heavy industries

ఉన్నవాటికి విద్యుత్ ఇవ్వలేరు కానీ...

            తాను దూరకంత లేదు తన మెడకో డోలన్నట్లు, విద్యుత్ సంక్షోభం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోఅనేక పరిశ్రమలు మూతబడుతుంటే, మళ్ళీ నిన్న కొత్తగా రెండు పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబోతున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాల సంతోషం వ్యక్తం చేసారు. ఆయన స్వస్థలమయిన చిత్తూరు జిల్లాలో ఒకటి, భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి స్వంత జిల్లా మెదక్ లో జహీరాబాద్ వద్ద మరొక పరిశ్రమ స్థాపనకు రంగం సిద్ధం అయింది. రెండు పరిశ్రమలు కూడా వాహన తయారీ రంగానికి చెందినవే కావడం మరో విశేషం.   చిత్తూరు జిల్లాలో పీలేరువద్ద ‘ఇసుజి’ తన వాహన తయారీ సంస్థను స్థాపించడానికి ముందుకు రాగా, దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా’ తన ట్రాక్టర్ల తయారీ సంస్థను జహీరాబాదు వద్ద స్థాపించేందుకు సిద్ధం అవుతోంది. గత రెండు సం.లలో కొత్తగా వస్తున్న పెద్ద పరిశ్రమలు ఈ రెండు మాత్రమే. అయితే, ఉన్నవాటికి విద్యుత్ సరఫరా చేయలేక చేతులెత్తేసిన మన రాష్ట్ర ప్రభుత్వం, పూర్తిగా విద్యుత్ మీదనే ఆధారపడి పనిచేసే ఈ రెండు భారీ పరిశ్రమలకు ఏవిధంగా విద్యుత్ సరఫరా చేస్తారో వివరించలేదు.   వాహన తయారీ సంస్థలు తమ వాహన విడిభాగాల ఉత్పత్తికి ప్రధానంగా వాటికి అనుబంధంగా ఏర్పడే చిన్న పరిశ్రమలు, వర్క్ షాపులపైన ఆధారపడి ఉంటాయి. అవికూడా పూర్తిగా విద్యుత్ మీద ఆధారపడి పనిచేసేవేనని ప్రత్యేకంగా చెప్పకరలేదు. గత నాలుగు సంలలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్న పెద్దా పరిశ్రమలు పవర్ హాలీడేస్ మరియు సరయిన విద్యుత్ సరఫరా లేని కారణంగా దివాలా స్థితికి చేరుకొంటున్నాయి. ఇక చిన్నచిన్న వర్క్ షాపులు అనుబంధ పరిశ్రమల సంగతి అంతకంటే దారుణంగా ఉంది. విద్యుత్ కోతలతో తీవ్ర నష్టలపలవుతున్న చిన్న పరిశ్రమలు, విద్యుత సరఫరా సరిగ్గా ఉన్నా లేకపోయినా కూడా భారీగా వస్తున్నా విద్యుత్ బిల్లులతో కుదేలవుతున్నారు.   పెద్ద పరిశ్రమలపై ఆధారపడిపనిచేసే ఆ చిన్న సంస్థలు, విద్యుత్ సమస్య వల్ల ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకంజ వేస్తుంటే, మరో వైపు సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయని కారణంగా వాటిని పెద్ద పరిశ్రమలు బ్లాక్ లిస్టులో పెట్టక తప్పట్లేదు. ఇక, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకోనేవారు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిపోతుంటే, ఉన్న పరిశ్రమలు మెల్ల మెల్లగా తమ ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గించుకొంటూ అంతిమంగా మూసేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇక, ఇటువంటి సమయంలో మరి ఈ రెండు భారీ పరిశ్రమలు ఏ భరోసాతో మన రాష్ట్రంలో అడుగుపెట్టాయో వాటికి విద్యుత్ ఏవిధంగా అందిస్తారో ఎవరికీ తెలియదు.

