మానవత్వంతో ఆలోచించండి: కృష్ణా జలాల వివాదంపై జగన్ స్పందన

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటీనికి కూడా నీరు లేని పరిస్థితి ఉంది ఏపీకి కేటాయించిన నీటినే మేము వాడుకుంటాం అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నాం కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందని... దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని జగన్ చెప్పారు. ఈ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లేందుకు కృష్ణా బోర్డు కూడా ఒప్పుకోదని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామని చెప్పారు. శ్రీశైలం డ్యాములో నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని జగన్ తెలిపారు. ఈ నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు కూడా మించి ఉండదని చెప్పారు. ఆ 10 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. నీటి మట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లలేదని చెప్పారు. శ్రీశైలం నీటిమట్టం 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే వెళ్తుందని తెలిపారు.

కియాలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభం

అనంతపురం : కియా ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని అంతర్జాతీయ కియా మోటర్స్ కార్ల పరిశ్రమలో ఉత్పత్తి మళ్లీ మొదలైంది. కియా రోజుకు 400 కార్ల తయారీని చేపట్టింది. పనిచేసేందుకు 500 మంది కార్మికులకు అనుమతి లభించింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కార్ల ఉత్పత్తి చేస్తామని కియా యాజమాన్యం తెలిపింది. ఇక, కంటైన్మేంట్ జోన్లలో నివసించే కార్మికుల సెలవులను పొడగించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముంద్తు జాగ్రత్తలు తీసుకుంటూ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కరోనా!

  క‌రోనా వైరస్ తమిళనాడు ప్రజలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత పది రోజుల్లోనే కేసులు మూడింతలయ్యాయి. వీటిలో అత్యధికంగా చెన్నైలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక, కోయంబేడు మార్కెట్ ప్రభావం చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది. చెన్నై తర్వాత అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నది ఇక్కడే. ఈ డెడ్లీ వైర‌స్‌ బారినపడిన 190 మంది పోలీసులు ప‌డ్డారు. . మరోవైపు, ఉన్నతాధికారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది. అలాగే, చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా బారినపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి.

క‌రోనాపై పోరుకు 20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌! లాక్ డౌన్ 4  మే 18 కంటే ముందే ప్ర‌క‌టిస్తాం!

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల 15వ తేదీలోగా వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని మే 17వ తేదీ లోగా నాలుగో విడత లాక్ డౌన్ విధివిధానాలను వెల్లడిస్తామని ప్ర‌ధాని వివరించారు. స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా కట్టడికి మార్గమని ఆయన అన్నారు. ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూనే ముందుకెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. క‌రోనాతో పోరాటం చేద్దాం. ముందుకు వెళ్దాం. క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని సైంటిస్టులు, డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌ట్టికీ క‌రోనా మ‌న జీవ‌నంలో భాగ‌మై పోయింది.  మాస్క్ ధ‌రించుదాం. సామాజిక దూరాన్ని పాటిద్దాం.  ఆత్మస్థైర్యం కలిగిన భారత్ ఆ విధంగా ముందుకెళుతుందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవస్థ, డెమోగ్రపీ అనే నాలుగు పిల్లర్లు, ఐదో పిల్లర్ డిమాండ్ అని మోడీ పేర్కొన్నారు. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నామ‌ని ప్రధాని చెప్పారు. మనవద్ద తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం. లోక‌ల్ ప్రాడెక్ట్స్ కొన‌డ‌మే కాదు వాటికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.

