pitani satyanarayana

ఎన్నికలకు ముందే కిరణ్ పార్టీ ఖాళీ అయిపోనుందా

  గత ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపిస్తున్నపుడు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయన పార్టీ కార్యాలయం ముందు బారులు తీరారు. కానీ ఎన్నికల ముగిసిలోగానే అందరూ మళ్ళీ తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు. అయితే ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరునెలలు మీనమేషాలు లెక్కించి మరీ పార్టీని స్థాపిస్తే ఒక్కరు కూడా వచ్చి చేరడం లేదు, పైగా ఉన్నవారే బయటకి వెళ్ళిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన వెనుకే తిరిగిన అనేక మంది మంత్రులు తెదేపాలో చేరిపోగా, పార్టీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా కాదు పొమ్మని శైలజానాథ్ కూడా తెదేపాలో చేరేందుకు సిద్దమయిపోతున్నారు. ఇప్పడు కొత్తగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా తెదేపాలోకి మారిపోయేందుకురంగం సిద్దం చేసుకొంటున్నారు. తెలంగాణాకి ముఖ్యమంత్రి కావలనుకొంటున్న కేసీఆర్ తన అనుచరులచేత అందుకు అనుకూలంగా ఏవిధంగా డిమాండ్ చేయించుకొంటున్నారో, అదేవిధంగా పితాని కూడా తెదేపాలో చేరాలని తన అనుచరుల చేత డిమాండ్ చేయించుకొన్న తరువాత, మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలియజేసారు. అంటే, లాంచనంగా కిరణ్ కుమార్ రెడ్డికి గుడ్ బై చెప్పేసినట్లే అనుకోవచ్చును.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న రోడ్ షోలకి కూడా జనాలను పోగేయడం చాలా కష్టమవుతోందని సమాచారం. బహుశః ఆయన చెప్పే సమైక్యపాటాలు వినేందుకు ఇప్పుడు ఎవరికీ ఆసక్తి లేకపోవడమే అందుకు కారణం అయ్యుండవచ్చును. పరిస్థితి ఇలాగే కొనసాగితే కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలు జరుగక ముందే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయవలసి వస్తుందేమో..పాపం. కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకయినా ఆయన పార్టీని నడిపించుకోగలిగితే, ఆనక ఏ కాంగ్రెస్ గంగలో కలిపేసుకొన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఆశ్చర్యపోరు కూడా. కానీ, ఆయన తొందరపడి ఎన్నికల ముందే ఆ పనిచేస్తే మాత్రం ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది.

tdp

తెదేపా-బీజేపీ పొత్తులు ఖరారయ్యేనా

  బీజేపీ-తెదేపాలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ, తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి. కానీ, ఆ రెండు పార్టీలు కూడా తెరవెనుక ఆ విషయంపై చాలా కసరత్తు చేస్తున్నట్లు, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తాజా ప్రకటనతో స్పష్టమయింది.   ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెదేపాతో పొత్తులకు ఆసక్తిగా ఉందని, అందువలన రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ సీమాంధ్రలో ఎనిమిది లోక్ సభ, ఇరవైఐదు శాసనసభ స్థానాలను తెదేపా నుండి ఆశిస్తోందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణాలో కూడా ఇరు పార్టీల బలాబలాలను బట్టి సీట్లు కేటాయించమని తెదేపాను కోరినట్లు తెలిపారు. అంతేగాక తెలంగాణాకి ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయించే అవకాశం కూడా తమ పార్టీకే ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.   ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తెదేపాలో కల్లోలం సృష్టించే ప్రమాదం ఉంది. చిరకాలంగా పార్టీలో ఉన్నవారు, కాంగ్రెస్ నుండి వరదలా వచ్చి చేరుతున్న నేతలకి టికెట్స్ కేటాయించకుండా, పొత్తుల కోసమని బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తేదేపాకు చాలా కష్టమే. అయితే, బీజేపీ ప్రధాన లక్ష్యం కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడమే తప్ప రాష్ట్రంలో అధికారం సంపాదించడం కాదు గనుక, తేదేపాకు అనుకూలంగానే సీట్ల సర్దుబాట్లకు అంగీకరించవచ్చును.   ఇక తెలంగాణాలో బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకొన్నారు. అంతే గాక బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్, కృష్ణయ్యను తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కనుక, ఈవిషయంలో కూడా బీజేపీ తెదేపాతో రాజీ పడక తప్పదు.   ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణాలలో నెలకొన్న తీవ్రమయిన పోటీ వాతావరణంలో, తెదేపా-బీజేపీలు పొత్తులపై ఒక అంగీకారానికి రాలేకపోయినట్లయితే అవే తీవ్రంగా నష్టపోవడం తధ్యం. అందువలన ఆ రెండు పార్టీలు వీలయినంతమేర ఇచ్చి పుచ్చుకొనే ధోరణినే పాటిస్తూ పొత్తులు ఖరారు చేసుకోవడం తధ్యం. తెలంగాణా బీజేపీ నేతలు తెదేపాతో ఎన్నికల పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ వారు కూడా పార్టీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయిష్టంగా అయినా తెదేపాతో పొత్తులకు అంగీకరించక తప్పదు.

