TS Government to extend school holidays

ఆర్టీసీ సమ్మెతో స్కూల్‌లకు మరో 2 రోజులు సెలవులను పొడిగించే ప్రయత్నంలో ఉన్న టీఎస్ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్తృతం చేస్తోంది. పండగలకు ఊరు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది టీఎస్ ప్రభుత్వం. అవసరమైతే విద్యాసంస్థల బస్సులను ప్రైవేట్ వాహనాలుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అవసరమైతే దసరా సెలవులను రెండ్రోజులు పొడగించాలని కూడా యోచిస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో కోటిన్నర మంది ప్రయాణించే అవకాశముంది కావున తాము ప్రయాణికులు కొరకు  ప్రత్యామ్నాయ  మార్గాలకు నాంది పలుకుతున్నట్లు తెలియజేస్తున్నారు టీఎస్ అధికారులు.  మరోపక్క సమ్మెపై వెనక్కి తగ్గబోమని జేఏసీ తాజా పరిణామాలపై చర్చించేందుకు సోమాజిగుడా ప్రెస్ క్లబ్ లో సమావేశమైంది. రాజకీయ పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు దీనికి హాజరయ్యారు.ఆర్టీసీ సమ్మె కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలిపిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. దసరా సెలవు లను మరో రెండు రోజుల పాటు పొడిగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పండగ అయిపోవడంతో చాలా మంది ప్రయాణికులు తిరిగి సొంతూళ్ల కు పయనమవుతారు. ఈ నేపధ్యంలో బస్సుల కొరత ఉన్నందువలన  అవసరమైతే విద్యా సంస్థ లకు చెందిన బస్సులు ను వినియోగించుకునేందుకు వీలుగా రెండ్రోజుల పాటు సెలవుల్లో పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దాదాపు  ఎన్ని బస్సులను సిద్ధం చేయబోతున్నారు మరియు రెండ్రోజుల సెలవలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపధ్యంలో ఇటు ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సుల వాడకం వల్ల ప్రయాణీకుల కష్టాల్లో కొంత మెరకు ఊరట కనిపిస్తుందా అనే అంశం పై పలు అనమానాలు వెల్లడవుతున్నాయి. ప్రభుత్వం ఈ సమ్మే పై చాలా కోపంగా ఉన్నట్లు తెలియజేస్తోంది.ఎట్టి పరిస్థితిలో తాము తమ నిర్ణయాన్ని వెనక్కు తగ్గేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం పై ప్రభుత్వం ఎన్ని  ప్రత్యామ్నాయ మార్గాలని అయిన ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి  సిద్ధంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ సమ్మే పోరులో ఎవరు విజయం చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది.

Cabinet approves Rs 5 lakh package for PoK families who settled outside kashmir

కేంద్రం మరో సంచలన నిర్ణయం!!

  1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పరిహారాన్ని ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద అందజేయనున్నారు. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పీవోకే నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన  5,300 కుటుంబాలకు రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నిరాశ్రయులైన కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

Justice Chandrakumar Sensational Comments On CM KCR

కేసీఆర్ ది నోరా? మోరీనా?.. అప్పుడు చెప్పింది గుర్తులేదా!!

  ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ.. భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నాడు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని చంద్రకుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని కేసీఆర్ ది నోరా? మోరీనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవ్లరకు నెలకు 50 వేల రూపాయల జీతం ఇస్తున్నామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఏ డ్రైవర్ కు, కండక్టర్ కు అంత మొత్తం ఇస్తున్నారో చూపించాలని చంద్రకుమార్ డిమాండ్ చేశారు. టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది కనుక ప్రైవేట్ పరం చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా అని చంద్రకుమార్ ప్రశ్నించారు. యూనియన్లు అవసరం లేదనడం చాలా దుర్మార్గం అని మండిపడ్డారు. ఎన్నికలు, సకలజనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో ఓసారి గుర్తుకుతెచ్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని, వారి జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సమానం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆరోజున మాట్లాడిన మాటేంటి? ఈరోజున మాట్లాడుతున్న మాటేంటి? అని చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

passengers facing problems with tsrtc strike

నిర్లక్షపు దోరణిలో ఉన్న తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ కు బుద్ధి చెప్పిన ప్రభుత్వం...

  తెలంగాణ రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఆర్టీసీ సమ్మె పైన తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం తాత్కాలిక ఉద్యోగుల నియమించింది. అయితే ప్రభుత్వం నియమించిన అవకాశాన్ని కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించాల్సి వస్తోంది. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సును నడుపుతున్నాడు. ప్రయాణికులు వారించినా తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో వారు ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించిన డ్రైవర్ ను తొలగించి వేరే డ్రైవర్ తో బస్సు ను పంపించడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు. లక్సెటిపేట్ నుంచి బస్సు మంచిర్యాల వెళుతుండగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. గతంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణం గా ఎంతో మంది ప్రాణా లు గాలిలో కలిసిపోయినా సంఘటనలు మనం చూశాం.ఇక పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న రైల్వే స్టేషన్ ల నుంచి ఇళ్లకు చేరలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా బస్సు లను ఏర్పాటు చేసినా అవి మెయిన్ రోడ్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి సిటీలో బస్సుల తక్కువ గా ఉండటం అవి వస్తాయో రావో అన్నది తెలియక పోవడం తో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు. ప్రభుత్వం ఇంకా ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న వెనక్కు తగ్గబోమని చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో బస్సులు దాదాపు డిపోల్ లోనే కనిపిస్తున్నాయి.ఇక ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

YS Jagan Serious On YCP Leaders Kottamreddy And Kakani

బావ, బావమరిది మధ్య ఆధిపత్య పోరు.. జగన్ కు తలనొప్పిగా మారనుందా?

