్ రోకో కారణంగా రైల్వే రాకపోకలు ప్రభావితమ య్యాయి. సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య నిజామాబాద్–హైదరాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ నిలిపివేయ బడింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మరో గూడ్స్ రైలు కూడా ఆపబడింది. కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయ కులపై కేసులు నమోదు చేశారు. రైల్వే ఆక్ట్  147 & 174(a) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేయడంతో, రేపు సికింద్రా బాద్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

By
en-us Political News

  
మంత్రి నారా లోకేష్ రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్-యూజీ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ నగరాన్ని 2023లో కుదిపేసిన సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇళ్ల దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దేశ ఆర్ధిక భద్రత విషయంలో కాలం మారుతున్నా కేంద్ర నిర్ణయాలు ఒకేలా ఉంటుండటం విశేషం.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణలో సొంతింటి లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న తర్వాత అదే క్రేజ్‌ రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశంలో పసిడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శుభకార్యం ఉన్నా, పండుగ వచ్చినా భారతీయులు బంగారం కొనడానికే మొగ్గు చూపుతారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.