కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు లభించిన హామీలివే!
posted on Jul 23, 2024 @ 12:33PM
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ఏపీకి అందించిన వరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పూర్తికి అధిక నిధులు, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామికాభివృద్ధికి హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి.
అలాగేవిశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, విశాఖ - చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, నీరు, విద్యుత్, రైల్వే, రోడ్ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు, విభజన చట్టంలో ఉన్న హామీల అమలు, పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ప్రాజెక్ట్