  శ్రీధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ వరుసకు బావ బావమరుదులు. వీళ్లిద్దరి మధ్య విభేదాలున్నాయి ముఖ్యం గా ఒకరి పై ఒకరు ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు పార్టీ లో హాట్ టాపిక్ గా మారాయి.నెల్లూరు జిల్లా వైసీపీ లో ఆధిపత్య పోరు నడుస్తోంది ఇంత కాలం సైలెంట్ గా సాగిపోతున్న ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ముఖ్యంగా ఎంపీడీవో సరళ ఇంటి పై దాడి వివాదం లో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్ర చేశారంటూ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ప్రత్యక్ష ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజల్ లోకి తప్పుడు సంకేతా లు వెళ్లేలా ఉన్నాయనే భావనలో ఉన్న జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ లో నెల్లూరు జిల్లా నాయకు ల అంశంపై చర్చించనున్నారు.కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి వ్యవహారం పార్టీ పరువు తీసేలా ఉండటం తో వాటిని సర్దుబాటు చేసేందు కు రంగం లోకి దిగారు. ముఖ్యం గా కీలక నిర్ణయా లు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కోటంరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వివాదం పై ఇద్దరు నేత లతో చర్చించనున్నారు.వారిద్దరి మధ్య ఉన్న విభేదా లు పార్టీ కి జరుగుతున్న నష్టం పై వివరించనున్నారు.  సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే కోటం రెడ్డి విమర్శలు గుప్పించడం వెనుక అసలు కారణాలేంటి. అసలు కాకాణి కోటంరెడ్డి కి మధ్య ఎక్కడ చెడింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.నిజానికి వైసీపీ ఆరంభ సమయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. అయితే మేకపాటి కుటుంబం ఇతర పార్టీ నేతలు కాకాణిని ఒప్పించి ఆ పదవి అప్పగించారు అప్పట్లో ఇద్దరి మధ్య భగ్గుమనేలా తయారైంది పరిస్థితి.ఇటీవల నెల్లూరు రూరల్ పరిధి లో కాకాణి స్నేహితుడొకరు హోటల్ ఏర్పాటు చేశారు. కాకాణి దానిని ప్రారంభించారు శ్రీధర్ రెడ్డి ఆ హోటల్ మూత వేయించేవరకూ నిద్రపో లేదన్న వార్తలు వినిపించాయి. దీంతో అప్పటి నుంచి కోటంరెడ్డిపై కాకాణి గుర్రు గా ఉన్నట్టు చెబుతారు పార్టీ లో అంతర్గత విబేధాలు బయటికొచ్చినప్పటికీ పెద్దలకు చెప్పుకొని సరిపెట్టారు.మొన్న శ్రీధర్ రెడ్డి స్నేహితుడు కాకాణి ప్రాతి నిధ్యం వహించే సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడి లో ఓ భారీ వెంచర్ వేశారు. ఆ వెంచర్ కి నీటి సదుపాయం  ఇవ్వాలనీ ఎంపీడీవో సరళిని కోరారు. ఆమె ఎమ్మెల్యే కాకాణి సంప్రదించమని చెప్పగా దానికి ఆయన వీలుకాదన్నారు.నిజానికి ఈ వెంచర్ పక్కనే గిరిజన కాలనీ ఉంది. అక్కడి వారంతా వైసీపీ వర్గీయులే ప్రస్తుతం ఆ కాలనీకే వాటర్ ఇవ్వడం కష్టం గా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారు. అయితే తమ వెంచర్ కు వెంటనే నీటి సరఫరా ఇవ్వాలని ఎంపీడీవో మీద ఒత్తిడి తీసుకువచ్చినట్టు చెబుతున్నారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగానే తనపైన తన స్నేహితుడు పైన అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులైతే కాకాని డబ్బు లు డిమాండ్ చేశారంటూ బహిరంగంగా వ్యాఖ్య లు చేస్తున్నారు. ఇంటి పై దాడి జరిగిన తరువాత ఎంపీడీవో సరళ నేరుగా పోలీస్ స్టేషన్ కి కాకుండా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికెళ్లారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. కాకాణిపై పరోక్షంగా కోటం రెడ్డి తీవ్ర విమర్శ లు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతల్లో తాను చంద్రబాబు కాళ్లు పట్టుకోలేదు అన్నారు. తనకు చాలా అనుమానా లున్నాయని కోటం రెడ్డి తీవ్ర వ్యాఖ్య లు చేశారు.  అంతేకాదు జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతి నిధులు నేతలు ఎవరి దారి వారిది అన్నట్టు ఉంటున్నారు.ఎవరు ఏ వర్గం అనే లెక్కల్లోనే ఉండిపోయారు అధికారం లోకి వచ్చాక కింగ్స్ కోట్ లోని పార్టీ జిల్లా కార్యాలయానికి రావడం మానేశారు. ఎవరి కార్యాలయాల్లో వారి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. కాకాణి తన ఇంటి దగ్గరే రాజకీయాల నెరుపుతుంటే కోటం రెడ్డి తన సొంత కార్యాలయంలో రాజకీయాలు చేస్తున్నారు.ఎంపీడీవో సరళ ఇంటి పై దాడి కేసులో తన తప్పు ఉందని తెలిస్తే శాశ్వతంగా బహిష్కరించండి అంటూ జగన్ కు విజ్ఞప్తి చేశారు కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి. తాను ఇంటి పై దాడి చేసినట్టు రుజువు చేస్తే ఎంపీడీవో సరళకు క్షమాపణ చెప్తా నని కూడా కోటం రెడ్డి చెప్పారు. తనను ఇరికించేందుకు కుట్ర పన్నారు అంటూ మండిపడ్డారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ చెప్తూనే తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. మొత్తానికే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ఎక్కువ మంది ముఖ్య నేతలు అసహనంగా ఉన్నారు. వరుస సంఘటనల నేపథ్యంలో పార్టీకి తీరని నష్టం కలుగుతుంద ని బహిరంగం గానే వ్యాఖ్య లు చేస్తున్నారు పార్టీ పెద్దలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. ఈ విషయాల పై పార్టీ పెద్ద లు దృష్టి సారించారు. వర్గపోరుకు మూలాల ను వెతికి అరికట్టే పనిలో పడ్డారు ఈ నేపథ్యం లో ఇవాళ సాయంత్రం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

tsrtc employees strike continues on fifth day

హోరా హోరీగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె...

