TRS Swamy Goud

స్వామిగౌడ్ అయ్యారు ఎమ్మెల్సీ !

        స్వామిగౌడ్ ఇక ఎమ్మెల్సీ అయిపోయినట్లే! అదేంటి స్వామిగౌడ్ పోటి చేసి గెలవకుండానే ఎలా ఎమ్మెల్సీ అయిపోయారు అనుకుంటున్నారా? తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన స్వామిగౌడ్ సకల జనుల సమ్మె విజయవంతానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరిన స్వామి గౌడ్ ను మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.   ఈ నేపథ్యంలో ఈ స్థానం నుండి పోటీలో దిగాలి అనుకున్న బీజేపీ తీవ్ర తర్జన భర్జనల నడుమ పోటీకి దిగకూడదని నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్ రావులు ఈ మేరకు పార్టీలో వాదించి పోటీ పెట్టకుండా నిరోధించినట్లు తెలుస్తోంది. బీజేపీ వెనకడుగు వేయడంతో స్వామిగౌడ్ గెలుపు నల్లేరు మీద నడకే అని భావించాలి. మొత్తానికి స్వామిగౌడ్ అయ్యారు ఎమ్మెల్సీ..!

venkayya naidu

కాంగ్రెస్ కలను వెంకయ్య నాయుడు సాకారం చేస్తారా?

  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి మోడీ వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి అంటూ మీడియాలో వార్తలు వస్తున్ననేపద్యంలో, మొన్నఆయన కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్ ను కలవడానికి డిల్లీ రావడం ప్రాదాన్యతని సంతరించుకొంది. మూడు నాలుగు గంటలకు పైగా సాగిన వారి సమావేశం అనంతరం, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అయన అభ్యర్దిత్వం గురించి ప్రత్యేకంగా ఏమి మాట్లాడకపోయినప్పటికీ, మీడియాతో మోడీకు అనుకూలంగానే మాట్లాడారు.   ఆ మరునాడే, ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా మోడీ అభ్యర్దిత్వాన్ని సమర్దిస్తూ మాట్లాడారు. తరువాత, బీజీపీ నుండి సస్పెండ్ చేయబడ్డ రామ్ జేత్మలానీ కూడా మోడీ లౌకికవాది, అతని నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడం మంచిదని అన్నారు.   అయితే, పార్టీ ఇంతవరకు మోడీ అభ్యర్దిత్వాన్నిఖరారు చేయనప్పటికీ, అప్పుడే ఆయనకు వ్యతిరేఖంగా మరోవర్గం ప్రచారం మొదలు పెట్టింది. పార్టీలో సీనియర్ నాయకుడు వెంకయ్య నాయడు నిన్న మీడియా వారితో మాట్లాడుతూ “అద్వాని, నేను, సుష్మ స్వరాజ్ తో సహా పార్టీలో చాలామందే ప్రధాని పదవికి అర్హులయినవారున్నారు. కానీ, ఈ విషయం గురించి పార్టీలో చర్చించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.   భారతీయ జనతాపార్టీ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, ఆ పార్టీని వచ్చేఎన్నికలలో నరేంద్ర మోడీ తప్ప మరొకరు గట్టేకించలేరు అని వారికీ తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ ను అవలీలగా ఓడించి డిల్లీ పీటాన్ని కైవసం చేసుకోగలమని వారు నమ్ముతున్నారు.   కానీ, కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను రాహుల్ గాంధీ నేతృత్వంలో, అతనిని తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నిలిపి ముందుకు సాగాలనుకొంటునందున ఆ పార్టీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొనిపనిచేస్తుంది. అటువంటప్పుడు, దేశ వ్యాప్తంగా మంచి పేరు పొంది, రాహుల్ గాంధీని దీటుగా ఎదుర్కోగల నరేంద్ర మోడీని కాదనుకొని, ఏంతోకాలంగా ప్రధాన పదవిని అధిష్టించాలని ఆశపెట్టుకొన్న వయసుమీరిన లాల్ కృష్ణ అద్వానీ, లేదా ఏవిధమయిన ప్రత్యేకత లేని వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్ వంటి నేతలను ముందుంచుకొని భారతీయ జనతా పార్టీ గనుక ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో వేరేగా చెప్పనవసరం లేదు.   నిజం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ కాకుండా వేరేవరయినా ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే తనకీ లాభం అని కోరుకొంటోంది. కాంగ్రెస్ కోరికని వెంకయ్య నాయుడు వంటి వారు సాకారం చేస్తారేమో చూడాలి మరి.

KCR Telangana

'రాజకీయ నిరుద్యోగుల' పదవీకాంక్ష వల్లే ఉద్యమ వైఫల్యం !

 డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       అది 2011 సంవత్సరం, జనవరి నెల 16వ తేదీ. ఆరోజున తెలుగు పత్రికలు, ఛానళ్లు ఒక ప్రకటనను విడుదల చేశాయి, ప్రసారం చేశాయి. ఆ ప్రకటన కర్త పేరు 'ఊసరవెల్లి' రాజకీయాలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతీయవాది, కాదు, శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగువారి తెలంగాణా ప్రాంతానికి చేరిన పెద్ద వలసదారు. అతడిపేరు కె.సి.ఆర్ అనే ఒక 'బొబ్బిలిదొర' ! రాజకీయ నిరుద్యోగ రోగంతో చాలాకాలంగా తీసుకుంటున్న ఇతడు చేసిన ప్రకటనే అది. కాని తాను ఆనాడు చేసిన ఈ ప్రకటన తిరిగి తనకే ఎదురు తగులుతుందని అతడు వూహించి ఉండడు. ఏమిటా ప్రకటన: "తెలంగాణాకు శాపం తెలంగాణా ప్రాంత నేతలే. వీళ్లకు చీమూ, నెత్తురూ లేదు, వీళ్లు దద్దమ్మలు అని దూషించాడు కె.సి.ఆర్ ! కాని ఏ తెలంగాణాలోని ప్రస్తుత నాయకుల్ని ఏ కె.సి.ఆర్ మూడేళ్లనాడు దూషించాడో, ఆ కె.సి.ఆరే తెలంగాణా తెలుగు వారికే గాదు, యావత్తు తెలుగుజాతి ఉనికికీ, ఉసురుకే పెద్ద శాపంగా మారాడు. ఎలా? ఆ "చీమూ, నెత్తురూ" లేవనే కేంద్రకాంగ్రేస్ నాయకత్వంతో విశాలఖత రాజకీయాలకు దిగి, ఏ తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏ వ్యక్తి తన రాజకీయ నిరుద్యోగం వల్ల, ఏ ముఖ్యమంత్రి పదవిని ఆశించి ఇంతకాలం దశాగతి, దిశాగతి లేని వేర్పాటు ఉద్యమాన్ని నడిపిస్తూ చివరికి "చుక్కా లేని నావ" గా తయారు చేశాడో ఆ కె.సి.ఆర్ కాంగ్రెస్ చంకలో దూరిన ఫలితంగా ఉద్యమాన్ని నట్టేటముంచాడు. అందువల్ల 'దద్దమ్మలు"గా తెలంగాణా తెలుగు నాయకుల్ని ప్రజలలో చిత్రించడం ద్వారా ఆ ఆఖరికి ఎవడు "దద్దమ్మ" గా మిగిలిపోయారో యావదాంధ్రప్రజలకు తెలిసిపోయింది.     యావదాంధ్ర(తెలుగు) జాతిని ఒక్క తాటిపైన నిలిపిన శాతవాహన, కాకతీయ, కూలీ కుతుబ్ షాహీల కాలం మినహాయిస్తే వాళ్లు ఆ సమైక్యతకు వారధి కట్టిన మరపురాని చారిత్రక మహత్తర ఘట్టం - తెలంగాణా సాయుధపోరాటం మాత్రమేనని గుర్తించాలి. ఇది మూడు ప్రాంతాల ప్రజల తపన ఫలితంగా, అనుపరిత్యాగాల మూలంగా, యావత్తు తెలుగుజాతి చిరకాల ఆకాంక్ష ఫలితంగా వచ్చిన పరిణామం. ఇది మరెవరి దయాదాక్షిణ్యాల వల్లనే సిద్ధించిన పరిణామంకాదు. ఈ చరిత్రలో మిలితంలేనివాడు ఈ 'బొబ్బిలిదొర', వలసపెత్తందారు ! తెలంగాణా ప్రాంతానికి ఏ తెలంగాణా ప్రాంతనాయకులే 'శాపం' అని ఈ 'దొర' పలికాడో ఆ శాపపు వారసుడు కూడా ఆ  'దొరే' అయ్యాడు. కనుకనే పదవీ రాజకీయం కోసం గతంలో వేర్పాటు ఉద్యమాన్ని నిర్మించిన మర్రిచెన్నారెడ్డి పదవి దొరికిన మరునాడే ఆ ఉద్యమాన్ని విరమించడమేగాక, "ఇకముందు ప్రత్యేక తెలంగాణా ప్రసక్తి లేదని" బహిరంగంగా చాటినవారని నేటి ఉద్యమకారులు మరవరాదు. సరిగ్గా అదే బాటలో నేటి 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్ఠానంతో మంతనాలాడిన ఫలితంగా ఢిల్లీలో నెలరోజులు పడిగాపులు పడిఉన్న దాని ఫలితం - కాంగ్రెస్ లో తన వేర్పాటు ఉద్యమ పార్టీ అయిన టి.ఆర్.ఎస్ కు విలీనం చేయడానికి సంసిద్ధత ప్రకటించడమూ, అందుకు తగినట్టు వేర్పాటు ఉద్యమాన్ని క్రమంగా నిర్వీర్యం చేయడానికి 'మేధోయధనం'లో తలమున్కలై ఉండడాన్ని కూడా తెలుగుజాతి గమనిస్తోంది ! సోదర తెలుగువారిపైన అబద్ధాలతో, వంచనతో, జాతులతో, ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలతో ఇతడు ప్రాంతాలలోని తెలుగు ప్రజలమధ్య వైషమ్యాలను, విద్వేషాన్ని కల్గిస్తూ ఉద్యమాన్ని కె.సి.ఆర్ నిర్మించాడు! 'ఇదిగో తెలంగాణా రేపే వస్తుంది, నేడేవస్తుంది,లేదా ఎల్లుండి వస్తుంది, లేదా కొలది రోజుల్లో రాబోతోంది" అంటూ ఏళ్లు వూళ్లు గడుపుతూ, తప్పుడు హామీలపై యువతలో భ్రమలు భారీస్థాయిలో కల్పించి, వందలాదిమంది యువకుల్ని భంగపెట్టి ఆత్మహత్యలకు ప్రోత్సహించాడు. ఫలితం? మొత్తం ఉద్యమం గాడి తప్పింది. కె.సి.ఆర్ నాయకత్వంలో ఎక్కడ ఉద్యమం బందీ అయిపోతుందోననుకుని  భ్రమలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణా కాంగ్రెస్ అని ఒకడూ, చిన్న రాష్ట్రాల పేరిట రాజకీయ అవినీతిలోకి, అనిశ్చితిలోకి, నిత్యసంక్షోభంలోకి ఏ చత్తీస్ ఘడ్ , జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు నెట్టిన బి.జె.పి., మొత్తం తెలుగుజాతి ఐక్యతకోసం ఏ రైతాంగసాయుధపోరాటం ద్వారా రాజకీయ నాయకత్వాన్ని ఏ కమ్యూనిస్టుపార్టీ అందించిందో చివరికి ఆ కమ్యూనిష్టు పార్టీ యే తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయడంకోసం కంకణం కట్టుకొన్నది., ఎటూ తేల్చుకోలేని "తెలుగుదేశం" నాయకత్వమూ రెండుగా చీలి సంక్షోభాన్ని కొనసాగించడానికి దోహదం చేస్తోంది., తెలంగాణా సాయుధపోరాట లక్ష్యాలలో ఒకటిగా ఉన్న తెలుగుజాతి సమైక్యతా రాష్ట్ర సాధనకు దోహదం చేసిన ఉమ్మడికమ్యూనిస్టు పార్టీలోని మరొక వర్గం - మార్క్యుస్టు పార్టీ - సమైక్యతకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఏదైనాసరే "కేంద్రమే తేల్చాలన్న" నినాదాన్ని కూడా అదే సమయంలో పదేపదే ఉచ్చరిస్తూ నీళ్లు నమలుతోంది! ఇలా తలా ఒకడూ తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి తలా ఒక సమిధవేసి తెలుగుజాతిని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం మాత్రం ఏం చేయగల్గుతుంది? అక్షిలపక్ష సమావేశాలు కూడా అధికార తాపత్రయంతో భాగమైపోయాయి ! అందరివీ పదవీరాజకీయాలే, "వోట్లు, - సీట్లు" నిష్పత్తిలో