AP Budget outlay for 2013-14

రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ ముఖ్యంశాలు

      రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రూ. 25,962 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రణాళిక వ్యయం రూ.17,694 కోట్లు, ప్రణాళేకతర వ్యయం రూ.8,267 గా ఉంది. వ్యవసాయ రుణ లక్ష్యం రూ.75,450 కోట్లుగా మంత్రి కన్నా వివరించారు. ప్రకృతి వైపరిత్యాలలో నష్ట పరిహారం కింద రూ.589 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మద్దతు లభించని సమయంలో రైతులకు సాయం కోసం రూ.100 కోట్లతో ఆలంబన నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు : - విద్యుత్ రాయితీ కోసం - రూ.3,621 కోట్లు - షుగర్ ఫ్యాక్టరీ - రూ.52.05 కోట్లు - ఫుడ్ ప్రాసెసింగ్ - రూ.120 కోట్లు - వడ్డీలేని పంట రుణాలకు రైతుశ్రీ పథకం పురుతో రూ. 500 కోట్లు - వ్యవసాయ యంత్రీకరణ - రూ.450 కోట్లు - పట్టు పరిశ్రమలకు - రూ.79.20 కోట్లు - రాష్ట్రంలో కొత్తగా ఆరు రైతు బజార్ల ఏర్పాటు - మత్స్యశాఖ - రూ.184.35 కోట్లు - ఆహార ధాన్యాల నిల్వలకు - రూ.39 కోట్లు - విత్తనాభివృద్ధి - రూ.308 కోట్లు - భూసార అభివృద్ధి నిర్వహణకు - రూ.2309 కోట్లు - అటవీశాఖ - రూ.492 కోట్లు - పశుసంవర ్థక శాఖ - రూ.924 కోట్లు - సోలార్ పంపు సెట్లకు - రూ.150 కోట్లు - వర్షాధారిత వ్యవసాయాభివృద్ధికి - రూ.2903 కోట్లు - గోదాముల నిర్వహణకు - రూ.42 కోట్లు - రైతులకు 50 శతం సబ్సీడీ విత్తనాలు

AP Budget outlay for 2013-14

రూ.1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

      శాసనసభలో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి రూ.1,61,348 కోట్లతో సోమవారం ఉదయం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అగ్రాసనం వేస్తుందన్నారు. వ్యవసాయం రంగంలో ఆరు శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. ఉగాది నుంచి పేదలకు రేషన్ కార్డు ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, దాని కోసం రూ.660 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో మెరుగైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.   బడ్జెట్‌లోని అంశాలు : - హోంశాఖ - రూ.5,386 కోట్లు - ఐటీ - రూ.207 కోట్లు - పరిశ్రమలు, వాణిజ్యం - రూ.1,120 కోట్లు - సాగునీరు - రూ.13,800 కోట్లు - ఇంధనం - రూ.7,117 కోట్లు - మౌలిక సదుపాయాల కల్పనకు - రూ. 180 కోట్లు - పర్యావరణం, అడవులు, శాస్త్రసాంకేతిక రంగానికి - రూ.551 కోట్లు - పాఠశాల విద్య - రూ.16990 కోట్లు - ఉన్నత విద్య - రూ.4082 కోట్లు - వైద్య, ఆరోగ్య శాఖ - రూ.1,738 కోట్లు - కార్మిక శాఖ - రూ.562 కోట్లు - పట్టణాభివృది - రూ.6770 కోట్లు - ఎన్ఆర్ఈజీఎస్ - రూ.11200 కోట్లు - పౌరసరఫరా - రూ.3231 కోట్లు - గృహనిర్మాణం - రూ. 2326 కోట్లు - సాంస్కృతిక రంగం - రూ.69 కోట్లు - పర్యాటక రంగం - రూ. 163 కోట్లు - యువజన సేవలకు - రూ.280 కోట్లు - వికలాంగులకు - రూ.73 కోట్లు - మహిళా శిశు సంక్షేమానికి - రూ.1027 కోట్లు - బీసీ సంక్షేమానికి - రూ.4027 కోట్లు - ఎస్సీ సంక్షేమానికి - రూ.4,122 కోట్లు - గిరిజన సంక్షేమానికి - రూ.2,126 కోట్లు - వ్యవసాయానికి - రూ.6,28 కోట్లు - మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,980 కోట్లు - కృష్ణా జలాల తరలింపునకు రూ.1,676 కోట్లు - కొత్తగా 18 రెవెన్యూన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు - 2 కలెక్టరేట్‌లు, 144 తహశీల్దార్ భవనాలు నిర్మిస్తాం - రెవెన్యూ అధికారుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు - ఈ ఏడాది 27,903 కొత్త ఉద్యోగాలు - తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రికి 100 పడకల పెంపు - నెల్లూరులో 150 పడకలతో ఆస్పత్రి - వికలాంగులకు వివాహం చేసుకుంటు 50 వేలతో ప్రోత్సాహం - 2291 సబ్ఇన్‌స్పెక్టర్లు, 736 కానిస్టేబుళ్ల నియామానికి త్వరలో నోటిఫికేషన్ - నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ల నిర్మాణం - వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.262 కోట్లు - తిరుపతి, జహీరాబాద్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ - రాజీవ్ యువ కిరణాలు ద్వారా 2014-15 నాటికి 15 లక్షల మందికి ఉపాధి - గ్రామీణ, నగర ప్రాంతాల్లో అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం.

TRS telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

        శాసనసభ సజావుగా సాగేందుకు సహకరించని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినకపోవడంతో వారిని ప్రభుత్వం ఒకరోజు పాటు సస్పెండ్‌ చేసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సీపీఐ, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈనెల 21న తలపెట్టిన సడక్ బంద్కు అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు ఉదయం హోంమంత్రిని కోరారు.

Baadshah audio launch

ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని బహిష్కరిస్తున్నాం

        'బాద్ షా' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మరణించిన వరంగల్ కు చెందిన అభిమానికి సంతాపం ప్రకటించకపోవడంపై సినీనటి, ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయశాంతి మాట్లాడుతూ…బాద్‌షా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో తెలంగాణ బిడ్డ మరణించినా సంతాపం తెలపకుండా ఆడియో ఫంక్షన్‌ నిర్వహించడం సీమాంధ్ర అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బాద్‌షా సినిమాను బహిష్కరిస్తున్నామన్నారు. కాగా బాద్‌షా ఆడియో రిలీజ్‌ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రాజు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

famous cartoonist Mallik director

ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ దర్శకావతారం

        కామెడీ ప్రపంచానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ 'తొక్కలో ప్రేమ' అనే సినిమా తో దర్శకా వతారంలో మన ముందుకు రాబోతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్ మన ముందుకు తీసుక రాబోతుంది. ప్రస్తుతం తెలుగువన్.కాం క్రియేటీవ్ హెడ్ గా ఆయన చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు యెందరో ప్రముఖుల ప్రశంసలు పొందాయి.   తెలుగు కార్టూన్ ప్రపంచంలో మల్లిక్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు! ఇంకా చెప్పాలంటే మల్లిక్ ని మించినవారు లేరని చెప్పవచ్చు. మల్లిక్ గారు సృష్టించిన చిట్టి, టింగు తెలియనివారంటూ ఉండరు. ఒకానొక సమయంలో ప్రముఖ దిన,వార మాస పత్రికలు కేవలం మల్లిక్ కార్టూన్లు చదవడానికే కొనేవారన్నది అక్షరసత్యం. ఐదు వందలకు పైగా కధలు వివిధ పత్రికలకు వ్రాసారు. అలాగే యెన్నో ధారావాహికాలు కూడా ప్రచురింపబడ్డాయి. "పరుగో పరుగు”, "జీవితమే ఒక ఢమాల్" కధలు సినిమాలుగా తీయబడి జనాదరణను పొందాయి. అలాగే "మని", సిసింద్రీ" చిత్రాలకు పబ్లిసిటీ డిసైనర్ గా ఛాయాచిత్రాలను అందించారు. ఆల్ ఇండియా రేడియో వారికి ముఫైకి పైగా నాటికలు వ్రాసారు. అందులో "ఇంపోర్టెడ్ కెమేరా" రేడియో శ్రోతకు బాగా తెలిసిందే! ఇంకా యెన్నో టీ.వి ధారావాహికాలకు కధను అందించారు.