ప్రాణాలు కాపాడుకుంటూ క‌రోనాపై యుద్ధం కొన‌సాగిద్దాం! ప్ర‌ధాని మోదీ

జాతిని ఉత్తేజ పరుస్తూ ప్ర‌ధాని మోదీ మ‌ళ్లీ ప్ర‌సంగించారు. 2020లో 20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను ‌ప్ర‌క‌టించారు. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ ల‌క్ష్యంగా ప్ర‌ధాని ఆర్థిక ప్యాకేజ్‌ను ప్ర‌క‌టించారు. ఇది దేశ జిడిపిలో 10 శాతం. అన్నివ‌ర్గాల‌కు న్యాయం చేసేలా ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని చెప్పారు. స్వ‌యం స‌మృద్ధికి ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఒక వైర‌స్‌ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. మ‌న‌వ‌త్వానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. క‌రోనాపై పోరాటాంలో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. అయితే ఇది గెల్చి తీరాల్సిన యుద్ధం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 42 ల‌క్ష‌ల మందిపై క‌రోనా ప్ర‌భావం చూపింది. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి యుద్ధం చేస్తున్నారు. ప్ర‌పంచంలో జీవ‌న్మ‌ర‌ణ పోరాణం కొన‌సాగుతోంది. దేశంలో అనేక మంది త‌మ వారిని కోల్పోయారు. ఈ విప‌త్తు క‌న్నా మ‌న సంక‌ల్పం గొప్ప‌ది. మ‌న ద‌గ్గ‌ర సామ‌ర్థ్యం వుంది.  ఇలాంటి విప‌త్క‌ర స్థితిని చూడ‌లేదు. విన‌లేదు. ఈ సంక్షోభం నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాలి. ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌రం వుంది. మ‌న ధృక్ప‌థం దృఢంగా వుండాలి. గ‌త శ‌తాబ్దం నుంచే వింటూనే వున్నాం. 21వ శ‌తాబ్దం భార‌త‌దేశానిదే. భార‌త పురోగ‌తే ప్ర‌పంచ పురోగ‌తిగా మారింద‌ని ప్ర‌ధాని అన్నారు.

కరెంటు బిల్లుల్ని చూసి ప్ర‌జ‌లు గుడ్లు తేలేస్తున్నారు! కరెంటు షాక్!

లిక్కర్‌ దెబ్బతో రాష్ట్ర ఖజనాని నింపుకుంటూ, మందు బాబుల పొట్ట కొడుతున్న ప్రభుత్వాల క‌న్ను ఇప్పుడు కరెంటు బిల్లుల మీద పడింది. కరోనా వైరస్‌ కారణంగా ఓ నెల రీడింగులు తీయకపోవడంతో, శ్లాబ్‌లు మారిపోయాయి. అదొక్కటే కారణం కాదు.. ఇతరత్రా కారణాలు కూడా కలిసి బిల్లులు వాచిపోతున్నాయి.. దాంతో, సామాన్యుడి నడ్డి విరిగిపోతోంది. విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. క‌రోనా కార‌ణంగా బాగా ఆల‌స్యం జ‌రిగింది. దీంతో శ్లాబ్‌ల లెక్క మారిపోయింది. 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్క‌డే వుంది టెక్నిక్‌. ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా అంటే మూడు రూపాయ‌ల 60 పైస‌ల స్లాబ్ నుంచి ఆరు రూపాయ‌ల తొంభై పైస‌ల స్లాబ్‌లో బ‌ల‌వంతంగా చేరాల్సి వ‌స్తోంది. లెక్క ఇలా వుంటోంది. కేవ‌లం రెండు రోజులు ఆల‌స్యంగా బిల్ రీడింగ్ చేయ‌డం వ‌ల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఇప్పుడే మొదలైంది అసలు మజా... ముందుంది మరింత వాయింపుడు వ్యవహారమంటూ, ఆర్టీసీ ఛార్జీలు సహా.. ఇతరత్రా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి.

దేవుడు సంపాదిస్తేనే సేవ‌కుల‌కు జీతాలా? టిటిడి లీల‌లు!

