ఒకవైపు పాలన పరవళ్ళు.. మరోవైపు ప్రతీకార డిమాండ్లు!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు అయ్యింది. ఈ రెండు నెలలుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ప్రజలకు రాష్ట్ర అభివృద్ధితో పాటుగా సంక్షేమం కూడా పట్టాలెక్కిందన్న భావన కలిగింది.  జగన్ ఐదేళ్ల పాలనలో భష్టుపట్టిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సీరియర్ గా దృష్టి సారించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నప్పటికీ.. సామాజిక పెన్షన్లను పెంచి చెప్పిన విధంగా ఒకటో తేదీకల్లా అందజేయడం ద్వారా చంద్రబాబు అందర్నీ ఆశ్చర్య పరిచారు. అంతే కాకుండా ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటిన్లను ప్రారంభించనున్నారు. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారులో ఆయన నిమగ్నమై ఉన్నారు. చెప్పిన విధంగా ఒక్కో హామీనీ అమలు చేస్తూనే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడలో పెట్డడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగానూ వేగంగా ముందుకు దూసుకువెడుతున్నారు. మొత్తంగా ఈ రెండు నెలల్లోనే రాష్ట్రం పురోగమిస్తోందన్న నమ్మకాన్ని చంద్రబాబు పాలన ప్రజలలో కలిగించింది.  రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం, రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ జగన్ ఎంత గొంతు చించుకున్నా జనం పట్టించుకోవడం లేదు. బాబు సమర్థ నాయకత్వంపై వారు విశ్వాసంతో ఉన్నారు.  అయితే అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వంపై తెలుగుదేశం క్యాడర్ నుంచే విపరీతమైన ఒత్తిడి వస్తోంది. వాస్తవాలను అర్ధం చేసుకోకుండా, ఓ రకమైన ఎమోషన్ లో తెలుగుదేశం కార్యకర్తలు జగన్ హయాంలో అక్రమార్కులందరికీ తక్షణం శిక్షలు పడిపోవాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఆ దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్ల జగన్ హయాంలో తెలుగుదేశం కేడర్ నరకం చూసింది. వేధింపులకు, దౌర్జన్యాలకూ గురైంది. ఐదేళ్ల పాటు హింసను, దౌర్జన్యాలనూ భరించి తెలుగుదేశం క్యాడర్ గట్టిగా నిలబడింది. అందులో సందేహం లేదు. జగన్ హయంలో తమపై జరిగిన దాడులు, దౌర్జన్యాలకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తగు విధంగా న్యాయం చేస్తుందనీ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన శక్తులను తగు విధంగా శిక్షిస్తుందని వారు సహజంగానే భావించారు. అది జరుగుతుంది కూడా. అయితే క్యాడర్ కోరుకుంటున్నట్లు ప్రతీకార చర్యలు ఉండవు. చేసిన తప్పులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. అందుకు సమయం పడుతుంది. ఆ విషయాన్ని క్యాడర్ అర్ధం చేసుకోవడం లేదు. తక్షణ చర్యలు ఉండాలని కోరుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలల అయిన తరువాత కూడా వైసీపీ హయాంలో దౌర్జన్యాలకు పాల్పడిన వారి ఇంకా ఎలంటి శిక్షలూ లేకుండా స్వేచ్ఛగా ఎందుకు ఉండగలు గుతున్నారు? అంటూ ప్రభుత్వంపై తెలుగుదేశం క్యాడర్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.  అయితే తెలుగుదేశం క్యాడర్  ఒక విషయం అర్ధం చేసుకోవాలి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అయ్యింది. గత ఐదేళ్ల జగన్ అస్తవ్యస్థ, అరాచక పాలనలో వ్యవస్థలన్నీ పై నుంచి కింది దాకా భ్రష్టుపట్టిపోయాయి. ఆ వ్యవస్థలను ప్రక్షాళన చేయడానికే కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ పని జరుగుతోంది.  జగన్ దోపిడీ, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం కూటమికి అఖండ విజయాన్ని అందించారు. అంత మాత్రాన కూటమి సర్కార్ అధకారంలోకి రాగానే ప్రత్యర్థులపై పంజా విసరడానికి లైసెన్స్ ఇచ్చేసినట్లు కాదు. ప్రభుత్వం అదే పని చేస్తే జనం కూడా మెచ్చరు.  ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. జగన్ హయాంలో పార్టీ నాయకత్వం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. వేధింపులకు గురైంది. పార్టీ అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులకు పైగా జైలులో నిర్బంధించింది.  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అనేక విధాలుగా వేధింపులకు గురి చేసింది. చివరకు ఆయన తల్లి భువనేశ్వరిని సైతం అనుచిత వ్యాఖ్యలతో అవమానించింది.  మొత్తం చంద్రబాబు కుటుంబం అంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి కల్పించింది. వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాని చూసింది.   ఇంకా పలువురు తెలుగుదేశం నేతలను జైలుకు పంపి చిత్రహింసలకు గురి చేసింది.  వాస్తవానికి తెలుగుదేశం నాయకత్వం గత ఐదేళ్లూ ఎటికి ఎదురీది పార్టీని కాపాడుకుంది.  అవమానాలను భరించింది. దూషణలకు గురైంది. జైలుకు వెళ్లింది.  జగన్ హయాంలో పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అండగా నిలిచింది. అవసరమైన న్యా సహాయం అందించింది.  ప్రతిపక్షంగా దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని ఇబ్బందులకు జగన్ హయాంలో తెలుగుదేశం ఎదుర్కొంది. అవేవీ అంత తేలిగ్గా మరచిపోయేవి కావు.  వాటన్నిటినీ అధిగమించి పార్టీకి ఘన విజయాన్ని తీసుకువచ్చారు. జగన్  పార్టీని   151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు.  జగన్ ను ఓడించడమెలాగో తెలిసిన నాయకత్వానికి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతకవలు, అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం ఎలా శిక్షించాలో కూడా తెలుసు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. అంత వరకూ క్యాడర్ సంయమనం పాటించాల్సి ఉంది .జగన్ హయాంలో పార్టీ నాయకత్వం, క్యాడరే కాదు, ప్రజలూ దోపిడీ, దౌర్జన్యాలకు గురయ్యారు. వారు  జగన్ అరాచక పాలనలో హద్దులు మీరిన వారిపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు సర్కార్ కు సమయం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. పార్టీ క్యాడర్ కూడా ఆ సమయం ఇవ్వాలి. అందుకు భిన్నంగా వ్యవహరించడం సమంజసం కాదు. 

తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు 

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.  వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.  వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.హైదరాబాద్‌లో రేపు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.

దివ్వెల మాధురికి రిమాండ్!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో సహజీవనం చేస్తూ, ఆ కుటుంబ వివాదంలో కేంద్ర బిందువులా మారి, ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హైవే మీద వేగంగా కారు నడిపి, ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో మరో కారుని ఢీకొట్టిన విషయం తెలిసిందే. మొదట లారీని కొట్టాలని అనుకున్న మాధురి పాపం లారీలో వాళ్ళకి ఏమైనా అవుతుందని జాలిపడిందో ఏమోగానీ, కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురి కారు, మాధురి ఢీకొట్టిన కారు రెండూ బోల్తాపడ్డాయి. అదేం ఖర్మోగానీ, ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసిన దివ్వెల మాధురి నిక్షేపంలా వుంది. ఆస్పత్రిలోనే మీడియాతో చాలా ఫెరోషియస్‌గా మాట్లాడుతోంది. తన ‘ఆయనకిద్దరు’ వ్యవహారానికి రాజకీయ రంగు పులమటానికి శాయశక్తులా కృషి చేస్తోంది. మాధురి ఢీకొట్టిన కారులో వున్నవాళ్ళు మాత్రం పాపం, ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య వున్నారు. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టుగా తయారైంది వాళ్ళ పరిస్థితి. వీళ్ళు వీళ్ళు సంబంధాలు పెట్టేసుకోవడమేంటో.. గొడవలు పడటం ఏంటో.. అనవసరంగా ఆ కారులో వున్నవాళ్ళు సమస్యల్లో పడ్డారు. ఇదిలా వుంటే, దివ్వెల మాధవిని ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు. ఇవాళో రేపో ఆ అరెస్టు కార్యక్రమం జరిగే అవకాశం వుంది. యాక్సిడెంట్ చేసినందుకు, ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు దివ్వెల మాధురిని రిమాండ్‌కి తరలించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. 

ఏపీ ఫైబర్‌నెట్‌లో 238 కోట్ల స్కామ్!

జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన మరో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. రాక్షస పాలన జరిగిన ఐదేళ్లలో ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి పైగా తగ్గినట్లు లెక్కలు చూపించి, వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్ళించినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతి నెలా 14 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 17 నెలల్లో 238 కోట్ల రూపాయల సొమ్మును మధుసూదన్ రెడ్డి అండ్ గ్యాంగ్  గుటకాయస్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ అండదండలతో మధుసూదన్ రెడ్డి విచ్చలవిడిగా చెలరేగిపోయి కొత్తరకం స్కామ్ విజయవంతంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. అవినీతితోపాటు అసమర్థ నాయకత్వం వల్ల ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ మొత్తం 1,258 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ వ్యవహారం మీద చంద్రబాబు ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తోంది.  ప్రీపెయిడ్ విధానం అమల్లోకి వచ్చాక ఆపరేటర్లు ప్రతి నెలా తమ బిల్లులను యాప్ ద్వారా చెల్లించాలన్న నిబంధన పెట్టారు. అప్పటినుంచి కనెక్షన్ల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గినట్లు చూపించారు. నిజానికి కనెక్షన్ల సంఖ్య తగ్గలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. ఎప్పటిలా ప్రతి నెలా యాప్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నామంటున్నారు. కేవలం సంస్థ రికార్డుల్లో మాత్రమే కనెక్షన్ల సంఖ్య తగ్గించి.. ఆ మేరకు నాలుగు లక్షల కనెక్షన్లకు సంబంధించి నెల బిల్లుల కింద వసూలయ్యే మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్ళించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఒక ఏజీఎం, డైరెక్టర్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆపరేటర్లు తమ బిల్లులు ప్రతి నెలా చెల్లించడానికి ఉపయోగించిన యాప్‌ని గ్రీన్ లాంటెర్న్ అనే ఐటీ సంస్థ రూపొందించినట్లు తెలుగుస్తోంది. ఆ యాప్ ద్వారా ఆపరేటర్లు జరిపే చెల్లింపులు రికార్డుల్లో చూపిన కనెక్షన్ల సంఖ్య మేరకు ఫైబర్‌నెట్ ఖాతాకి, మిగిలిన సొమ్ముబినామీ ఖాతాకు జమయ్యేలా ప్రోగ్రామింగ్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును ముంబైలోని ఒక బ్యాంకు ఖాతాకు మళ్ళించినట్లు సమాచారం.

తమిళనాడులో ప్రమాదం.. ఒంగోలువాసులు 5 గురు దుర్మరణం

తమిళనాడులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  దీంతో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.  తిరువళ్లూరు జిల్లా రామంజేరిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కారును రాంగ్ రూట్ లో ఎదురొచ్చిన ట్రక్కు బలంగా ఢీ కొట్టింది.ఏపీలోని ఒంగోలుకు చెందిన ఏడుగురు విద్యార్థులు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన విద్యార్థులు.. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. విద్యార్థులంతా ఒకే కారులో చెన్నైకి బయలుదేరారు. ఈ క్రమంలో తిరువళ్లూరు సమీపంలోకి చేరుకున్నాక వారి కారును ఓ కంటైనర్ ట్రక్కు ఢీ కొట్టింది.చెన్నైకి 65 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చి ఢీ కొనడంతో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మిగతా ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. చనిపోయిన విద్యార్థులు.. నితీశ్ వర్మ, చేతన్, యుగేశ్, నితీశ్, రామ్మోహన్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. గాయపడ్డ చైతన్య, విష్ణులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కాగా, ఈ ఘోర ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

దువ్వాడ వ్యవహారం.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రభావం.. వైసీపీ ఆందోళన

