లగడపాటికి వ్యాపారం, చిరుకు పదవే ముఖ్యం: కేశవ్

      రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చిరంజీవి కి కేంద్ర మంత్రి పదవి, లగడపాటి కి తన వ్యాపారాలే ముఖ్యమని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని విమర్శించారు.   లగడపాటికి దమ్ముంటే ఢిల్లీలో ఆందోళన చేయాలని హితవు పలికారు.రాజీనామాలు వద్దంటూనే కాంగ్రెసు నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లుగా తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం జరగలేదన్నారు.

జగన్‌ చాలా కాలం జైళ్లో ఉండాల్సి వస్తుంది

      వైయస్‌ఆర్‌ అభిమానిగా ఉండి ఇటీవల వైకాపా పార్టీని వీడిన కొండా సురేఖ మరోసారి వైఎస్‌ఆర్‌సిపి పై దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం ఆపార్టీలో ఉన్నతెలంగాణ నేతలంతా పార్టీని వీడాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే తనతో పాటు పార్టీని వీడిన జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్‌ రెడ్డి, రాజ్‌ఠాకూర్‌తో కలిసి భువనగిరిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.   వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా ఉండేవారని కాని ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వైయస్‌ ఆశయాలకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా ఇడుకుల పాయ వైయస్‌ సమాది సాక్షిగా మాట ఇచ్చిన వైసిపి ఇప్పుడు మాట తప్పిందన్నారు. జగన్‌ తన తీరు మార్చుకోకపోతే మరింత కాలం జైళులోనే గడపాల్సి వస్తుందన్నారు సురేఖ, వైయస్‌ అంటే తమకు ఇప్పటికీ అభిమానం  ఉందన్న నేతలు అభిమానం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అన్నారు.

మేం రాజీనామా చేయం: బొత్సా

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్‌లు రాజీనామ చేయాలంటూ వస్తున్న ఒత్తిని పిసిసి చీఫ్‌ బోత్సా సత్యనారాయణ తొసి పుచ్చారు. సమైఖ్యంగా డిమాండ్‌తో తాను రాజీనామ చేయబోవటం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాము రాజీనామ చేస్తే శాసన సభలో సమైక్య వాణి ఎవరు వినిపిస్తారంటూ ఆయన ప్రశ్నించారు.   ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సీమాంద్ర నేతల సమావేశంలో తాము కూడా సంతకాలు చేశామని చెప్పారు. విభజిస్తే వచ్చే నీటి వనరులు, విద్యా, ఉద్యోగ ఉపాది అవకాశాలు లాంటి సమస్యల విషయం పై కూడా అధిష్టానంతో చర్చిస్తామన్నారు.   పార్లమెంట్‌లో తెలంగాణబిల్లు పాసవుతువందో లేదో ఇప్పుడే చెప్పలేమన్న బొత్స, టిడిపి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు రాజకీయ లబ్దికోసమే దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

ఆగస్టు 12లోపు రాజీనామా చేయకుంటే అంతే..

      ఐదు రోజులు గడిచిన సీమాంద్రలో నిరసనల హోరు మాత్రం తగ్గటం లేదు. ఇప్పటికే ప్రజాల సంఘాలు విద్యార్ధులు ఉద్యమంలో పాల్గొంటుండగా రాజకీయానాకులకు కూడా ఉద్యమకారులు హుకుం జారీ చేశారు. ఆగస్టు 12 లోగా పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ డెడ్‌లైన్ విధించింది.   పదవుల కోసం పాకులాడుతూ ఉద్యమంలోకి రాని పక్షంలో త్వరలోరాభోయే ఎలక్షన్స్‌లో ప్రజలే ఆ నాయకులకు తగిన బుద్ది చెపుతారన్నారు. నాయకలు ఉద్యమంలో చేరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విభజన ఆపే దిశగా వత్తిడి చేయాలని అలా జరగని పక్షంలో 12 అర్ధరాత్రి నుంచి నిరవదిక సమ్మెకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. ఏపి ఎన్జీవోలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్ధులు, రాజకీయనాయకులు ఇలా అందకిని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి రాష్ట్ర సమైక్య పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైరదాబాద్‌ ఆంద్రప్రదేశ్‌లో భాగం అన్న ఎన్జీవోలు ఆగస్టు 15న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

సీమాంద్ర మున్సిపాలిటీలు బంద్‌

        రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంద్ర ప్రాంతంలో ఉద్యమాలు ఉదృతం అవుతున్నాయి. ఇన్నాళ్లు రాజకీయనాయకులు, విద్యార్ధలు మాత్రమే పాల్గొన్న ఉద్యమంలో నేటి నుంచి ప్రభుత్వొద్యోగులు కూడా భాగం కానున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీమాంద్రలోని 13 జిల్లా మున్సిపాలిటీ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు.   ఈ మేరకు మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు, కమిషనర్ల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం చైర్మన్ కృష్ణమోహన్‌రావు, కమిషనర్ల సంఘం అధ్యక్షుడు శివరామకృష్ణ పాల్గొన్న సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులు మూడు రోజులపాటు విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు జెఏసి తలపెట్టిన అన్నిరకాల నిరసనలకు సమ్మెలకు మున్సిపాలిటీ ఉద్యోగులు సహాకరిస్తారని ప్రకటించారు.