పాల‌కులు త‌ల‌చుకుంటే విద్య, వైద్యం మాత్రమే కాదు. భక్తి కూడా మార్కెట్ వ‌స్తువు అయిపోయింది. ‌దేవుడ్ని కూడా వ్యాపార వ‌స్తువుగా చేసేశారు. ఆధ్యాత్మిక‌త ఉట్టిప‌డేలా వుండాల్సిన మ‌త సంస్థ‌ల్ని ఆదాయ‌వ‌న‌రుగా చూడ‌డం ప్రారంభించారు. అందుకే వ్యాపార భాష మాట్లాడుతూ ఆదాయం త‌గ్గింది కాబ‌ట్టి టిటిడి ఉద్యోగుల జీతాల్లో కోత విధించామంటున్నారు. కరోనా వైరస్‌ కారణంగా టీటీడీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింద‌ట‌. దాంతో, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా టీటీడీ ఉద్యోగులకూ వేతనాల కోత అమలవుతోంది. ఇది 'కోత' కాదు, 'సర్దుబాటు' అని ప్రభుత్వం చెబుతున్నా, జీతాల కోతతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు. టీటీడీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? మ‌రి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకు సంబంధించిన టన్నుల కొద్దీ బంగారం, వేల కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. మరి, అలాంటి టీటీడీ సుమారు 100 కోట్లు వెచ్చించి, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వలేదా.? వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక, టీటీడీలో చాలా మార్పులొచ్చాయి. అద్దె గదుల రేట్లు, లడ్డూ రేటు పెరిగాయి. టీటీడీ అంటే, భక్తులకి సౌకర్యాలు కల్పించడం కాదు, వీఐపీల సేవలో తరించేదేనన్న అభిప్రాయం రోజురోజుకీ బలపడిపోతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. భక్తులకు అవసరమైన మేర, తక్కువ ధరలో లడ్డూ ప్రసాదం అందించలేని ఆర్థిక సమస్యల్లో టీటీడీ వుందా.? తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాలకు వివిధ రూపాల్లో ఆదాయం ల‌భిస్తుంది. అందులో హుండీ ద్వారా వ‌చ్చే దానితో పాటుగా ద‌ర్శ‌నాల టికెట్లు, ల‌డ్డూ ప్ర‌సాదం, వ‌స‌తి గదులు, క‌ల్యాణ క‌ట్ట స‌హా ప‌లు మార్గాల్లో ఆదాయం వ‌స్తుంది. క‌రోనా దెబ్బ‌తో తిరుమ‌ల పూర్తిగా ఖాళీ కావ‌డంతో ఆదాయ మార్గాలన్నీ నిలిచిపోయాయి. టీటీడీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం ల‌భించింది. అంటే నెల‌కు వంద కోట్ల‌కు పైగా ఆదాయం లెక్కన స‌గ‌టున రోజుకి రూ. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఆదాయం వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే, అది రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం.. అనే వాదన ఎప్పటినుంచో వుంది. అందులో వాస్తవం లేకపోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆ పార్టీ, తమకు అత్యంత సన్నిహితులైనవారిని టీటీడీకి సంబంధించి కీలక పదవుల్లో నియమించడం చూస్తూనే వున్నాం. కేంద్ర మంత్రి పోస్ట్‌తో సమానంగా టీటీడీ ఛైర్మన్‌ పదవికి 'గిరాకీ' వుందంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

'వాట్సాప్ పాఠాలు'... ఏపీ ప్రభుత్వం నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు... సిలబస్‌ను వాట్సాప్ సహా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా విద్యార్ధులకు అందించాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం... ప్రతీ పాఠశాలకూ ఓ ‘వాట్సాప్ గ్రూప్’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక పాఠశాలలోని విద్యార్ధులు, టీచర్లు... ఒక గ్రూపులో ఉంటారు. పదవ తరగతి పరీక్షల కోసం... విద్యార్ధులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ మీడియా ద్వారా అందించనున్నట్లు సమాచారం. ‘ఆన్‌లైన్’ ద్వారా తరగతులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. మొత్తం పాతిక వేల మంది వరకు విద్యార్ధులు, మరో 933 మంది ఉపాధ్యాయులు ఈ వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి ‘ యూ ట్యూబ్‌’లో అప్‌లోడ్ చేస్తారు. సంబంధిత ‘యూఆర్‌ఎల్ లింక్’లను వాట్సాప్ గ్రూప్ లేదా ‘ఈ-మెయిల్’ ద్వారా విద్యార్ధులకు పంపుతారు. ఆ వీడియోల ద్వారా విద్యార్ధులు తరగతులను ఫాలో కావాల్సి ఉంటుంది. అలాగే విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్‌ను కూడా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంటుంది. మొత్తంమీద ఈ విధానంతో కరోనాను కట్టడి చేయడంతోపాటు విద్యార్ధులకు సమయం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు కూడా ఇదే విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎల్ జీ గ్యాస్ లీక్ కి కార‌ణం మానవ తప్పిదమే! ఫోరెన్సిక్