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైసీపీకి కొత్త తలనొప్పిగా మారింది. దివ్వెల మాధురితో తన సహజీవనాన్ని  తన భార్య వాణి, బిడ్డలు హైందవి, నవీనాలు నిలదీస్తూ, ప్రశ్నించడం వెనుక తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ నుంచి ఎటువంటి మద్దతూ లభించడం లేదు సరికదా, ఆయన వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. గత మూడు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దువ్వాడ తన వివాసం వద్దనే భార్య వాణి, కుమార్తెలతో వాగ్వాదానికి దిగడం అందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. గత మూడు నాలుగు రోజులుగా  దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల వ్యవహారం రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలు, ఇరువురూ పరస్పరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడం, భార్యా కుమార్తెలతో దువ్వాడ శ్రీనివాస్ వాగ్వాదం ఇవన్నీ పార్టీకి శిరోభారంగా మారాయి. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి    ప్ర‌భుత్వ  ఉద్యోగి శాంతిల మధ్య సంబంధంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ విషయంలో ఆ ఇరువురూ ఇచ్చిన వివరణలు మరింత వివాదం కావడం తెలిసిందే.  ఈ వ్య‌వ‌హారంపై ర‌చ్చ‌న‌డుస్తున్న నేప‌థ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ రాస‌లీల‌ల వ్య‌వ‌హారం బహిర్గతం కావడంతో  వైసీపీలో ఇలాంటి ఘన కార్యాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్  ల వ్యవహారాలను గుర్తు చేస్తూ నెటిజనులు వైసీపీని ఓ ఆటాడుకుంటున్నారు.  ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి దువ్వాడకు ఎటువంటి మద్దతూ లభించడం లేదు. పైపెచ్చు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు దువ్వాడ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు పార్టీ వీడే యోచనలో ఉన్నారని అంటున్నారు. పార్టీ నాయకత్వం నుంచే కాదు.. కనీసం ఆయన నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు కూడా దువ్వాడకు మద్దతుగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై పార్టీ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దువ్వాడ వంటి నేతల తీరు కారణంగా వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఏపీలోనూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. విధి విధానాల ఖరారు!

తెలుగుదేశం ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (ఆగస్టు 12) ఖరారు చేయనున్నారు. ఇందు కోసం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.  హైదరాబాద్ నుంచి అమరావతికి ఈ ఉదయం చేరుకున్న చంద్రబాబు నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై అధికారులతో చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తారు. దీనితో పాటు పలు అంశాలపై కూడా అధికారులతో సీఎం సమీక్షిస్తారు.  

సానుభూతి డ్రామానా..జ‌గన్ ను మించిపోయారు కదా?!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ఫ్యామిలీ వ్య‌వ‌హారం సినిమా ట్విస్ట్ ల‌ను త‌ల‌పిస్తోంది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తె హైంద‌వి శ్రీ‌నివాస్ ఇంటి వ‌ద్దనే టెంట్ వేసుకొని నిర‌స‌న తెలుపుతుంటే.. దువ్వాడ శ్రీ‌నివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. ఆమె   కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న క్ర‌మంలో ఎదురుగా వ‌చ్చిన మ‌రో కారును ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెకు స్వ‌ల్ప‌గాయాలు అయ్యాయి. ఆస్ప‌త్రిలో చికిత్స అందించారు. కొద్ది గంట‌ల‌కే ఆమె ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్ర‌మాదం త‌రువాత ఆమె మాట్లాడ‌తూ.. తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే కారు యాక్సిడెంట్ చేశాన‌ని చెప్పారు. ఎదురుగా వ‌స్తున్న లారీని ఢీకొట్టి చ‌నిపోవాల‌ని చూశాన‌ని, కానీ, అనుకోకుండా కారును ఢీకొట్టాన‌ని చెప్పారు. ఇంత‌కీ ఎందుక‌లా చేశావరన్న మీడియా ప్ర‌శ్నకు దువ్వాడ వాణి త‌న పిల్ల‌ల‌ గురించి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడారనీ, తన పైనా అస‌త్య‌పు ఆరోప‌ణ‌లు చేస్తున్నారనీ, మా కుటుంబ స‌భ్యులు త‌లెత్తుకోలేక పోతున్నార‌నీ వాపోయారు.  దీంతో తాను మానసికంగా కుంగిపోయానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వాణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తనకు ఏమైనా జరిగితే అందుకు వాణియే కారణమని చెప్పారు. గ‌త నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ ఫ్యామిలీ, దివ్వెల మాధవిల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మాధురి కారు ప్ర‌మాదానికి గురికావ‌టంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  దువ్వాడ ఫ్యామిలీ వ్య‌వ‌హారంలో దివ్వెల మాధురి వ్య‌వ‌హార శైలి మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టుగా ఉంద‌న్న వాద‌న ప్ర‌జ‌ల్లో ఉంది. ద‌వ్వాడ శ్రీ‌నివాస్ తో క‌లిసి ఉంటూ వాళ్ల ఫ్యామిలీలో ర‌చ్చ‌ రేప‌డ‌మే కాకుండా.. తిరిగి దువ్వాడ వాణి, ఆమె కుమార్తెపై మాధురి విమ‌ర్శ‌లు చేస్తుండ‌టాన్ని  ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, నేను అడల్టరీ బంధంలో ఉన్నామని, అదేమీ చట్ట వ్యతిరేకం కాదని మీడియా ముందు సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పిన మాధురి.. ప్ర‌స్తుతం త‌న ప‌రువు పోతోంద‌ని, తాను, త‌న పిల్ల‌లు త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని అన‌డం కాస్త విడ్డూరంగానే కాకుండా ఎబ్బెట్టుగా కూడా ఉంది. నా ఫ్యామిలీ ప‌రువు పోతోంది, నా ముగ్గురు పిల్ల‌లు త‌లెత్తుకోలేక పోతున్నార‌ని క‌న్నీరు పెట్టుకున్న మాధ‌వి.. దువ్వాడ శ్రీ‌నివాస్‌తో అడ‌ల్ట‌రీ సంబంధం పెట్టుకునే ముందే ఈ విషయం గురించి ఆలోచిస్తే ఈ వ్య‌వ‌హారం ఇంత‌వ‌ర‌కు రాక‌పోయేది కదా అని జనం అంటున్నారు.   కాగా దివ్వెల మాధురి కారు ప్ర‌మాదం వ్యవహారాన్ని జనం సానుభూతి డ్రామాగానూ చూస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యాల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాళ్ల‌తో, క‌త్తితో దాడి చేయించుకోవ‌టం అల‌వాటే. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ ప్రణాళికలు రచించుకుని వాటిని అమలు చేయడం చూశాం. 2019 ఎన్నిక‌ల్లో కోడికత్తి దాడితో జ‌గ‌న్ ఫార్ములా వ‌ర్కౌట్ అయింది. 2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గులకరాయి దాడితో సానుభూతి పొందాలన్న ప్రయత్నంలో ఆడిన సానుభూతి డ్రామా ఫెయిలైంది. అది వేరే సంగతి.  ప్ర‌స్తుతానికి దివ్వెల మాధురి తీరు కూడా జ‌గ‌న్ సానుభూతి డ్రామా ఫార్ములాను ఫాలో అవుతున్న‌ట్లు  క‌నిపిస్తోంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కారు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌రువాత మాధురి మీడియాతో మాట్లాడుతూ.. తనకేమైనా అయితే అందుకు  కార‌ణం దువ్వాడ‌ వాణియే అని చెప్పడం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతికోసం   ప్ర‌య‌త్నిస్తున్నారని అంటున్నారు.  మ‌రోవైపు దువ్వాడ శ్రీ‌నివాస్‌, దివ్వెల మాధురిలు త‌మ త‌ప్పును క‌ప్పిపుచ్చుకుని అధికార తెలుగుదేశంపై నెపం మోపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దువ్వాడ వాణి, ఆమె కుమార్తె హైంద‌వీలు శ్రీ‌నివాస్ ఇంటిపైకి రావ‌డం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హ‌స్తం ఉంద‌ని ఆరోపిస్తున్నారు. కుటుంబ   వ్య‌వ‌హారానికి రాజ‌కీయ రంగు పులిమేందుకు దువ్వాడ, దివ్వెల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వాణి వెనుక తెలుగుదేశం నేత‌లు ఉన్నార‌ని ప‌దేప‌దే ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించడం ద్వారా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఫాలో అవుతున్న‌ట్లు చెప్ప‌క‌నే చెబుతున్నారు.  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిసైతం ఏపీ రాజ‌కీయాల్లో ఏ చెడు జ‌రిగినా దాని వెన‌క చంద్ర‌బాబు ఉన్నారని ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు. జ‌గ‌న్ పై ష‌ర్మిల‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు విమ‌ర్శ‌లు చేసినా చంద్ర‌బాబు చేయిస్తున్నారని చెబుతూ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ త‌ర‌హాలోనే త‌మ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు దువ్వాడ శ్రీ‌నివాస్, దివ్వెల వాణిలు తెలుగుదేశం నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దివ్వెల మాధురి యాక్సిడెంట్ తో ఆత్మహత్య అంటూ ఆడిన సానుభూతి డ్రామా జనాన్ని నమ్మించ లేదు సరికదా నవ్వుల పాలైంది.  