తెలుగుజాతి భవితవ్యాన్ని తక్కెటలో పెట్త్రి తూస్తూ నిర్ణయించే అధికారం ఏ రాజకీయ నిరుద్యోగులకూ లేదు. తీరా ఇప్పుడు తాజాగా వినపడుతున్న నినాదం - "అన్నదమ్ముల్లా విడిపోదాం, తెలుగువారిగా మంచిగా ఉందాం" అని! విషప్రచారంతో "ఉద్యమం పేరిట" మూడు ప్రాంతాల ప్రజల మధ్య తీవ్రమైన మనస్తాపానికి, వైషమ్యానికి బీజాలు నాటిన ఈ పనికిమాలిన ప్రజావ్యతిరేక రాజకీయ నిరుద్యోగులు తిరిగి అన్నదమ్ముల్లా ఉండే పరిస్థితిని కల్పించగలరా? మూడుప్రాంతాల ప్రజాబాహుళ్యంలో ద్వేష భావం లేదు, ఉండడు. కాని మనస్సులను కలపవలసిన రాజకీయపక్షాలూ వాటి నాయకులూ ఈ ముఖ్యమైన విషయాన్ని మినహాయించి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం వీరంగాలు వేశారు, వేస్తున్నారు. వీళ్లకి ప్రగతికి, వెనుకబాటు తనానికి కారణాలు తెలుసుకునే ఓపిక లేక లెక్కలూ, డొక్కలూ వద్దని చెప్పి బొక్కలు మాత్రం వోపికతో వెతుకుతున్నారు! వీళ్లే ప్రజలపాలిట అసలు 'శాపకులు'! కనుకనే ఆది నుంచీ చిదంబరం నోట వెలువడిన "డిసెంబర్ 9" నాటి "ప్రాసెస్" పదాల్ని నేడు కేంద్రమంత్రులు షిండే, ఘులామ్ నబీ ఆజాద్ లు చేసిన ప్రకటనలకు ["చర్చలు యింతే విస్తృతంగా సాగాలి, ఒక్క రోజుతో తేలే సమస్య కాదు".]  చోటా మోటా నాయకులుగా వికృతార్థాలు తీసి, తమను తాము వంచించుకుని, తెలుగు ప్రజలను మరిన్ని భ్రమలలో తినెడుతూ వస్తున్నారు. తీరా కోరుకుంటున్న ఆ "జనవరి 28" ముహూర్తం రానే వచ్చింది. తీరావచ్చి తేల్చిందేమిటి? తెలంగాణా "వేర్పాటు సమస్య"ను తొందరపడి తేల్చేదిలేదు, మరొకసారి చేతులు కాల్చుకునేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానం తెగేసి చెప్పింది ! ఎందుకని? ఒకటిగా ఉన్న తెలుగుజాతి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని (ఆంధ్రప్రదేశ్) చీల్చడం అసహజం, అస్వభావికం కాబట్టి ! అంటే, చిదంబరం"ప్రాసెస్" అన్నా, లేదా మూడు ప్రాంతాల సీనియర్ నాయకులతో కూలంకుష పైన చర్చలు జరగాలన్నా అర్థం ఒకటే అన్ని కోణాల నుంచి "సమస్య"ల్ని చర్చించకుండా "లేడికి లేచిందే పరుగు" అన్నట్టుగా ఏ సమస్యను ఆదరాబాదరా తేల్చడం సాధ్యంకాదని స్పష్టంగా చెప్పడమే. "ఉద్యమం" ఆడు నుంచీ జరుగుతున్న పెద్దలోపం, క్షమించరాని నేరం - వేర్పాటునాయకులు విద్యార్థియువతను గాని, ప్రజాబాహుళ్యాన్ని గాని భౌద్ధికంగా చైతన్య వంతులను చేయగల వాస్తవ సమాచారాన్ని వారికి అందించకపోవడమూ, నినాదలనే 'విద్యాగంధం' గా పంచిపెట్టడమూ! తీరా ఇప్పుడు వేర్పాటు నాయకుల పని "కుడితిలో పడ్డ ఎలుక" చందంగా తయారయింది. ప్రజలకు యువతకు నాయకత్వం చెప్పలేని, వివరించాలో లేని దుస్థితి.  తాముగా సృష్టించుకున్న ఈ దుర్గతి నుంచి బయటపడేందుకు చేస్తున్న మరిన్ని తప్పిదాలు - తమ భవిష్యత్తు తప్ప విద్యార్థి, యువత, పేద, బడుగు, బలహీన వర్గాల మౌలిక ప్రయోజనాలును నట్టేట ముంచే "పరువురక్షణ" చర్యలు! వీళ్లకి విద్యార్థుల భవిష్యత్తు లేకపోయినా ఫర్వాలేదు, బలిదానాలు యువతవంతు, తమకు, తమ ప్రాణరక్షణ ప్రధానం! కోటికి పడగలెత్తే దొరలు భూస్వాములు, పాత జాగిర్దార్లు రాజకీయ నిరుద్యోగులూ తమ ఓటమిని సహించలేరు, కనుకనే వారికి వేర్పాటు ఉద్యమాన్ని వదులుకోలేరు. సీట్లు - వోట్లు మీద పేకాట ఫక్కీలో జూదం ఆడడానికి నాయకులు అలవాటు పడినంతకాలం నలిగిపోయేదీ నలిగిపోతున్నది బడుగు బలహీన వర్గాలు మాత్రమే. కనుక వామపక్షాలన్నా ఒక్క తాటిమీద ఈ సమస్యపై ఉండిడింటే జూదగొండు రాజకీయులు ఏనాడో కట్టుబడిపోయేది; సిపిఐ నారాయణ ఏం మాట్లాడుతున్నాడో, సుధాకరరెడ్డి ఏం చేస్తున్నాడో వారికే తెలియని పరిస్థితి; ఇక సిపిఎం రాఘవుల గొంతు కూడా ఉండవలసినంత బలంగా వినిపించడంలేదు. వేర్పాటు వాదంలో నాలుగైదు పార్టీల నాయకుల లక్ష్యం తెలంగాణా ప్రయోజనాలుగాని, తెలుగుజాతి బాగోగులు కాని కాదు - కేవలం పార్టీల ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో అనాలోచితంగా వేర్పాటు వాదానికి అందచేస్తున్న అనుచితమైన, ప్రమాదకరమైన అండదండలు! ఇంత త్వరలో అంతటి కమ్యూనిస్టుపార్టీ. ఇంతగా దిగజారిపోతుందనీ, తెలుగు వంగడానికి వేరు పురుగుగా అవతరిస్తుందనీ ఎవరూ వూహించి ఉండరు ! ఇక మావో పేరుతో ఉన్న భారత మావోయిస్టు పార్టీ వారు, 'చైనాలో ఒక్క తాటిపైన ఉన్న ఏ భాషా రాష్ట్రాన్ని మావో చీలదీశాడు. ఒక్క ఉదాహరణనైనా చూపగల స్థితిలో లేరు. చివరికి విమోచనోద్యమంలో రక్షణదుర్గంగా ఒక స్థావరం అవసరమైనప్పుడు ఏ గుహా జీవితాన్నో మావో గడిపినవాడే గాని జాతిని చీల్చిన వాడుకాదు; ఇక "న్యూడెమోక్రసీ" పేరిట ఉన్న మార్కిస్టు - లెనినిస్టు పార్టీ కూడా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడి పనిచేస్తున్న పార్టీగా తెలంగాణాలో ఉనికి కోసం తంటాలుపడే మార్గంలో తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికే సంకల్పించి అభాసుపాలయింది ! ప్రజల మధ్య వైరుధ్యాల్ని పరిష్కరించడంలో ప్రజలనే నిలువునా చీల్చమని ఏనాడూ చెప్పలేదు !! ఇంతకూ మనసమస్యల్లా - రాష్ట్ర సమస్య అనే కాదు యావద్భారత సమస్యలకు సామరస్యమైన  సుహృద్భావ పరిష్కారమార్గాలు చూపగల స్థాయిగల జాతీయ నాయకత్వం కొరవడడమే. ఢిల్లీ నుంచి మన గల్లీల వరకూ మనం చూస్తున్న నేటి నాయకత్వాలు మరుగుజ్జులూ, కేవల"మైకాసురులూ", భావ శూన్యాలూ, వాచాలురూ, కడుపుల్లో కత్తెరలూ, నోళ్లలో చక్కెరలూ దాచుకున్న సరుకుకేనంటే ఎవరూ బాధపడనక్కరలేదు!    

asuddudeen owaisi

ఓవైసీ! దయచేసి మా ఊర్లో అడుగుపెట్టద్దు

  ఓవైసీ సోదరులిరువురూ కాంగ్రెస్ పార్టీకి తలాక్ ఇచ్చి బయటకి వచ్చిన తరువాత, తమ మజ్లిస్ పార్టీని రాష్ట్రమంతా విస్తరించాలనే తాపత్రయంతో సభలు సమావేశాలు నిర్వహించి నోరు జారారు. దాని పర్యవసానంగా నిత్యం కోర్టులు, పోలీసులు, కేసులు అంటూ ఇప్పుడు తిరుగుతున్నారు. దీనికి తోడూ, పోలీసులు వారిపై ఉన్న పాతకేసులు కూడా తిరగాదోడటంతో, ఇక వారికిప్పుడు తమ పార్టీ గురించి కానీ, సభల గురించి గానీ ఆలోచించే తీరికేలేకుండా పోయింది. అయినప్పటికీ, దెయ్యం వెంటబడినట్లు వారిపై వివిధ రాష్ట్రాలలో నమోదయిన కేసులు ఇప్పటికీ వారి వెంటబడుతూనే ఉన్నాయి.   ఇదే క్రమంలో, బుధవారంనాడు ఔరంగాబాద్‌ పోలీసులు స్వయంగా వచ్చి అసదుద్దీన్‌ ఓవైసీకి కోర్టు సమన్లు అందజేయడమే గాకుండా, అయన ఇంటిని కూడా తణికీలు చేశారు. పనిలో పనిగా అయన వచ్చే నెల 1వ తేదీన ఔరంగాబాద్‌లో తలపెట్టిన బహిరంగసభకు అనుమతి నిరాకరిస్తునట్లు కూడా తెలియజేసారు. అసుదుద్దీన్ ఓవైసీ మరో మారు తన ఉపన్యాసం ద్వారా ప్రశాంతంగా ఉన్న తమ నగరంలో చిచ్చుపెట్టే అవకాశం ఉందని భావించిన ఔరంగాబాద్‌ కమిషనర్‌. ఫిబ్రవరి 1 నుంచి మార్చి నెలాఖరువరకు తమ నగరంలో ఎటువంటి సభలకు అనుమతినీయమని స్పష్టం చేశారు. అందువల్ల అసుదుద్దీన్ ఓవైసీని తమ నగరంలోకి సభల కోసం అడుగు పెట్టవద్దని ఆయన సూచించారు.

telangana congress MPs

కొత్త ట్విస్టులిస్తున్న టీ.కాంగ్రెస్ ఎంపీలు

  ఇక అధిష్టానంతో తాడో పేడో అంటూ డిల్లీ వెళ్ళిన తెలంగాణా కాంగ్రెస్ యం.పీలు, వెళ్ళినంత స్పీడుగా వెనక్కి తిరిగివచ్చేసారు. ఏడుగురి రాజీనామాలు చేత బట్టుకొని వెళ్ళిన మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, కే.కేశవ్ రావులు, కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో తాము సంతృప్తి చెందామని, అందువల్ల ఇక రాజీనామాలు అవసరం లేదని తాము భావిస్తున్నట్లు తెలియజేసారు. మధుయాష్కీ, కేశవరావులు ఆవిధంగా చెప్పగా, పొన్నం ప్రభాకర్ వారితో ఏకీభవిస్తూనే తమ రాజీనామా పత్రాలు మాత్రం సోనియా గాంధీ చేతికిచ్చివచ్చామని చెప్పారు.   కానీ, కధ మళ్ళీ మరో మారు అడ్డం తిరిగింది. హైదరాబాదులోనే ఉండి, తమ రాజీనామా పత్రాలను మధు యాష్కీ చేతికిచ్చిన రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు మధుయాష్కీతో విభేదిస్తూ, తాము ఇప్పటికీ తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, పార్టీ అధిష్టానం వెంటనే తెలంగాణా ప్రకటించకపోతే మరో మారు తమ రాజీనామాలను పంపిస్తామని అన్నారు. మధుయాష్కీ రాజీనామా ఉపసంహరణ ఆయన వ్యక్తిగతమని దానితో తమకు సంబంధం లేదని వారు ప్రకటించడంతో తెలంగాణా కాంగ్రెస్ యంపీల మద్య విబేధాలు తలెత్తాయి. అయితే, ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు తమ పరువు తామే మరో మారు తీసుకొని, తెరాస, జేఏసీల ముందు మరింత చులకన అయిపోయారు.