చరిత్రాత్మకమైన సమ్మె ఐదో తేదీన ప్రారంభమైంది.ఎటు చూసినా ఈ సమ్మే పైనే చర్చలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కారు సీరియస్ గానే ఉంది. మరో మాటలో చెప్పాలంటే ఉక్కుపాదం మోపుతోంది. సమ్మె మొదలుపెట్టినరోజే సాయంత్రం ఆరు గంటల వరకు డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం ఆ తర్వాత పన్నెండు వందల మంది కార్మికు లు మిగిలారు అని తేల్చింది. తాజా గా సమ్మె చేస్తున్నా ఉద్యోగు లకు వర్తిం చే ఈఎస్ ఐ సౌకర్యాన్ని కూడా రద్దు చేసింది సర్కార్. సికింద్రాబాద్ లోని తార్నాక లో ఆర్టీసీ సిబ్బంది వైద్య ఆరోగ్య పరీక్షకు ఈఎస్ఐ సేవలందించే కార్యాలయం ఉంది. సమ్మె చేస్తున్న సిబ్బందికే సౌకర్యాలూ ఇవ్వవలసిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు రావడంతో  నిరాకరణ చెబుతున్నారు ఈఎస్ఐ సిబ్బంది.సమ్మెను ఉధృతం చేస్తోంది ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే రాజకీయ పక్షాల మద్దతు తీసుకున్న నాయకులు ఇక ప్రజల్లోకి వెళతామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేదని అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లోని కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఎంత మొండి గా ముందు కు వెళితే తాము అంతే మొండి గా ముందు కు వెళతామని చెబుతున్నారు. దీంతో సమ్మె ఇటు వైపు వెళుతుందో అని టెన్షన్ నెలకొంది. ఇటు ప్రభుత్వం మాత్రం మొన్నటి నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల కార్యాచరణ ఏంటి సర్కారు తరవాతే నిర్ణయం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అన్ని సంఘాల మద్దతును కూడగట్టిన కార్మిక సంఘాలు. ఇటు అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడా కోరాయి. ఈ నేపధ్యం లో ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విపక్షాల తో భేటీని కూడా ఏర్పాటు చేశారు.ఈ భేటీకి హాజరైన పక్షాలన్నీ ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతును ప్రకటించాయి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లు న్యాయబద్ధమైనవని చెబుతున్నారు. విపక్షాల నేతలు సిపిఐ సిపిఎంతో పాటు బీజేపీ, టిడిపి కూడా ఆర్టీసీకి మద్దతును ప్రకటించాయి.ఈ సమ్మె గతంలో బహుశా  గుర్తున్నంత వరకూ ఇంత జయప్రదంగా నూటికి నూరు శాతం కార్మికు లు కూడా సమ్మె లో పాల్గొన్నటువంటి మొదటి సందర్భం చెప్పి తెలియజేశారు.అశ్వత్థామ గారు ఒకసారి పత్రికల్లో సవాల్ చేసినట్టు గా హాజరయ్యారు హాజరయ్యారు అంటున్నారు హాజరైన వాళ్ల పేరు ఒక్క పేరు బయట పడింది ఇలా జయప్రదం గా సాగుతున్నట్టు వంటి ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సమ్మే తెలంగాణ కమిటీ సంపూర్ణంగా సమర్పిస్తున్నందు మీరు చివరంటా పోరాడి విజయం సాధిం చేదాకా మీకు తోడుందామని భుజం భుజం కలిపి మీ కార్యాచరణ లో పాల్గొంటామని తెలిజేస్తున్నారు.మొత్తానికి ఈ సమ్మే ప్రభావం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

crime against women decreased in hyderabad

నిజంగానే ఆడవారికి మంచి రోజులు రాబోతున్నాయా?

  హైదరాబాద్ కు ఐటీ కంపెనీల అభివృద్ధి వేగవంతమవుతోంది. పరుషులకు ధీటుగా మహిళలు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల అంటేనే ఇరవై నాలుగు గంటల డ్యూటీ. మహిళలకూ మినహాయింపు ఉండదు. దీంతో నైట్ షిప్టు డ్యూటీ లు చేసే మహిళల సంఖ్య పెరిగింది. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు అయింది. దీంతో పరిస్థితు లు పూర్తి గా మారిపోయాయి. సైబరాబాద్ పోలీసులు చేపట్టిన భద్రత చర్యల తో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఎప్పుడైనా ఉద్యోగాని కి వెళ్లి రాగలుగుతున్నారు మహిళా ఉద్యోగులు. సైబరాబాద్ తొలినాళ్ల లో మహిళల భద్రతకు సవాల్ గా ఉండేది. ఐటీ కారిడార్ లో వందల సంఖ్య లో ఐటీ కంపెనీలు రావడం లక్షలాది మంది మహిళలు ఉద్యోగాల్లో చేరడం అందుకు కారణం.రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న దాడులు లైంగిక వేధింపులతో పోలీసు లు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈవ్ టీజింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు భరోసా కేంద్రాల షీటీమ్స్ బృందాలను రంగంలోకి దింపారు.ఫలితంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ లో క్రమం గా మహిళల కు భద్రత పెరిగింది. షీటీమ్స్ బృందాలు క్షేత్ర స్థాయిలో నిరంతరం పనిచేయటంతో పాటు వాట్సప్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపడుతున్నారు. ఐటీ కారిడార్ లో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భరోసా సెంటర్ లను ఏర్పాటు చేశారు. మహిళలకు భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు డాక్యుమెంట్ లతో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగినీలు ప్రయాణించి ఆటో క్యాబ్ లకు సంబంధించి పూర్తి స్థాయి నిఘా ఉండేలా క్యూ ఆర్ కోడ్ ను రూపొందించారు.సైబరాబాద్ పోలీసులు చేపట్టిన చర్యల తో మహిళలపై నమోదయ్యే కేసు లు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయని సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు.  మహిళలకు సంబంధించిన నష్టాలు ఏమున్నాయి వాళ్ల కి సపోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయి ఎన్జీవోస్ ఎవరున్నారు మరియు ఎవరైనా మహిళ  బాధతో వస్తే ఆమెకు ఏ రకంగా చేయూత నివ్వాలి ఏ రకంగా సానుభూతి చూపించాలి అన్న అంశాల మీద కూడా వాళ్లక ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లు అక్కడ ఐటి ఇండస్ట్రీలో ఎవరైనా మహిళ ఏదైనా బాధతో వాళ్ల దగ్గర వస్తే వాళ్లకు ఎటువంటి సహాయం ఇవ్వాలి షీటీమ్స్ కావాలంటే షీటీమ్స్ నంబర్స్ అట్లాగే భరోసా సెంటర్ నంబర్స్ ఇచ్చి ఎన్ని రకాలు గా ఆమెకే సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి అన్నదాని మీద వాళ్ల ని ట్రెయిన్ చేసి వాళ్లకే చేయూత కోసం వాళ్ళకు భరోసాను ఇవ్వడంను ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనసూయ తెలియజేశారు.అసలు మహిళలను తప్పుడు ఆలోచనతో చూడాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తున్నారని మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించడంపై సైబరాబాద్ పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీ కారిడార్ లో ఉచితంగా షీ షటిల్స్ మినీ బస్సులను మహిళల కోసం ఏర్పాటు చేశారు. యువతులపై జరుగుతున్న సంఘటనల నేపథ్యం లో వారికి మెరుగైన భద్రత సౌలభ్యమైన ప్రయాణం అందించాలని సైబరాబాద్ పోలీసు లు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు తమ తమ మహిళా ఉద్యోగు లకు రవాణా సౌకర్యా లు కల్పించాలని జీవో నెంబర్ యాభై ఒకటి ను తీసుకొచ్చారు. దీంతో సైబరాబాద్ పరిధి లోని అన్ని కంపెనీలూ మాల్స్, మల్టీప్లెక్స్ లు, మహిళా ఉద్యోగు లకు వారి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ట్రాన్స్ పోర్టేషన్ ఫెసిలిటీస్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి షీ షటిల్ బస్ సర్వీస్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు నాలుగు బస్సు లు ఐటి కారిడార్ ఏరియా లో తిరుగుతున్నాయి అందులో ఏ మహిళా ఉద్యోగి అయినాగానీ ఐటీఐ కాకపోవచ్చు అక్కడ ఇతర రంగాల్లో పని చేస్తున్న మహిళలు ఎవరైనా గాని ఏ మహిళైనా గానే హాప్ ఆన్ హాప్ ఆఫ్ అన్నమాట ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు ఆ రకంగా షీ షటిల్ బస్ నడుస్తున్నాయి. ఒక ఐటీ కారిడార్ లోని కాదు సైబరాబాద్ పరిధిలోనూ పోకిరీలు, ఆకతాయిల ఆట కట్టించడంతో పాటు మోసగాళ్లు భార్యలను వేధిస్తున్న ప్రబుద్ధుల నయవంచన కు గురి చేస్తున్న కేటుగాళ్ల ను హెచ్చరిస్తూ బాధిత మహిళల కు రక్షణ కల్పిస్తున్నామని ప్రత్యేక భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మహిళల ను వేధిస్తున్న వారి ఆట కట్టించడం తో పాటు బాధిత మహిళల కు లైంగిక దాడుల కు గురైన చిన్నారులకు కుటుంబ సభ్యుల వేధింపులకు గురైన బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహించి మానసిక దృఢత్వాన్ని కల్పించి సమస్య లను ఎదుర్కొనే ధైర్యాన్ని అందించే విధంగా భరోసా కేంద్రాన్ని తీర్చిదిద్దామని అంటున్నారు. మహిళల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసు లు తీసుకుంటున్న భద్రతా చర్యల తో నేరాల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని పదేపదే నేరాలు చేసే వారి డేటాను తీసుకొని వారి పై నిరంతరం నిఘా పెడుతున్నారు అధికారులు.నిజంగానే ఈ చర్యలన్ని సక్రమంగా జరుగుతుంటే ఆడవాళ్ళ విషయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండగలగటమే కాగా  నేరాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించడంలో ఎటువంటి సందేహంలేదు.