bjp

పొత్తుపై ముందు.. వెనక

   టీడీపీతో పొత్తు విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీతో కలిసి సాగాలా.. వద్దా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ బలహీనపడిందని, పొత్తు లాభదాయకం కాదని ఓ వర్గం వాదిస్తుండగా.. టీడీపీ మద్దతుతో ఎక్కువ సీట్లు సాధించవచ్చునని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ వద్ద తెలంగాణ కమలనాథులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ హైదరాబాద్ నగర శాఖ పొత్తుకు అనుకూల అభిప్రాయాన్ని చెప్పగా, జిల్లాల నుంచి వచ్చిన నేతల్లో ఎక్కువ మంది పొత్తు వద్దని స్పష్టం చేశారు.   జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఉన్నందున దేశంతో పొత్తు అవసరం లేదని కొందరు యువనేతలు వ్యాఖ్యానించారు.మరికొందరు ఎలాంటి నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా నిర్ణయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికే వదిలిపెట్టారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవడంతో జవదేకర్ ఒకింత అసహనం ప్రదర్శించారు. తమిళనాడులో ఐదు పార్టీలతో కూటమిగా మారామని, ఇక్కడ మాత్రం ఇంత అయోమయం ఎందుకన్నట్టుగా వ్యాఖ్యానించారు. స్థానిక నేతలు స్పష్టమైన అభిప్రాయానికి రానిపక్షంలో జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయాన్ని తేల్చేస్తామని ప్రకటించారు.

pawan kalyan

మోడీకి జై కొట్టిన పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అహ్మదాబాద్ వెళ్లి బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిసారు. దాదాపు గంటసేపు సాగిన వారి సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తన జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిరువురూ రాష్ట్ర రాజకీయాలు, విభజన జరిగిన తీరు గురించి చర్చించుకొన్నట్లు తెలిపారు.   పవన్ కళ్యాణ్ తాను అధికారం కోసం రావడం లేదని ముందే స్పష్టం చేస్తున్నందున, ఆయన వలన బీజేపీకి లాభమే తప్ప నష్టమేమి ఉండదు. ఆయన మద్దతుతో ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా బీజేపీకి చాలా లాభం చేకూరుతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు తెలంగాణాలో కూడా చాలా మంది అభిమానులున్నపటికీ, వారిలో చాలా మంది చిరంజీవి తెలంగాణా వ్యతిరేఖ ధోరణి వలన ఆయనకి దూరమయ్యారు. అయితే నేటికీ వారిలో చాలా మంది పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చూపుతూనే ఉన్నారు. గనుక పవన్ కళ్యాణ్ మద్దతు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఇక సీమాంద్రాలో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆయన మాటే వేద వాక్కు గనుక అక్కడ కూడా బీజీపీ లాభపడుతుంది.   పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు మ్రోగ్గు చూపినందున, ఇంతవరకు సీమాంద్రా ప్రజలలో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేఖత కూడా కొంత తగ్గుముఖం పట్టవచ్చును. గనుక తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులకు మార్గం సుగమం అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నట్లు సూచించారు గనుక ఇక ఈ మూడు పార్టీలు చేతులు కలపడం తధ్యం. దీనితో ఇంతవరకు ఆంద్ర, తెలంగాణాలలో రాజకీయ పార్టీల బలాబలాలలో తీవ్ర అంతరం ఏర్పడుతుంది కూడా.   ఇంతవరకు సీమాంద్రాలో తెదేపా-వైకాపాలు రెండూ సమవుజ్జీలుగా నిలుస్తూవచ్చాయి. కానీ, ఇప్పుడు శక్తివంతులయిన, ప్రజలను ప్రభావితం చేయగల ముగ్గురు వ్యక్తులు-చంద్రబాబు, నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ చేతులు కలిపినట్లయితే, జగన్మోహన్ రెడ్డి వారిని తట్టుకొని విజయం సాధించడం దాదాపు అసంభవమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఉన్నందున, అతనికీ కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్న రహస్య అవగాహన కూడా వైకాపాకు ఒక ప్రతిబందకంగా మారవచ్చును.   మోడీ, చంద్రబాబు ఇరువురూ మంచి పరిపాలనా దక్షులు, రాజకీయ అనుభవజ్ఞులు కాగా, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పాలనానుభవం లేకపోగా అతని నేర చరిత్ర, సీబీఐ,ఈడీ కేసులు ఆయన పార్టీకి శాపంగా మారే అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా మంచి ప్రజాధారణ ఉన్నపటికీ, అది పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ కాదు. ఎందువలన అంటే పవన్ కళ్యాణ్ తన ఉన్నత వ్యక్తిత్వంతో, తన సినిమాల ద్వారా ప్రజాధారణ పొందితే, జగన్ మాత్రం చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొంటున్నట్లుగా నేటికీ తన తండ్రి వైయస్సార్ మరణం తాలూకు సానుభూతి ద్వారానే ప్రజాధారణ పొందే ప్రయత్నం చేయడమే అందుకు కారణం. ఇక దేశ వ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనం, చంద్రబాబు, మోడీలమధ్య ఉన్న సత్సంభందాలు వగైరా అంశాలు కూడా ఈ కూటమికి వైకాపాపై స్పష్టమయిన ఆధిక్యత ఏర్పరచవచ్చును. అయితే తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ప్రభావం అంతంత మాత్రమే గనుక ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చును. కానీ ఆయన మద్దతు వలన తెదేపా, బీజేపీలకు ఎంతో కొంత లాభమే తప్ప నష్టం మాత్రం జరగదని చెప్పవచ్చును. కానీ, ఈ మూడు పార్టీలు ఒకబలమయిన కూటమిగా ఏర్పడి వేర్వేరుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, తెరాసల విజయావకాశాలకు తప్పకుండా గండి కొట్టగలవు.  

chandrababu

కృష్ణయ్యే తెదేపా తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్దా?

  చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ఎన్నికలలో విజయం సాధించేందుకు, తమ పార్టీని గెలిపిస్తే బీసీ కులాలకు చెందిన వ్యక్తిని తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత ఆయన బీసీ సంఘాల నేతలతో సమావేశమయినప్పుడు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆ వెనువెంటనే బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తన అనుచరులతో కలిసి త్వరలోనే తెదేపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు కృష్ణయ్యను తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. నిన్న జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆ వార్తలను దృవీకరిస్తున్నట్లే కృష్ణయ్య మాట్లాడటం గమనిస్తే, చంద్రబాబు ఆయననే తమ పార్టీ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఖరారు చేసి ఉండవచ్చనని నమ్మకం కలుగుతోంది.   కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణాలో 60-80 శాతం మంది బీసీలున్నపుడు, తెదేపా ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే దానిని కాంగ్రెస్, తెరాసలు ఎందుకు తప్పుబడుతున్నాయని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ముందు తమ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధుల పేర్లను ప్రకటించి, అప్పుడు తెదేపా గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.   రాష్ట్ర విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకొన్న ఈ బీసీ ఎత్తుగడ చాలా మంచి ఫలితాన్నే ఇచ్చే అవకాశాలున్నపటికీ, ఇంతకాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్న ఎర్రబెల్లి, రేవూరి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి వంటి అనేకమంది తెదేపా సీనియర్ నేతలు ఇదే కారణంగా ఆగ్రహం చెందవచ్చును. మరి చంద్రబాబు వారందరినీ కాదని కనీసం ఇంతవరకు పార్టీలో ప్రాధమిక సభ్యత్వం కూడా లేని కృష్ణయ్యకు ఏవిధంగా ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్దపడుతున్నారో, పార్టీలో సీనియర్లను ఏవిధంగా బుజ్జగించగలరో ఊహించడం కష్టమే.   సర్వ సాధారణంగా చంద్రబాబు ఏ కీలక నిర్ణయం తీసుకొన్నా అది తాత్కాలిక ప్రయోజనాల కోసం కాక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకొంటారు. వాటిలో చాలా వరకు ఆయన ఆశించిన విధంగానే ఫలితాలు వచ్చాయి. అందువలన ఇప్పుడు కూడా ఆయన కృష్ణయ్య పేరును ప్రతిపాదించి ఉండి ఉంటే, అందుకు తగ్గట్లుగానే ఆయన పార్టీ నేతలను ముందుగానే సన్నధం చేసే ఉండి ఉండవచ్చునని అనుకోకతప్పదు.

pawan kalyan

పవన్, మోడీ,బాబు చేతులు కలిపితే...

  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్తాపిస్తున్నట్లు ప్రకటించగానే దేనినయినా రాజకీయ రంగు కళ్ళద్దాలలో నుండి మాత్రమే చూసేందుకు బాగా అలవాటు పడిపోయిన అనేకమంది రాజకీయ విశ్లేషకులు ఎన్నికల తరువాత పవన్ స్థాపించిన జనసేన కూడా చిరంజీవి యొక్క ప్రజారాజ్యంలాగే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని నిర్దారించేసారు. వారేగాక సీపీయం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కూడా అదేవిధంగా అభిప్రాయపడ్డారు. కానీ వారందరి ఊహాగానాలను వమ్ము చేస్తూ పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ లాగే నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీని దేశం నుండి పూర్తిగా తుడిచిపెట్టేయాలని పట్టుదలగా ఉన్నారు. అటువంటి వ్యక్తితో, పార్టీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపాలనుకోవడం చూస్తే పవన్ జనసేనను, చిరంజీవి ప్రజారాజ్యంతో పోల్చలేమని, అదేవిధంగా ఆ అన్నదమ్ముల ఆలోచనా సరళిలో చాలా వైర్ద్యం ఉందని స్పష్టమవుతోంది.   చిరంజీవి తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, తనను, తన ప్రజారాజ్యాన్నినమ్ముకొన్న వారినందరినీ నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి, సోనియాగాందీ ముందు సాగిలపడి తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే, పవన్ కళ్యాణ్ ఆయనకు పూర్తి విరుద్దంగా తనకసలు ఏ పదవి మీద వ్యామోహం లేదని అసలు ఎన్నికలలో పోటీ చేస్తానో లేదో కూడా చెప్పలేనని ప్రకటించారు. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజలందరూ సక్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆయన తన ప్రసంగంలో విభజన రాజకీయాలను ఎండగట్టి, అందుకు కారకురాలయిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తానని శపథం చేయడమే కాకుండా, తన ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీని కలవనున్నారు.   మూలిగే ముసలి నక్క వంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా దానిని గెలిపించే బాద్య భుజానికెత్తుకొన్నఆయన సోదరుడు చిరంజీవికి ఇది మరొక పెద్ద షాక్ అని చెప్పవచ్చును. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా వారికి తోడయితే, వారి కూటమి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఒక తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం. నరేంద్రమోడీ, చంద్రబాబులకు వారి కార్యదక్షత, సమర్ధ పరిపాలనానుభావం అనుకూలాంశాలు అయితే, వారికి పవన్ కళ్యాణ్ కున్న అపారమయిన ప్రజాధారణ, స్టార్ ఇమేజ్ మరింత కలిసి వస్తుంది. వీరు ముగ్గురు చేతులు కలిపినట్లయితే, రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ సమీకరణాలు మారినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కొద్దో గొప్పో విజయావకాశాలు ఉన్నాయనుకొంటున్న తెలంగాణాలో కూడా ఇకపై కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులను వెతుకొనే దుస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు. అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ తెరాసతో పొత్తులకు గట్టిగా ప్రయత్నించవచ్చును. లేదా తనకు అలవాటయిన పద్దతిలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆధాయపన్ను శాఖ తదితరులను ఉసిగొల్పినా ఆశ్చర్యం లేదు.

congress

బొబ్బిలి యుద్ధానికి వీరులేరీ?