జగన్ హయాంలో భూదందాల పరిష్కారానికి 90 డేస్ టార్గెట్!

జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చుల పరిష్కారానికి చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది.  ఇందు కోసం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని  ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజులపాటు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి, మరో 45 రోజులలో వీటి పరిష్కరించాలని నిర్ణయించింది.  గత ఐదేళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి. పేదలు, బడుగువర్గాలు, అణగారిన వర్గాల భూములను వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకొని రికార్డులను తారుమారు చేసి, ఇదేమిటని అడిగితే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు.  కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తున్న వినతి పత్రాల్లో సగానికిపైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్‌, ఆయన అనుయాయులు చేసిన పాపాలు అరాచకాలను సరిదిద్దాలన్న కృత నిశ్చయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. 45 రోజులపాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పెట్టుకుంది‌. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.  జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను మంగళవారం (ఆగస్టు 13) నాటికే ఖరారు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లను  ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జాయింట్ కలెక్టర్ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌, సభ్యులు, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.  గ్రామ రెవెన్యూ సదస్సుకు రెండు రోజుల ముందే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తుంది. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, అటవీ, దేవదాయ, వక్ఫ్‌ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వ పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, ప్రజల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న భూములు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్‌, చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నా యో పరిశీలిస్తారు.  వాటిపై ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూముల పరిశీలన చేస్తారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఆర్‌ఓఆర్‌ రికార్డును ప్రజల సమక్షంలో చదివి వినిస్తారు. కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు జగన్‌ బొమ్మలున్న పాస్‌పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. జగన్‌ బొమ్మలున్న పాస్‌ పుస్తకాలను తహసీల్దార్లు ధ్వంసం చేయాలని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సిసోడి యా మార్గదర్శకాల్లో పేర్కొంది. గ్రామంలో జగన్‌ పేర్లు, బొమ్మలతో సర్వేరాళ్లు ఉంటే, వాటిపై పేర్లను చెరిపివేయాలని నిర్దేశించింది. ఈ నెల 15నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మరో 45 రోజుల్లో అంటే నవంబరు 15 నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.   

ఒక్క ట్వీట్ తో అప్పాయింట్ మెంట్.. బాబు స్పందనకు జనం జేజేలు!