banjara hills police to record statement of sivaram on kodela death

కోడెల శివరాం స్టేట్మెంట్ కోసం గుంటూరుకి బంజారాహిల్స్ పోలీస్ బృందం!!

  గత కొన్ని రోజుల కిత్రం టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు పై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.ఆయన కుమారుడే కోడెలను హత్య చేశాడు అని వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. ఇలాంటి ఆరోపణలు కూడా ఎదురైయ్యాయి. దీని విచారణనిమిత్తం బంజారా హిల్స్ పోలీసులు వారి కుటుంబ సభ్యులను కూడా విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ మిస్సింగ్ పట్ల కూడా చాలా అనుమానాలు వెలిగులోకి వచ్చాయి. కోడేలను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది ఆ ఫర్నీచర్ కేసు.ఇందులో తన కొడుకు,కూతురకు కూడా భాగం ఉందని కేసులు ఆరోపించారు.ఇందు భాగంగా ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్ మిస్సింగ్ కేసులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ కృష్ణ మంగళగిరి కోర్టు కు హాజరయ్యారు. అయితే ఇదే సమయంలో కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు లు విచారించారు. ఈ విచారణ కు కుమారుడు శివరామ్ హాజరుకాలేకపోయారు. మంగళగిరి కోర్టు కు హాజరు కావాల్సి ఉండడం తో ఆయన తన తండ్రి ఆత్మహత్య కేసు విచారణ కు రాలేకపోయారు. ఇపుడు ఆయన స్టేట్ మెంట్ రికార్డు చెయ్యటానికి బంజారాహిల్స్ పోలీసులు గుంటూరు వెళ్లడానికి సిద్ధమయ్యారు.ఒక పక్క మంగళ గిరి కోర్ట్ కేసులో హాజరు అయ్యి బెయిల్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మరో పక్క తండ్రి ఆత్మహత్య కేసు లో విచారణకు హాజరు కావడం వీలు కాకపోవడంతో ఆఖరికి పోలీసులే తనున్న గ్రామానికి వెళ్లాలని నిర్ణయించారు. దీని బట్టి బంజారహిల్స్ పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా ముగిస్తారని అంతేకాక ఈ కోడెల కేసు పై వారు చాలా నిఖచ్చిగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది.ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి.

rtc bus accident in nagarkurnool district

తృటిలో తప్పిన పెను ప్రమాదం...

  అటు రాష్ట్రమంటా ఆర్టీసీ సమ్మే హడావడి జోరుగా సాగుతున్న నేపధ్యంలో ఏమి జరుతుందా అని అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రమంతటా జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు,వాగులు ఉధృక్తంగా పొంగి పొర్లుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా లో కూడా ఒక పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. ప్రయాణికులు అంతా సురక్షితంగానే ఉన్నరు. నాగర్ కర్నూల్ జిల్లా లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కల్వకుర్తి తెలకపల్లి మార్గం లో బస్సు వాగులో కి దూసుకెళ్లింది. వర్షాల దాటికి జిల్లా లో దుందుబీ వాగు ఉధృతం గా ప్రవహిస్తోంది. రఘుపతిపేట దగ్గర వరద నీరు రోడ్డుపై చేరింది నీటి ప్రవాహ తీవ్రతను గమనించకుండా డ్రైవర్ బస్సు ను వేగంగా నడిపాడు. బస్సు నీటిలో చిక్కు కున్న వెంటనే ఆయన అప్రమత్తమవడం తో ప్రమాదం తప్పింది. ప్రయాణి కులందరూ సురక్షితంగా ఉన్నారు. ఒక్క సారిగా బస్సు వరదలో చిక్కుపోయిన కారణంగా ప్రయాణికులందరూ భయబ్రాంతులకు గురైయ్యారు. డ్రైవర్ కొంత నిదానంగా నడుపుతూ ఉధృక్తిని గమనించి ఉండుంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయ పడ్డారు. అదృష్టం మేరకు ఎటువంటి ప్రమాదం జరగక పోవడమే కాక డ్రైవర్ ఎంతో చాకచక్యంతో   బస్సును  అదుపు చేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