స‌భ సాగ‌టానికి స‌హ‌క‌రించండి

  వ‌ర్షాకాల స‌మావేశాలు మెద‌లుతున్న నేప‌ధ్యంలో స‌భ స‌జావుగా న‌డిచేందుకు అన్ని పార్టీల వారు స‌హ‌క‌రించాల‌ని ప్రదాని మ‌న్మోహ‌న్ సింగ్ కోరారు. గ‌త మూడు స‌మావేశాల్లో ఆటంకాలు నిర‌స‌నల వ‌ల్ల చాలా స‌మ‌యం వృదా అయినందున ఈ సారి అలాంటి ఆటంకాల‌కు తావివ్వదవ‌ద్దని కోరారు. ఈ స‌మావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఆహార భ‌ద్రత బిల్లును స‌భ‌ముందుకు తీసుకు రానున్నారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి ప్రధానితోపాటు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ స‌మావేశాల్లో అన్ని పార్టీ ప్రతినిధుల‌ను స‌భ స‌జావుగా జ‌ర‌గాడ‌నికి స‌హాక‌రించాల‌ని ప్రదాని కోరారు. అందుకు అన్ని పార్టీల స‌భ్యులు మ‌ద్దతు ప‌లికారు.

ముగిసిన మ‌రో ప్రజా ప్రస్థానం

  వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు, జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చెల్లెలు, ష‌ర్మిల చేప‌ట్టిన మ‌రోప్రజాప్రస్థానం పాద యాత్ర ముగిసింది. 2012 అక్టోబ‌ర్ 18న క‌డ‌ప‌జిల్లా ఇడుపుల పాయ‌లో  ప్రారంభ‌మైన ష‌ర్మిల పాద యాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. గతంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేప‌ట్టిన ప్రజాప్రస్థానం పాద‌యాత్ర కూడా ఇచ్చాపురంలోనే ముగించారు. జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అంటూ ష‌ర్మిల ప్రారంభించిన పాద‌యాత్ర 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్లకుపైగా సాగింది. ఈ యాత్ర 14జిల్లాల్లో 230 రోజుల పాటు 2250 గ్రామాల మీదుగా 3112 కిలోమీటర్ల వరకు సాగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ష‌ర్మిల ఎంతో మంది ప్రజ‌ల‌ను క‌లిశారు. వెళ్లిన ప్రతిచోట అధికార ప్రతిప‌క్షాల‌పై విమ‌ర్షనాస్త్రాల‌ను సందిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో త‌న మార్క్ చూపించారు. దాదాపుకు కోటి మందికి పైగా ప్రజ‌ల‌ను క‌లిసిన ష‌ర్మిల ఆగ‌స్టు 4 ఆదివారం ఇచ్చాపురంలో యాత్ర ముగించారు. పాదయాత్ర ముగిస్తున్న సందర్భంగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపాన్ని షర్మిల ప్రారంభించనున్నారు.

మ‌ళ్లీ స్వరం మారింది

  ఆంద్రప్రదేశ్ రాజ‌కీయాల్లో కెసిఆర్‌ది ప్రత్యేక‌మైన శైలి, ఎంత‌టి వారినైన ఏ మాట ప‌డితే ఆ మాట అన‌డం త‌రువాత అబ్బే నా ఉద్దేశ్యం అది కాదు అంటూ మాట మార్చడం ఆయ‌న‌కు మాత్రమే చెల్లింది. అప్పట్లో తెలంగాణ జాగో ఆంద్రా వాల బాగో అంటూ నినాదాలు ఇచ్చిన కెసిఆర్ త‌రువాత అబ్బే నా ఉద్దేశ్యం అది కాదు అంటూ బుకాయించారు. త‌రువాత తెలంగాణ ప్రక‌ట‌న‌తో కెసిఆర్ వ్యాఖ్యల కోసం ఎదురు చూసి వారికి ఆయ‌న ఓ గౌత‌మ బుద్దునిలా క‌నిపించారు. అన్ని ప్రాంతాల వారు తెలంగాణ‌లో ప్రశాంతంగా ఉండ‌వొచ్చు అన్న ఆయ‌న అంద‌రిని మా సొంత వారిలా చూసుకుంటామని భ‌రోసా కూడా ఇచ్చారు. కాని ఈ స్టేట్‌మెంట్ ఇచ్చి 48 గంట‌లు కూడ గ‌డ‌వ‌క ముందే కెసిఆర్ మరోసారి మాట మార్చారు. ఆంద్రా ఉద్యోగులు ఆంద్రాకు వెళ్లిపోవాల్సిందే అని హుకుం జారి చేశారు. అయితే కెసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యల‌తో రాజ‌కీయ వ‌ర్గాల్లో భారీ దుమార‌మే రేగింది. దీంతో మ‌రో సారి న‌ష్ట నివార‌ణ చ‌ర్యల‌కు దిగాడు కెసిఆర్‌. ప్రెస్‌మీట్ పెట్టి మ‌రి త‌న చేసిన వ్యాఖ్యల‌లోని అస‌లు అర్ధాన్ని వివ‌రించాడు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ త‌రువాత తెలంగాణ పున‌ర్‌నిర్మణం కోసం త‌ను ఎలాంటి ప్రణాలిక‌ల‌ను సిద్దం చేస్తున్నాడో కూడా ప్రజ‌ల‌కు వివ‌రించాడు. అయితే రోజుకో ర‌కంగా మాట్లాడుతున్న కెసిఆర్ వ్యాఖ్యల‌ను స‌మ‌ర్ధించ‌లేక సొంత పార్టీ నాయ‌కులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

అమ్మా బైలెల్లినాదో..

తెలంగాణ ప్రాంతంలో ఘ‌నంగా జ‌రుపుకునే బోనాల ఉత్సవాలు ఆఖ‌రికి అంకానికి చేరుకున్నాయి. ఆఖ‌రి వారం అయిన ఈ రోజు పాత‌బ‌స్తీలోని లాల్‌ద‌ర్వాజా అమ్మవారికి భ‌క్తులు బోనాలు స‌మ‌ర్పిస్తున్నారు. ఈ రోజు ఉద‌యం నుంచే లాల్ ద‌ర్వాజ అమ్మవారి ఆళ‌యం ద‌గ్గర భ‌క్తులు భారులు తీరారు. అంతేకాదు ఈ రోజుతో లాల్‌ద‌ర్వాజా బోనాల‌కు 105 ఏళ్లు పూర్తవుతుండ‌టంతో ఈ బోనాల‌ను మ‌రింత వైభవంగా జ‌రిపేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సావాల‌తో పాటు,రంజాన్ ఉప‌వాస‌లు కూడా కొన‌సాగుతుండ‌టంతో హైద‌రాబాద్ న‌గ‌రం ఆద్యాత్మిక శోభ సంత‌రించుకుంది. పోతురాజుల వీరంగాలు, అమ్మవారి పూనకాలతో  హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం ముందు వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఈ రోజుతో దాదాపుగా అన్నిప్రాంతాల్లో బోనాల ఉత్సావాలు ముగుస్తుండ‌టంతో భ‌క్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ద‌ర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఉప్పొంగెనే గోదావరీ..

  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌తో గోదావ‌రి మ‌హోగ్రరూపాన్ని దాల్చింది. వాగులు వంక‌ల‌ను త‌న‌లో క‌లుపుకుంటూ చుట్టు ప‌క్కల గ్రామాల‌ను ముంచెత్తుతుంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు, ఖ‌మ్మం వ‌రంగ‌ల్లో జిల్లాలోని చాలా ప్రాంతాలు వ‌ర‌ద తాకిడి అత‌లాకుత‌లం అవుతున్నాయి. తాజాగా గోదారి పోల‌వ‌రం గ్రామంపై కూడా పోటెత్తడంతో అక్కడి ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ధ‌వ‌లేశ్వరం బ్యారేజి అన్ని గేట్లత‌ను ఎత్తి 19 ల‌క్షల క్యూసెక్ల నీరు స‌ముద్రంలోకి విడిచి పెడుతున్నారు. అయినా మ‌రో 18 అడుగుల నీటి మ‌ట్టం పెరిగే అవ‌కాశం ఉన్నట్టుగా అంచ‌నాలు వేస్తున్నారు అధికారులు. 15 రోజుల్లోనే మూడోసారిగ గోదావరి ఇలా ఉగ్రరూపం దాల్చటంతో లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌లు భయాందోల‌న‌ల‌కు గుర‌వుతున్నారు. చాలా ఊర్లకు ప్రజా సంభందాలు తెగిపోయాయి. కోన‌సీమ‌లోని 70 కి పైగా గ్రామాలు జ‌ల‌దిగ్భందంలో ఉన్నాయి. ఖ‌మ్మం జిల్లానూ ప‌రిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే గోదావ‌రి నీటి మ‌ట్టం 62 అడుగులకు చేరింది. శభరీ వంతెన నీట మునిగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉద్రుతికి వరంగల్ జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఎన్టీఆర్ స‌మాది సాక్షిగా సీత‌య్య రాజీనామ‌