ఏపీలో గ‌డిచిన ఐదేళ్లు వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో విధ్వంస పాల‌న కొన‌సాగింది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుప‌డింది. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయి. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిపై పోలీసులు కేసులు పెట్టి జైళ్ల‌కు  పంపించారు. దొరికిన చోట‌ల్లా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి అప్పులు చేశారు. దీంతో ఉద్యోగులకు నెల‌వారి జీతాలు ఇవ్వాల‌న్నా అప్పు తేవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. జ‌గ‌న్ ప్ర‌భ‌త్వంపై విసిగిపోయిన ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మికి అధికారం క‌ట్ట‌బెట్టారు.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌ల చేప‌ట్టిన నాటి నుంచి స‌మ‌యం వృథా చేయ‌కుండా  రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారంతో రాష్ట్రంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. నిత్యం మంత్రులు, అధికారుల‌తో స‌మీక్ష‌ల‌తోపాటు.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉద‌యం నిద్ర‌ లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు చంద్ర‌బాబు నిరంత‌రం రాష్ట్రాభివృద్ధే ల‌క్ష్యంగా బిజీబిజీగా గ‌డుపుతున్నారు. మ‌రో వైపు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లపై విన‌తులు స్వీక‌రించేందుకు ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయిస్తున్నారు. చంద్ర‌బాబు రోజంతా బిజీబిజీగా ఉంటుండంతో ఆయనను క‌లిసేందుకు వ‌చ్చిన‌వారికి స‌మ‌యం కేటాయించ‌లేక పోతున్నారు.  ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ప‌లు రంగాల ప్ర‌ముఖులు ఆయ‌న్ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలోప‌ట్టే ప్ర‌య‌త్నాల్లో బాబు బిజీబిజీగా ఉండ‌టంతో అంద‌రికీ స‌మ‌యం కేటాయించ‌లేక పోతున్నారు. దీంతో ప‌లువురు బాబును క‌లిసేందుకు స‌మ‌యం కోసం వేచిచూస్తున్నారు. తాజాగా ప్రముఖ సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ చంద్ర‌బాబును క‌లిసేందుకు కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సునీతా కృష్ణన్.. అమ్మాయిల అక్రమ రవాణా మాఫియాలకు ఎదురొడ్డి పోరాడి వందల సంఖ్యలో అమ్మాయిలకు స్వేచ్ఛ ప్రసాదించారు. ప్రజ్వల ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అభాగ్యులైన మహిళలకు ఆశ్రయం, ఉపాధి కల్పిస్తున్నారు. అయితే, ఆమె చంద్ర‌బాబును క‌లిసి ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ఆయ‌న ముందు ఉంచాల‌ని భావిస్తున్నారు. కానీ, బాబు రోజువారి షెడ్యూల్ లో ఖాళీలేక‌పోవ‌టంతో  ఆమెకు అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో చంద్ర‌బాబుతో భేటీ అయ్యేందుకు ఆమె చేసిన ప్ర‌య‌త్నాలు  ఫ‌లించ‌లేదు. దీంతో ఆమె ఎక్స్ (ట్విట‌ర్) వేదిక ద్వారా సీఎం చంద్ర‌బాబును ట్యాగ్ చేస్తూ ప‌ది నిమిషాలు  అపాయింట్‌మెంట్ కావాల‌ని కోరారు.  సునీతా కృష్ణన్ తాను చేసిన ట్వీట్‌లో.. చంద్రబాబు సర్... ఇలా సంప్రదాయ విరుద్ధ మార్గంలో మీ అపాయింట్ మెంట్ కోరుతున్నాను. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు. వచ్చే వారం నాకోసం 10 నిమిషాల విలువైన సమయాన్ని కేటాయించగలరా?  రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసేందుకు గత కొన్ని రోజులుగా సాధారణ మార్గాల్లో ప్రయత్నించాను కానీ, ఆ ప్రయత్నాలు   సఫలం కాలేదు. అందుకే ఇలా సోషల్ మీడియా ద్వారా మీ అపాయింట్ మెంట్ అడుగుతున్నాను... క్షమించండి" అంటూ సునీతా కృష్ణన్ పేర్కొన్నారు. కాగా, ఆమె ట్వీట్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. "నో ప్రాబ్లమ్ సునీత గారూ... మనం మంగళవారం కలుద్దాం. ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అవుదాం. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. పాలనను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేం ఎంతో కృషి చేస్తున్నాం. అంతేకాదు, మా అపాయింట్ మెంట్ వ్యవస్థలను మెరుగుపర్చడానికి ఏం చేయగలమో కూడా ఆలోచిస్తాం" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.  చంద్ర‌బాబు స్పంద‌న‌కు సునీతా కృష్ణ‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు. సునీతా కృష్ణ‌న్ ట్వీట్ ప‌ట్ల‌   ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు స్పంద‌న‌ను చూసి నెటిజ‌న్లు, రాష్ట్ర ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.   వైసీపీ   హ‌యాంలో సీఎం హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేవ‌లం తాడేప‌ల్లి ప్యాలెస్ కే ప‌రిమితం అయ్యారు. బ‌హిరంగ స‌భ‌లు, ఏదైనా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చినా ప‌ర‌దాలు క‌ట్టుకొని వ‌చ్చేవారు. ఇక జ‌గ‌న్ ను క‌ల‌వాలంటే వైసీపీ నేత‌ల‌తో పాటు.. ప‌లు సంఘాలు, ప‌లు వ‌ర్గాల్లోని ప్ర‌ముఖుల‌కు అవ‌కాశమే ఉండేది కాదు.  కేవ‌లం ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఐదారుగురు నేత‌ల‌కు మాత్ర‌మే జ‌గ‌న్ వ‌ద్ద‌కు నేరుగా వెళ్లే అవ‌కాశం ఉండేది. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దాఖ‌లాలు లేవు. కానీ, చంద్ర‌బాబు నాయుడు అలాకాదు. ముఖ్యంగా నాల్గోసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి చంద్ర‌బాబు త‌న‌ దైన‌ శైలిలో ముందుకెళ్తున్నారు. ఒక‌ప‌క్క రాష్ట్రాన్ని అభివృద్ధిప‌థంలో ప‌రుగులు పెట్టిస్తూనే.. మ‌రోప‌క్క పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ వాటి ప‌రిష్కారానికి అధికారుల‌ను ఆదేశిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లే అయినా చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌లు  చేశారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యనే ఉండేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేసిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు మాత్రం ఏమాత్రం గ‌ర్వం లేకుండా ప్ర‌జల సీఎంగా పాల‌న సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో సామాజిక కార్య‌క‌ర్త సునీతా కృష్ణ‌న్ ట్వీట్ కు చంద్ర‌బాబు స్పందించిన తీరుప‌ట్ల నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ ఎపిసోడ్‌లో మరో భారీ ట్విస్ట్ క్రియేట్ అయింది. శ్రీనివాస్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి, కుమార్తెలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం టెక్కలి వైసీపీ నాయకురాలు, దువ్వాడ శ్రీనివాస్‌తో ‘అడల్ట్రీ’ చేస్తున్న దివ్వెల మాధురి కారు ప్రమాదంలో గాయపడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న కారును మాధురి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో తన కారుతో ఢీ కొట్టింది. దాంతో రెండు కార్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.   ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనపై ట్రోల్ చేస్తున్న వార్తలకు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. డిప్రెషన్లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకునేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు మాధురి తెలిపారు. తాను మొదట లారీని ఢీకొట్టాలని అనుకున్నానని, కానీ కారుకు ఢీకొట్టానని ఆమె చెబుతున్నారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు రాజకీయ రంగు పులమటానికి మాధురి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అలాగే మాధురి ఢీకొట్టిన కారులో వున్న వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్‌గా వున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ సినిమా ఫలితంగా ఏ పాపమూ ఎరుగని వాళ్ళు మృత్యువుతో పోరాడుతున్నారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడం, వరుసగా రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలు కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం (ఆగస్టు 10) శ్రీవారిని మొత్తం 79 వేల 313 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 65 లక్షల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం (ఆగస్టు 11) తిరుమల కోండ భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. 