power purchase

విద్యుత్ కొనుగోల్లో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనున్నది

రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలోనే స్పష్టత ఇవ్వనుందా లేదా అనేది చర్చనీయాశంగా మారింది. పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలనే ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి వంటివి సరికాదనే నిర్ణయానికి వచ్చింది. ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న పీపీఎలను మరో పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామనడం పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలని ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి వంటివి సరికాదనే నిర్ణయానికి వచ్చింది. ఈ వ్యవహారం పై మొత్తం అన్ని రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వాలని భావిస్తొంది. పవన సౌర విద్యుత్ సంస్థ లతో కుదుర్చు కున్న పీపీఏ లకు రాష్ట్ర ప్రభుత్వాల డిస్కాంల కట్టుబడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో గుజరాత్ లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ నేతృత్వం లో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన ప్రధాన ఎజెండా లో పీపీఏల అంశాన్ని కూడా చేర్చారు. ఉత్పత్తి సంస్థ లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి సూచించ పోతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒప్పందాలనూ కొన్ని రాష్ట్రాలు పాటించకపోవడం వల్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని తద్వారా కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా పెట్టుబడుల సమస్య కూడా ఏర్పడుతుంద ని కేంద్రానికి వివరించారు. విద్యుత్ సంస్థలు కూడా ఆర్థికంగా నష్టపోతామని తద్వారా బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపులు నిలిచిపోయి బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంద ని నివేదించారు. పీపీఏల రద్దు తో తలెత్తిన పర్యావసనాలపై సీఎం జగన్ కు ఆర్ కె సింగ్ ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో తలెత్తకుండా చూడటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని కేంద్రానికి ఫిర్యాదులొచ్చాయి. ఒక్క ఏపీలోనే పలు విద్యుత్ సంస్థలకు డిస్కాం లో పదమూడు వేల నలభై ఆరు కోట్ల మేర బకాయి పడినట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే అనేక రాష్ట్రాల్లో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం లేదనే విషయం కూడా కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ అంశాలన్నింటిపైనా విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో కేంద్రం అన్ని రాష్ట్రా లకు మార్గ నిర్దేశం చేసే అవకాశం ఉందని తెలిసింది. ఏపీ కేంద్రం ఇప్పటికైనా విద్యుత్ కీలక నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.

Musi River Project Gate Collapse Due To Heavy Inflow

విరిగిన మూసీ నది ఐదవ గేటు...

  భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతటా వరదలతో నగరాలు సైతం నీట మునుగుతున్నాయి.ఇది ఇలా ఉండగా జలాశయాలు కూడా నిండు కుండను తలపిస్తున్నాయి.తాజాగా మూసీ నది గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోతుంది. ఇప్పటికే రెండు టీఎంసీ లకు పైగా నీరు ప్రాజెక్టు నుండి ఖాళీ అయిపోయింది. దీంతో రైతు లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐదవ నెంబర్ గేటు విరిగిపోవడం తో మొత్తంగా రోజు కూడా పదిహేను వేల క్యూసెక్యుల నీరు అయితే వృధాగా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మూసీ ప్రాజెక్టు సంబంధించి ఆరు వందల నలభై ఐదు ఫీట్ల పూర్తి స్థాయి సామర్థ్యం కాగా ఆరు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు జీరో వరకు కూడా నీరు చేరుకున్నది. ఆ తర్వాత ఒక్కసారిగా ఐదు నెంబర్ గేటు శనివారం సాయంత్రం విరగటంతో నీరు వృధాగా పోతున్న పరిస్థితి నెలకొన్నది. ఇది నిజాం కాలంలో పంటల అరవై మూడు లో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్ల క్రితం రెండు వేల పదిహెడు లో స్వప్న కన్స్ ట్రక్షన్స్  మొత్తం ఇరవై గేట్లు దీనికుండగా మొత్తం ఇరవై గేట్లు మాత్రమే వినియోగంలోకి ఉంచి పది గేట్లను మూసేశారు. ఈ డ్యామ్ ఒక్క పూర్తి స్థాయి సామర్థ్యం ఫోర్ పాయింట్ ఫోర్ టీఎంసీ గానూ మనకు ఇప్పటి దాకా దాదాపు రెండు పాయింట్ కోట్లు టీఎంసీ కి చేరింది. గత కొన్న రోజులు విషయం అందరికీ తెలిసిందే. ఐదవ నెంబరు గేతు సాకేతిక ప్రాబ్లం రావడం వల్ల చాలా వరకు నీరు వృధాగా పోతుందని వారు తెలియజేస్తున్నారు.చీఫ్ ఇంజనీర్లు మరియు టెక్నికల్ బృందం  ఈ సమస్యను పరిష్కరించే పనిలో పడ్డట్టు అక్కడి అధికారులు తెలిజేస్తున్నారు.

Police case filed against Bhuma Akhila Priya husband

అఖిలప్రియ భర్తపై కేసు నమోదు.. ఎస్ఐని కారుతో ఢీకొట్టే ప్రయత్నం!!

  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై  వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో భార్గవరామ్‌పై కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు.  కొద్ది రోజుల క్రితం.. ఆళ్లగడ్డలో ఓ స్టోన్ క్రషర్ బిజినెస్ వ్యవహారంలో భార్గవరామ్ బెదిరించాడంటూ కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ప్రశ్నిస్తామంటూ ఆళ్లగడ్డ ఎస్‌ఐ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో భార్గవరామ్ ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లారు. అయితే భార్గవరామ్ తనకు సహకరించకుండా తనను కారుతో ఢీకొట్టేలా రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిపోయారని.. ఆళ్లగడ్డ ఎస్‌ఐ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై కేసు నమోదయింది. ఐపీసీ సెక్షన్‌ 353, 336 కింద అఖిలప్రియ భర్తపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

ACB Serious On ESI Medicine Scam

ఈఎస్ఐ స్కామ్ విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు...