  విజయనగరం జిల్లా బొబ్బిలి అనగానే.. ఒక్కసారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బొబ్బిలి యుద్ధం నాటి వీరగాధలు కళ్లముందు కదలాడతాయి. కానీ అదంతా గత వైభవం. ఇప్పుడక్కడ యుద్ధాలు కాదుకదా, ఎన్నికల్లో పోరాడేందుకు కూడా వీరులు కనిపించడంలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదు.   మున్సిపల్ ఎన్నికలకు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టకపోతే పార్టీ లేదనుకుంటారేమోనని కొన్ని వార్డుల్లో ఎవరో ఒకరిని పోటీకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ఆ పరిస్థితి గ్రామాల్లోకి వెళ్లే సరి కి తారుమారైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చే యడానికి అభ్యర్థులే లేని గడ్డు పరిస్థితి ఎదురైంది.   నిజానికి తొలినుంచి కాంగ్రెస్‌ పార్టీకి బొబ్బిలిలో మంచి పట్టుంది. డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేలుగా అదే పార్టీ నుంచి విజయం సాధించగా, బొబ్బిలి ఎంపీలు కూడా అఖండ మెజార్టీతో అదే పార్టీలో ఉంటూ గెలిచేవారు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీకి సుజయ్‌కృష్ణ రంగారావు రాజీనామా చేసిన తరువాత కేడర్ కూడా ఆయన వెంట వెళ్లడంతో పరిస్థితి మరీ దిగజారిపోయింది. రామభద్రపురంమండలంలో టీటీడీ బోర్డు సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ స భ్యుడు అప్పికొండ శ్రీరాములు నాయుడు, తెర్లాంలోని నర్సుపల్లి బాబ్జీరావు, బొబ్బిలిలోని ఇంటి గోపాలరావు వంటివారే పార్టీ ని లాగేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ సమయలో టీడీపీ నుంచి ప్రభుత్వ మాజీ విప్ శంబంగిని తెచ్చారు. కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే.. ఇంతలో రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల నుంచి ఆ పార్టీని వదిలేసి నాయకులంతా వెళ్లిపోయారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరి స్థితి ఏర్పడింది. రామభద్రపురంలో 14 స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కా గా, బాడంగిలోని 14 స్థానాలకు ఒకటే నా మినేషన్ వేశారు. తెర్లాం మండలంలో 17 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేశారు.

chandrababu

చంద్రబాబు బీసీ మంత్రం ఫలిస్తుందా?

  రాష్ట్ర విభజన వ్యవహారంలో తెలంగాణాలో బాగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీని తిరిగి బలపరిచేందుకు చంద్రబాబు మళ్ళీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుతో మంచి జోరు మీదున్న కాంగ్రెస్, తెరాసలపై పైచేయి సాధించేందుకు ఆయన మొట్ట మొదటగా చేసిన ‘బీసీ ముఖ్యమంత్రి’ ప్రతిపాదనతో ఊహించినట్లే ఆ రెండు పార్టీలలో కలకలం చెలరేగింది. అందుకే కేంద్రమంత్రి జైరామ్ రమేష్ తమ పార్టీ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హడావుడిగా ప్రకటించి ఆనక నాలుక కరుచుకొన్నారు. అయితే, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులెవరూ చంద్రబాబు ఉచ్చులో పడలేదు, పైగా మాటల మాంత్రికులైన వారందరూ పోలవరం, ఉద్యోగులు, నదీ జలాల పంపకాలు తదితర సున్నితమయిన అంశాలను లేవనెత్తి దానిపై తెదేపా వైఖరి ఏమిటో చెప్పమని నిలదీస్తూ చంద్రబాబునే ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. కానీ, చంద్రబాబు కూడా వారి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. అందుకే బీసీ, యువ మంత్రాలు జపిస్తున్నారిప్పుడు. ఆయన రెండు రోజుల క్రితం బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యి వారికి 50శాతం టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చి వారిని తెదేపా వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు.   త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరబోతున్నట్లు సూచన ప్రాయంగా ప్రకటించారు. ఆయననే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిని చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, పార్టీకి ఇంతకాలం సేవ చేసిన వారిని కాదని కొత్తగా పార్టీలో చేరుతున్న ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారని భావించలేము. అలా చేసినట్లయితే చంద్రబాబు ఒక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించి మరో కొత్త సమస్యను సృష్టించుకొన్నట్లవుతుంది గనుక అటువంటి ఆలోచన చేయకపోవచ్చును.   ఈసారి ఎన్నికలలో బీసీలను, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గనుక సఫలమయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణాలో పుంజుకోవచ్చును. ఒకవేళ తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారు అయినట్లయితే, అప్పుడు తెదేపా మరింత బలడుతుంది. అప్పుడు పోటీ ప్రధానంగా తెరాస, తెదేపా-బీజేపీ కూటమిల మధ్యనే జరుగుతుంది గనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో అధికారం చెప్పట్టడం కోసం కాక, మూడో స్థానం కోసం పోటీ చేసే దుస్థితికి దిగజారవచ్చును. రాష్ట్ర విభజన చేసి బీజేపీ, తెదేపా, తెరాసలను దెబ్బతీద్దామని దురాలోచన చేసి అంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చంద్రబాబు ప్రయోగిస్తున్న బీసీ ఆయుధం, కేసీఆర్ ప్రయోగిస్తున్న తెలంగాణా సెంటిమెంటు దెబ్బకీ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆశ్చర్యం లేదు.