sharmila

ఫిబ్రవరి 6 నుంచి షర్మిలా మరో ప్రజాప్రస్థానం

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల వచ్చే నెల 6వ తేదీ నుండి, రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌ పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాకి తెలియజేసారు.   ఆక్టోబర్‌ 18, 2012న ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టిన ఆమె పాదయాత్ర 57 రోజుల పాటు 5 జిల్లాల్లో 24 నియోజకవర్గాల్లో 10 మునిసిపాల్టీలు దాదాపు నాలుగు వందల గ్రామాల గుండా సాగింది. ఆమె మొత్తం 822 కి.మీ నడిచారు. కానీ, డిసెంబర్‌ 15న మోకాలికి గాయం అవడంతో మద్యలో పాదయాత్రను ఆపివేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలోని డిసెంబర్‌ 14వ తేదీన జరిగిన బీఎన్‌ రెడ్డి బహిరంగసభలోఆమె కుడి మోకాలికి గాయమైంది. ఆ కారణం చేత ఆమె పాదయాత్ర వాయిదా వేసుకోకతప్పలేదు. డిసెంబర్ 18న మోకాలికి శస్త్ర చికిత్స అనంతరం, ఇంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ వచ్చే నెల 6వ తేది నుండి షర్మిల తన పాదయాత్రను ఆగిపోయిన చోటునుండే అంటే రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌ తిరిగి ప్రారంబించనున్నారు.   అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమె తెలంగాణా నుండే తన పాదయాత్రను ప్రారంబించాలను కోవడం, తెరాసను సవాలు చేసినట్లే అవుతుంది. తెలంగాణా ఈయనందుకు ఆగ్రహావేశాలతో ఉన్న తెరాస నేతలు, తమకు స్పష్టమయిన మద్దతు ఈయని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షర్మిల పాదయాత్రను సజావుగా సాగానిస్తారని అనుకోలేము. ఈ లోపుగానే వారు ఆమె పాదయాత్ర పై స్పందించే అవకాశం ఉంది. ఒకేవేళ వారు ఆమెను తెలంగాణాలోకి అడుగుపెట్టనీయమని ప్రకటిస్తే, అప్పుడు కూడా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పనిసరిగా కొనసాగిస్తామని ప్రకటిస్తే, అప్పుడు ఆ రెండు పార్టీల మధ్య తీవ్రమయిన ఘర్షణలు తప్పవు. ఈ పరిస్థితులను వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏవిధంగా అధిగామించాలనుకుంటున్నదో త్వరలోనే స్పష్టం అవవచ్చును.   షర్మిల పాదయాత్ర ద్వారా, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాలో తన పార్టీ శ్రేణులను బలపరుచుకోవడమే గాకుండా, తెలంగాణా లో తన బలాన్ని కూడా స్వయంగా అంచనావేసుకొంటూనే, తెరాసకు కూడా తన బలం ఏమిటో చూపే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కుంటిసాకులు చెప్పి మద్యలో పాదయత్ర విరమించారని తమను విమర్శిస్తున్న తెరాస, తెదేప, కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ తెలంగాణా లోనే షర్మిల పాదయాత్ర మొదలుపెట్టడం ద్వారా సరయిన జవాబు ఇచ్చినట్లు ఉంటుందని కూడా ఆ పార్టీ ఉదేశ్యం కావచ్చును. అందువల్లనే, షర్మిల తన పాదయాత్రను వేరే ప్రాంతం నుండికాక, మళ్ళీ తెలంగాణాలోనే మొదలు పెడుతున్నారని భావించవచ్చును.

kcr

కాంగ్రెస్ పార్టీకి పరోక్ష సాయం చేసిన కేసీఆర్

  కేసీఆర్ ఏమి ఆశించి నెహ్రు కుటుంబం, ప్రధాన మంత్రిపై అంత చులకనగా మాట్లడేడోగానీ, అతను ఆశించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమయిన ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం ప్రతిస్పందించక తప్పనిపరిస్థితిని అతను సృష్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అతనికి వ్యతిరేఖంగా అనేక పోలీసు స్టేషన్లలో ఒకేరోజున అనేక పిర్యాదులు నమోదు చేయబడ్డాయి. ఇక, కాంగ్రెస్ శాసనసభ్యుడు తూరుపు జయప్రకాశ్ రెడ్డి స్వయంగా గాంధీ నగర్ పోలీసు స్టేషన్లో కేసీర్, ప్రొఫసర్ కోదండరాంలు ఇరువురూ కూడా తమ ప్రసంగాలతో ప్రజలమద్య విద్వేషం రెచ్చ గోడుతున్నారని, దేశ నాయకులను అగౌరవరపరిచి దేశ ద్రోహానికి పాల్పడ్డారని కేసు వేసారు.   ఈ కేసుల సంగతి ఎలా ఉన్నపటికీ, కేసీఆర్ చేసిన ప్రేలాపనలవల్ల ప్రజల, కాంగ్రెస్ వాదుల మనసులు చాలా నొచ్చుకొన్నాయని చెప్పకతప్పదు. తద్వారా ఇంతవరకు, ఎవరికీ వారే యమునా తీరే అన్న రీతిలో సాగుతున్న కాంగ్రెస్ నేతలందరూ, చాలా రోజుల తరువాత ఐకమత్యం ప్రదర్శిస్తూ తెరాస నేతలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఒక విదంగా కేసీఆర్ తన ప్రేలాపనలా ద్వారా వారికి పరోక్షంగా చాలా సహాయం చేసాడని చెప్పవచ్చును. ఇంతవరకూ తెరాస నేతలతో భుజాలు రాసుకొని తిరుగుతున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలకు కేసీర్ మాటలతో కనువిప్పు కలిగించాయని కూడా చెప్పుకోవచ్చును. తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీని వీడి, అతని పంచన జేరితే తమ బ్రతుకులు ఎంత దారుణంగా మారుతాయో కేసీర్ మాటలతో వారికి స్పష్టంగా అర్ధమయి ఉంటుంది. గనుక, ఇంతవరకు సందిగ్ధంలో ఉన్న వారెవరయినఉంటే, వారిప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్చ, సుఖం అర్ధం చేసుకొని ఉంటారు గనుక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే దైర్యం చేయరు.   మరో ఆసక్తికరమయిన పరిణామం ఏమంటే, కేసీఆర్ ప్రేలాపనలవల్ల, తెలంగాణా కాంగ్రెస్ వాదులకు రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో ఒక పెద్ద అండ కూడా దొరికింది. వారిని వెనకేసుకు వస్తూ నిన్న కిరణ్ కుమార్ మాట్లాడిన తీరు వారికి కేసీఆర్ ని ఎదిరించి నిలవగలిగే దైర్యం ఇస్తుందని చెప్పవచ్చును.