  ఇటివల అందరిలో హాట్ టాపిక్ గా మరిన అంశం ఈఎస్ఐ స్కామ్ .ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో ఏసీబీ దూకుడు మరింత పెంచింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురిని విచారిస్తోంది. అధికారుల విజ్ఞప్తి మేరకు నిందితులను రెండ్రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. మరోవైపు మెడికల్ స్కాన్ లో తనిఖీ లు కొనసాగిస్తున్న ఏసిబి అధికారులు మరి కొంత మందిని అరెస్టు చేయనున్నారు. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో ఏసీబీ దూకుడు మరింత పెంచింది ఈ ఎస్ ఐ డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురి ని విచారిస్తోంది అధికారుల విజ్ఞప్తి మేరకు నిందితుల్లో రెండ్రోజుల పాటు కస్టడీ కి అనుమతిచ్చింది కోర్టు.పూర్తి అవినీతి కేసుకు సంబంధించిన ఈఎస్ఐ అధికారుల దర్యాప్తు వేగవంతమవుతోంది. ఇప్పటికే కేసులో ఉన్నటువంటి నిందితుల్ని ఈ రోజు ఏసీబీ అధికారులు కస్టడీ లోకి తీసుకొని రెండు రోజుల పాటు విచారించనున్నారు. రెండ్రోజుల పాటు విచారిస్తే మరిన్ని అవకాశాలుమరియు ఎంత మందికి సంబంధించిన ఎటువంటి వివరాలైన వెల్లడయ్యే అవకాశముందని ఏసీబీ అధికారులు గట్టిగా భావిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న రోజుకో కొత్త విషయం వెలుగు చూడటం స్కామ్ కు  సంబంధించి ఈ సొమ్ము ను బ్లాక్ మార్కెట్ లోకి  కొల్లగొట్టాలన్నది ఒక్కొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి.హెల్త్ క్యాంప్ లో జరిగిన వంటి అక్రమాలకు సంబంధించినటువంటి కిట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని కోట్ల రూపాయల అనుకున్నారన్నది నిందితులందరిపైనా ఉన్నటువంటి ఆరోపణ.దీనికి సంబంధించినటువంటి  విషయాలను ఏసీబీ అధికారులు  సేకరిస్తున్నారు. గత రెండు మూడు రోజుల క్రితం జరిగిన శోదాల్లో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి పద్మ పేరుపైనే ఏకంగా బినామీ కంపెనీలు ఉండటంతో అధికారులు నివ్వెరపోయారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని మొదట భావించినా ఏకంగా బినామీ కంపెనీలను సృష్టించి ఏపీకి సంబంధించినటువంటి మందుల కొనుగోళ్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు దండుకున్నారని ఇటు దేవికారాణి పద్మల కు సంబంధించి వారిపై ఉన్న  అభియోగాలున్నాయి. వీరిద్దరినీ విచారిస్తే ఒక్కొక్కరిగా ఇటు ఫార్మా కంపెనీల నుంచి మెడికల్ సిబ్బందులు,డిస్పెన్సరీలల్లోనీ సభ్యులు, మెడికల్ ఏజెన్సీల అభ్యర్దులు,అటు డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్ ఇలా చాలా మందికి ప్రమేయం ఉండటంతో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఇందులో పదమూడు మంది నిందితులు అరస్టయ్యారు ఈరోజు మరి కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి తర్వాత కూడా అరస్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాలా మంది అనుమానితులను చుట్టుముట్టబోతున్నరు అధికారులు  కోటపల్లి ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఈ స్కామ్ లో ప్రత్యక్షంగా పరోక్షం గా సంబంధాలు ఉన్నాయా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ విచారణలో చాలా వరకు నిజాలు బయటకు రాబోతున్నాయి. మొత్తం మీద ఈ స్కామ్ లోని అసలు నిందితులు బయటకు రాబోతారా లేదా అన్నది చర్చనీయంశం అయ్యింది.

Gold prices continue to rise

వరుస పండుగలతో బంగారం షాపులు కళకళ...

  బంగారం కొనుగోళ్లు అంటే దృష్టి పెట్టని మగువలు ఉండనే ఉండరు. అందులోనూ పండుగ పూట పెట్టే ఆఫర్లను చూసి ఆకర్షితులు అయ్యేవారు ఇంకెందరో. దీర్ఘ కాలిక పెట్టుబడిగా బంగారం మొదటి స్థానంలో ఉండగా ఊరిస్తున్న కొత్త డిజైన్ లో ఒక వైపు దాచుకోవాలన్నా కోరిక మరో వైపు బంగారం కొనుగోళ్లకు ప్రోత్సహిస్తున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గు లున్నా ధైర్యంగా కొనుగోళ్లుచేస్తున్నారు ప్రజలు. పసిడి కొనుగోళ్ల కు ఇదే తగిన సమయం అంటున్న మార్కెట్ వర్గాలు. దుర్గాష్టమి నుంచి విజయ దశమి వరకు బంగారం కొనుగోలుకు శుభతరుణం అని భారతీయుల నమ్మకం. అప్పుడు కుదరకపోతే దీపావళి ముందు వచ్చే దంతేరాస్ రోజు న తప్పక కొనుగోళ్లు చేయడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ సారి అక్టోబరు ఎనిమిది న విజయ దశమి అక్టోబర్ ఇరవై ఐదున ధంతేరాస్ జరుపుకొంటారు. రెండు పండుగ లకు మధ్య పక్షంరోజుల కుపైగా టైమ్ ఉన్నందున దసరా నవరాత్రుల్లో బంగారం కొనుగోళ్లు పెరిగాయని ధంతేరాస్ వరకు ఆగేందుకు వినియోగదారులు సిద్ధంగా లేరని మార్కెట్ వర్గా లు చెబుతున్నాయి. పండుగ లతో పాటు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు పెళ్లిళ్ల సీజన్ రాబోతున్నాయి. దానితో ఇప్పుడే బంగారం కొనుక్కుని దాచుకోవాలని భావించే వారికి ఇదే తగిన తరుణమని బంగారం రేట్లు బాగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుదలపట్ల ఉన్నాయి.  రూపాయి బలపడడం తో దాని ప్రభావం బంగారం మార్కెట్ పై కూడా ఉంది. దేశీయ మార్కెట్ లో కొనుగోలుదారు లు కొత్త జోష్ లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఒక వైపు బంగారం మరోవైపు స్టాక్ మార్కెట్ పై ఇన్వెస్టర్ లు దృష్టి సారించారు. ఇప్పుడు చిన్న మధ్య తరహా ఇన్వెస్టర్లంతా రెండువైపులా చూస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధుల్లో సగం బంగారం కొనేందుకు మిగిలిన సగం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడు లు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది బంగారం కొనుక్కు ని ఐదేళ్ల వరకు దాచుకోగలిగితే పెట్టుబడి రెట్టింపవుతుంద ని మార్కెట్ వర్గా లు విశ్లేషిస్తున్నాయి. అయిదేళ్ల లో బంగారం ధర పది గ్రాము లకు డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు కొనుక్కొని దాచుకోవటం మంచిదే నని మార్కెట్ వర్గా లు సూచిస్తున్నాయి. బంగారం ఎంత తొందర గా కుంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వారం రోజుల పాటు రోజూ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెరిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దేశీయంగా ఇప్పుడు నగర వ్యాపారుల నుంచి కూడా మంచి గిరాకీ ఉంది దానితో బంగారం కొరత ఏర్పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సరి కొత్త డిజైన్ లు రూపొందించి వినియోగదారు లను ఆకట్టు కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి .బంగారం షాపుల వారి ప్రకటన లు కూడా ఆకట్టుకునేది గా ఉన్నాయి కొన్ని గ్యారెంటీ లకు సంబంధించి వ్యాపారు లు ఇచ్చే హామీల తో వినియోగదారుడు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దానితో పండుగ రోజు ల్లో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గించారు. తాజాగా రెపో రేట్ల ను తగ్గించా దానితో బ్యాంకు ల్లో డబ్బు దాచుకోవాలనుకునే వారికి పెద్దగా బట్టి రాని పరిస్థితి ఉంది. దీర్ఘ కాలిక ఇన్వెస్ట్ మెంట్ గా బంగారన్ని కొనుక్కొంటే దాచుకోవటానికి వీలుంటుందని సాధారణ వినియోగదారులు నమ్ముతున్నారు. బ్యాంకు లో డబ్బు దాచుకునే కంటే బంగారం కొనుక్కుని లాకర్ లో పెట్టుకోవాలనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగు తోంది. పండుగల అడ్వాన్స్ లు పండుగ బోనస్ లతో అందుకున్న సొమ్ము ను బంగారం కొనుగోళ్లు ఇన్వెస్ట్ చేయాలని పలువురు వినియోగదారులు తీర్మా నించుకుంటున్నారు. బంగారం స్కీమ్ లలో చేరి డబ్బు పొదుపు చేసిన వారు సైతం కొనుగోళ్ల కు ఇదే తగిన తరుణంగా భావిస్తున్నారు సగటు భారతీయుడి కి బంగారం ఒక సెంటిమెంట్ ఏడాదికి ఒకసారి అరతులం బంగారమైనా కొనుక్కోవాలనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సెంటిమెంట్ చాలా ఎక్కువే పైగా ఇప్పుడు ఆదాయాలు పెరగడం దానితో పాటు పొదుపు పెరగడంతో ఇన్వెస్ట్మెంట్ కు అవకాశాలు పెరిగాయి. మరి ఆ పెట్టుబడిని బంగారంలో పెడితేనే మంచిదనే జనం విశ్వసిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం సగటు వినియోగదారుడి చేతికందని ఎత్తుకు ఎదిగింది. సగటు మనిషి దగ్గరున్న డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు గోల్డ్ మార్కెట్ ఒక్కటే సరైన ప్రదేశంగా కనిపిస్తుంది. దానితో ఇప్పుడు జనమంతా బంగారంపై దృష్టి పెట్టారు అందుకే పండుగ సీజన్ లో బంగారం షాపులో కళకళలాడుతున్నాయి..నిజంగానే బంగారం ధర రాను రాను పెరగనున్నదా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.