లాక్ డౌన్ సందర్భంగా మెయిన్ టెనెన్స్ లో నిర్లక్ష్యం, మానవ తప్పిదాల ఫలితంగానే స్టెరీన్ గ్యాస్ లీక్ అయినట్టు ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం తెలిపింది. విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ కి మానవ తప్పిదమే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. స్టెరీన్ స్టోరేజీ ట్యాంక్ లోపల ఆటో పాలిమరైజేషన్ ఇన్ హిబిటర్ని మిక్స్ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అలాగే 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండేలా చూడడంలో అలసత్వం వహించిన‌ట్లు తెలిసింది. డాక్టర్ సరీన్, టి.సురేష్ నేతృత్వంలో ఈ సంస్థకు చెందిన టీమ్ ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి సాక్ష్యాధారాలు సేకరించి రిపోర్ట్ త‌యారుచేసింది. సెల్ఫ్ పాలిమరైజేషన్ ని నివారించేందుకు స్టెరీన్ గ్యాస్ ని టెర్షియరీ బ్యుటైల్ కెటిచాల్ అనే కెమికల్లో కలపాల్సి ఉందని, కానీ లాక్ డౌన్ కాలంలో ఇలా జరగలేదని వివరించారు. సెల్ఫ్ పాలిమరైజేషన్ క్రమంగా మొదలై.. కెమికల్ రియాక్షన్ కి దారి తీసింది..దీంతో 150 డిగ్రీల సెంటీగ్రేడ్ తో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడింది అని ఈ నివేదిక తెలిపింది. దీనిని వెరిఫై చేయడానికి కంట్రోల్ రూమ్ లో ఒక ఆపరేటర్ ఉండాలని, తాము సైట్ ని పరిశీలించిన రోజున స్టోరేజీ ట్యాంక్ లో టెంపరేచర్ 120 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్టు ఈ బృందం పేర్కొంది. కూలింగ్ ప్రాసెస్ ని కూడా సరిగా నిర్వహించలేదని డాక్టర్ సరీన్ తెలిపారు.

పిచ్చి చైనా.. తాను తీసుకున్న గోతిలో తానే పడింది

కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొన్ని కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు అసలు శాశ్వతంగా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనంతటికి కారణం చైనా అని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే.. కరోనా వైరస్ సృష్టించింది చైనానే అనడానికి తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతోంది. ఓ రకంగా దాదాపు అన్ని దేశాలు చైనా వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు.. ఈ కరోనా ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద గట్టిగానే పడింది. మనం ఓ పది వస్తువులు కొంటే వాటిల్లో దాదాపు ఏడెనిమిది వస్తువులపై 'మేడ్ ఇన్ చైనా' అని రాసి ఉంటుంది. దీనినిబట్టే ప్రపంచ మార్కెట్ పై చైనా వస్తువుల ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పిన్నీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ దాకా క్వాలిటీతో సంబంధం లేకుండా దాదాపు అన్ని ఐటమ్స్ తయారుచేసి ప్రపంచ దేశాల మీదకు వదులుతుంటుంది చైనా. కాస్ట్ కూడా అందుబాటులో ఉండటంతో ప్రజలు కూడా తెలిసో తెలియకో చైనా వస్తువులు కొంటుంటారు. దీంతో ఇన్నాళ్లు చైనా ఆటలు సాగాయి. అయితే ఇప్పుడు కరోనా గేమ్ లో చైనా కూడా బలైంది. కరోనా దెబ్బకి నిత్యవసరాలు తప్ప అనవసర వస్తువులు కొనాలన్నా ఆలోచన ప్రజల్లో లేదు. ఒకవేళ కొనాలన్నా డబ్బులు కూడా లేవు. దీనికితోడు ఇప్పుడు దేశాలు కూడా వస్తువులు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో లేవు. ఇక చైనా నుంచైనా అసలు ఛాన్సే లేదు. అందుకే చైనాలో చాలా కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ముఖ్యంగా గార్మెంట్స్, టాయ్స్ కంపెనీలు మూతపడ్డాయి. తయారుచేసినా కొనేవారు లేరు, వర్కర్స్ కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో పలు కంపెనీలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రపంచ మార్కెట్ ని శాసించిన చైనాలోని కంపెనీలే మూతపడే పరిస్థితికి చేరుకున్నాయంటే, ఇలాంటి సమయంలో మన దేశం తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

10 వేల మందితో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మహానాడు!

ప్ర‌తి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును తెలుగు తమ్ముళ్లు పండుగలా జరుపుకుంటారు. అయితే ఈసారి మహానాడు వినూత్నంగా జరుగబోతోంది! భారీ బహిరంగసభ గాకుండా.. వర్చువల్‌ మీడియా వేదికగా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 29న టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించగా ఇప్పుడు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మహానాడు జరుగనుంది. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుండడం ఇదే తొలిసారని టీడీపీ ముఖ్యనేతలు తెలిపారు. సాధారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పదుల సంఖ్యలో నేతలతో భేటీకి అవకాశం ఉంటుంది. ఒకేసారి 10వేల మందితో జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించడం సాధారణ విషయం కాదని వారు పేర్కొంటున్నారు. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల దృష్ట్యా కిందటిసారి మహానాడు నిర్వహణ సాధ్యం కాలేదు. లాక్‌డౌన్‌ ఎప్పటివరకు ఉంటుందో స్పష్టత లేకపోగా... కరోనా నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో, ప్రత్యామ్నాయా లపై పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. జూమ్‌ కాన్పరెన్స్‌కు అనుగుణంగా ఏర్పాట్లుచేయాలని వారికి సూచించారు.