Agriculture Budget Announce Kanna

కన్నా వ్యవసాయ బడ్జెట్

  రాష్ట్ర శాసనసభలో నేడు వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మినారాయణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కన్నా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రైతుల సమగ్ర అభివృద్దే లక్షంగా ప్రత్యేక బడ్జెట్ తెస్తున్నట్టు, ప్రత్యేక బడ్జెట్ తెచ్చినంత మాత్రాన వ్యవసాయమ్లోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తాము భావించడం లేదని, ఈ ప్రత్యేక బడ్జెట్ వల్ల వ్యవసాయ రంగంపై శ్రద్ధ పెరుగుతుందని, రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా వినియోగమయ్యేలా చూసేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Swiss Women Gang Rape Culprits Arrested

స్విస్ మహిళ గ్యాంగ్ రేప్ నిందుతులను అరెస్ట్ చేసిన పోలీసులు

  స్విట్జర్లాండ్ పర్యాటకురాలిపై మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో గ్యాంగ్ రేప్ జేరిగిన విషయం విధితమే. స్విట్జర్లాండ్ దంపతులు రెండు రోజుల కిందట ఝాడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బసచేశారు. దీన్ని కనిపెట్టిన బాబా, భూతా, గజా అలియాస్ బ్రిజేష్, నితిన్ కంజర్, విష్ణు కంజర్, రాంప్రో అనే యువకులు ఆ దంపతులపై దాడి చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, ఇతర విలువైన వస్తువులను దోచుకుని మహిళా టూరిస్ట్ పై అత్యాచారం చేసి పారిపోయారు. బాధితులు పోలీసులకు ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఆరుగురు నిందుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Stratergies Sadak Bandh 21st March

సడక్ బంద్ కు సన్నాహాలు

  ఈ నెల 21న టి.ఆర్.ఎస్. టి.జెఎసి తలపెట్టిన సడక్ బంద్ కు సన్నాహాలు చేస్తుంది. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించియన సడక్ బంద్ సన్నాహక సమావేశాలో టి.ఆర్.ఏ.స్. నేత హరీశ్ రావు మాట్లాడుతూ "ప్రభుత్వం సడక్ బంద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని,ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం ఐదు గంటలవరకు రోడ్డుమీద చీమకూడా కదలకుండా సడక్ బంద్ చేసి జయప్రదం చేయాలని,  ప్రజలకోసం చేపడుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోకూడద''ని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ స్వామీ గౌడ్ మాట్లాడుతూ అమరవీరుల సాక్షిగా తెలంగాణా సాధనకోసం చేపట్టిన ఈ కార్యక్రమం విఅజయవంతం చేయడం కోసం  కృషి చేయాలని టి.ఆర్.ఎస్., టి.ఆర్.ఏ.సీ.వీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అవాంతరాలు, ఎన్ని నిర్భంధాలు పెట్టినా సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, ఈ సడక్ బంద్ కార్యక్రమానికి సుమారు ఇరవై ఐదు వేలమంది కార్యకర్తలను తరలించాలని పిలుపునిచ్చారు.  టి.ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు నాయిని నరసింహ ప్రసంగిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం తెలంగాణా రాష్ట్ర సాధనకోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తనడైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

TDP Senior Leader Resignation

టి.డి.పి. కి మరో ఝలక్ ...

  టి.డి.పి. నుండి వలసలు ఆగడం లేదు. తాజాగా 30 ఏళ్ళుగా టి.డి.పి.లో పలు కీలక పదవులు చేపట్టిన మహబూబ్ నగర్ సీనియర్ నేత పొడపాటి చంద్రశేఖర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టి.ఆర్.ఎస్. లో జాయినయ్యే యోచనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంనుంచి పార్టీలో కొనసాగుతున్న చంద్రశేఖర్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లభించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2009లో ఎన్నికల పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ స్థానాన్ని టి.ఆర్.ఎస్.కు కేటాయించడంతో ఆయన రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రశేఖర్ రాజీనామా విషయం తెలుసుకున్న టి.డి.పి. జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు చంద్రశేఖర్ తో భేటీ అయ్యి రాజీనామాపై పునరాలోచించుకోవాలని కోరినా చంద్రశేఖర్ రాజీనామాపై వెనక్కి తగ్గే సమస్యే లేదని తెగేసి చెప్పారు. ఈనెల 21న టి.ఆర్.ఎస్. తెలంగాణా జెఎసి తలపెట్టిన సడక్ బంద్ లో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు.