Kcr about seemandhra

ముందే విషం చిమ్మిన కేసీఆర్

      రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి విషం చిమ్మారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య లేనిపోని విభేదాలను రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. రేపు రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఒకవేళ తాము అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు చూపించారు. తమ ప్రాజెక్టులు నిండితేనే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లిస్తామని కుండ బద్దలుకొట్టేశారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వాళ్లు తమతమ ప్రాంతాలకు వెళ్లి తీరాల్సిందేనని హుకుం జారీ చేశారు. ‘‘మా తెలంగాణ ప్రాజెక్టులు నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, భీమా, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకం.. ఇవన్నీ నిండిన తరువాత నీళ్లు మిగిలితే..అక్కడి అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామే గానీ.. లేకపోతే నీళ్లు తీసుకుపోనీయం. పోలవరం కోసం సీమాంధ్రలో కలపాలని చెప్పి ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించిన ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మేం ప్రాజెక్టు యథాతథంగా కడతామంటే దానిని వ్యతిరేకిస్తాం. డిజైను మార్చాలని డిమాండ్ చేస్తున్నం. ఏడు మండలాలు ఖచ్చితంగా తెలంగాణలోనే ఉండాలే. సుప్రీంకోర్టుకు పోయి అయినా, ఉద్యమం చేసైనా సరే,  చివరిదాకా పోరాడతం. అక్కడ ఉన్న గిరిజనులను కాపాడతం. డిజైను మార్చకుండా ఆ ప్రాజెక్టును కట్టనీయం.తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ గవర్నమెంట్‌లో పనిచేయాలి. ఆంధ్ర ఉద్యోగులు వాళ్ల గవర్నమెంట్‌లో పనిచేయాలి.వేరే ఆప్షన్లు ఉండయి. చంద్రబాబూ.. ఇక్కడ కూడా నా గవర్నమెంట్ వస్తదంటున్నవు. నీ బొంద.. నీ గవర్నమెంట్ కాదు కదా, నెత్తి కొట్టుకున్నా ఈడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ ధాంధీం అని మాట్లాడి, ఒక అబద్ధం నూరుసార్లు చెప్పి, ఏదో చేయాలని ప్రయత్నంలో ఉన్నడు. చంద్రబాబు మనకు కొట్టిన గుండు చాలదా? ఇంకా మనం బుద్ధి లేకుండా ఉన్నామా? మన తలరాత మనమే రాసుకోవాలి. చంద్రబాబు ఓయ్ ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లు అని చెప్తుండు. జపాన్  పోయి వచ్చి జపాన్ చేస్తాన న్నాడు. చైనా పోయి వచ్చి చైనా చేస్తానన్నాడు. సింగ పూర్ పొయి వచ్చి సింగపూర్ చేస్తానన్నాడు. చివరకు ఆయనకు పిచ్చి లేచిపోయి స్క్రూ లూజ్ అయిపోయి మాట్లాడుతుండు. జపాన్, సింగ పూర్ కాలేదు కానీ, చంద్రబాబు మెంటల్ మాత్రం ఖరాబ్ అయింది. అన్నీ పిచ్చి కూతలు కూస్తున్నడు’’ అంటూ తనదైన శైలిలో, తనదైన స్థాయిలో కేసీఆర్ మాట్లాడారు.

congress ap bifurication

తిలాపాపం తలా పిడికెడు.. సీమాంద్రాలో మాత్రమే

      కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారం తలకెత్తుకొనప్పుడు మొదట తన అభిప్రాయం, వైఖరి చెప్పకుండా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నుండి లేఖలు తీసుకొంది. ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకొని తన రాజకీయ ప్రత్యర్ధులను బ్లాక్ మెయిల్ చేస్తోంది. అంతే గాక, అన్ని పార్టీలు విభజనకు అంగీకరించిన తరువాతనే తమ పార్టీ విభజనకు పూనుకొందని అందువల్ల ఎవరూ తమ పార్టీని తప్పు పట్టలేరని, ఒకవేళ తప్పు పట్టదలిస్తే లేఖలు ఇచ్చిన అన్ని పార్టీలను కూడా తప్పు పట్టాలని, ఈ వ్యవహారంలో తిలా పాపం తలా పిడికెడు అని వితండవాదం చేస్తోంది. కానీ, తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా వాదన చేస్తోంది. తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొన్న సోనియా గాంధీ వారికిచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా ఏర్పాటు చేసారని టీ-కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం గురించి అందరికీ తెలుసు. సీమాంద్రాలో ఈ పాపంలో అందరికీ భాగం ఉందని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మాత్రం ఆ పాపంలో (?)ఎవరికీ వాటా పంచి ఇచ్చేందుకు సిద్డంగా లేదు. తమది జాతీయ దృక్పధం ఉన్న గొప్ప పార్టీలని గర్వంగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా ఇదే రకమయిన ద్వంద విధానం అవలంభిస్తూ రెండు ప్రాంతాల ప్రజలను మభ్యపెడుతున్నాయి.   రెండు ప్రాంతాలలో తమ రాజకీయ ప్రత్యర్ధులను బట్టి వేర్వేరు వ్యూహాలు అమలుచేస్తూ, ప్రజల భావోద్వేగాలను అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నాయి. అందువల్ల ఉభయ ప్రాంతాల ప్రజలు కూడా వారి మాటల గారడీకి లొంగిపోకుండా, విజ్ఞతతో వ్యవహరించి తమ తమ ప్రాంతాలకు మేలు చేకూర్చగల ప్రతినిధులను, పార్టీలను మాత్రమే ఎన్నుకోవలసి ఉంది.   

 Forest fire rages near Tirumala temple

శ్రీవారి కొండలపై ఆరని కార్చిచ్చు

      తిరుమల శేషాచలం అడవి మంటల్లో చిక్కుకుని బుగ్గి అవుతోంది. ప్రధాన ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉత్తర, ఈశాన్య దిశలో కాకుల కొండ వద్ద 40 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన 500 మంది సిబ్బంది, 15 ఫైరింజన్లు రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాల సహకారాన్ని కోరింది. గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం రక్షణ దళాలను రంగంలోకి దించే ఏర్పాట్లు చేశారు.   నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను, వంద మంది సిబ్బందిని తిరుపతికి తరలిస్తున్నారు. మంటల్లో చిక్కుకుని 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని సుమారు 2 వేల హెక్టార్ల అడవి బూడిద యింది. టీటీడీ పవన విద్యుత్ ప్లాంట్ దెబ్బతింది. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. ఎన్ని ఫైరింజన్లు వచ్చినా మంటలు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ఇక హెలికాప్టర్లను రంగంలోకి దించక తప్పడంలేదు. నీరు, నురగతో కూడిన రసాయనాలను గగనతలం నుంచి చల్లి మంటలను ఆర్పేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎంఐ-17 హెలికాప్టర్లు తిరుమలకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బుధవారం ఓ హెలికాప్టర్ శేషాచలంపై చక్కర్లు కొట్టి అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వెళ్లింది. భక్తుల భద్రత కోసం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పాపవినాశనం, ఆకాశగంగ, జాపాలీతీర్థం, వేణుగోపాల స్వామి ఆలయాలకు  వెళ్లే మార్గాలను, అక్కడి దుకాణాలను మూసివేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే కాలిబాటను కూడా మూసివేశారు.

 tdp trs

కొత్త నేతలతో టికెట్ల గోల

      తమ పార్టీలోకి భారీగా వలసలు ఉంటున్నాయని నేతలు సంబరపడుతున్నా, అదే చివరకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉంది. కొత్తగా వస్తున్న నాయకులు అప్పటికే రాజకీయాల్లో పండిపోయి ఉండటం, ఇప్పుడు ఏదో ఒకటో లేదా రెండు మూడు స్థానాల విషయంలో హామీలు తీసుకున్న తర్వాత మాత్రమే టీడీపీలోకి రావడం ఇందుకు అసలు కారణం. ఫలానా లోక్ సభ స్థానం, ఇన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు ఇవ్వాలనే షరతుకు పార్టీ అంగీకరించిన తర్వాత మాత్రమే వాళ్లు వస్తున్నారు. కానీ, ఇది ఆయా పార్టీలలో అంతర్గత తగాదాలకు కారణం అవుతోంది.   కొండా సురేఖ, మురళి దంపతులకు టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. ఖిలా వరంగల్‌లో ఓ వ్యక్తి వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని అతనిని ఆస్పత్రికి తరలించారు. ఇక రాయపాటి వచ్చినా, ఇంకెవరు వచ్చినా నర్సరావుపేట ఎంపీ టికెట్ మాత్రం తనదేనని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ తేల్చిచెప్పారు. సిట్టింగ్ ఎంపీనైన తనను కాదని కొత్తవారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నర్సరావుపేట బరిలో దిగి తాడోపేడో తేల్చుకుంటానని వెల్లడించారు. ఇలా అన్ని పార్టీల్లోనూ కొత్త చేరికలతో తలనొప్పులు ఇప్పుడిప్పుడే మొదలువుతున్నాయి. ఇవి ఇంకెంత ముదురుతాయో, ఏ స్థాయికి వెళ్తాయో చూడాల్సిందే.

BJP TDP poll deal

కమలం - సైకిల్ సీట్ల బేరాలు

      తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య పొత్తు విషయం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేయడంతో ఇక సీట్ల సర్దుబాటు గురించిన బేరసారాలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నా, ఆయన మాత్రం తనకు సీట్లు అక్కర్లేదని, తాను చెప్పిన విధానాలను మేనిఫెస్టోలో పెట్టి, అమలుచేస్తే చాలని అంటున్నట్లు సమాచారం. ఇక బీజేపీ మాత్రం తనకు రెండు రాష్ట్రాల్లో కలిపి 16 ఎంపీ సీట్లు, 75 అసెంబ్లీ స్థానాలు అడుగుతోందట. తెలంగాణాలో 8 ఎంపీ, 50 అసెంబ్లీ సీట్లు... ఆంధ్రప్రదేశ్‌లో 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు కోరుతున్నారు. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం ఇందుకు అబ్బే అనేస్తున్నారు. 2004 ఎన్నికల్లో పొత్తు సమయంలో బీజేపీకి మొత్తంగా ఆరు ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇప్పుడు కూడా అంతకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. టీడీపీ ఇంతగా బెట్టు చేయడానికి కూడా కారణం ఉంది. బీజేపీ వల్ల తాము పెద్దగా పొందబోయే ఎన్నికల లబ్ధి ఏమీ ఉండబోదని, రేపు కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావాలంటే వాళ్లకు ఎంపీల సంఖ్య, మద్దతు అవసరం కాబట్టి వాళ్లకే తమ అవసరం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. బీజేపీకి సొంతంగా నెగ్గగల సామర్థ్యం ఇక్కడ లేదు కాబట్టి, తాము చెప్పినట్లుగా వింటే, రేపు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తమకూ ఎంతో కొంత పాత్ర ఉంటుందని వాళ్లు అనుకుంటున్నారు.

