జమ్మూ కాశ్మీర్ లో పాక్ డ్రోన్ కలకలం

జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ కలకలం రేపింది. పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామంపై పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ ఎగరడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. చక్ భూరా పోస్టు నుంచి సరిహద్దు దాటి భారత భూభాగంలోనికి ప్రవేశించిన ఆ డ్రోన్ కొద్ది సేపు ఘగ్వాల్ సెక్టార్లోని రీగల్ గ్రామంపై చక్కర్లు కొట్టింది.

ఆ తరువాత తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయింది.  ఈ సంఘటన స్థానికంగానే కాకుండా భద్రతా బలగాలలో సైతం కలకలం సృష్టించింది. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu