నేతలు కాదు వీళ్ళు నీచులు
...సాయి లక్ష్మీ మద్దాల
విభజన విషయం ముందుగానే సీమాంద్ర నేతలందరికీ తెలిసినా ఏమీ తెలియనట్లు చివరి వరకు ఎంతో నాట కమాడారు. ఒక్కోసారి ఒక్కో నేత వెళ్లి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి తమకు కావలసిన పదవులు పొంది కావలసినంత రాజకీయ లబ్ధి చేకూరిన తరువాత ప్రజలను మభ్య పెడుతువచ్చిన వీరి వైనం ఎంత రోతగా ఉందో సేమాన్ద్రలో జరుగుతున్న ఆందోళనలే తెలియ జేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేద్రంలో మంత్రులుగా ఉన్నవారు పురందరేశ్వరి,పనబాకలక్ష్మి,కిల్లికృపారాణి,జె.డి శీలం,కావూరి ,, చిరంజీవి, కిషోర్ చంద్రదేవ్,కోట్ల,పల్లంరాజు,ఇంకా MPలు అందరు వారి వారి స్వప్రయోజనాల కోసం ఒక విదేసీయురాలి దగ్గర సాగిల పడిపోవడాన్ని చూస్తుంటే నేతలు కాదు వీళ్ళు నీచులు అనిపిస్తుంది.
పురందరేశ్వరి 9సం''లుగా కేంద్రంలో మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒరగ బెట్టింది ఏమీ లేదు. అలాగే మిగిలినవారు కూడా. కానీ నేడు రాష్ట్రం విడిపోతుంటే మాత్రం ముందుగానే తెలిసినా చివరివరకు ప్రజలను మోసమ్ చేస్తూ వచ్చారు. ప్రతి మంత్రి,ప్రతి MP,ప్రతిMLA అందరూ అవినీతిలో కూరుకు పోయి ఉన్నారు. అందుకే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటాము అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
వారి స్వప్రయోజనాల కోసం అంతగా అధిష్టానానికి అమ్ముడుపోయిన వీరికి ప్రజలను శాసించే హక్కు,అర్హత ఎక్కడివి?ప్రజలను ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారు వీళ్ళు ఒక్కటి మాత్రం నిజం తెలంగాణ ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవటానికి వారి నేతలున్నారు. కాని సీమాంద్ర ప్రజలను ఆదుకోవటానికి మాత్రం ఏ ఒక్క నేత లేడు. అప్పుడే రాజధానుల గొడవ తెరమీదికి తెస్తున్నారు. ఒక పక్క హైదరాబాదులో ఉంటున్న సేటిలర్స్ భద్రత గాల్లో దీపంలా ఉంది. దానినిగురించిన బాధ ఏ నేతకి పట్టదు. మరోపక్క సీమాంద్ర ప్రాంతంలో చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల అన్వేషణలో ఉన్న యువత భవిష్యత్తును కాల రాసేశారు. కాని రాష్ట్ర విభజన మాత్రం అన్ని పార్టీల అంగీకారం తోనే జరిగింది అంటున్నారు. మరి ప్రజల అంగీకారం ఎవరికీ అవసరం లేదా?వీరు వీరు తీసుకునే నిర్ణయాలు,జరిపే చర్చలు అన్నిటిలోనూ చివరిగా నష్టపోతున్నది ప్రజలే. ఇప్పుడు కనుక ప్రజలు సత్వరమే మేల్కొని వారికి సరైన గుణపాఠం చెప్పకపోతే ఇంకేప్పటికి వారు మారరు.