KCR targets Seemandhra

పంచాయితీ అయిపోలేదంటున్న కేసీఆర్

      తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినన్నాళ్లూ నోటికి ఏ మాత్రం అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడిన కేసీఆర్.. మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు మాటలు మొదలుపెట్టారు. విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ కొనసాగించినన్నాళ్లు తాను మాట్లాడకుండా, మిగిలిన నాయకులను కూడా అదుపులో ఉంచిన ఆయన.. ఇప్పుడు ఎటూ పని అయిపోయింద కదా అనుకుంటున్నారో, ఏమో గానీ మళ్లీ సీమాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడటం మొదలుపెట్టేశారు.   ఆంధ్రాతో పంచాయితీ పూర్తిగా అయిపోలేదని, చాలా అంశాల్లో ఇంకా పోరాడి సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాల్సి ఉందని తాజాగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. రిటైర్డు డీజీ ఎస్.కె.జయచంద్ర, మాజీమంత్రి కొండా సురేఖ, కొండా మురళీ తదితరులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయనీ మాటలు చెప్పారు. తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని చెప్పారు. వీటిలో పంపిణీ పూర్తయ్యేదాకా ఆంధ్రాతో పంచాయతీ పూర్తయినట్టు కాదన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలు కూడా తెలంగాణలో కలపాలని ఆయన డిమాం డు చేశారు. ‘‘పందిగూడులాగా ఒకటే గదిని కట్టించి ఇచ్చి బలహీనవర్గాలకు ఇళ్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నరు. తెలంగాణ రాష్ట్రంలో రెండు బెడ్‌రూములు, ఒక హాలు, కిచెన్, బాత్‌రూములు, మరుగుదొడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. పూర్తిగా ప్రభుత్వమే ఈ ఖర్చును ఉచితంగా భరిస్తుంది. కుల రహిత వ్యవస్థ ఉండాలని చెబుతున్న ప్రభుత్వమే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను ఎందుకు పెడుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కులరహిత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తం. అటెండరు నుండి ఐఏఎస్‌దాకా, రిక్షా కార్మికుని నుండి మంత్రుల పిల్లల దాకా అదే హాస్టళ్లలో ఉంటరు. స్విమ్మింగ్‌పూల్, విశాలమైన ఆట మైదానంతో పాటు భోజనం వంటి అన్ని వసతులను ప్రభుత్వమే నిర్దేశిస్తుంది.ఐదేళ్లు దాటిన పిల్లగాడు బడికి పోకుంటే అక్కడ ఉన్న పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగం పోతుంది. దీనివల్ల ఉచిత నిర్బంధ విద్య కచ్చితంగా అమలు అవుతుంది’’ అని కూడా కేసీఆర్ తనదైన శైలిలో హామీలు ఇచ్చిపారేశారు.  

What is with these politicians sons

What is with these politicians’ sons?

      Last Sunday we had MP Anjan Kumar Yadav’s son, Arvind Yadav beating up a constable Vamsi of the Hussainialam Police station limits. What was the poor constable’s mistake? He asked him to move his vehicle which was obstructing others and what was the young man doing? Playing Holi at midnight on the middle of the road. The poor constable was beaten balck and blue by the MP’s son and was hospitalized by his colleagues and a case under sections 332 and 506 were filed for obstructing a govt official on duty and causing injury. He was “on the run” and was finally arrested today. Following suit was former minister Ganta Srinivasa Rao’s son Ravi Teja and his friend Indrajith who were caught drunk at the RGIA and manhandled the driver of an Airport Bus conductor and created a ruckus at the Airport on Monday . Surprisingly the Central Police force who handle the security did not take the matter into their hands. Now the gentleman was caught and was sent to 14 days in judicial remand. It’s time the politicians wake up and understand that this kind of behavior will not be tolerated by the public nor the police and with the elections round the corner, may be these politician progeny should be given some grooming sessions as to how to conduct themselves in public and not ruin the reputation of their parents and their political careers. People are more aware and watching what’s happening around them and these kind of irresponsible acts will not go down well with the public.

సైకిల్ - కమలం సర్దుబాటు ఓకే?

      వచ్చే ఎన్నికల్లో బీజేపీ,టీపీడీ మధ్య సీట్ల సర్దుబాట్లపై చర్చలు మొదలయ్యాయి. రెండు రోజులుగా ఇక్కడే ఉన్న ప్రకాశ్ జవదేకర్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,సీనియర్లు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. గతంలో పొత్తు ప్రాతిపదికలను వీరి నుంచి తెలుసుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటరీలోని నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ఫోన్‌లో సంప్రదించినట్టు తెలిసింది. ఈ వివరాలను కిషన్‌రెడ్డికి చెప్పగా... పొత్తును కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. జవదేకర్ అసహనం వ్యక్తంచేస్తూ... ముగిసిన వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడవద్దని సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో తెలంగాణలో మెజారిటీ సీట్లన్నా దక్కేటట్లు చూడమని కోరడంతో జవదేకర్ మరోసారి సీఎం రమేష్‌ను సంప్రదించారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో బీజేపీ చెప్పినట్టు టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చెప్పినట్టు బీజేపీ వినాలన్న సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు బీజేపీ తెలంగాణలో 64 అసెంబ్లీ, 9 లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో 6 లోక్‌సభ, 25ఎమ్మెల్యేల సీట్లు కోరుతున్నట్టు తెలిసింది. కాగా, తెలంగాణ శాఖ సమ్మతించినా లేకున్నా తాము పొత్తుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ నేతలు జవదేకర్‌కు స్పష్టం చేశారు.  