ఇలా అయితే కష్టం.. జ‌గ‌న్‌కు సీనియ‌ర్లు బైబై!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వం సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అభివృద్ధిపై దృష్టి సారించింది. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టాన్ని అధిగ‌మిస్తూ త‌న అపార పాల‌నా అనుభ‌వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ప‌రుగులు పెట్టించేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. మ‌రోవైపు వైసీపీ హ‌యాంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  ఏపీలో జ‌గ‌న్ హయాంలో అరాచ‌క పాల‌న సాగింది. డ్ర‌గ్స్‌, గంజాయి విచ్చ‌ల‌విడి  ర‌వాణా జ‌రిగింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌పై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. దీంతో ఏపీలో ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు లేకుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు భ‌యాందోళ‌నలు లేకుండా స్వేచ్ఛగా లేకుండా జీవ‌నం సాగిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులోనే ఉన్నాయ‌ని ఏపీలో జనమే కాదు వైసీపీ నేత‌లు కూడా అంటున్నారు. కానీ  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్పాయంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ.. రాష్ట్రంలోకి పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ రాకుండా కుట్ర‌లు చేస్తున్నారు. తన ఐదేళ్ల పాల‌న‌లో ఏపీలో అభివృద్ధి గురించి ఇసుమంతైనా పట్టించుకోని జ‌గ‌న్‌..  చంద్ర‌బాబు అధిరాన పగ్గాలు చేపట్టీ పట్టగానే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుంటూ  చూసి ఓర్చుకోలేక పోతున్నారు. తాను  అధికారంలో ఉన్న ఐదేళ్ల  కాలంలో ఏపీలో అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత కూడా త‌న తీరు మార్చుకోవ‌టం లేదు. రాష్ట్రంలో ఎక్క‌డ ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగి ఎవ‌రు చ‌నిపోయినా.. చ‌నిపోయింది వైసీపీ కార్య‌క‌ర్త‌.. హ‌త్య చేసింది తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు అంటూ త‌న అనుకూల మీడియాతో ప్ర‌చారం చేసుకొని   ప‌రామ‌ర్శ‌కు వెళ్తున్నారు. ప‌రామ‌ర్శ‌కు వెళ్లి మృతుడి కుటుంబ‌ స‌భ్యుల‌ను ఓదార్చాల్సిన జ‌గ‌న్‌.. అమ్మ ఒడి డ‌బ్బులు వ‌చ్చాయా అంటూ వారిని ప్ర‌శ్నిస్తుండ‌టంతో వైసీపీ నేత‌లు సైతం జ‌గ‌న్ తీరును ఏవగించుకుంటున్నారు. జ‌గ‌న్ కు అస‌లు మైండ్ ప‌నిచేస్తుందా.. ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారేంటి అంటూ   వైసీపీ కార్య‌క‌ర్త‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. దీనికి తోడు కూట‌మి ప్ర‌భుత్వంపై త‌న నోటికొచ్చినట్లు మీడియా ముందు విమ‌ర్శ‌లు చేస్తున్న జ‌గ‌న్‌.. మీడియా ప్ర‌తినిధులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు  మాత్రం స‌మాధానం ఇవ్వ‌కుండా వెళ్లిపోతుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ చేసే ఆరోప‌ణ‌లు నిజం కాద‌ని ప్ర‌జ‌లు  నిర్దార‌ణ‌కు వ‌స్తున్నారు. విప‌క్ష నేత‌గా హూందాగా న‌డుచుకోవాల్సిన జ‌గ‌న్‌.. తన తీరుతో  సొంత పార్టీ నేత‌లు సైతం త‌లెత్తుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ మాట వైసీపీలోని సీనియ‌ర్ నేత‌లే అంటున్నారు. జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.  జ‌గ‌న్ త‌ర‌హా రాజ‌కీయాల‌తో మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నే భావ‌న‌కు వ‌చ్చి పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఇప్ప‌టికే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు జ‌గ‌న్‌కు రాజీనామా లేఖ‌ను పంపించారు. మ‌రో వైపు మ‌రికొంద‌రు మాజీ మంత్రులు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మ‌రుక్ష‌ణ‌మే వారు వైసీపీకి బైబై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు‌. వీరిలో ముందు వ‌రుస‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేతిరెడ్డి ఓడిపోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం రాష్ట్రంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌తేన‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విష‌యాన్ని కేతిరెడ్డి సైతం ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నెల‌ రోజుల నుంచే జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని కేతిరెడ్డి తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వానికి క‌నీసం ఆరు నెలలైనా స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేతిరెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న తెలుగుదేశం గూటికి వెళ్ల‌బోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతోంది. కేతిరెడ్డితో పాటు మ‌రికొంద‌రు వైసీపీ కీల‌క నేత‌లు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.    మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇలా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేతల జాబితా చాలా పెద్దగానే ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే తెలుగుదేశంతో టచ్ లోకి వచ్చారని అంటున్నారు.   వీరంతా వైసీపీని వీడేందుకు సిద్ధమవ్వడానికి ప్ర‌ధాన కార‌ణం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలి. జ‌గ‌న్ కావాల‌నే అధికార పార్టీ నేత‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌శాంత  వాతావ‌ర‌ణం లేకుండా అల్ల‌ర్లు సృష్టించాల‌ని, కులాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు  త‌లెత్తేలా చేయాలని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జ‌గ‌న్ తీరు ఇలానే ఉంటే రాబోయే కాలంలో ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను రోడ్ల‌పైకికూడా రానివ్వ‌ర‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు. దీంతో వైసీపీలో ఉండ‌టం కంటే రాజీనామా చేసి పార్టీకి దూరం కావడమే మేలని వారు భావిస్తున్నారు.  జ‌గ‌న్ తీరు ఇలానే ఉంటే రాబోయేకాలంలో వైసీపీ నేత‌లంతా కూట‌మి పార్టీల్లోకి క్యూ క‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

అదానీ మీద హిండెన్‌బర్గ్ భారీ బాంబు!