తాత్కాలిక కోవిడ్19 కేర్ సెంటర్ గా రైల్వే బోగీలు!

కేంద్ర రైల్వే శాఖ ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న కోవిడ్ సమస్యకు తమవంతు సేవగా రైల్వే బోగీలను తాత్కాలిక కోవిడ్19 కేర్ సెంటర్ గా మరియు కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చి బోగీలలో అనుమానిత లేదా స్వల్ప లక్షణాలతో బాధపడే రోగులకు అవసరమైన అదనపు బెడ్ లు సౌకర్యం కల్పించడానికి ముందుకు వ‌చ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 215 రైల్వే స్టేషన్లలో ఒక ప్రత్యేక రైలు ను ఏర్పాటుచేసి అందులో గల బోగీలను కేంద్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాల ప్రకారం ఆ రైలులో గల బోగీలను కోవిడ్ చికిత్స అందించేందుకు అనువుగా మార్పు చేసి క్రిమి రహితం చేసి కోవిడ్ కేర్ మరియు కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చి నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే అధికారులు స్థానిక రాష్ట్ర నోడల్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపడం ద్వారా రాష్ట్రం లో అవసరమైన చోట ఈ ప్రత్యేక రైలు లో కోవిడ్ హెల్త్ సెంటర్ లేదా కోవిడ్ చికిత్స కేంద్రం లను ఏర్పాటు చేసి స్థానిక అధికారులకు అప్ప గించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన విధంగా బోగీలలో పైప్ మార్గాలతో ఆక్సిజన్, పడకలు, దుప్పట్లు మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. అంతే కాకుండా ఈ ప్రత్యేక రైలు లో కోవిడ్ అనుమానితులు మరియు కోవిడ్ నిర్ధారించబడిన వ్యక్తులకు సంబంధించి వేరు వేరుగా కోచ్ లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక కోవిడ్ చికిత్స రైలు నందు కోచ్ లలో క్యాబిన్ కి ఒక కోవిడ్ రోగిని అనుమతిస్తారు మరియు .కొన్ని ప్రత్యేక సందర్భం లో క్యాబిన్ కు ఇద్దరినీ అనుమతిస్తారు. ఇప్ప‌ట్టికే దేశం లో సుమారు 85 స్టేషన్లలో ఏర్పాటు చేయబడిన కోవిడ్ చికిత్స ప్రత్యేక రైల్వే బోగీలలో రైల్వే శాఖ వైద్య సిబ్బంది చే సేవలు అందించబడుచున్నది. ఈ రైల్వే స్టేషన్ లలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోవిడ్ రైలు స్థానిక డేడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రికి అనుసంధానము ఉండేలా చూస్తారు. ఒకవేళ ఈ రైలులో చికిత్స పొందుతున్న వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక కోవిడ్ ఆరోగ్య కేంద్రానికి తరలించుటకు గాను అన్నీ వేళల అందుబాటులో ఉండే ఆక్సిజన్ సౌకర్యం గల అంబులెన్స్ ని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక రైలు కోవిడ్ కేంద్రం లో పనిచేసే వైద్య సిబ్బంది స్థానిక జిల్లా వైద్య అధికారి లేదా స్థానిక రాష్ట్ర నోడల్ అధికారి ద్వారా గుర్తించబడి స్థానిక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లో పని చేయటం జరుగుతుంది సూచించిన ప్రమాణాల మేర శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే ఇటువంటి కేంద్రాలలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ఇక ప్రత్యేక కోవిడ్ రైలు నిర్వహణ లో రైలు ఎక్కడైతే నిలుపబడిందో అక్కడ స్థానిక రైల్వే సిబ్బంది రైలు కు కావలసిన ఎలెక్టికల్ రిపేర్లు గాని చిన్న చిన్న మరమ్మతులు వంటి నిర్వహణ నిర్వహిస్తారు. అవసరమైన చోట భోజన వసతి ఏర్పాట్లు కొరకు IRCTC బాధ్యత తీసుకుంటుంది. అలాగే రైల్వే రక్షక దళం బోగీలలో చికిత్స తీసుకునే రోగులకు, చికిత్స అందించే వైద్యులకు మరియు ఇతర సహాయ సిబ్బంది యొక్క రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంది. స్టేషన్ లో ప్రత్యేక ప్రదేశములో నిలుపబడిన కోవిడ్ రైలు చేరుటకు సరైన సూచీలు మరియు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం ద్వారా సామాన్యులు మరియు రోగులు చేరుకొంటారు బోగీలలో ఉష్ణోగ్రతలు పెరగకుండా తగిన చర్యలు చేపడతారు. కోవిడ్19 వ్యక్తుల విసర్జితాలు నిర్మూలనలో కేంద్ర పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాలు అనుసరించబడతాయి. మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ ప్రత్యేక కోవిడ్ చికిత్స రైలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాసా, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్, కొండాపురం(కడప), దిగువ మెట్ట స్టేషన్లలో లో ఈ ప్రత్యేక రైలు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. చికిత్సలు ముగిశాక ట్రైన్ ను తిరిగి రైల్వే శాఖ కు అందించే సమయం లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాలు ప్రకారం ఈ ప్రత్యేక రైలు ను క్రిమి రహితం చేసి రైల్వే శాఖకు అప్ప చెప్పడం జరుగుతుందని కోవిడ్ 19 స్టేట్ నోడ‌ల్ అధికారి డాక్ట‌ర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