  సీమాంద్ర జిల్లాలల్లో జ‌రుగుతున్న స‌మైక్య ఉద్యమానికి మ‌ద్దతుగా ఎన్టీఆర్ త‌న‌యుడు, టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు  నంద‌మూరి హరికృష్ణ రాజీనామ చేశారు. త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు తెలుగు జాతి ఎప్పుడు ఐక్యంగా ఉండాల‌ని కోరుకున్నార‌ని, కాని ఇప్పుడు ప‌రిస్థితులు అలా లేవ‌ని, కొంద‌రు త‌మ స్వార్థం కోసం రాష్ట్రాన్ని రావ‌ణ కాస్టంగా మార్చార‌ని, అలాంటి స్వార్ధప‌రుల కుట్రల‌కు తెలుగు జాతి బ‌లైపోయింద‌ని హరికృష్ణ ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ రోజు ఉద‌యం ఎన్టీఆర్ ఘాట్‌ను సంద‌ర్శించిన ఆయ‌న‌, త‌న తండ్రి స‌మాధి సాక్షిగా రాజీనామ ప‌త్రంపై సంత‌కం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను తాను వెతిరేఖించ‌డం లేద‌న్న హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ సీమాంద్ర ప్రాంతంలో అనుస‌రించిన వైఖ‌రికి నిర‌స‌న‌గానే రాజీనామా చేస్తున్నాఅన్నారు. గ‌తంలో శ్రీకృష్ణ క‌మిటీ వేసిన కేంద్ర ఆ క‌మిటీపై ఏనిర్ణయం చెప్పలేదు. హైద‌రాబాద్ విష‌యంలో స్పష్టత ఇవ్వలేదు. సీమాంద్రకు రాజ‌ధానిని చూపించ‌లేదు అయినా నాలుగు నెల‌ల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామ‌నటం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అన్నారు. కాంగ్రెస్ త‌న స్వార్ధ రాజ‌కీయాల కోస‌మే తెలుగు జాతిని చీల్చింద‌న్న హరికృష్ణ, సోనియా అనే దుష్ట శ‌క్తి వ‌ల్లే రాష్ట్రం రెండుగా విడిపోతుంది అన్నారు.

ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లు రాజీనామ చేయాలి

  స‌మైక్యాంద్ర కోసం ఎలాంటి త్యాగాల‌కైనా ముందుకు రావాల‌ని సీమాంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప‌ట్టుప‌డుతున్నారు. ఈ విష‌యంపై శ‌నివారం సాయంత్రం ముఖ్యమంత్రి, పీసిసి చీఫ్ ల‌తో స‌మావేశం అయిన సీమాంద్ర ప్రజా ప్రతినిధులు, మంత్రులు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్‌ల రాజీనామాల‌కు కూడా ప‌ట్టుప‌ట్టిన‌ట్టుగా స‌మాచారం. రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం సృష్టించి అయినా స‌రే స‌మైఖ్యాంద్రను కాపాడుకోవాల‌ని వారు భావిస్తున్నారు. ఈ సమావేశంలో 20 మంది సీమాంద్ర మంత్రులు, 43 మంది శాస‌స‌స‌భ్యులు, 15 మంది ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న నేత‌లు రెండు తీర్మానాలు చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనే రాష్ట్రం విడిపోవ‌డానికి అంగీక‌రించ‌కూడ‌దంటూ ఏక వాఖ్య తీర్మానం చేసిన నాయ‌కులు, సిడ‌బ్ల్యూసిలో తీసుకున్న ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం వెన‌క్కి తీసుకునే వర‌కు నిర‌స‌న‌లు కొన‌సాగించాల‌ని తీర్మానించారు. అధిష్టానం పై ఒత్తిడి తీసుకురావ‌డం కోసం ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ల రాజీనామాల‌తో పాటు ల‌క్ష మందితో ఓ భారీ మార్చ్ నిర్వహించాల‌ని స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. హైదరాబాదును శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా చేయడం, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం, దేశానికి రెండో రాజధానిగా చేయడం లాంటి విష‌యాలుపై ఈ స‌మావేశంలో చ‌ర్చజ‌రిగిన‌ట్టుగా స‌మాచారం.