telangana congress mps

తెలంగాణ ఎంపీల రాజీనామా ఎఫెక్ట్: ఢిల్లీ నుంచి పిలుపు

        తెలంగాణ అంశంపై రాజీనామాలకు సిద్దమయిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఎంపీలందరూ ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఢిల్లీకి వెళ్లేందుకు ఎంపీలు సిద్దమవుతున్నారు. పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎంపీలు కేకే నివాసంలో భేటీ అయ్యారు. రాజీనామా లేఖలను సోనియాకు అందించి వారం రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలు సిద్దమయ్యాయని ఎంపీలు ప్రకటించారు. తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వకుంటే రాజీనామాలు ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు ఎంపీ మధుయాష్కి తెలిపారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అధిష్టానం సూచించిందని, రేపు ఢిల్లీలో  సోనియాను కలిసి పరిస్థితిని వివరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐక్యంగా ఉద్యమిస్తున్నామని కేకే నివాసంలో భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు తెలిపారు.  తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి తమ నిర్ణయాన్ని అధిష్టాన పెద్దలకు వివరిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచామని, తమకు వయలార్ రవి, గులాం నబీ ఆజాద్ ఫోన్ చేశారని తెలిపారు.  

devineni nehru

దేవినేని చంద్రశేకర్ తెలుగుదేశం పార్టీలో జేరనున్నాడా?

  1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిననాటి నుండీ 1996లో ఎన్టీఆర్ మరణించే వరకు పార్టీలో కొనసాగిన దేవినేని నెహ్రు, ఆ తరువాత పార్టీలోతనకు తీవ్ర ప్రతికూల పరిస్థితులేర్పడటంతో, తప్పని పరిస్థితుల్లో తెదేపాను వీడి, 1997 లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఆయనని అభిమానించేవారు చాలామంది ఉన్నారు. ఆ కారణం చేతనే, కొద్ది సం.ల క్రితం ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జోరుగా సాగాయి. గానీ, ఆయనను వ్యతిరేఖించే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అడ్డుపడటంతో దేవినేని కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు.   అయితే ఆయన వర్గానికే చెందిన ప్రజలు అనేక మంది ఆయనను అభిమానిస్తున్నపటికీ, అయన కాంగ్రెస్ పార్టీలో జేరడంతో ఆయనకి దూరంగా ఉండిపోయారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో జేరడంవలన ఆయన తన వర్గానికి చెందిన ప్రజలను, అభిమానులను దూరం చేసుకొనగా, అటువంటి సమర్ధుడు, శక్తివంతుడయిన నేతని పోగొట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రనష్ట పోయింది. మరి చేసేదేమిలేక, అంబటి బ్రాహ్మణయ్యవంటి కులపెద్దను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమించుకొని, యువకుడయిన దేవినేని ఉమాను కార్యదర్శిగా నియమించింది.   అయితే, అధికారానికి దూరమయిన ఈ 9 సం.లలో తెలుగుదేశం పార్టీకి ఒక విషయం స్పష్టంగా అర్ధమయింది. దేవినేని కుటుంబాన్ని దూరం చేసుకొన్నలోటును మరెవరూ కూడా పూడ్చలేరని అర్ధం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించలేకపోయినప్పటికీ, అయన సోదరుడు బాజీప్రసాద్ తనయుడు చంద్రశేఖర్‌కు స్థానికంగా యువతలో ఉన్న మంచి పేరు, మంచి ఫాలోయింగు దృష్ట్యా కనీసం ఆయననైనా తెలుగుదేశం పార్టీలోకి రప్పించాలని పాదయాత్రలో ఉన్న చంద్రబాబును పార్టీ శ్రేణులు కోరడంతో ఆయన అందుకు అంగీకరించినట్లు సమాచారం.   అయితే, ఈ వ్యవహారాన్ని అయన స్వయంగా బాలకృష్ణకి అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణకి, దేవినేని కుటుంబ ప్రతినిధులకీ మద్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రశేఖర్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు సీటు ఇచ్చేందుకు పార్టీ అంగీకరించినట్లయితే తెలుగుదేశం పార్టీలో చేరడానికి అయన సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ, అన్నీ సవ్యంగా జరిగినట్లయితే చంద్రబాబు పాదయాత్ర కృష్ణా జిల్లా సరిహద్దులు దాటకమునుపే, దేవినేని చంద్రశేకర్ తెలుగుదేశం పార్టీలో జేరే అవకాశాలు ఉన్నాయి.

 Ponnam lands in troubles

పొన్నం చేసిన వేశ్య వ్యాఖ్యలపై మహిళా జేఏసీ ఫిర్యాదు

        రాజమండ్రి ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ పెద్దాపురం వేశ్యగా పోల్చడం పై సమైక్యాంధ్ర మహిళా జెఎసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ పట్టణంలోని మూడవ పట్ణణ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ను పొన్నం పెద్దాపురం వేశ్యతో పోల్చారు. ఆయన వేశ్యకన్న హీనమని పొన్నం విమర్శించారు. అయితే దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. పెద్దాపురం వేశ్య అని అన్న నేపథ్యంలో ఈ విధంగా మహిళలను కించపరచడం అన్యాయమని, మహిళల మనోభావాలను దెబ్బతీశారని మహిళా జేఏసీ తప్పుపట్టింది. తెలంగాణ కావాలంటే తెచ్చుకోవచ్చని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు స్థాయి దిగజారి మాట్లాడవద్దని వారు అన్నారు.