బువ్వ తినే పైసలతో బ్రాందీ, విస్కీ తాగేస్తుండు!

గరీబోనికి సర్కారికిచ్చిన 1500 రూపాయిలు మందు తాగనీకే ఖర్చయిపోయే. గిప్పుడు రాక్షస పాలనలో ఫార్మ్హౌస్ ముఖ్యమంత్రి 5 దినాల్లో 600 కోట్ల రూపాయిల మందు తాపించి, ఇంట్లో ఆడోళ్ళ, చిన్నపిల్లల బతుకులు కూలుస్తుండు అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుప‌డుతోంది. మందు పేరుతో సామాజిక దూరం పోయి వైరస్ కు జనాలు బలైతే, తాగొచ్చి ఆడోళ్లను, పిల్లలలను కొడుతుంటే, బువ్వ తినే పైసలతో బ్రాందీ, విస్కీ తాగేస్తుంటే, ఆ పాపం, ఏడుపు తగిలి నీ సర్కారు త్వరలో నాశనమౌతదని మహిళలు శాపాలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని రుగ్మతలకు కారణం మద్యం కాబట్టి దీన్ని దశలవారీగా నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన‌ని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మ‌ద్యం షాపుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని టి.కాంగ్రెస్ ఆర్టీఐ ద్వారా సేక‌రించింది. తెలంగాణాలో ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయి అని అడగగా ఏమీ లేవు అని స‌ర్కార్ స‌మాధానం ఇచ్చింది. అయితే ఎన్ని ఇల్లీగల్ కేసులు బుక్ అయ్యాయని అడగగా 22 జిల్లాల వారిగా 17952 కేసులు నమోదయ్యాయి అత్యధికంగా వికారాబాద్ జిల్లా కింద పరిగి ఎస్ హెచ్ ఓ కింద 8233 కేసులు నమోదయ్యాయి మహబూబ్ నగర్ జిల్లా 1022 జగిత్యాల కింద 783, రంగారెడ్డి కింద 784 గు వనపర్తి 492, సంగారెడ్డి 889, కరీంనగర్ 722, సిద్దిపేట్ 419 ,మహబూబాబాద్ 354 ,జనగాం 511 ,వరంగల్ 481, సికింద్రాబాద్ 153, మెదక్ 462, నిజామాబాద్ 217, కొత్తగూడెం 496, మేడ్చల్ 280, పెద్దపల్లి 1024 నమోదయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎనిమిది కోట్ల 50 లక్షల జనాభా ఉన్న 23 జిల్లాల్లో లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఆర్టీఐ ద్వారా వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. 2008 నుంచి 2009 వరకు 4888.18, కోట్లు 2009 నుంచి 2010 వరకు 5595.07 కోట్లు 2010 నుంచి 2011 వరకు 6512 కోట్లు 2011 నుండి 2012 వరకు 7275 కోట్లు 2012 నుంచి 2013 వరకు 8575 కోట్లు 2013 నుంచి 2014 వరకు 9890 కోట్ల 63 లక్షలు అంటే లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం 26 శాతం. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుండి 2019 వరకు అంటే 3 కోట్ల 75 లక్షల జనాభా ఉన్న ఉమ్మడి పది జిల్లాల ఆర్టీఐ ద్వారా పొందిన ఆదాయ వివరాలు ఇలా వున్నాయి. 