పాకిస్థాన్‌లో భూకంపం

  పాకిస్ధాన్ రాజ‌దాని ఇస్లామాబాద్‌ భూకంపంతో వ‌ణికిపోయింది. రంజాన్ మాసం కావ‌టంతో తెల్లవారుజామునే ప్రజ‌లు మెల‌కువ‌గా ఉండ‌టంతో భూకంప న‌ష్టం పెద్దగా ఏం జ‌ర‌గ‌లేదు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా న‌మోదైన‌ట్టు వెల్లడించారు జియోలాజిక‌ల్ నిపుణులు. పాకిస్తాన్‌తో పాటు భార‌త్ దేశ‌ స‌రిహ‌ద్దుకు స‌మీపాన ఉన్న పంజాబ్ త‌దిద‌ర ప్రాంతాల్లోనూ భూకంప కంపించింది. లాహోర్ ప్రాంతాల్లో ప‌విత్ర రంజాన్ మాసాన్ని పుర‌ష్కరించుకుని `సెహ్రీ` వేకువ జామున భోజ‌న ఏర్పాటు స‌మ‌యంలో ఒక్కసారిగా భూమి కంపించిన‌ట్టు అక్కడి ప్రజ‌లు గుర్తించారు. పాక్ ప్రాంతాల్లో లాహోర్‌, మంది బ‌హుద్దీన్‌, జీలూమ్‌, గుజ్రావాలా, మాన్సెహ్రా, అబ్బొట్టాబాద్‌లో దీని ప్రభావం క‌నిపించింది. దాంతోపాటు భార‌త్ స‌రిహ‌ద్దూ ప్రాంతాలైనా శ్రీ‌న‌గ‌ర్‌లో జ‌మ్ము-కాశ్మీర్‌కు స‌మీపాన 10కిలోమీట‌ర్ల దూరంలో కూడా భూమి కంపించిన‌ట్టు భూకంప కేంద్రం వెల్లడించింది.

కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే నిర్ణయంలో జాప్యమా

  కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తీసుకొన్నఅత్యంత సాహసోపేత నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన. ఆ నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్రం చాలా భారీ మూల్యం కూడా చెల్లించక తప్పలేదు. అయినప్పటికీ, అందుకు తగిన ప్రతిఫలం మాత్రం కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. హైదరాబాదు విషయంపై నిర్దిష్ట ప్రణాళిక ఏదీ తెలియజేయకుండానే రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించినందున, ఇప్పుడు సీమంద్రా ప్రాంతంలో అరాచక పరిస్థితులు తలెత్తాయి. అయితే, ఇటువంటి పరిస్థితులు అత్యంత సహజమని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ గారు శలవివ్వడం చాలా విస్మయం కలిగిస్తుంది. అంటే ఇటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి పూర్తి అవగాహన ఉన్నపటికీ, వాటిని ముందుగానే పరిష్కరించే ప్రయత్నమేదీ చేయకుండా రాష్ట్ర విభజన చేసినట్లు అర్ధం అవుతోంది.   తెలంగాణాపై మరింత తాత్సారం చేయడం వలన తనకి ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం కలుగుతుందని గ్రహించినందునే ఆ పార్టీ అంత తక్కువ సమయంలో అంత త్వరగా నిర్ణయం ప్రకటించగలిగింది. గులాం నబీ ఆజాద్ ఏళ్ల తరబడి నాన్చిన ఈ వ్యవహారాన్నిదిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా నియమితులయిన కొద్ది రోజులలోనే పరిష్కరించడం గమనార్హం.   అంటే ఇది రాత్రికి రాత్రి తీసుకొన్న నిర్ణయమేమీ కాదని అర్ధం అవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై చాలా కాలం క్రితమే ఒక రోడ్ మ్యాప్ సిద్దం చేసుకొని తగిన సమయం వరకు వేచి చూస్తూ, చర్చలు, కోర్ కమిటీల పేరిట కాలక్షేపం చేసి, ఆ సమయం రాగానే త్వర త్వరగా పావులు కదిపి తెలంగాణా ప్రకటన చేసేసింది.   ఇప్పుడు ప్రకటన చేయడం ద్వారా ఎన్నికలు దగ్గర పడేవరకు ఈ ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంటుంది. తద్వారా అటు కేసీఆర్ ని తెలంగాణా ప్రజలని తనకు అనుకూలంగా మలచుకోవచ్చును. సరిగ్గా ఎన్నికల గంట మ్రోగేసరికి రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేసి ఆ వెంటనే ప్రజలలోకి వెళితే దాని పూర్తి ఫలితం పొందవచ్చునని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును.రాజకీయంగా ఇది చాల చక్కటి ఆలోచనే.   అయితే అందుకు రాష్ట్రాన్ని మళ్ళీ అగ్ని గుండంలోకి త్రోయడం మాత్రం క్షమించరాని నేరం అని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రజలు ఏవిధంగా గొడవలు పడినా, ఉద్యమాలు చేసినా, రాష్ట్రం ఎంత నష్టపోయినా పరువలేదు కానీ, తన రాజకీయ ప్రయోజనాలకి మాత్రం ఎటువంటి నష్టం కలగకూడదని కాంగ్రెస్ వంటి పార్టీ ఆలోచించడం చాలా విచారకరం.