Hyderabad woman commits suicide in US

కన్న కూతురు శవం కోసం ఆరాటపడుతున్న తల్లిదండ్రులు...

  కన్న కూతురు ఎక్కడైనా క్షేమంగానే ఉందిలే అనుకున్న తల్లిదండ్రులకు కూతురు శవంగా మారిందని తెలిసి కుప్పకూలిపోయారు. వివరాళ్లోకి వేళ్తే  అమెరికా సంబంధం అంటే గతంలో తల్లితండ్రులు ఎగిరి గంతేసేవారు. కూతురు విదేశాలకూ వెళ్తుంది. సంతోషం గా ఉంటుందని అక్కడి సంబంధాల వైపే మొగ్గు చూపేవారు. అయితే రానురాను ఫారిన్ పెళ్లిళ్లు విషాదాంతం అవుతున్నాయి. తాజాగా అమెరికా లోని నార్త్ కరోలినా లో వనిత అనే వివాహిత భర్త అత్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పదిహేనేళ్ల క్రితం శివ కుమార్ తో వనితకు పెళ్లయ్యింది నాలుగేళ్ళ కాపురం ఆనందంగా సాగింది. వీరిద్దరికీ సింధూ, సిద్ధార్థ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాపురంలో కలహాలు మొదలయ్యాయి. పెద్ద మనుషుల సమక్షం లో పంచాయితీ కూడా చేశారు కుటుంబ సభ్యులు. అయినా తరచూ గొడవలు జరుగుతూ వచ్చేవి ఈనేపధ్యం లో ని పుట్టింటి కి తిరిగొచ్చింది వనిత. వనిత తల్లితండ్రులు హైదరాబాద్ నాగోల్ ఉంటున్నారు. భర్తతో విబేధాలు అత్తింటి వేధింపు లు తట్టుకోలేక చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటోంది. అయితే పిల్ల లను చూసేందు కు గత జూలైలో భర్త దగ్గర కు వెళ్లింది వనిత. కానీ రెండు నెలల నుంచి కాంటాక్ట్ లో లేదు ఏమి జరిగిందా  అని శివ కుమార్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు తల్లితండ్రులు. అయినా ఫలితం లేకుండా పోయింది. సడన్ గా ఫోన్ చేసి మీ కూతురు సూసైడ్ చేసుకుంది అమెరికాలోనే అంత్యక్రియులు చేసేస్తున్నామని చెప్తాడు అల్లుడు. కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అత్తింటి వేధింపు లతోనే తమ కుమార్తె చనిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. డెడ్ బాడీని ఇండియా కు తీసుకు రావాలని కోరుతున్నారు. అల్లుడు శివ కుమార్ పై ఎల్ బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురి విషయంలో వారికి తీరని లోటు జరిగిందని అది ఎప్పటికి తిరిగి రాలేనిదని కనీసం తన బాడీని అయినా వారికి అప్పగించాలి అని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు.వారి కూతురు ఎన్నో కష్టాలు అనుభవంచిందని కనీసం తమ తల్లిదండ్రులతో కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిని ఎదురుకుందని,ఎప్పుడు కనీసం తమతో గడిపే అవకాశానికి కూడా తాము నోచుకోలేదని వారు తమ బాధను వ్యక్తం చేస్తూ వారికి న్యాయం చేయ్యాలని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఐదవ రోజు ఆర్టీసీ సమ్మె భేటీలో ఏం జరగబోతోంది?

  గత నాలుగు రోజులుగా అందరిలో కలవర పరచిన అంశం ఆర్టీసీ సమ్మె. పండుగ అయిపోయింది ఆర్టీసీ సమ్మెకు మన తెలంగాణ సీఎం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పటు చేయంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి పండగ కూడా గడిచిపోయింది.ఆర్టీసీ సమ్మె ఈ ముఖ్యమైన పండుగలకు చేయడం పై ప్రభుత్వ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. మళ్ళీ నేటి నుంచి ఆర్టీసీ సమ్మె ప్రభావం  కనిపించే పరిస్థితి వస్తోంది. ఓ వైపు సర్కార్ సీరియస్ గా ఉన్న అంశం కాగా మరోవైపు పంతం వీడని ఆర్టీసీ ఉద్యోగులు వెరసి ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. మరి ఇవాల్టితో అయినా సమ్మె ఆగుతుందా సాగుతుందా ఎందుకంటే ఇవాళ జరగబోయేవన్నీ ఆర్టీసీ భవిష్యత్ ను సమ్మె చేస్తున్న కార్మికుల  భవిష్యత్తును తేల్చేసి సమావేశంగా మారనుంది. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక సమావేశా లు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నయ ఏర్పాట్లు మరింత పెంచుతున్న కేసీఆర్ సునీల్ శర్మ కమిటీ తో మరోసారి భేటీ అవుతారు ఆర్టీసీ భవిష్యత్ పై చర్చిస్తారు. మరోవైపు డిపోల వారీగా ఆయా జిల్లాల కలెక్టర్ లు సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం చేపడుతున్న ఈ పద్దతిని గమనిస్తూ సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల జేఏసీ మరోసారి భేటీ కాబోతోంది. ఆ భేటీలోనే భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని సమ్మె కొనసాగిస్తారా విరమిస్తారా అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ లో అఖిల పక్ష సమావేశం జరగనుంది. రాజకీయ పార్టీ లు నిర్వహిస్తున్న ఈ భేటీకి జేఏసీ నేతలు కూడా హాజరవుతారు. కేసీఆర్ ఈ మధ్యాహ్నం తరువాత అధికారులతో సమీక్ష జరుపుతారు. ఈలోపు జేఏసీ ఓసారి సమావేశంకానుంది ఆ తర్వాత అఖిల పక్ష భేటీకి హాజరు కాబోతోంది. ఈ భేటీ లో అయినా ఆర్టీసీ కార్మికులకు ఆనందం తెచ్చి పెట్టబోతుందో లేదో వేచి చూడాలి.