2014 నుంచి 2015 వరకు 10,853 కోట్లు 2015 నుంచి 2016 వరకు 12,706 కోట్లు, 2016 నుంచి 2017 వరకు 14,184 కోట్లు 2017 నుంచి 2018 వరకు 17,597 కోట్లు 2018 నుంచి 2019 వరకు 20,859 కోట్లు అంటే లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం 65 శాతం ఆదాయం పెరిగింది. 2019 ఏప్రిల్ అనగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో 1884 కోట్ల యాభై ఐదు లక్షల అమ్మకాలు జరిగినట్లుగా నమోదయింది. 2019 డిసెంబర్ 30 31 రెండు రోజుల ఆదాయం 450 కోట్లు గత సంవత్సరం డిసెంబర్ 30, 31 అమ్మకాలతో పోల్చితే నాలుగు శాతం ఎక్కువ.. ఉదాహరణకి పంజాబ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 2017-18 లో లిక్కర్ మీది ఆదాయం 5,136 కోట్లు, 2018 నుంచి 2019 లో 5,450 కోట్లు నమోదయింది. అంటే 10 నుంచి 12 శాతం పెరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం వసతి లిక్కర్ నమ్మకమే అన్నట్లు 65 శాతానికి పెంచిన ఘనత ఈ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లో ఏ పాలసీ అయినా ఆలస్యం కావచ్చేమో కానీ లిక్కర్ పాలసీ మాత్రం ఒక రోజు కూడా అటు ఇటు కాలే దీన్నిబట్టి ఇ రాష్ట్ర ప్రజల పైన ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తూ రాష్ట్రంలో నేర ప్రవృత్తి పెరిగేందుకు కారణం అవుతుంది. రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు నెలకొల్పాల్సి ఉండగా...రహదారికి 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలను నెలకొల్పేందుకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ భాద్యతరహిత్యాన్నికి నిదర్శనంగా చెప్పొచ్చు. దిశ ఘటన జరిగాక అయిన ప్రభుత్వం మద్య నియంత్రణ కు చర్యలు తీసుకుంటుందని ఊహించాం కానీ సర్కారు ఆదిశగా ఏమాత్రం కృషి చేయడం లేదు.అత్యాచారాలు నిత్యం జరుగుతుండటానికి గల ప్రధాన కారణమైన లిక్కర్ ను ప్రభుత్వం అదుపు చేయకపోవడమే...తక్షణమే ప్రభుత్వం మద్యం నియంత్రణకు దశల వారీగా చర్యలు తీసుకోవాల‌ని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గుజరాత్ రాష్ట్రంలో మద్యపాన నిషేదం ఉంది.మరి మోడి గారు దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయవచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నీరా పాలసి నడవాలన్న బెల్టు షాపులు బందు కావలి. అరోగ్య వంతమైన తెలంగాణ గా తీర్చి దిద్దలంటె మద్యాని నియంత్రించ వలసిన బాధ్యత ప్రభుత్వనిదే. లేనిచో ఈ మహిళా లోకాన్ని చైతన్య పరిచి ఉద్య‌మించ‌డానికి తెలంగాణా పిసిసి యాక్ష‌న్ ప్లాన్ రూపొందించుకుంటోంది.

మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం!

