వరుస పండుగలతో బంగారం షాపులు కళకళ...

 

బంగారం కొనుగోళ్లు అంటే దృష్టి పెట్టని మగువలు ఉండనే ఉండరు. అందులోనూ పండుగ పూట పెట్టే ఆఫర్లను చూసి ఆకర్షితులు అయ్యేవారు ఇంకెందరో. దీర్ఘ కాలిక పెట్టుబడిగా బంగారం మొదటి స్థానంలో ఉండగా ఊరిస్తున్న కొత్త డిజైన్ లో ఒక వైపు దాచుకోవాలన్నా కోరిక మరో వైపు బంగారం కొనుగోళ్లకు ప్రోత్సహిస్తున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గు లున్నా ధైర్యంగా కొనుగోళ్లుచేస్తున్నారు ప్రజలు. పసిడి కొనుగోళ్ల కు ఇదే తగిన సమయం అంటున్న మార్కెట్ వర్గాలు. దుర్గాష్టమి నుంచి విజయ దశమి వరకు బంగారం కొనుగోలుకు శుభతరుణం అని భారతీయుల నమ్మకం. అప్పుడు కుదరకపోతే దీపావళి ముందు వచ్చే దంతేరాస్ రోజు న తప్పక కొనుగోళ్లు చేయడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ సారి అక్టోబరు ఎనిమిది న విజయ దశమి అక్టోబర్ ఇరవై ఐదున ధంతేరాస్ జరుపుకొంటారు. రెండు పండుగ లకు మధ్య పక్షంరోజుల కుపైగా టైమ్ ఉన్నందున దసరా నవరాత్రుల్లో బంగారం కొనుగోళ్లు పెరిగాయని ధంతేరాస్ వరకు ఆగేందుకు వినియోగదారులు సిద్ధంగా లేరని మార్కెట్ వర్గా లు చెబుతున్నాయి. పండుగ లతో పాటు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు పెళ్లిళ్ల సీజన్ రాబోతున్నాయి. దానితో ఇప్పుడే బంగారం కొనుక్కుని దాచుకోవాలని భావించే వారికి ఇదే తగిన తరుణమని బంగారం రేట్లు బాగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుదలపట్ల ఉన్నాయి. 

రూపాయి బలపడడం తో దాని ప్రభావం బంగారం మార్కెట్ పై కూడా ఉంది. దేశీయ మార్కెట్ లో కొనుగోలుదారు లు కొత్త జోష్ లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఒక వైపు బంగారం మరోవైపు స్టాక్ మార్కెట్ పై ఇన్వెస్టర్ లు దృష్టి సారించారు. ఇప్పుడు చిన్న మధ్య తరహా ఇన్వెస్టర్లంతా రెండువైపులా చూస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధుల్లో సగం బంగారం కొనేందుకు మిగిలిన సగం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడు లు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది బంగారం కొనుక్కు ని ఐదేళ్ల వరకు దాచుకోగలిగితే పెట్టుబడి రెట్టింపవుతుంద ని మార్కెట్ వర్గా లు విశ్లేషిస్తున్నాయి. అయిదేళ్ల లో బంగారం ధర పది గ్రాము లకు డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు కొనుక్కొని దాచుకోవటం మంచిదే నని మార్కెట్ వర్గా లు సూచిస్తున్నాయి. బంగారం ఎంత తొందర గా కుంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వారం రోజుల పాటు రోజూ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెరిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దేశీయంగా ఇప్పుడు నగర వ్యాపారుల నుంచి కూడా మంచి గిరాకీ ఉంది దానితో బంగారం కొరత ఏర్పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సరి కొత్త డిజైన్ లు రూపొందించి వినియోగదారు లను ఆకట్టు కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి .బంగారం షాపుల వారి ప్రకటన లు కూడా ఆకట్టుకునేది గా ఉన్నాయి కొన్ని గ్యారెంటీ లకు సంబంధించి వ్యాపారు లు ఇచ్చే హామీల తో వినియోగదారుడు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దానితో పండుగ రోజు ల్లో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గించారు. తాజాగా రెపో రేట్ల ను తగ్గించా దానితో బ్యాంకు ల్లో డబ్బు దాచుకోవాలనుకునే వారికి పెద్దగా బట్టి రాని పరిస్థితి ఉంది. దీర్ఘ కాలిక ఇన్వెస్ట్ మెంట్ గా బంగారన్ని కొనుక్కొంటే దాచుకోవటానికి వీలుంటుందని సాధారణ వినియోగదారులు నమ్ముతున్నారు. బ్యాంకు లో డబ్బు దాచుకునే కంటే బంగారం కొనుక్కుని లాకర్ లో పెట్టుకోవాలనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగు తోంది. పండుగల అడ్వాన్స్ లు పండుగ బోనస్ లతో అందుకున్న సొమ్ము ను బంగారం కొనుగోళ్లు ఇన్వెస్ట్ చేయాలని పలువురు వినియోగదారులు తీర్మా నించుకుంటున్నారు. బంగారం స్కీమ్ లలో చేరి డబ్బు పొదుపు చేసిన వారు సైతం కొనుగోళ్ల కు ఇదే తగిన తరుణంగా భావిస్తున్నారు సగటు భారతీయుడి కి బంగారం ఒక సెంటిమెంట్ ఏడాదికి ఒకసారి అరతులం బంగారమైనా కొనుక్కోవాలనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సెంటిమెంట్ చాలా ఎక్కువే పైగా ఇప్పుడు ఆదాయాలు పెరగడం దానితో పాటు పొదుపు పెరగడంతో ఇన్వెస్ట్మెంట్ కు అవకాశాలు పెరిగాయి. మరి ఆ పెట్టుబడిని బంగారంలో పెడితేనే మంచిదనే జనం విశ్వసిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం సగటు వినియోగదారుడి చేతికందని ఎత్తుకు ఎదిగింది. సగటు మనిషి దగ్గరున్న డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు గోల్డ్ మార్కెట్ ఒక్కటే సరైన ప్రదేశంగా కనిపిస్తుంది. దానితో ఇప్పుడు జనమంతా బంగారంపై దృష్టి పెట్టారు అందుకే పండుగ సీజన్ లో బంగారం షాపులో కళకళలాడుతున్నాయి..నిజంగానే బంగారం ధర రాను రాను పెరగనున్నదా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.