అదానీ సంస్థ మీద, సెబీ (SEBI) ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్ మీద అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ కృత్రిమంగా పెరగడానికి వినియోగించిన మారిషస్ పండ్లలో మాధబి బచ్, ఆమె భర్తకు వాటాలు ఇచ్చారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అదానికి చెందిన మారిషస్, ఆఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఎంతమాత్రం ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. 'నియంత్రణ సంస్థల కంట్రోల్ లేకుండా అదానీ కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ ఛైర్ పర్సన్ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను గమనించడం ద్వారా దీని వెనుక వున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవచ్చు. కీలక పత్రాల ప్రకారం.. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నాయి. ఇందులో మాధబి బచ్, ఆమె భర్త ధావల్ బచ్‌కి వాటాలు ఉన్నాయి' అని హిండెన్‌బర్గ్ తన తాజా నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్ల (83 కోట్ల రూపాయలు) వరకు ఉండొచ్చని తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచడానికి అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక బయటపెట్టింది, దాంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. ఆ తర్వాత ఒక ‘పెద్దమనిషి’ అండతో మళ్లీ కోలుకుంది.

మంగళగిరిలో వైసీపీ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్!?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ కు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రత్యర్థులనే వారే లేకుండా పోయారా? మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలి సారి 2019 ఎన్నికలలో పరాజయం పాలైన నాటి నుంచి అక్కడ విజయమే లక్ష్యంగా అడుగులు కదిపిన లోకేష్ అదే నియోజకవర్గం నుంచి 2024లో అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికలలో ఆయనకు ప్రత్యర్థిగా చేనేత వర్గానికి చెందిన లావణ్య పోటీ చేసి పరాజయం పాలయ్యారు. లావణ్యది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. లావణ్య మావగారు హనుమంతరావు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. అలాగే లావణ్య తల్లి కాండ్రు కమలకుమారి కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. అటువంటి కుటుంబం ఇప్పుడు నారా లోకేష్ పని తీరును మెచ్చుకుంటున్నారు.  మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావణ్య మావయ్య మరుగుడు హనుమంతరావు.. లోకేష్ పని తీరును ప్రశంసిస్తున్నారు. త్వరలో ఆయన సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరుతారని వైసీపీ వర్గీయులే అంటున్నారు. నియోజకవర్గంలో బలమైన చేనేత సామాజిక వర్గానికి చెందిన మరుగుడు హనుమంతరావు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరితో మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలి ఎన్నికలలో మరుగుడు హనుమంతరావు వైసీపీ అభ్యర్థి లావణ్యకు మద్దతుగా చురుకుగా పని చేశారు. అయితే ఎన్నికల తరువాత నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో లోకేష్ చూపుతున్న చొరవకు తాను ఆకర్షితుడనయ్యానకి ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారు. అంతే కాకుండా పార్టీలో, ప్రభుత్వంలో కూడా లోకేష్ క్రియాశీలంగా వ్యవహరించడమే కాకుండా, ప్రజాదర్భార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.   తొలిసారి  ఎమ్మెల్యే అయినా ఎంతో అనుభవం ఉన్న నేతగా ప్రజలలో మమేకం అవుతూ వారి ఆదరణ చూరగొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో లోకేష్ చూపుతున్న శ్రద్ధ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆయనను ఆత్మీయుడిగా మార్చేసింది. ఈ నేపథ్యంలోనే మురుగుడు హనుమంతరావు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించు కున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో లోకేష్ సమక్షంలో ఆయన తెలుగుదేశం కండువా కప్పుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  సిద్ధమయ్యారన్న అంశం వైసిపి వర్గాల్లో చర్చకు దారితీసింది. త్వరలోనే నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరేందుకు హనుమంతరావు.రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇక మంగళగిరిలో వైసీపీ దుకాణ్ బందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బుక్ చేసిన 24 గంటల్లో  ఆర్టీసు బస్సుల్లో రాఖీలు  డెలివరీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఆఫర్ ఇచ్చింది. తాజాగా మహిళలను  మరో మారు ఆకట్టుకుంది.   ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు టీజీఎస్ఆర్‌టీసీ తీపి క‌బురు అందించింది. దూర ప్రాంతాల్లో ఉన్న‌ త‌మ సోద‌రుల‌కు సోద‌రీమ‌ణులు రాఖీలు పంపేందుకు వీలుగా పండుగ‌కు నాలుగైదు రోజుల ముందుగానే కార్గో కేంద్రాల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్లు తెర‌వాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం అన్ని బ‌స్టాండ్ల‌లోని కార్గో సెంట‌ర్ల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.  రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు కూడా పంపే అవ‌కాశం క‌ల్పించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవ‌చ్చ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు. కార్గో సెంట‌ర్ల‌లో బుక్ చేసిన 24 గంట‌ల్లోనే రాఖీల‌ను డెలివ‌రీ చేసే విధంగా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. అయితే, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాలేదు. ధ‌ర‌ల‌ విష‌యంలో సోమ‌వారం స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి? కిషన్ రెడ్డికి ఉద్వాసన ఎప్పుడు?