చిరంజీవి శపథం

  ఈ రోజు మన చిరంజీవి గారు ఒక గొప్ప మాట శలవిచ్చారు. హైదరాబాదును శాశ్విత రాజధాని చేయకపోతే తానూ కూడా రాజీనామాకు సిద్దం అని. అయితే అంతకు ముందు రోజే రాజీనామాల వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండబోదనే గొప్పనిజాన్ని కూడా ఆయన నోటితోనే శలవిచ్చారు. బహుశః కాంగ్రెస్ నీళ్ళు బాగా వంటబట్టడం వలననే నాలిక ఆవిధంగా మెలికలు తిప్పడం సాధ్యం అవుతోందేమో. ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలనే ఆలోచన కంటే ఈ సమయంలో ఏవిధంగా మాట్లాడితే రాజకీయంగా తనకు ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనే ఆయనలో ఎక్కువ కనిపిస్తోంది. అందుకే ఆయన హైదరాబాదును శాశ్విత రాజధాని చేయకపోతే రాజీనామాకు చేస్తానని ఇప్పుడు శలవిస్తున్నారు. అయితే, కేంద్రం హైదరాబాద్ పై తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యమని తెలిసినందునే ఆయన ఆవిధంగా అని ఉండవచ్చును తప్ప ఎంతో ‘కష్టపడి’ సంపాదించుకొన్న కేంద్ర మంత్రి పదవిని ఆయన వదులుకొంటారని భావించలేము.   ఆయన రాజీనామా చేస్తారా లేదా అనే దాని కంటే అసలు అటువంటి కీలక పదవిలో ఉండి, రాష్ట్ర సమస్య పరిష్కారంలో ఏమి పాత్ర పోషించారనేదే ప్రజలకి ముఖ్యం. రాష్ట్ర విభజన ప్రకటన కూడా వచ్చేసిన తరువాత ఆయనని వెళ్లి సోనియాగాంధీతో మాట్లాడి నిర్ణయం వెనుకకు తీసుకొనేలా చేయమని ఎవరూ కోరట్లేదు. కానీ, రాజధానిపై రగులుతున్న మంటలని చల్లార్చేందుకు, లేదా అర్పివేసేందుకు తన వంతు కృషి ఏమి లేదా? అని మాత్రమే ప్రజలు ప్రశ్నిస్తున్నారు.   తన ముద్దుల కొడుకు కారుకి అడ్డువచ్చిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను తన భద్రతా సిబ్బంది నడిరోడ్డు మీద చితక బాధినప్పటికీ నోరు మెదపని ఆయన, కేసీఆర్ ఆంధ్ర ఉద్యోగులను బయటకి పొమ్మని చెప్పడం భావ్యం కాదని శలవిచ్చారు. ఆయన వంటి రాజకీయ అనుభవజ్ఞుడు అటువంటి మాటలు మాట్లాడటం విచారకరమని చాలా పద్దతిగా శలవిచ్చారు.   ఇటువంటి ఖండనలు, అసంబద్దమయిన ప్రతిపాదనలు చేస్తూ కాలక్షేపం చేయడం కంటే, ఇటువంటి సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకొంటే ఉభయప్రాంతాల వారికి మేలు చేకూరుతుందో చెప్పగలిగే మేధావులను సమావేశ పరిచి వారి సలహాలను సూచనలను అటు కేంద్రానికి, ఇటు ఉభయ ప్రాంత నేతలకు తెలియజేసి తన పరపతిని సద్వినియోగ పరిస్తే ఆయన రాజీనామా చేసినంత పుణ్యం మూట కట్టుకోవచ్చును.