ప్రధాని వస్తున్నారు జాగ్రత్త... నెల్లూరు జిల్లా నేతలకు జగన్ క్లాస్

  నెల్లూరు జిల్లా వైసీపీలో నేతల మధ్య విభేదాలు వీధికెక్కడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారట. ముఖ్యంగా కోటంరెడ్డి-కాకాని వివాదం జగన్ దగ్గరకు చేరింది. కోటంరెడ్డి అరెస్టుకు దారితీసిన పరిణామాలు, కోటంరెడ్డి-కాకాని మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ సీరియస్ అయ్యారట. అధికారంలోకి వచ్చి, ఇంకా ఆర్నెళ్ల కూడా పూర్తికాకముందే ఈ గొడవలేంటని జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కోటంరెడ్డి అండ్ కాకానికి స్ట్రాంగ్ క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రైతు భరోసా పథకాన్ని నెల్లూరు నుంచి ప్రారంభించబోతున్న నేపథ్యంలో సింహపురి నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించినందున... కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందుగా నెల్లూరు జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపంపై చర్చించనున్నారు. అయితే, కోటంరెడ్డి-కాకాని వివాదమే కాకుండా, మిగతా నేతల మధ్య కూడా సరిగా సఖ్యత లేదని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి... విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని, రైతు భరోసా పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

పవన్ కు షాక్ మీద షాకిస్తోన్న నేతలు... అసలు జనసేనలో ఏం జరుగుతోంది?

  కారణాలు ఏవైనా, పవన్ స్టార్ డమ్ పై ఆధారపడి జనసేనలోకి వచ్చిన నేతలంతా ఒక్కొకరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎన్నికలకు ముందే జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ పార్టీకి గుడ్ బై చెప్పగా, ఎన్నికల తర్వాత జనసేన కోశాధికారి, పవన్‌ కు అత్యంత సన్నిహితుడైన మారంశెట్టి రాఘవయ్య, రావెల కిశోర్ బాబు పార్టీకి రిజైన్ చేశారు. అలాగే కృష్ణాజిల్లా జనసేన కన్వీనర్‌ డేవిడ్ రాజు, మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన చింతల పార్థసారథి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇక, కావలి, పెదకూరపాడు, తణుకు నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన పసుపులేటి సుధాకర్, దండమూడి సామ్రాజ్యం, పసుపులేటి వెంకటరామారావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, పవన్ కళ్యాణ్ తీరును నిరసిస్తూ పార్టీని వీడారు. అయితే రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సైతం రాజీనామా చేయడంతో, జనసేనలో అసలేం జరుగుతోందన్న చర్చ హీటెక్కిస్తోంది. అయితే, పార్టీలో అయోమయం, సీనియర్లకు తగిన గౌరవం లేకపోవడం వల్లే, ఆకుల రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోంది.  వీళ్ల బాటలోనే మరికొంతమంది సీనియర్ నాయకులు పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా జరగుతోంది. వీరిలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ముత్తంశెట్టి కృష్ణారావు పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలై నాలుగు నెలలు కూడా గడవక ముందే పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి నాయకులు వలస వెళ్లిపోతుండటంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, పలువురు నేతలు పార్టీని వీడటానికి, పవన్ వ్యవహార శైలే కారణమంటున్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో పవన్ పూర్తిగా వైఫల్యం చెందాడని భావిస్తుండం ఒక కారణమైతే, ఇంకా చంద్రబాబు పార్టనర్‌గానే మెలుగుతున్నారని అనుమానిస్తున్నారట. నిర్మాణాత్మక ప్రతిపక్షం గా వ్యవహరించలేకపోవడం... పార్టీ కోసం కష్టపడినవాళ్లను కాకుండా డమ్మీలను వెంటబెట్టుకుని తరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారట. అంతేకాదు పవన్‌ కొంతమందితో కోటరీ ఏర్పాటు చేసుకుని, వారు చెప్పిన మాటలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే పలువురు పార్టీని వీడుతున్నారనే మాట వినిపిస్తోంది.

ఇవాళ ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్... మరో ఛాన్సిచ్చేందుకు కేసీఆర్ యోచన

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఉద్యోగాలు ఊడిపోయాయంటూ బెదిరింపులకు దిగుతున్నా, కార్మికులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. దాంతో మెజారిటీ బస్సులన్నీ డిపోలకే పరిమితమవుతున్నారు. ఇక సమ్మె ఐదో రోజుకి చేరడంతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే, విపక్షాల మద్దతు కూడగట్టిన ఆర్టీసీ కార్మిక జేఏసీ...తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ కి పిలుపునిచ్చింది. అలాగే, తమ సమ్మెకు మద్దతివ్వాలని అన్ని పార్టీలను, ఉద్యోగ, ప్రజాసంఘాలను కోరింది. ఒకవైపు ఆర్టీసీ కార్మికులు పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతుంటే.... మరోవైపు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని మరోసారి పిలుపునివ్వాలని కోరనున్నట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక, కేసీఆర్ తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకే కార్మికులపై సీఎం కేసీఆర్ వేటు వేశారని బీజేపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఏ కొలువుల కోసం ప్రత్యేక రాష్ట్రం పోరాటం జరిగిందో ఆ కొలువులనే ఇప్పుడు కేసీఆర్ తొలగిస్తున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్లేనన్న కేసీఆర్... ఇప్పుడు అదే అగ్గితో చెలగాటం ఆడుతున్నారని హెచ్చరించారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ పై మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ చెప్పడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమంటూ భట్టి ఫైరయ్యారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాలు అండగా ఉండాలని భట్టి పిలుపునిచ్చారు.