కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు... కేసు నమోదు

 

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఓ యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన యువతి కేఏ పాల్ వద్ద పని చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాల్‌ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి.. తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్‌‌కు అందచేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో షీ టీమ్ కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేసింది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu