CM KCR Holds Meeting With Kesava Rao & Muhammad Ali Over TSRTC Strike

కేశవరావు తో సీఎం కేసీఆర్ ఆర్టీసీ పై చర్చలకు సిద్ధంగా ఉన్నారా?

  నేడు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి మరి కేసీఆర్తో సమావేశమయ్యారు కేకే. తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్న ఆర్టీసీ సమ్మెపై ఇద్దరు చర్చించనట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్ఎస్ నేతల్లో కేకే ఒక్కరే మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు. చర్చలకు మధ్యవర్తిగా ఉంటానని ఆయన ప్రకటించారు. కేసీఆర్, కేకే మీటింగ్ లో హోమ్ మంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. సీఎం చాంబరులో కేశవరావుతో పాటు హోం మంత్రి మహమద్ అలీ సమావేశమయ్యారు.  ఉదయం సీఎం ఆఫీసు నుంచి కేకే కు పిలుపు రావడంతో కేకే ప్రగతి భవన్ కు వెళ్లారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ తరపున టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు చాలా మంది సీనియర్లు మంత్రుల ఎంతమంది ఉన్నప్పటికీ చర్చలు జరగాలి చర్చకు మధ్యవర్తిగా వహిస్తానని ముందుకొచ్చింది మాత్రం కేశవరావు ఒక్కరే. కాని కేశవరావు ముందుకొచ్చిన తర్వాత కార్మికుల నుంచి మంచి ఫలితం వచ్చింది. కార్మికులు కేశవరావు మధ్యవర్తిగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు చర్చకు మేం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.కానీ ప్రభుత్వం నుంచి కేశరావుకి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఆయన సీఎంను కలిసేందుకు సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా కేశవరావునే స్వయంగా చెప్పారు. కానీ సీఎం అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆ చర్చలు జరగలేదు. మంచి జరుగుతుందంటే తను ఇప్పుడు కూడా చర్చ జరిపేందుకు మధ్యవర్తి వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేశవరావు వెల్లడించారు.ఇక చర్చలు జరిగి సమ్మేకు ఒక పరిష్కారం వస్తోందో లేదో వేచి చూడాలి.  

TSRTC union leaders to Meet CS

సిఎస్ ను కలవనున్న ఆర్టీసి కార్మికులు...

  కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ఈ విధంగానే కొనసాగుతుంది. పదమూడవ రోజు ఆర్టీసి కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది, రోజుకో తరహాలో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న  కోర్టు సూచనల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు చెప్తున్నా చర్చలకు ససేమిరా అంటున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్. రేపు మరోమారు ఆర్టీసి కార్మికుల సమ్మెపై విచారణ చేపట్టబోతోంది హైకోర్టు. చర్చల సారాంశం ఏంటని ప్రశ్నించబోతోంది, చర్చల పురోగతిని కోర్టు ముందు ఉంచాలని కోర్టు గతంలోనే సూచించినా ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే రేపటి విచారణలో ఇరువర్గాలూ ఎలాంటి వాదన వినిపించబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. తమ వాదనను కోర్టుకు గట్టిగానే వినిపించాలని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు సిఎం కెసిఆర్. నిన్నటి సమావేశంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని అధికారులకు వివరించారు సీఎం. మరోవైపు కాసేపట్లో సీఎస్ ను కలవబోతోంది ఉద్యోగ సంఘాల జెఎసి. తమ సమస్యలను  సియస్ దృష్టికి తీసుకొస్తూనే ఆర్.టి.సి కార్మికుల సమ్మెను ప్రత్యేకంగా ప్రస్తావించనుంది. మరోవైపు సీఎంతో భేటీ అయ్యారు ఎంపీ కేశవరావు. కెసిఆర్ ఆదేశిస్తే కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమని గతంలో కేకే ప్రకటించిన నేపధ్యంలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందన్న అంశం ఆసక్తికరంగా ఉంది.

ap govt to reduce height of cell towers near gannavaram airport

ప్రమాదకరంగా మారిన గన్నవరం చుట్టుపక్కల సెల్ టవర్లు...

  ఏపీ సీఎం జగన్ హెలికాప్టర్ ప్రయాణాలపై అధికారులు, పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని మార్పులకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్టు చుట్టుపక్కలున్న సెల్ టవర్ ల వల్ల భద్రతాపరమైన ఇబ్బందులను గుర్తించిన సిబ్బంది, ఎయిర్ పోర్ట్ అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. గన్నవరం రన్ వే పనులు పూర్తయిన క్రమంలో చుట్టు పక్కల సెల్ టవర్ ల వల్ల కొన్ని ఇబ్బందులను గుర్తించారు. రన్ వే సమీపంలో ఆరు సెల్ టవర్లున్నాయి, ఇప్పుడు ఈ టవర్ ల ఎత్తు తగ్గించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఏరోడ్రమ్ మీటింగ్ కమిటీ ఏఈఎంసీ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ కుమార్ సెల్ టవర్ ల ఎత్తు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ టవర్ ల రెడ్ లైట్లు వెలిగేలా చూడాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. మరోవైపు విజయవాడ ఎయిర్ పోర్టులో ఇటీవలే రన్ వేను రెండు వేల రెండు వందల ఎనభై ఆరు మీటర్ ల నుంచి మూడు వేల మూడు వందల అరవై మీటర్ లకు విస్తరించారు. అయితే భారీ విమానాలు ఎయిర్ బస్ 320, బోయింగ్ 747, బోయింగ్ 777 విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయంలో సెల్ టవర్ లు ఇబ్బందికరంగా ఉన్నాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు గుర్తించారు. గన్నవరం, బుద్ధవరం ప్రాంతాల మధ్య ఉన్న ఆరు సెల్ టవర్ లు విమానాలకు తగిలే అవకాశముందని అంచనా వేశారు. సెల్ టవర్ ల నిర్వాహకులకు మూడు నెలల గడువు ఇచ్చి జనవరిలో నోటీసులు పంపించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సమస్య కేవలం సీఎంకే కాదు, త్వరలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం డైరెక్ట్ విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెల్ టవర్ లు ఎత్తు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రన్ వే పరిసరాలతో పాటు విమానాశ్రయం చుట్టూ జంతు వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు డంప్ చేయడం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీ కొనే అవకాశముంది. అందుకే ఎయిర్ పోర్ట్ చుట్టు పక్కల వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Villagers Variety Protest Against Bad Roads in vizianagaram district

తమ రోడ్ బాగుచేయాలని వింతగా నిరసన తెలిపిన స్థానికులు...

విజయనగరం జిల్లా కొమరాడ, కూనేరు జాతీయ రహదారి పై స్థానిక గ్రామాల ప్రజలు వినూత్న నిరసన తెలిపారు. పిల్లల్ని స్కూలుకు ఎడ్లబండి లో పంపి స్ధానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా విద్యార్థులను ఎడ్ల బండిపై పాఠశాలకు పంపిస్తూ నిరసన తెలిపారు. రోడ్లు పాడవడం తో ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని స్థానికులు అంటున్నారు. నిరసనలో భాగంగా స్థానికులు మాట్లాడుతూ, ద్వారపల్లెం నుండి కూనేరు, కొమరేడు వరకూ నాటు బళ్ళతో పది రూపాయల చార్జీలు పెట్టి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఎందుకంటే పిల్లలు చదువులకు వెళ్ళడానికి ఇబ్బందులు పదుతున్నారని, గిరిజనులు వైద్యం అందక అవస్థలు పడుతున్నారని, రోడ్లకు బస్సులు రాని కారణంగా ఈరోజు ఇలా ప్రయాణం చేస్తున్నామని అన్నారు. తమపై ప్రభుత్వం మొండి వైఖరిని చూపకుండా చిత్తశుధ్ధి ఉంటే వెంటనే తమ గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేపట్టాలని, మరమత్తులు చేసి వెంటనే ఆర్టీసి బస్సులలో ప్రజలను ప్రయాణించేలా చేసి వారు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తుల్ని చేయమని విజయనగరం జిల్లా కొమరాడ, కూనేరు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

TDP Leader Devineni Avinash Join To YSRCP

వైఎస్ తో నెహ్రూ... జగన్ తో అవినాష్... మళ్లీ పార్టీ మారతారంటూ ప్రచారం

  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.

CRDA demolishing illegal constructions on Krishna river bed

అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో ఉన్న సీఆర్డీఏ అధికారులు...

  కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ప్రముఖ శైవక్షేత్రం తాళ్లాయపాలెంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. శైవక్షేత్రం పక్కనే నిర్మించిన క్యాంటీన్లు, బాత్రూంలను కూల్చివేస్తున్నారు. సీఆర్డీఏ అధికారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. కరకట్ట వెంబడి ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.  సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే ఒకటి రెండు అక్రమ కట్టడాలకు సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకి నోటీసులు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పాతూరి కోటేశ్వరరావుకి సంబంధించిన అక్రమ కట్టడాన్ని తొలగించే క్రమంలో ర్యాంపు లాంటిది ఉంటే గతంలోనే సీఆర్డీఏ అధికారులు తొలగించారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది.  శైవక్షేత్రం ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను ప్రస్తుతం సీఆర్డీయే అధికారులు తొలగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద కృష్ణానది కరకట్ట లోపలకు ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ అక్రమ కట్టడాలను తొలగించే దిశగానే ప్రభుత్వం కొనసాగుతోందని వెల్లడవుతోంది. ఒకేసారి అన్ని కాకుండా ఒక్కొక్కటిగా వీలునుబట్టీ అలాగే అక్కడున్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ, అక్రమ కట్టడాల కూల్చివేత దిశగా చర్యలు తీసుకుంటుంది.  దీంట్లో భాగంగా తాళ్లాయపాలెంలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారానికి సంబంధించిన పనులు ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. శైవక్షేత్రంకి సమీపంలోనే ఉన్న బాత్ రూంలు,క్యాంటీన్ లను కూడా ప్రస్తుతం అక్కడ కట్టడాల కూల్చివేత వ్యవహారం  జరుగుతోంది .మొత్తంగా చూస్తే ఒక్కొక్కటిగా అంటే కొంత మంది లింగంనేని గెస్ట్ హౌస్ కి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఎక్కడ నివాసం ఉన్నారో ఆ స్థలాన్ని ఉన్న భవనం కూడా అక్రమ కట్టడాలుగా  భావించి  తొలగించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అధికారులు.మొత్తం మీద అక్రమ కట్టడాలపై నిజమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందా లేదా కక్ష సాధింపు చర్యలు చేపట్టే పనిలో ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది.

KCR Must Change His Attitude! Is KTR also upset with KCR

స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఆత్మహత్యలా? కేసీఆర్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత!

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిపై పార్టీలో అసంతృప్తి పెరుగుతుందనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు ఎవరికీ నచ్చడం లేదని అంటున్నారు. ఎవరైనా ఏదైనా మంచి చెబితే వాళ్లను వెంటనే దూరం పెట్టేస్తున్నారని... మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా... అధికారులైనా ఇదే పరిస్థితి అంటూ చెప్పుకుంటున్నారు. కేసీఆర్ వ్యవహారశైలి, తీరు నచ్చక అసలు మాట్లాడేందుకకే ఎవరూ సాహిసించడం లేదని అంటున్నారు. కేసీఆర్ తీరుపైనా, ఆయన నిర్ణయాలపై స్వయంగా కేటీఆర్ కూడా అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఒక్కొక్కటిగా కేసీఆర్ చేస్తున్న తప్పులు కొండలా పేరుకుపోతున్నాయని, ఆయన నిర్ణయాలు... అటు పార్టీకి... ఇటు ప్రభుత్వానికి చేటు చేస్తున్నాయని టీఆర్ఎస్ నేతలే వాపోతున్నారట. కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ నిర్మాణం... కాళేశ్వరం వృథా పంపింగ్, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం... ఇలా అనేక నిర్ణయాలు చాలా మందికి నచ్చడం లేదట. ఇక, కొన్ని నిర్ణయాలైతే ఎవరికీ మింగుడుపడటం లేదని అంటున్నారు. అసలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు రావడానికి కేసీఆరే కారణమంటున్నారు. హిందూగాళ్లు బొందుగాళ్లు అంటూ కేసీఆర్ చేసిన కామెంట్సే.... బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఇక, యూపీఏ అధికారంలోకి వస్తుందన్న అతి నమ్మకంతో కేసీఆర్ ముందుకు తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం బెడిసికొట్టిందంటున్నారు. కేసీఆర్ వ్యవహార శైలి కారణంగానే కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాల్లేవని అంటున్నారు. ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలోనూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రమంతా రగిలిపోతోందని, మరీ ఇంత కఠిన వైఖరి మంచిది కాదని అంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఏదోఒకరకంగా సమ్మె విరమింపజేయకుండా... ప్రభుత్వం ఇలా మొండిగా వ్యవహరించడం సరికాదంటున్నారు. అసలు కేసీఆర్ నిర్ణయాలను గులాబీ నేతలే జీర్జించుకోలేకపోతున్నారట. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు సాధించిన స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాము అనుకోలేదని వాపోతున్నారట. కనీసం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ సమ్మె ఉగ్రరూపం దాల్చితే మాత్రం ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి, కిందస్థాయి నేతలు, కేడర్ మనోభావాలు కేసీఆర్ వరకు చేరతాయో లేదో చూడాలి.

KTR to be next cm in telangana

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.! త్వరలోనే యువరాజుకి పట్టాభిషేకం?

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారంటూ ఎప్పట్నుంచో విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఎక్కువగా వినిపించింది. ప్రధాని మోడీ సైతం... కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలు ఎలాగున్నా, తొందర్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాట టీఆర్ఎస్ వర్గాల్లోనూ వినిపించింది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు రావొచ్చనే భయంతో కేసీఆర్ వెనకడుగు వేశారని చెబుతారు. అందుకే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకగణమంతా కేటీఆర్ చుట్టూ తిరిగేలా చేశారని అంటారు. ఒకవిధంగా చెప్పాలంటే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేది కేటీఆరే. టికెట్ల దగ్గర్నుంచి... మంత్రి పదవుల వరకు... అన్నింటిలోనూ కేటీఆర్ మార్క్ కనబడుతుంది. అయితే, కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపడతారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ కూడా తన పదవికి తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టాలని సీరియస్  గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం-అఖిలేష్ మాదిరిగా... పార్టీకి గౌరవాధ్యక్షుడిగా, ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల నుంచి కేసీఆర్ కు ఊహించని కామెంట్స్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్ర నాయకత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందని, దాంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో... అన్నీ చక్కబడగానే... పార్టీలో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, యువరాజు పట్టాభిషేకం జరగడం ఖాయమని అంటున్నారు.  

Hamali workers stage sit-in to protest government move in Nalgonda

నల్గొండలో హమాలీ కార్మికుల మధ్య ఉధృక్తతకు దారీ తీస్తున్న ఘర్షణ...

  గత కొన్ని రోజులుగా హమాలీ కార్మికుల మధ్య ఘర్షణ జరుగుతోంది. నల్గొండలో హమాలీ కార్మికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకరి పై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ రోడ్ల పై పరుగులు పెట్టారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రజలు హడలిపోయారు. హమాలీ కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.దీంతో ఎవరు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా మొన్నటి దాకా సీపీఎం అనుబంధ సంఘం సీఐటీయూ యూనియన్ లో ఉన్న కొందరు ఇటీవల టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరారు. దీంతో లోడింగ్ అన్ లోడింగ్ విషయంలో కొద్ది రోజులుగా రెండు యూనియన్ల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ రోడ్ లోని ఒక సిమెంట్ ట్రేడింగ్ షాప్ ముందు టీఆర్ఎస్ కేవీకి చెందిన హమాలీలు అన్ లోడింగ్ చేస్తున్నారు. వీరిని సీఐటీయూకు చెందిన హమాలీలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఒకరి పై ఒకరు దాడికి దిగారు. ఘర్షణలో పలువురు గాయపడ్డారు.ఈ సంఘటనను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు.ఈ ఘర్షణ పై పోలీసులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలానే వదిలేస్తే ఇంకా పరిస్థితులు ఉధృక్తం అవుతాయని వెల్లడిస్తున్నారు అక్కడి ప్రజలు.  

Record applications to bag liquor shop licences across Telangana

మద్యం దుకాణాల దరఖాస్తులతో ఆశ్చర్యానికి గురైన అధికారులు...

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు భారీ స్పందన చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ రాత్రి పన్నెండు గంటల వరకు కొనసాగింది. మొత్తం నలభై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. బుధవారం ఒక్క రోజే ఇరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం కన్నా అదనంగా నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. దరఖాస్తు దారులతో ఎక్సైజ్ కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి. ఎక్సైజ్ అధికారులు టెండర్ల స్వీకరణ పరిశీలనలో బిజీ అయిపోయారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులొచ్చాయి. వరంగల్లో రెండు వందల అరవై ఒక్క దుకాణాలకు గాను ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో నూట డెబ్బై మూడు మద్యం దుకాణాలకు గాను ఒక వెయ్యి మూడు వందల పంతొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా లోనూ పోటా పోటీగా దరఖాస్తులు సమర్పించారు. ఏపిలో లిక్కర్ పై నియంత్రణ విధించడంతో అక్కడి వ్యాపారులు తెలంగాణా బాటపట్టారు. ఏపీ నుంచి మద్యం వాప్యారులు తెలంగాణాకి వచ్చి పోటా పోటీగా టెండర్లు వేశారు. ఒకరు ఓకే టెండర్ వేయాలనే నిబంధన ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్ గా మారి భారీగా టేండర్లు వేసినట్టు తెలుస్తోంది. అనంతపూర్, గుంటూరు, సత్తెనపల్లి, మాచర్ల, కర్నూలు, విజయవాడ, నంద్యాల ప్రాంతాల వ్యాపారులు గ్రేటర్ శివార్ల లోనే ఏకంగా రెండొందలకు పైగా దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం.

heavy rains in nellore district

నెల్లూరు జిల్లాను గడగడలాడిస్తున్న వర్షం...

  గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నెల్లూరు తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటితో రహదార్లు మూసుకుపోవడంతో పలు గ్రామాలలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఆత్మకూరు పరిధిలోని ఆరు మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సోమశిల జలాశయం నుంచి పది వేల క్యూసెక్ ల వరద నీరు సంఘంలోని పెన్నా ఆనకట్ట వద్దకు చేరుతుంది. పెన్నా వద్ద ఉన్న రోడ్డుపై ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు గేట్లను మూసివేశారు. దీనితో సంఘం నుండి పొదలకూరు, చేజర్ల మండలాల్లోని గ్రామాలకు వెళ్లేందుకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామంలోని చేనేత కార్మికుల ఇళ్ళల్లో వర్షపు నీరు చేరడంతో మగ్గం గుంతలు నిండి పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మర్రిపాడు మండలం సన్నువారిపల్లి వద్ద బోగేరు వాగు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కృష్ణాపురం గ్రామంలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రాయలసీమ ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహానికి జిల్లాలోని పడుతున్న వర్షాలు తోడవడంతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయంలో డెబ్బై మూడు టిఎంసిల నీరు నిల్వ ఉండగా ఇన్ ఫ్లో పదకొండు వేల క్యూసెక్యుల నీరు వస్తుంది. అవుట్ ఫ్లో పన్నెండు వేల క్యూసెక్యుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.ఇప్పటి వరకూ కరీఫ్ లో ఎలాంటి వర్షాలు లేని నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన వర్షాలు ఇప్పటి వరకు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమైన వర్షాలూ నిన్న పగలు దాకా కురిసి కొంచం తగ్గుముఖం పట్టినట్లు తెలిస్తోంది. దీంతో ప్రజలు కొంచం ఊపిరి పీల్చుకున్నారు.పగలు వర్షం కురవకపోగా రాత్రి పెద్ద ఎత్తున ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి.మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పవచ్చు.కేవలం సుల్లూరు పేట నియోజక వర్గం తప్ప మిగతా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా వర్షాలు కురుస్తున్నాయి.

Police Officers in Schools: Effects on School Crime and the Processing of Offending Behaviors

విద్యార్ధులకు పోలీసుల ఆయుధాల ఉపయోగం పై జ్ఞానాన్ని ప్రదర్శించిన పోలీసు అధికారులు.....

  పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు చేరువయ్యేలా పోలీస్ శాఖలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు వాటి పని తీరు వంటి వాటి పై ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరిస్తున్నారు. విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో ఈ ప్రదర్శనను డిజిపి గౌతం సవాంగ్ ప్రారంభించారు. సాధారణ తుపాకి నుంచి ఏకే ఫార్టీ సెవన్ వరకు వివిధ రకాల ఆయుధాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. వీటి గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటే పోలీసులు కూడా ఓపిగ్గా వివరిస్తున్నారు. టిఫిన్ బాక్స్ లు, సూట్కేసులు, డస్ట్ బిన్ లో అమర్చే బాంబుల నిర్వీర్యం గురించి ప్రత్యేకంగా వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు భవనాలు కూలినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఉపయోగించే పనిముట్లను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. సెవన్ పాయింట్ సిక్స్ టూ ఎమ్ఎమ్ఎస్ఎస్జీపీ టూ ఇది షార్క్ షూటింగ్ గన్. ఈ ఆయుధానికి పై భాగంలో ఉండే టెలిస్కోప్ దూరంగా ఉన్న వ్యక్తిని పది రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. దాని ద్వారా శత్రువులను మట్టుబెట్టవచ్చు వివరించారు . నైన్ ఎంఎం పిస్టల్ బ్లాక్ నైన్టీన్ దీన్లో నైన్ ఎంఎం బుల్లెట్లు పదిహేను రౌండ్లు ఉంటాయని యాభై అడుగుల దూరంలో ఉన్న శత్రువులను టార్గెట్ చేయవచ్చు అని దీనిపై భాగంలో గెగోటాక్టికల్ లైట్ ఉంటదిఅని విద్యార్ధులకు వివరించారు . చీకట్లో ఉన్నప్పుడు ఐఆర్ అతినీలలోహిత కిరణాలు శత్రువులపై పడేలా చేయవచ్చు. ఎత్తైన ప్రదేశాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్న వాటిని మట్టుబెట్టడానికి యాభై యొక్క ఎంఎం మోర్టార్ ను ఉపయోగిస్తాము అని అల్లర్లు జరిగే సందర్భాల్లో యాంటీ రాయిట్ గన్ ను ఉపయోగిస్తామని పోలీసులు ప్రదర్శనలో వెల్లడించారు. తాము వాడే వస్తువుల పై కొంత పరిజ్ఞానాన్ని ప్రజలకు, విద్యార్ధులకు చాలా ఓపిగ్గా సమాచారం ఇచ్చారు పోలీసులు.ఈ ప్రదర్శన చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఇతర ప్రజలు కూడా ఆసక్తిగా తరలి వస్తున్నారు.  

Parallel Exchange Rates in Developing Countries

ఐటి సోదాల్లో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడడం ఇదే తొలిసారి...

  కల్కి ఆశ్రమంలో అక్రమాలు బయట పడుతున్నాయి, కల్కి భగవాన్ ముసుగులో జరుగుతున్న దందా లెక్కలు విప్పుతున్నారు ఐటి అధికారులు. బుధవారం నుంచి ఆశ్రమంలోనే ఐటీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు వెయ్యి ఎకరాల భూమి ఉన్నట్టు లెక్క తేల్చారు, దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయల నగదును గుర్తించారు. అందులో తొమ్మిది కోట్ల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు, ఐటి సోదాల్లో ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడడం ఇదే తొలిసారి. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు ముప్పై చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో ఏకంగా ఆశ్రమంలోనే ఐటీ అధికారులు నిన్నటి నుంచి మకాం వేశారు. వరదయ్యపాలెం మండలం, ఉబ్బలమడుగు, బీఎన్ కండ్రిగ మండలంలోని కల్కి ఆశ్రమానికి చెందిన నాలుగు క్యాంపస్ లలో సోదాలు జరుగుతున్నాయి. భక్తుల విరాళాలు పక్కదారి పడుతున్నాయని, ఆదాయ పన్ను కట్టడం లేదని భారీగా ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగం లోకి దిగారు. తొలి రోజు ఐటీ సోదాల అనంతరం వారు అక్కడే ఉన్నారు, రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. మొత్తం నాలుగు వందల మంది అధికారులు పదహారు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఆశ్రమ ఆదాయ కార్యకలాపాలూ, ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. ఆంధ్రాతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో కూడా సోదాలు జరుపుతున్నారు. వరదయ్యపాలెం ఆశ్రమం ప్రధాన ద్వారం మూసి వేశారు, పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐదు రాష్ట్రాల్లోని కల్కీ ఆశ్రమాలకు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కల్కి భగవాన్ కృష్ణాజీ దంపతులు, సీఈవో లోకేష్ దాసాజీ లను అధికారులు విచారిస్తున్నారు. తొలి రోజు ఆశ్రమం నుంచి ముప్పై మూడు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమ నిర్వాహకులు భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి, ఆ సొమ్ముతో భూముల కొనుగోలు, డిపాజిట్ లు దుర్వినియోగమవుతున్నట్టు తమిళనాడు ఐటి అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఐటి అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఏక కాలంలో దాడులకు దిగింది. మొత్తం పదహారు బృందాలుగా ఏర్పడి నలభై చోట్ల ఏక కాలంలో తనిఖీలు జరుపుతున్నారు. బుచ్చినాయుడు కండ్రిగ వరదయ్యపాళెం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలకు విదేశీ భక్తులు భారీగా వస్తుంటారు, కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ ఆయన సతీమణి ప్రీతిజి పర్యవేక్షణలో ఆశ్రమాలు, సేవా మందిరాలు నడుస్తున్నాయి. కృష్ణాజీ నిర్వహిస్తున్న ఇతర కంపెనీల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశాల నుంచి కల్కి ట్రస్టుకు అందిన విరాళాలపై ప్రత్యేక దృష్టి సారించారు ఐటి అధికారులు. పైగా మూడేళ్ళుగా కల్కి ఆశ్రమ ఆదాయ పన్ను ఎగ్గొట్టిందని కూడా ఫిర్యాదులు అందాయి.  