 Telangana Congress leader

తెలంగాణకోసం రాజీనామాలు చేస్తాం: టీ కాంగ్రెస్‌ ఎంపీలు

        తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ ఎం.పి.లు నిర్ణయించుకున్నారు. వీరు పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.   పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఎం.పి.లు నిర్ణయం తీసుకున్నారు. ఈ లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధికే పంపించాలని వారు నిర్ణయించుకున్నారు. స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు. టి.ఆర్.ఎస్. 2014 ఎన్నికలే లక్ష్యంగా మాట్లాడుతున్నదని, కాని తాము మాత్రం తెలంగాణ ను సాధించే దిశగా అధిష్ఠానాన్ని నిలదీస్తామన్నారు.

telangana congress leaders

మౌనమేలనోయి...ఈ మరపురాని రోజు

  అటు కేంద్ర సహకారం లేక, ఇటు రాష్ట్రంలోనూ మోర పెట్టుకొనేందుకు నాధుడు లేక, తెరాస బాధితులయిన తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ మరోమారు సమావేశమయ్యి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకోవడానికి సిద్దం అవుతున్నారు.   ఇంతవరకు ఏ తెరేసాతో వారందరూ అంటకాగేరో ఇప్పుడు అదే తెరాస నాయకులు తమను చీము నెత్తురు, సిగ్గు శరంలేని నాయకులని తిడుతున్నా కూడా వారు తమ పదవులను వదులుకొంటామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇంతకీ వారు తమ పదవులకి ఎందుకు రాజీనామా చేలేకపోతున్నారు? వారిని తమ పదవులని, పార్టీని వదిలిపెట్టనీయకుండా ఏమి అడ్డుపడుతోంది? పైకి చెప్పుకోలేని కారణాలు వారికి చాలానే ఉన్నాయి. వాటి గురించి తెరాస నేతలకు స్పష్టంగా తెలిసినప్పటికీ, తెలియనట్లు నటిస్తూ వారిని పదవులు వదులుకోమని, వారికి తమ మద్దత్తు ఉంటుందని చెపుతున్నారు. అయితే ఇంతకీ ఆ బలమయిన కారణాలేమిటి?   తెరాస, జేయేసీ నేతల తిట్లకి ఉద్రేకపడి తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పదవులను వదులుకొంటే మొదట నష్టబోయేది తామేనని వారందరికీ బాగా తెలుసు. ఆపని చేసిననాడు తమపై ఆధారపడిన ప్రభుత్వం కూలిపోవడం తధ్యం. తద్వారా పార్టీ అధిష్టానానికి కోపం తెప్పించడం, అది కూడా ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మంచిదికాదని వారికి తెలుసు. తెలంగాణాలో తెరాసా తప్ప వేరే ప్రత్యమ్నాయ పార్టీ లేకపోవడం, తెదేప, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలలో జేరడానికి మనస్కరించకపోవడంవల్ల, మాట నిలకడలేని చంద్రశేకర్ రావును నమ్ముకోవడం కంటే, తమ పార్టీ అధిష్టానాన్ని నమ్ముకోవడమే మంచిదనే ఆలోచనతో వారు వెనకంజ వేస్తుండవచ్చును. ఒకవేళ దైర్యం చేసి పార్టీని వదిలిపెడితే, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి తప్ప వేరెవరికీ తలవంచనవసరం లేనంతగా స్వేచ్చ అనుభవించిన తాము, తెరాసాలో కేసీర్ కు, అతని కుటుంభానికి సలాములు చేస్తూ బ్రతకడం కష్టమని గ్రహింపుతోనే వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా అడుగువేయలేకపోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా తెలంగాణాలో తెరాస కాకుండా మరో బలమయిన పార్టీ ఏదయినా ఉండిఉంటే తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎప్పుడో రాజీనామాలు చేసేసి పార్టీ వదిలిపెట్టేవారు.   ఇక మరో బలమయిన కారణం ఏమిటంటే, ప్రస్తుతం పార్టీ అధిష్టానం తెలంగాణా సమస్యని పరిష్కరించేందుకు నిజాయితీగా ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ తరుణంలో, కేసీర్ వంటి వారి మాటలకులొంగి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం కంటే, మరి కొంత కాలం ఒపికపడితే, పార్టీ తెలంగాణాగానీ ప్రకటిస్తే, పరిస్థితులు అన్ని చక్కబడుతాయనే నమ్మకంవల్లనే వారు తమ పదవులను అంటిపెట్టుకొని ఉండేలా చేస్తుండవచ్చును.   పదవి లేన్నప్పుడు తమ స్వంత పార్టీ వారికే కాకుండా తెలంగాణా ఉద్యమనేతలకి కూడా అలుసుగానే కనిపిస్తారనేది మరో చేదు నిజం. ఒకవేళ పార్టీ అధిష్టానం తెలంగాణా ఇచ్చినట్లయితే, తమ పార్టీలోనే తెరాస విలీనమయితే, అప్పుడు పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకి పార్టీలోకి కొత్తగా వచ్చిన కేసీర్, కేటీర్,హరీష్ రావువంటి వారిపై తమదే పైచేయి అవుతుంది, వారికి తాము సలాములు చేస్తూ బ్రతుకవలసిన అగత్యం కూడా ఉండదనే ఆలోచన కూడా తెలంగాణా కాంగ్రెస్ నేతలను పార్టీకి, పదవులకి అంటిపెట్టుకు ఉండేలాచేస్తోందని భావించవచ్చును. కానీ, ఇటువంటి ఆలోచనలను పైకి చెప్పుకొనే అవకాశం వారికి లేదు గనుక మౌనంగా నిందలు భరిస్తున్నారు.

Book ShindeChidambaram for cheating people on Telangana

హోంమంత్రి షిండే, చిదంబరం పై 420 కేసు

        ఆర్ధిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ల పై ఎల్బీనగర్ పోలీసులు 420 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశం మీద ఏ విషయం వెల్లడిస్తాం అని గడువు విధించి మాట తప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ తెలంగాణ వాదులు రంగారెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు. తెలంగాణ అంశం మీద ఇచ్చిన మాట తప్పి వేలాది మంది ఆత్మహత్యలకు కారణం అయ్యారని, అప్పటి హోంమంత్రి, ప్రస్తుత ఆర్ధిక మంత్రి చిదంబరం, ఇప్పుడు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు గడువుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని వారిమీద చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  దీనిమీద విచారించిన కోర్టు మంత్రుల మీద 420 కేసులు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై నెలరోజుల్లో తేలుస్తామని గత నెల 28న అఖిలపక్ష సమావేశం అనంతరం హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే  అన్నారు. ఈ రోజుతో ఆ గడువు ముగిసిపోయింది. ఓ రోజు ముందే ఆయన తెలంగాణ అంశం తేల్చేందుకు మరింత సమయం కావాలని, మరిన్ని చర్చలు జరగాలని అన్న నేపథ్యంలో న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.