జోరందుకున్న సైకిల్ స్పీడు

      తెలుగుదేశం పార్టీలోకి భారీ స్థాయిలో నాయకులు వలస వెళ్తున్నారు. సీమాంధ్రలో సైకిల్ స్పీడు పెరిగింది. వివిధ పార్టీల నుంచి చేరికల జోరు ఊపందుకుంది. సోమవారం ఒక్కరోజే కాంగ్రెస్, జగన్ పార్టీలకు చెందిన సుమారు 20 మందికి పైగా నేతలు పచ్చ కండువాలు కప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తిప్పేస్వామి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తదితరులు టీడీపీలో చేరారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌సీ రెడ్డి (తిరుపతి), చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జి. శంకర్ యాదవ్, తిరుపతి నియోజకవర్గానికి చెందిన హరిప్రసాద్, నరసాపురం కాంగ్రెస్ నేతలు పొత్తూరు రామాంజనేయరాజు, అన్నా రామచంద్రయ్య, హరికుమార్ టీడీపీ గూటికి చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన వి.రామ్మూర్తి, మాజీ ఎంపీ డి. పుల్లయ్య కుమారుడు దరూరి రమేశ్ చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పెద్దాపురం నుంచి దావూలూరి దొరబాబు, అమలాపురం నుంచి ఎస్. నాగేశ్వరరావు, హనుమాన్ జంక్షన్‌కు చెందిన వీరమాచినేని సత్యప్రసాద్, ఎనికపాడుకు చెందిన గోగం బాలకోటేశ్వరరావు కూడా దేశంలో చేరారు. తులసీ గ్రూప్ సంస్థల అధినేత తులసీ రామచంద్ర ప్రభు టీడీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనను గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈయన గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీచేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఆయన మేనల్లుడు, కురుపాం ఎమ్మెల్యే జనార్దన థాట్రాజ్ , నోవా విద్యాసంస్థల అధినేత, కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్తం శెట్టి కృష్ణారావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

గులాబీ కారులో సీట్ల కోసం ఫైట్

  ఎన్నికల దారిలో కనిపించిన కాంగ్రెస్ వారందరికీ లిఫ్ట్ ఇచ్చి మరీ కారు ఎక్కించుకుంటున్న కేసీ..యార్.. టికెట్ కోసం వెనుక సీట్లో జరుగుతున్న ఫైట్ చూసి డ్రైవింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. తెలుగు తమ్ముళ్ళు, ఇతరుల వలసలతో బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ నేతల అసంతృప్తి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి రెండు సార్లు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీంను కాదని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు గులాబీ దళపతి టికెట్ కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ కూడా అయిన ఇబ్రహీం తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామని కేసీయార్ ప్రకటించినా..ఇబ్రహీమ్ వర్గీయులు సంతృప్తిచెందలేదు. దీంతో ఎన్నికల సమయానికి సమీకరణాలు మారే అవకాశం ఉంది.   నల్గొండ జిల్లాలో ముఖ్యనేతగా, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందిస్తున్న చెరకు సుధాకర్ అసెంబ్లీ టికెట్ కోసం వినూత్న నిరసనలు దిగారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెరకు సుధాకర్ బెదిరించారు. ప్రత్యెక తెలంగాణా ఉద్యమం సమయంలో పీడీయాక్ట్ కింద చెరుకు సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం వివాదస్పదమైంది. రాష్ట్ర హైకోర్టు జోక్యంతో సుధాకర్ ను విడుదల చేశారు. అయితే చెరుకు సుధాకర్ కు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తున్నారనే సమాచారం అందుకున్న అనుచరులు నకిరేకల్ లో సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించారు.   తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి తనకు టీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కోరినా అటునుంచి ఎటువంటి స్పందన లేదు. తనకు నచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చేందుకు సొంత సర్వేల పేరుతో ఉద్యమకారులను, అమరుల బంధువులను, పదేళ్లకు పైగా టీఆర్ఎస్ కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్న తమకు అన్యాయం చేస్తున్నారని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు ఆశావహులు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సభ

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తూ చేసిన రెండు గంటల ప్రసంగం ప్రజల్నిఆకట్టుకోనెలా వుంది. జెండా వుంది కాని ఎజెండా గురుంచి ఎక్కువగా మాట్లాడలేదు. పార్టీ కార్యాచరణ, పార్టీ కోసం కార్యకర్తలు, ఫాన్స్ ఏం చేయాలి అనే దానిపై దిశానిర్దేశం చేయలేదు. దీనిని పార్టీ ఆవిర్భావ సభ అనే కంటే పవన్ వ్యక్తిగత సభ అని అనుకోవచ్చు. సామాన్య ప్రజలకు దగ్గరయ్యేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. చాలా సహజమైన దోరణిలో..యూత్ ని ఆకట్టుకోనేలా ప్రసంగించారు. కాంగ్రెస్ తో తప్ప ఇతరపార్టీలతో పోత్తుకు రెడీగా వున్నానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీతో పోత్తు పెట్టుకోవాలి అనే దానిపై ఆయనకి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. వలసలను ప్రోత్సహించనని అన్నారు. చిరంజీవి పెట్టిన పీఆర్పీ పార్టీకి 17శాతం ఓట్లు వస్తే, పవన్ కళ్యాణ్ కి మాత్రం 3 లేదా నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు మాత్రమే వున్నాయి. పవన్ తెలంగాణకు ఎక్కువగా ప్రధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసిఆర్ ను టార్గెట్ చేసి..సీమాంధ్ర ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా తనకు ఏ (కాపు) కులస్థుల మద్దతు అవసరం లేదని, ఎందుకంటే తను పదవులకోసమో, అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టి మళ్ళీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకే రాజకీయాలలో ప్రవేశించానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి, ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి, తను అభిమానించే అన్న చిరంజీవికి, కాపు కుల నేతలకూ కూడా గట్టిగా చురకలు వేశారు. తన పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడానికి మాత్రం పవన్ ఈ రెండు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు. అయితే ఆయన పార్టీకి జనాల్లో  క్రేజ్ వచ్చిన కానీ కలెక్షన్లు (ఓట్లు) మాత్రం నీల్ అనే అభిప్రాయాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.