నేతలు కాదు వీళ్ళు నీచులు

...సాయి లక్ష్మీ మద్దాల       విభజన విషయం ముందుగానే సీమాంద్ర నేతలందరికీ తెలిసినా ఏమీ తెలియనట్లు చివరి వరకు ఎంతో నాట కమాడారు. ఒక్కోసారి ఒక్కో నేత వెళ్లి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి తమకు కావలసిన పదవులు పొంది కావలసినంత రాజకీయ లబ్ధి చేకూరిన తరువాత ప్రజలను మభ్య పెడుతువచ్చిన వీరి వైనం ఎంత రోతగా ఉందో సేమాన్ద్రలో జరుగుతున్న ఆందోళనలే తెలియ జేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేద్రంలో మంత్రులుగా ఉన్నవారు పురందరేశ్వరి,పనబాకలక్ష్మి,కిల్లికృపారాణి,జె.డి శీలం,కావూరి ,, చిరంజీవి, కిషోర్ చంద్రదేవ్,కోట్ల,పల్లంరాజు,ఇంకా MPలు అందరు వారి వారి స్వప్రయోజనాల కోసం ఒక విదేసీయురాలి దగ్గర సాగిల పడిపోవడాన్ని చూస్తుంటే నేతలు కాదు వీళ్ళు నీచులు అనిపిస్తుంది.  పురందరేశ్వరి 9సం''లుగా కేంద్రంలో మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒరగ బెట్టింది ఏమీ లేదు. అలాగే మిగిలినవారు కూడా. కానీ నేడు రాష్ట్రం విడిపోతుంటే మాత్రం ముందుగానే తెలిసినా చివరివరకు ప్రజలను మోసమ్ చేస్తూ వచ్చారు. ప్రతి మంత్రి,ప్రతి MP,ప్రతిMLA  అందరూ అవినీతిలో కూరుకు పోయి ఉన్నారు. అందుకే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటాము అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.                    వారి స్వప్రయోజనాల కోసం అంతగా అధిష్టానానికి అమ్ముడుపోయిన వీరికి ప్రజలను శాసించే హక్కు,అర్హత ఎక్కడివి?ప్రజలను ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారు వీళ్ళు ఒక్కటి మాత్రం నిజం తెలంగాణ ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవటానికి వారి నేతలున్నారు. కాని సీమాంద్ర ప్రజలను ఆదుకోవటానికి మాత్రం ఏ ఒక్క నేత లేడు. అప్పుడే రాజధానుల గొడవ తెరమీదికి తెస్తున్నారు. ఒక పక్క హైదరాబాదులో ఉంటున్న సేటిలర్స్ భద్రత గాల్లో దీపంలా ఉంది. దానినిగురించిన బాధ ఏ నేతకి పట్టదు. మరోపక్క సీమాంద్ర ప్రాంతంలో చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల అన్వేషణలో ఉన్న యువత భవిష్యత్తును కాల రాసేశారు. కాని రాష్ట్ర విభజన మాత్రం అన్ని పార్టీల అంగీకారం తోనే జరిగింది అంటున్నారు. మరి ప్రజల అంగీకారం ఎవరికీ అవసరం లేదా?వీరు వీరు తీసుకునే నిర్ణయాలు,జరిపే చర్చలు అన్నిటిలోనూ చివరిగా నష్టపోతున్నది ప్రజలే. ఇప్పుడు కనుక ప్రజలు సత్వరమే మేల్కొని వారికి సరైన గుణపాఠం చెప్పకపోతే ఇంకేప్పటికి వారు మారరు.

వాళ్ళ మాట - ప్రజల తూటా: 2

  వాళ్ళ మాట - ప్రజల తూటా: 2   వాళ్ళ మాట : * ఢిల్లీ పెద్దలు - సీమాంధ్ర సమస్యలకు మరో కమిటీ వేస్తాం.   ప్రజల తూటా : * ఇది వరకు శ్రీకృష్ణ కమిటి వేసి ఏం ఏడ్చారో అందరికి తెలుసు.   వాళ్ళ మాట : * దిగ్విజయ్ సింగ్ - హైదరాబాద్ కంటే అద్భుతమైన రాజధానిని నిర్మించడానికి సాయం చేస్తాం.   ప్రజల తూటా :   * సాయం చేయడానికి వృద్ధులైన మీరంతా అన్ని సంవత్సరాలు బతికుంటారా అసలు ?   వాళ్ళ మాట : * చంద్రబాబు - తెలంగాణకు కట్టుబడి ఉండాలి.   ప్రజల తూటా :   * ముందు ఆయన రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన అభిమాన ప్రాంతమైన తెలంగాణా నుండి పోటీ చేస్తే బాగుంటుంది. వాళ్ళ మాట : * KCR.. ఆంధ్ర వాళ్ళంతా వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలి.   ప్రజల తూటా :   * అయితే కేసిఆర్ విజయనగరం వెళ్ళిపోతాడన్నమాట !   వాళ్ళ మాట : * పళ్ళం రాజు, పురంధరేశ్వరి వగైరా దిగ్విజయ్ సింగ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తూటా :   * వ్యక్తం చేయాల్సింది ఆవేదన కాదు - ఆగ్రహం!   వాళ్ళ మాట :   * KCR - ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణా సాధన ఇంక్రిమెంట్ ఇస్తాం. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులతో సమానంగా జీతాలు ఇస్తాం.   ప్రజల తూటా :   * అప్పుడే రాష్ట్రం ఏర్పాటు అయిపోయినట్టు, దానికి ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయినట్టు అనుకుంటున్నాడు. ముందు ముందు కనీసం  పార్టీ కార్యకర్తగా  కూడా ఆ పార్టీ వాళ్ళు ఆయన్ని తిరస్కరిస్తారు. వాళ్ళ మాట : * దిగ్విజయ్ సింగ్ - హైదరాబాద్ కంటే అద్భుతమైన రాజధాని కర్నూల్ లోనో, గుంటూరులోనో, ఒంగోలు లోనో నిర్మించవచ్చు.   ప్రజల తూటా :   * అద్భుతమైన రాజధానిని కరీంనగర్ లోనో, నిజామాబాద్ లోనో , వరంగల్ లోనో నిర్మించుకోవచ్చని వాళ్ళకి చెప్తే మంచిది. వాళ్ళ మాట :   * నన్నపనేని రాజకుమారి - దిగ్విజయ్ సింగ్ ఇక్కడికి వస్తే గుండు గీయించి పంపిస్తాం.   ప్రజల తూటా :     * అంతేనా?