samaradeeksha

"సమరదీక్ష"వద్ద టి ఉద్యోగుల అత్యవసర భేటి

        ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న సమరదీక్ష వేదిక వద్ద తెలంగాణ ఉద్యోగులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆదివారం ఆజాద్, షిండేల వ్యాఖ్యల అనంతరం నెలకొన్న పరిస్థితులపై, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. 100 రోజుల సమ్మెను చెప్పట్టే దిశగా ఉద్యోగులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని మరుగున పడేస్తుందని, అందుకే ఈ సమయంలోనే కేంద్రం మీద వత్తిడి పెంచేలా కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారు. ఇంతకుముందే 100 రోజుల సమ్మెకు అనుకూలంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులను సంసిద్దం చేశారు. ఇప్పుడు మరింత నాన్చివేత ధోరణి నేపథ్యంలో తీవ్ర నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి.

 samara deeksha protest

"సమరదీక్ష"కు సబిత అనుమతి

        తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నిర్వహించనున్న "సమరదీక్ష"కు పోలీసులు అనుమతినిచ్చారు. 36 గంటల దీక్షకు అనుమతించకుండా అడ్డుకోవడంతో తెలంగాణవాదులు ఆందోళన బాట పట్టారు. ఎంఎల్ సీ చుక్కా రామయ్య, ప్రజా గాయకుడు గద్దర్ అనుమతి కోసం హోంమంత్రిని ఆశ్రయించారు. దీంతో హోంమంత్రి సబిత సమర దీక్షకు అనుమతిని ఇచ్చారు. వినతి పత్రాన్ని సైబరాబాద్ కమిషనర్‌కు ఇవ్వాలని సూచించారు. సోమవారం సాయంత్రం వరకు దీక్ష చేసుకోవాలని పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ సూచించారు. దీక్షకు పోలీసుల అనుమతి లభించడంతో తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు, విద్యార్థులు, తెలంగాణవాదులు ఇందిరాపార్క్‌కు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే సమరదీక్ష ప్రాంగణం తెలంగాణవాదులతో నిండిపోయింది.  

కేటీఆర్‌, స్వామిగౌడ్‌ అరెస్ట్

        తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నిర్వహించ తలపెట్టిన ‘సమరదీక్ష’ను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ నేతలను అరెస్టు చేస్తున్నారు. విద్యార్థులను అడ్డుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమరదీక్షను నిర్వహించి తీరుతామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. నిర్బంధం ద్వారా దీక్షను ఆపాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు ఆదివారం సాయంత్రంలోగా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ఫిబ్రవరిలో ‘చలో హైదరాబాద్’ లాంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు. అసెంబ్లీ నుంచి జేఏసీ కార్యాలయం వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో టీఎన్‌జీవో జేఏసీ నేతలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌తో సహా టీఆర్‌ఎస్ కార్యకర్తలను, టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులను పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అరెస్టు చేశారు. వీరిని గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఖైరాతాబాద్ చౌరస్తాలో రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. రాజ్‌భవన్ రోడ్డుని పూర్తిగా మూసేసిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరారు. గన్‌పార్క్ వద్దకు కార్యకర్తలో చేరుకున్న టీఆర్‌ఎస్ నేత స్వామిగౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వామిగౌడ్‌ను వెంటనే విడుదల చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. అరెస్టులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దానికి తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.  

కృష్ణాజిల్లా యాత్రలో బాబును పరామర్శించిన కుటుంబసభ్యులు

        కృష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును కంచికచర్లలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, సోదరి హైమావతి, మరదులు ఇందిర, మేనల్లుడు ఉదయ్, ఎన్టీఆర్ కుమార్తెలు, కోడళ్లు, ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రకు విరామం ఇవ్వాలని కోరమాని అయితే చంద్రబాబు అంగీకరించలేదన్నారు. పాదయాత్రను కొనసాగిస్తానని బాబు చెప్పినట్లు ఆమె తెలిపారు. చంద్రాబాబు మానసికంగా బలంగా ఉన్నారని, నడుము, కాలినొప్ప చంద్రబాబుకు తాత్కాలికమే అని ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ తెలిపారు.

తప్పు చేసి బాబును తప్పుపట్టిన బొత్స

  పీసిసి అధ్యక్షులుగా యావత్ రాష్ట్ర పార్టీకి బాద్యత వహించవలసిన బొత్స సత్యనారాయణ నిన్న రాజమండ్రీలో ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన జై ఆంధ్ర మహా సభలో పాల్గొనడం మొదటి తప్పయితే, హిందీ వాళ్ళకి పది రాష్ట్రాలు ఉన్నపుడు తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని లౌక్యంగా ప్రశ్నిస్తూ పార్టీలో తెలంగాణావాదులనుండి ఇబ్బందులు రాకుండా ఇంతవరకు కాలక్షేపం చేసేసిన ఆయన సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభలో పాల్గొంటూ పరోక్షంగా వారికి తన మద్దతు ప్రకటిస్తూ, సభలో చంద్రబాబును లక్ష్యం చేసుకొని ప్రసంగించడం మరో తప్పు. చంద్రబాబు రెండుకళ్ళ సిద్దాంతం అంటూ ఇంతకాలం కాలక్షేపంచేసి హటాత్తుగా ప్లేటు పిరాయించి తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇవ్వడాన్ని అయన తప్పు పట్టారు. అయితే తానూ ఆ సభకి వచ్చి తన రెండు రాష్ట్రాల వాదనను వదిలిపెట్టి సమైక్యాంద్రా వైపు ప్లేటు పిరాయిన్చినట్లు మాత్రం అయన బహిరంగంగా ప్రకటించకపోయినా ఆ విషయాన్ని తెలంగాణా వాదులు మాత్రం బాగానే అర్ధం చేసుకొన్నారు. పార్టీ అధ్యక్షపదవిలో ఉంటూ యావత్ రాష్ట్ర పార్టీకి బాద్యత వహించవలసిన అయన సమైక్యాంద్రావాదుల సభకి హాజరవడం తెలంగాణా వాదులు బాహాటంగానే ఖండించారు కూడా.