విరిగిన మూసీ నది ఐదవ గేటు...
posted on Oct 9, 2019 @ 2:19PM
భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతటా వరదలతో నగరాలు సైతం నీట మునుగుతున్నాయి.ఇది ఇలా ఉండగా జలాశయాలు కూడా నిండు కుండను తలపిస్తున్నాయి.తాజాగా మూసీ నది గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోతుంది. ఇప్పటికే రెండు టీఎంసీ లకు పైగా నీరు ప్రాజెక్టు నుండి ఖాళీ అయిపోయింది. దీంతో రైతు లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐదవ నెంబర్ గేటు విరిగిపోవడం తో మొత్తంగా రోజు కూడా పదిహేను వేల క్యూసెక్యుల నీరు అయితే వృధాగా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మూసీ ప్రాజెక్టు సంబంధించి ఆరు వందల నలభై ఐదు ఫీట్ల పూర్తి స్థాయి సామర్థ్యం కాగా ఆరు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు జీరో వరకు కూడా నీరు చేరుకున్నది. ఆ తర్వాత ఒక్కసారిగా ఐదు నెంబర్ గేటు శనివారం సాయంత్రం విరగటంతో నీరు వృధాగా పోతున్న పరిస్థితి నెలకొన్నది. ఇది నిజాం కాలంలో పంటల అరవై మూడు లో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్ల క్రితం రెండు వేల పదిహెడు లో స్వప్న కన్స్ ట్రక్షన్స్ మొత్తం ఇరవై గేట్లు దీనికుండగా మొత్తం ఇరవై గేట్లు మాత్రమే వినియోగంలోకి ఉంచి పది గేట్లను మూసేశారు. ఈ డ్యామ్ ఒక్క పూర్తి స్థాయి సామర్థ్యం ఫోర్ పాయింట్ ఫోర్ టీఎంసీ గానూ మనకు ఇప్పటి దాకా దాదాపు రెండు పాయింట్ కోట్లు టీఎంసీ కి చేరింది. గత కొన్న రోజులు విషయం అందరికీ తెలిసిందే. ఐదవ నెంబరు గేతు సాకేతిక ప్రాబ్లం రావడం వల్ల చాలా వరకు నీరు వృధాగా పోతుందని వారు తెలియజేస్తున్నారు.చీఫ్ ఇంజనీర్లు మరియు టెక్నికల్ బృందం ఈ సమస్యను పరిష్కరించే పనిలో పడ్డట్టు అక్కడి అధికారులు తెలిజేస్తున్నారు.