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా సచివాలయం ఉద్యోగులు ధర్నా

  నిన్న ఆంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ విడిచి వెళ్ళిపోక తప్పదని, వారికి వేరే ఆప్షన్స్ లేవని కేసీఆర్ చేసిన వ్యాక్యలకు నిరసనగా ఈ రోజు సచివాలయంలో ఆంద్ర ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. వారు ఆయన వ్యాక్యలను తీవ్రంగా ఖండించారు. అసలు సీమంధ్ర మంత్రులే దీనికంతటికీ కారణమని, వారి అశ్రద్ద వలననే నేడు రాష్ట్రం విడిపోయిందని, విడిపోతుందని తెలిసినప్పటికీ వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఇంత కాలం చల్లగా ఊరుకొని ఇప్పుడు కూడా రాజీనామాల పేరిట కొత్త డ్రామాలు ఆడుతున్నారని వారు ఆరోపించారు. ఉద్యోగుల భద్రత, సమస్యల గురించి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న సదరు నేతలకి రానున్న ఎన్నికలలో తప్పకుండా బుద్ధి చెపుతామని వారు హెచ్చరించారు. దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా హైదరాబాదులో స్థిరపడిన తమ జీవితాలతో, తమ పిల్లల భవిష్యత్తుతో ఆదోకొంటే సహించేది లేదని వారు రాజకీయ నేతలను హెచ్చరించారు. తాము తమ జీవితాలను ధారపోసి హైదరాబాద్ కోసం పనిచేశామని, ఇప్పుడు బయటకి పొమ్మని అడిగేందుకు కేసీఆర్ ఎవరని వారు ప్రశ్నించారు. కేసీఆర్ కి కనీసం గవర్నమెంట్ అనే మాటకి స్పెల్లింగు కూడా తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, సర్వీస్ రూల్స్ ఏమీ తెలియకపోయినా కేసీఆర్ ఏ హోదాతో నియామకాల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

విభజన విషయం చిరుకు ముందే తెలుసా..?

      రాష్ట్రంలో విభజన సెగలు తారా స్థాయికి చేరుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అందరూ ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది. నిజంగానే కేంద్ర మన రాష్ట్ర నాయకులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా..? కనీసం ముఖ్యమంత్రి, పిసి చీఫ్, కేంద్ర మంత్రుల లాంటి ఉన్నత స్థాయి నాయకులకు కూడా ఈ విషయం తెలియదా మరి అప్పుడే ఆపే ప్రయత్నం ఎందుకు చేయకుండా..? ఇప్పుడు నిరసనలకు ఎందకు దిగుతున్నారు.   ఈ సందర్భంగా ముఖ్యంగా గుర్తించాల్సిన అంశం ఒకటుంది. అదే కేంద్ర మంత్రి చిరంజీవి తీరు. జరిగిన పరిణామాలన్ని గమనించిన వారికి చిరంజీవి విభజన విషయం ముందేగానే తెలుసా అనే అనుమానం రాకమానదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్‌ వాయిదా వేసేది లేదంటూ భీష్మించు కూర్చున్న దిల్‌రాజు సడన్‌గా ఎవడు పోస్ట్‌పోన్‌ డెసిషన్‌ వెనుక చిరు ప్రమేయం లేదంటారా..? ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయను అని ప్రెస్‌మీట్‌ పెట్టి మరి నొక్కి వక్కానించిన దిల్‌రాజు 48 గంటలు గడవగానే సినిమాను ఏకంగా నెల రోజులు వాయిదా వేయటం చర్చనీయాంశం అయింది. విభజన విషయం ముందుగానే తెలిసిన చిరు కావాలనే తన కొడుకు సినిమాను వాయిదా వేయించడన్న టాక్‌ వినిపిస్తుంది.