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? కిషన్ రెడ్డి స్థానంలో మరో వ్యక్తి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రానున్నారని గత కొంత కాలంగా ఆ పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పార్టీ అధిష్ఠానం రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించే ఉద్దేశంలో ఉందని చెప్పకనే చెప్పారు. కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి ముందు వరకూ ఆ పదవిలో బండి సంజయ్ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ హైకమాండ్ బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్రపగ్గాలు అప్పగించడంపై అప్పట్లోనే పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్షణం నుంచే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు కిషన్ రెడ్డి చేజారడం ఖయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.  తెలంగాణలో బీజేపీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించిన బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీలో అందరినీ కలుపుకుని పోయే వ్యక్తికే పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలన్న భావనతో ఉంది. సాధారణంగా బీజేపీలో గ్రూపు తగాదాలు ఉండవు అని అంటుంటారు. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవలన్న లక్ష్యంతో బీజేపీ గత నాలుగైదేళ్లుగా పార్టీ గేట్లు బార్లా తెరిచేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. గతంలోలా పార్టీ సిద్ధాంతాలు, నిబద్ధత, విలువలు వంటి అంశాల కంటే నాలుగు ఓట్లు, రెండు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని భావిస్తే చాలు ఎవరికైనా బీజీపీ తీర్థం ఇచ్చేసి పార్టీ కండువా కప్సేయడానికి బీజేపీ హైకమాండ్ వెనుకాడలేదు. అందుకే వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్  వంటి వారిని పార్టీలో చేర్చుకుని కీలక పదవులు ఇచ్చింది. ఈటలకు చేరికల  కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టి పార్టీలోకి చేరికలను ప్రోత్సహించేందుకు కూడా వెనుకాడ లేదు. అయితే కమలనాథుల పాచికలు, వ్యూహాలు ఈ విషయంలో పెద్దగా ఫలించలేదు. రాష్ట్ర బీజేపీలో కొత్తగా వచ్చిన వారి పట్ల తొలి నుంచీ పార్టీలో ఉన్న వారిలో తీవ్ర అంసతృప్తి మొదలైంది. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా పార్టీ హైకమాండ్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే  ఈసారైనా అందరినీ కలుపుకుని పోయి, పార్టీలో గ్రూపు తగాదాలను రూపుమాపి పార్టీని ఏకతాటిపైనడిపించే వ్యక్తి కోసం బీజేపీ హైకమాండ్ గాలిస్తోంది.  ఎందుకంటే.. బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర పగ్టాలు చేపట్టిన సందర్భంగా అప్పట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు బాహాటంగా కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడాన్ని నిరసించారు. దాంతో అప్పట్లో కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన సభ బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది.  ఆ సభలో మాట్లాడిన పలువురు బీజేపీ నేతలు బండి సంజయ్ ను పొగడ్తలలో ముంచేశారు. ప్రశసంల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు.  బండి సంజయ్ స్థానంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే  కిషన్ రెడ్డికి పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. ఆ సెగ కారణంగానే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ డబుల్ డిజిట్ కు చేరుకోవడంలో విఫలమైందని పార్టీ వర్గాల్లో అప్పట్లోనే గట్టిగా వినిపించింది. ఆ తరువాత లోక్ సభ ఎన్నికలలో బీజేపీ మెరుగ్గానే పెర్ఫార్మ్ చేసినా ఆ క్రెడిట్ కిషన్ రెడ్డి ఖాతాలో పడలేదు. లోక్ సభ ఎన్నికలలో ఈటల రాజేందర్ మల్లాజ్ గిరి స్ధానం నుంచి భారీ మెజారిటీతో గెలవడంతో ఒక దశలో ఆయనకే పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందన్నభావన బీజేపీ శ్రేణులలోనే వ్యక్తమైంది. రాష్ట్ర పార్టీలో విభేదాలను రూపు మాపి.. పాత, కొత్త నేతలందరినీ ఏకతాటిపై నడిపించగలిగిన నాయకుడి కోసం బీజేపీ  అధిష్ఠానం గాలిస్తోంది.  అయితే ఆ ఎంపిక కసరత్తు మాత్రం దీర్ఘ కాలంగా సాగుతోంది. తాజాగా బండి సంజయ్, కిషన్ రెడ్డిల మాటలతో త్వరలోనే కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఖాయమని తేలిపోయింది. దీంతో బీజేపీ అధిష్ఠానం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేదెవరిన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈటల రజేందర్, డీకే అరుణ రేసులో ముందున్నారని అంటున్నారు.  

కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే.. చచ్చారే!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం... ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఏకంగా రూ.25 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు. రెడ్ లైట్ ఉల్లంఘన -  మునుపటి జరిమానా: రూ.100, - ప్రస్తుత జరిమానా: రూ.500 . అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం-  మునుపటి జరిమానా: రూ.500, - ప్రస్తుత జరిమానా: రూ.2,000 లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ -  మునుపటి జరిమానా: రూ.500, - ప్రస్తుత జరిమానా: రూ.5,000 అతివేగం-  మునుపటి జరిమానా: రూ.400, - ప్రస్తుత జరిమానా: రూ.1000 ప్రమాదకరమైన డ్రైవింగ్ - మునుపటి జరిమానా: రూ.1000, - ప్రస్తుత జరిమానా: రూ.5,000 డ్రంక్ అండ్ డ్రైవ్..- మునుపటి జరిమానా: రూ.2000, - ప్రస్తుత జరిమానా: రూ.10,000 రేసింగ్, స్పీడింగ్- మునుపటి జరిమానా: రూ.500, - ప్రస్తుత జరిమానా: రూ.5,000 హెల్మెట్ ధరించకపోవడం - మునుపటి జరిమానా: రూ.100 , - ప్రస్తుత జరిమానా: రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు సీట్‌బెల్ట్ ధరించకపోవడం -  మునుపటి జరిమానా: రూ.100, - ప్రస్తుత జరిమానా: రూ.1000 అత్యవసర వాహనాలను అడ్డుకుంటే-  మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు, - ప్రస్తుత జరిమానా: రూ.10,000 బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ -  ప్రస్తుత జరిమానా: రూ.1,200 ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్- మునుపటి జరిమానా: రూ.100, - ప్రస్తుత జరిమానా: రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్-  మునుపటి జరిమానా: రూ.1,000, - ప్రస్తుత జరిమానా: రూ.2,000