రోడ్షోను నిర్వహించిన పి&జి హైదరాబాద్ ప్లాంట్
ఇతరత్రా సామర్థ్యాలు గల వారు (వికలాంగులు) రూపొందించిన పెయింటింగ్లను ఆవిష్కరించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది, 'అందరికీ ఇక్కడ స్వాగతం' అనే సైనేజ్ ను ప్రదర్శించడం ద్వారా ప్లాంట్లో అందరికీ స్థానం ఉంటుందనే బలమైన సందేశాన్ని అందించింది.
హైదరాబాద్, 26 ఫిబ్రవరి, 2024: టైడ్, ఏరియల్, ప్యాంపర్స్ మొదలైన బ్రాండ్ల తయారీ సంస్థ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా (P&G ఇండియా) హైదరాబాద్ లో దేశంలోని తన అతిపెద్ద తయారీ కేంద్రం వద్ద 'ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజన్ రోడ్షో' రెండవ ఎడిషన్ను నిర్వహించింది. అందరికీ అవకాశాలు కల్పించడంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఈ రోడ్షో సంస్థలోని అన్ని స్థాయిల నుండి విభిన్న ఉద్యోగుల సమూహాన్ని ఒక్క చోటుకు తీసుకువచ్చింది. సాంకేతిక నిపుణులు, లైన్ వర్కర్ల నుండి మేనేజర్ల వరకు వివిధ స్థాయిలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. కొత్త నియమించబడిన వారి నుంచి నుండి దశాబ్దాల అనుభవంకంపెనీ సీనియర్ ఉద్యోగులు దీనికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ఆకర్షణీయమైన సెషన్లు, చర్చలు జరిగాయి. పక్షపాతాలను గుర్తించడానికి, అడ్డంకులను అధిగమించడానికి ఇవి వారికి తోడ్పడ్డాయి. సమాజంలోని భిన్న వర్గాలను మరింతగా కూడగట్టుకుంటూ తమ ప్రయాణంలో ముందుకు సాగుతామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
పి అండ్ జి చేపట్టిన సమానత్వం, చేకూర్పు వ్యూహం సంపూర్ణమైనది, సమగ్రమైనది. లింగ సమానత్వం, ఎల్జీబీటీక్యూ ప్లస్ తది తరులను చేర్చడం, వైకల్యాలున్న వ్యక్తులను చేర్చడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నాలతో అందరినీ చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ మునుపటి ఎడిషన్ సాధించిన విజయం నేపథ్యంలో ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమం కూడా ప్రఖ్యాత నిపుణులు, అతిధులను ఒకచోట చేర్చింది. భారతదేశంలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన మొదటి లింగమార్పిడి వ్యక్తి డాక్టర్ రూత్ జాన్ పాల్, సెన్స్ – ఇట్ –ఐస్ వ్యవస్థాపకురాలు, శిక్షకురాలు, సున్నిత అంశాలపై వర్క్ షాప్స్ నిర్వాహకురాలు శ్రీమతి పాయల్ కపూర్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రెగ్నెన్సీ సిమ్యులేటర్ల నుండి భారతీయ సైన్ లాంగ్వేజ్ ప్రాథమిక విషయాలపై ఉద్యోగుల్లో అవగాహన మరియు సానుభూతిని పెంపొందించడానికి తోడ్పడింది.
పి అండ్ జి ఇండియా మావన వనరుల విభాగం అధిపతి శ్రీనివాస్ పి.ఎం. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఒక కంపెనీగా మేం ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలోని బిలియన్ల మంది వినియోగదారులకు సేవలందించడానికి ప్రగాఢంగా కట్టుబడి ఉన్నాం. మేం మా వినియోగదారుల వైవిధ్యాన్ని గౌరవించి, దానిని ప్రతిబింబించేటపుడు, వారి ప్రత్యేక అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్న ప్పుడు వారికి అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలతో అందించడాన్ని మేం మరింత ఉత్తమంగా చేస్తాం అనే దాన్ని మేం నిజంగా విశ్వసిస్తు న్నాం. ఇది పి అండ్ జి లో మా సంస్కృతిలో పొందుపరచబడింది. మా వినియోగదారుల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం మరియు ప్రతిబింబించడం ఇక్కడే - మా కార్యాలయంలోనే ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ బ్రాండ్ అనుభవాలను అందించడానికి లోతైన దృక్పథాలను పొందడంలో ఇక్కడ మా ఉద్యోగులు మాకు సహాయపడతారు. దీనికి అనుగుణంగా, మా సంస్కృతికి మూలస్తంభంగా ఉన్న సమానత్వం, చేరికను మేం ప్రోత్సహించడం కొనసాగించాం. ప్రతి ఉద్యోగి తమ సొంత వ్యక్తిత్వాలతో కార్యాలయానికి రావచ్చు. మా విభిన్న ఉద్యోగుల యొక్క విభిన్న జీవిత దశ అవసరాలను తీర్చడానికి అందించబడిన అనేక ప్రత్యేక కార్యక్రమాలు మరియు కార్యాలయ విధానాల ద్వారా ఇది మరింత బలపడుతుంది’’ అని అన్నారు.
ఆయన ఇంకా ఇలా అన్నారు, ‘‘ ఈ సంవత్సరం రోడ్షో రెండవ ఎడిషన్తో మేము మా ఉద్యోగులను చేకూర్పు యొక్క నిజమైన ప్రచారకర్తలుగా మార్చడానికి ప్రయత్నించాం. ఇక్కడి విధానాలు మరియు రూపుదిద్దుకున్న అనుసంధానతలు ప్రతి ఒక్కరూ తమ ఉత్తమమైన సహకారాన్ని అందించే నిర్దిష్ట చర్యలుగా మారుతాయని మేం విశ్వసిస్తున్నాం. మా ఉద్యోగులు వారి కమ్యూనిటీలకు తిరిగి వచ్చినప్పుడు, వారు చేకూర్పులకు ప్రచారకర్తలుగా మారారు. వారుఈ సందర్భాన్ని వేగాన్ని ముందుకు తీసుకువెళతారు మరియు పి అండ్ జి వెలుపల సైతం సానుకూల మార్పును ప్రేరేపిస్తారు’’.
సంవత్సరాలుగా పి అండ్ జి హైదరాబాద్ సైట్ చేకూర్పుపై ఆలోచనలు చేసే అగ్రగామిగా అభివృద్ధి చెందింది. నైట్ షిఫ్టుతో సహా అన్ని తయారీ షిఫ్టులలో మహిళా సాంకేతిక నిపుణులను కలిగి ఉన్న మొదటి కంపెనీలలో P&G ఇండియా ఒకటి. ప్రభుత్వంతో కలసి పని చేయడం ద్వారా మహిళా టెక్నీషియన్ సిబ్బందికి అవసరమైన అనుమతులు సాధించింది. వారి వృద్ధికి అవకాశాలను తెరిచింది. ప్రతి ఒక్కరూ విలువైన మానవవనరుగా పరిగణించబడే కార్యాలయంలో విశ్వసనీయ, చేకూర్పు సంస్కృతిని సంస్థ కొనసాగించింది. అభివృద్ధి చెందడానికి సమానమైన అవకాశాలను అందించడాన్ని ప్లాంట్ కొనసాగించింది.
పి అండ్ జి ఇండియా తన ప్రధాన కార్పొరెట్ సామాజిక బాధ్యత కార్యక్రమం అయిన ‘పి అండ్ జి శిక్షా’ ద్వారా కూడా తాను సేవలందిస్తున్న కమ్యూనిటీలను అర్ధవంతంగా ప్రభావితం చేయడం కొనసాగించింది. హైదరాబాదులో సంవత్సరాలుగా, పి అండ్ జి శిక్షా ద్వారా, కంపెనీ విద్యాపరమైన మౌలిక సదుపాయాల పెంపుదల, పిల్లలలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి మరియు అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడానికి గాను వారి చదులుకు సహాయం చేసింది. ఈ సంవత్సరం, పి అండ్ జి శిక్షా తన డిజిటల్ రెమెడియల్ లెర్నింగ్ ప్రోగ్రాం - మైండ్పార్క్ ని తెలంగాణలోని గిరిజన సంఘాలకు చెందిన వేలాది మంది పిల్లలపై కూడా ప్రభావం చూపేలా విస్తరించింది. ఇది తెలంగాణ, మహారాష్ట్రలో రాష్ట్ర గిరిజన శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేకంగా నిర్వహించబడిన కార్యక్రమం. ఇంకా, పి అండ్ జి ఇండియా ‘పి అండ్ జి శిక్షాబేటియన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ ద్వారా రాష్ట్రంలోని కళాశాలల్లో స్టెమ్ విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం కూడా అందిస్తుంది.
సమానత్వం, చేరికను ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీ చేస్తున్న నిరంతర ప్రయత్నాల పైన ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఏరియల్ #ShareTheLoad వంటి ఉద్యమాల ద్వారా అవగాహన పెంచడం మరియు మూస పద్ధతులను సవాలు చేయడం కావచ్చు, అలాగే టెక్ మరియు ఐటీలో అపోహలను బద్దలు కొట్టడం మరియు లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సంభాషణలను నడిపించే వార్షిక ‘ఉమెన్ ఇన్ టెక్’ సమ్మిట్ వంటి సమగ్ర చర్యల ద్వారా కావచ్చు. కంపెనీ తన శ్రామిక శక్తి కోసం విభిన్న సమ్మిళిత విధానాలను కూడా అందిస్తుంది మరియు తన ఎల్జీబీటీక్యూ ప్లస్ తదితర ఉద్యోగుల భాగస్వాములకు అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఉదాహరణకు, ‘షేర్ ది కేర్’ అనేది సొంత తల్లిదండ్రులు, డొమెస్టిక్ పార్ట్ నర్స్, పెంపుడు తల్లిదండ్రులు, స్వలింగ జంటలలోని తల్లిదండ్రులతో సహా కొత్త తల్లిదండ్రులందరికీ 8 వారాల పూర్తి చెల్లింపు పేరెంటల్ లీవ్ను అందించే పేరెంటల్ లీవ్ పాలసీ