మొహంపై చెరగని చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతటి బాధలో నున్న వారికైనా ఓదార్పునిస్తున్నారు నర్సులు. ఈ అపత్కాల సమయంలో నర్స్‌లే బాధితులకు కొండంత అండగా వుంటున్నారు. ప్రస్తుత కరోనా వైరస్‌ ‌కట్టడి చేసేందుకు వైద్యులతో పాటు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్‌ ‌కట్టడికి వేల సంఖ్యలో నర్సులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలుసు. అయినా వారి లక్ష్యం ఒకటే. బాధితులను ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించడం. ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ‌మహమ్మరిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స మరియు సంరక్షణను అందిస్తున్నారు. వారి సేవలు వెలకట్టలేనివి. ప్రమాదం అంచున నిలబడి వైరస్‌ ‌బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నిరంతరం రోగుల మధ్యనే వుంటూ జబ్బులతో పోరాటం చేస్తూ వుంటారు. అంటు రోగాలతో సహవాసం చేస్తుంటారు. రాత్రి వేళల్లో సైతం డ్యూటీలు చేస్తుంటారు. పని ఒత్తిడిని ఎదుర్కోవడం, ఎదుటి వ్యక్తి బాధలను ఓపికగా వినడం వారికి వృత్తిలో అలవాటు అయిన లక్షణాలు. వారి ఓదార్పు మాటలు, సేవలు రోగులకు మనోధైర్యాన్ని ఆత్మ స్టైర్యాన్ని కలిగిస్తూ వారి జబ్బులను సగం నయం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ విపత్కర సమయంలో ఒక యజ్ఞం వలె సేవలందిస్తున్న నర్సుల సేవలకు వెలకట్టలేం. కరోనా సోకితే కన్న బిడ్డ నైనా తాకలేం. బంధువులైనా, ప్రాణ స్నేహితులైరా సరే దగ్గరికి రాలేరు. ఒక రకంగా ఒంటరైన పేషేంటుకు హాస్పిటలే దిక్కు. అలాంటి పేషేంట్‌ ‌దగ్గరకు ఆత్మీయంగా వచ్చి సేవలు అందించే వ్యక్తి అన్నీ తానై వ్యవహరించి అమ్మను మరిపిస్తుంది. కరోనా విలయంలో "అమ్మ"లా ఆదరిస్తూ,కనిపించే దైవాలుగా వైద్య సేవలు అందిస్తున్న "నర్సు" లందరికి శుభాకాంక్షలు.

అడవుల్ని సైతం వ‌ద‌ల‌డం లేదు! మడ అడవుల్ని జగన్‌ నుంచి కాపాడండి! చంద్ర‌బాబు పిలుపు

మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడంటూ చంద్రబాబునాయుడు పోస్టు పెట్టారు.  ఐక్యరాజ్య సమితి సైతం కోరింగ మడ అడవులను గుర్తించింది. కాకినాడకు రక్షణ కవచం లాంటివి మడ అడవులు. ఇలా నరికేస్తే రేపు తుపానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటీ? ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి? తూర్పు గోదావరి జిల్లాలోని మడ అడవులను నరికివేయిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆ అడవులు ఎలా ఉండేవో, నరికివేతతో అక్కడి ప్రాంతం ఎలా మారిపోయిందో తెలుపుతున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. 'ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?' అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మడ అడవులను జగన్‌ నుంచి కాపాడాలంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించం: కేసీఆర్

మాకు చెప్పకుండా కొత్త ప్రాజెక్టా? జ‌గ‌న్ స‌ర్కార్‌పై కేసీఆర్ ఆగ్రహం! వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించేలా ఏపీ ప్రభుత్వం జీఓ తీసుకురావడం విభజన చట్టానికి విరుద్ధమని, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుని తప్పు చేశారని, ఈ విషయంలో తమను సంప్రదించకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో రాష్ట్రం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అపెక్స్ కమిటీ నుంచి ఆమోదం పొందకుండానే ఏపీ ముందడుగు వేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టని, ఏ కొత్త నిర్మాణమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించే తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుతో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి సమస్య ఏర్పడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో నెలకొన్న విభేదాలను, వివాదాలను పక్కనబెట్టి నదీ జలాలను వాడుకుందామని తాను స్నేహహస్తం అందించానని, బేషజాలు లేకుండా తాను చొరవ చూపితే, తమను సంప్రదించకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం బాధను కలిగించిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. నదిలో నీటి వాటాలను తేల్చడంలో ట్రైబ్యునల్ లో జాప్యం జరుగుతోందని గుర్తు చేసిన ఆయన, సత్వర న్యాయం కోసం అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాలని అన్నారు.

మే 18 నుంచి ఎగరనున్న దేశీయ విమానాలు!

ఈ నెల 17‌తో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాతి రోజు నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమాన సేవలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై డీజీసీఏ, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులు, డీఐఏఎల్ అధికారులతో కూడిన కమిటీ ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న తనిఖీలు నిర్వహించింది. సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికార వర్గాలు తెలిపాయి.