South-West and North-East Monsoon in India

తగ్గుముఖం పట్టిన నైరుతీ ఋతు పవనాలు,సకాలంలో ప్రవేశించిన ఈశాన్య ఋతు పవనాలు......

  నిన్న మొన్నటి దాకా భారీ వర్షాలతో రాష్ట్రాలంతా అతలాకుతలమైపోయాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వాగులు,వంకలు నిండి వరదల్లతో ఎకంగా ఊర్ల సైతం నీట మునిగాయి.ఈ ఏడాది వర్షాలు బాగా కురిసాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నైరుతి ఋతు పవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి అనే తెలుకోవచ్చు. అదే సమయంలో తమిళనాడుకి ఆనుకుని ఉన్న ఆంధ్రా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య ఋతు పవనాలు ప్రవేశించాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల రాకతో ఇప్పటికే ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నిన్న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఒక్క రోజులోనే డెబ్బై పాయింట్ తొమ్మిది సగటు వర్షపాతం నమోదైంది. దక్షిణ తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురవ వచ్చని, దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారీ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. భారీగా వర్షాలు కురిశాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది చాలా ఆలస్యంగా నైరుతి ఉపసంహరణ జరిగింది. మరోవైపు ఈశాన్య ఋతు పవనాలు ఏడాది సకాలంలో విస్తరించనున్నాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈశాన్య ఋతు పవనాలు అక్టోబర్ ఇరవై ఏడు లోపు ప్రవేశించనే లేదు.    

Telangana: Stalemate over RTC

ఉద్రిక్తతకు దారి తీసిన ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ...

  ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రాంనగర్ దగ్గర ప్రారంభించి సిటీలో అన్ని డిపోలను కలుపుతూ ర్యాలీ చేయాలనుకుంది జీఏసీ కానీ, సభలకు, ర్యాలీలకు అనుమతులు లేని కారణంగా వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థులు నిర్వహించ తల పెట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ముందస్తుగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్ధిలందరినీ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి స్థాయి ఉద్రిక్తల మధ్యనే బైక్ ర్యాలీ ఆగిపోయింది, మరల బైక్ ర్యాలీ నిర్వహించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. అయితే పోలీసుల బందోబస్తు రాంనగర్ చౌరస్తా వద్ద పెరిగింది. ఏ ఒక్కరైనా ఆర్టీసీకి సంబంధించి స్లోగన్స్ ఇచ్చినా లేకపోతే ప్లకార్డులతో ప్రదర్శించినా కూడా అరెస్టు చేసి తీసుకెళ్లి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి అప్పజెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం రాంనగర్ చౌరస్తాలో మాత్రమే కాకుండా రాంనగర్ చౌరస్తాకి వస్తున్న దారిలో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. రాంనగర్ కు కలిసిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలన్నిటిలో కూడా పోలీసులు గస్తీ కాస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ అనుమతులు లేవంటూ ఆపేయాలని ఇప్పటికే పోలీసులు హెచ్చరించడం జరుగుతోంది. మీడియాతో కార్మికులు మాట్లాడుతూ, ఆత్మబలిదానాలు చేసుకోవద్దు అని ప్రభుత్వం హెచ్చరిస్తుంది కోర్టులు కూడా చెప్తున్నాయి కానీ, తమ సమస్యలు తీర్చేవారు లేరని కాబట్టి ఖచ్చితంగా పోరాడి తమ హక్కుల్ని సాధించుకుంటాం అని అన్నారు. అయితే ప్రస్తుతం రాంనగర్ వద్ద  ప్రశాంత వాతావరణం నెలకొంది.  

మీడియా తో వ్యవహరించాల్సిన తీరు పై మంత్రులకు భోదించిన జగన్.....

    ఏపీలో మీడియాతో వ్యవహరించాల్సిన తీరు పై మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ కర్తవ్య బోధ చేశారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ముగింపు దశలో మీడియా గురించి వారికి సీఎం కీలకమైన సూచనలు చేసినట్టు తెలిసింది. వైసీపీకి చంద్రబాబు ఒక్కరే శత్రువు కాదని, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వంటి మీడియా సంస్థలతోనూ నిరంతరం పోరాటం చేయాలని జగన్ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ మంత్రులతో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. 'అక్కడక్కడా కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయని ఏదైనా ఉంటే తాను మీడియాను పిలిచి మాట్లాడతానన్నారు సీఎం. నూట యాభై మందిలో సమర్థులైన వారిని మంత్రులుగా ఎంపిక చేశానని అందరితో తనకు స్నేహపూరితమైన సంబంధాలు ఉన్నాయని, ఆయనకి ఎవరినైనా మధ్యలోనే  తొలగించాలంటే బాధగానే ఉంటుందని చెప్పుకొచ్చారు జగన్ . మంత్రులెవ్వరూ కూడా అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దని వారు ఎక్కడ ప్రలోభాలకు లొంగిపోవద్దని హెచ్చరించారు. ఇదే సందర్భంగా మీడియా నిరంతరం మన చుట్టే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇతర మీడియా సంస్థలు మనపై నిఘా పెట్టాయని పేర్కొన్నట్లు తెలిసింది. మంత్రుల్లో ఎవరిపైనైనా ఆరోపణలు చేస్తూ మీడియాలో కథనాలు వస్తే తన పై ఒత్తిడి పెరుగుతుందని పిలిచి మాట్లాడాల్సి వస్తుందని ఆయన తెలిపారు'. ప్రతిపక్షనేత చంద్రబాబు నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించినట్టు తెలిసింది. ప్రతిపక్షం చేసే విమర్శలు, ఆరోపణలు మీడియాలో వస్తున్న, ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై మంత్రులూ, ఎమ్మెల్యేలూ తీవ్రంగా స్పందించి గట్టి సమాధానం చెప్పాలని సూచించారు. ఇటీవల ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారం వల్లే ఎండీ సురేంద్రబాబును ప్రభుత్వం బదిలీ చేసినట్లుగా ఆంధ్రజ్యోతి రాసింది. ఈ వార్తలో నిజమెంతో అబద్ధమెంతో పరిశీలించాలని సూచించారు. ఇలాంటి కథనాలు భవిష్యత్తులో పునరావృతమైతే కేసులు పెట్టి వాటి సంబంధిత శాఖల కార్యదర్శుల పై చర్యలు తీసుకోవుటకు ఏ మాత్రం వెనకాడవద్దని ఆదేశించారు. వెంటనే ఆయా మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయండి అని సీఎం చెప్పినట్టు  సమాచారం.

త్వరలో తెరపడనున్న 134 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న అయోద్య వివాదం...

  అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, నూట ముప్పై నాలుగు ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదానికి త్వరలో తెరపడనుంది. నవంబర్ 17 లోగా తుది తీర్పు రానుంది, చివరి రోజు కూడా అత్యున్నత న్యాయస్థానంలో వాడి వేడిగా వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో అయోధ్య వివాదంపై వాదనలు ముగిశాయి, ఇక తీర్పు పైనే అందరి కళ్ళు ఉన్నాయి, నలభై రోజుల పాటు కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ వాదనలు సాగాయి. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం విషయంపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయ్యింది. వాదనల చివరి రోజు సర్వోన్నత న్యాయస్థానంలో హైడ్రామా చోటుచేసుకుంది. విచారణలో భాగంగా హిందూ మహాసభ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ అయోధ్య రీవిజిటెడ్ అనే పుస్తకాన్ని కోర్టు ముందుంచగా, సున్నీ వర్క్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పుస్తకాన్ని సమర్పిస్తే చించేస్తామని హెచ్చరించారు. అయినా వికాస్ సింగ్ తన వాదనలు వినిపిస్తుండగా రాజీవ్ ధావన్ జోక్యం చేసుకొని ఆ పుస్తకాన్ని చించేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని చింపటాన్ని సమర్ధించుకున్నారు సున్నీ వర్క్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్. చీఫ్ జస్టిస్ అనుమతి తోనే అలా చేసినట్టు స్పష్టం చేశారు. అయోధ్య రీవిజిటెడ్ అనే పుస్తకాన్ని కిషోర్ గుణాల్ రచించారు. వివాదస్పద స్థలంలో రామ మందిరం ఉందని, దీనికి సంబంధించిన మ్యాప్ ను కూడా పుస్తకంలో పెట్టారు. అయితే ఈ పుస్తకాన్ని సాక్ష్యంగా తీసుకోవాలన్న పిటిషన్ ను న్యాయస్థానం రెండు వేల పద్ధతులనే తోసిపుచ్చిందన్నారు ముస్లిం సంస్థలు తరపు న్యాయవాది రాజీవ్ ధావన్. సున్నీ వర్క్ బోర్డు తరఫున ఆయన తుది వాదనలు వినిపించారు, అయోధ్యలో వివాదాస్పద స్థలంపై హిందు సంస్థల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయన్నారు ధావన్. అక్కడ ఆలయం ఉందని హిందూ సంస్థలు నిరూపించలేక పోయాయి అని అన్నారు. నాలుగు వందల ఏళ్ల నుంచి వివాదస్పద స్థలంలో మసీదు ఉన్నట్టు ఆధారాలున్నాయని చెప్పారు. ఆ స్థలాన్ని సున్నీ వర్క్ బోర్డుకు అప్పగించాలని డిమాండ్ చేశారు

గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికుల నేతలు.....

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మే పదమూడవ రోజుకు చేరింది. ఒకపక్క ఉప ఎన్నికలు ఉత్కంఠం మరోపక్క ఆర్టీసీ సమ్మేతో కేసీఆర్ తీవ్ర ఒత్తిడికి లోనైతున్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.హైకోర్ట్ కూడా ఎట్టి పరిస్థితిలో ఈ రెండు రోజుల్లో చర్చలు జరిపి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మండి పడింది. సమ్మే పై ఒకొక్కరు ఒకొక్క విమర్శలు చేస్తున్నారు. కొందరు నేతలు సమ్మేకి  మద్దత్తు కూడా తెలుపుతున్నారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల కార్యకర్తలు గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. సీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అటు నిర్మల్ లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కార్మికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అదుపు లోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్సు సర్వీసును పునరుద్ధరించారు. జయశంకర్ భూపాలపల్లి ఆర్టీసీ డిపో దగ్గర కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్ లకు దండం పెడుతూ విధులకు రావొద్దని వేడుకున్నారు. తమ పొట్టకొట్టవద్దని కుటుంబ సభ్యులతో సహా వచ్చి కోరారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.ఇక ఈ సమ్మే ఎప్పటికి ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాలి.    

హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసిఆర్ హాజరు కానున్నారా?

  తెలంగాణ సీఎం పైనే అందరి చూపులు.ఒక పక్క హుజుర్ నగర్ ఎన్నికల ప్రచారం,మరోపక్క ఆర్టీసీ సమ్మే. ఈ గండాలను కేసీఆర్ ఎలా దాటతారోనని అందరిలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. పార్టీ అధినేత కేసీఆర్ క్యాంపెయిన్ లో చొరవ చేసుకునే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఎన్నికల సంఘం నిఘా, మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె హుజూర్ నగర్ సభకు కేసీఆర్ హాజరు అవ్వాలో వద్దో తేల్చుకోలేని స్థితి  కల్పించారు. హుజూర్ నగర్ లో నేడు అధికార టీఆర్ఎస్ నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు పై ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు సీఎం వస్తారా రారా అని వారం రోజులుగా స్థానికంగా చర్చ జరగుతోంది. ఉప ఎన్నికల్లో వ్యయం పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించడమే ఇందుకు కారణం. ఎన్నికల సంఘం షాడో బృందాలు ఈ నియోజకవర్గంలో ప్రత్యేక నిఘా వేశాయి. ఈ నేపథ్యంలో సభకు కేసీఆర్ హాజరైతే అభ్యర్థిపై ఎన్నికలపై వ్యయ ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. బహిరంగ సభకు సుమారు యాభైవేలమంది హాజరవుతారని మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో వారిని తరలించేందుకు అయ్యే ఖర్చంతా టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సైదిరెడ్డి ఎన్నికల ఖర్చు నిబంధనలోకి వచ్చే అవకాశముంటుంది.ముఖ్యమంత్రి ఇక్కడికి హెలికాప్టర్లో వచ్చి వెళ్ళినందుకు సభావేదిక నిర్మాణం, నిర్వహణకు ఇతర వాహనాలకు అయ్యే ఖర్చులన్ని ఎన్నికల వ్యయం కిందకు వస్తాయి. వీటిలో కొన్ని ఖర్చులు టిఆర్ఎస్ ఖాతాలోకి మరి కొన్ని స్టార్ క్యాంపెయిన్ వర్గం అయిన సీఎం ఖాతాలోకి వెళ్తాయి. ఎన్నికల వ్యయం నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ వరుస రోడ్ షోలు కూడా రద్దయినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మి కుల సమ్మె కొనసాగుతుండటంతో సీఎం సభలో కార్మికులెవరైనా నిరసన తెలపడం వంటి ఘటనలు జరిగితే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందనే అంచనాలో పార్టీ నేతలు ఉన్నారు. దీంతో కేసీఆర్ రాకపై ఉత్కంఠ నెలకొంది.మరోవైపు అధికారులు మాత్రం సీఎం కేసీఆర్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను మాత్రం చేస్తున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. సుమారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కేసీఆర్ వస్తారా రారా అన్నదే అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.