 kcr chandrababu

ఎన్టీఆర్ టిడిపి చచ్చిపోయింది

        ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఆయన అన్నారు. అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షం మద్ధతు ఇవ్వడమన్నది ప్రపంచంలో ఇదే ప్రథమం అని కేసీఆర్ తెలిపారు. అసలు అవిశ్వాసాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడపీ ప్రవేశ పెడుతుందనుకున్నమని, కానీ అలా చేయకపోవడంతో తమతో అయినా కలిసి వస్తుందని అవిశ్వాసం పెట్టామని కేసీఆర్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో ఏప్రిలో మొదటి వారంలోగా తేలిపోతదని కేసీఆర్ అన్నారు. ఇక అవిశ్వాసంపై ఓటు వేయకపోవడం అన్నది ఎంఐఎం నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

junior ntr

బెజవాడ పదం దమ్ము విజయవాడలో లేదు: ఎన్టీఆర్

        ఎన్ని జన్మలెత్తినా ఎన్టీఆర్ అంత గొప్పవాడిని కాలేనని జూనియర్ ఎన్టీఆర్ తేల్చిచెప్పాడు. తాత గారికి తప్పితే 'అన్న' అని పిలిపించుకునే హక్కు ఎవరికీ లేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలకు తను తమ్ముడిలాగే ఉంటానన్నారు. బెజవాడలో ఈ కార్యక్రమం మొదలు పెట్టిన విజయవంతం అవుతుందని అన్నారు. బెజవాడ తనకు సన్నిహితమైన ప్రాంతామని...ప్రతి కుటుంబం తనను మీ బిడ్డలాగా ఆదరించాలని కోరారు. విజయవాడ కన్న బెజవాడ అని పిలవడమే తనకు ఇష్టమని, బెజవాడకు తానెప్పుడూ రుణపడి ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

నటి కవిత కూతురు ప్రేమ పెళ్ళిలో ట్విస్ట్ లు

        ప్రముఖ నటి, తెలుగుదేశం పార్టీ నేత కవిత కుమార్తె మాధురి తమ డ్రైవర్ రాజ్ కుమార్ ను పెద్దపల్లి వెంకటేశ్వరాలయంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సడన్ గా ట్విస్ట్ వచ్చి చేరింది. “మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మేమే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం" అని చెప్పిన మాధురి రోజు తిరగగానే తిరగబడింది.   అసలు రాజ్ కుమార్ నాకు 15 రోజులకిందట షాపింగ్ మాల్ లో పరిచయం అయ్యాడని, ఆ తర్వాత ఒకరోజు నాకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడని ఆ తరువాత ఏం జరిగింది నాకు తెలియదని మాధురి చెబుతున్నట్లు తెలుస్తోంది. తనకు స్పృహ వచ్చేసరికి ఇద్దరికి వివాహం అయిందని చెప్పాడని, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మాధురి చెబుతోంది. ఇక తల్లి కవిత తన కుమార్తెను పెళ్లి చేసుకున్న అతను మా డ్రైవర్ కానే కాదని, అతనిని నేను ఎప్పుడూ చూడలేదని అంటోంది.

గుర్నాథం! కాణిపాకం వస్తావా? పయ్యావుల కేశవ్

  ప్రస్తుత రాజకీయాలలో ఒకరిమీద మరొకరు వేసుకొంటున్న నిందలు, చేసుకొంటున్న ఆరోపణలు, బయట పెడుతున్న వ్యాపారలావాదేవీల రహస్యాల వలన అర్ధమవుతున్న విషయం ఏమిటంటే అందరూ ఆ తానూ ముక్కలేనని. అంతే కాదు, ఏ రాజకీయకుడు కూడా కేవలం ప్రజాసేవ చేసుకొంటూ బ్రతికేయట్లేదని మరో నిజం కూడా బయటపడుతోంది. అధికారం, రాజకీయాలు రెండూ కూడా వారి వృత్తి అయితే, వ్యాపారాలు, కాంట్రాక్టులు వారి ప్రవృత్తి అని అర్ధం అవుతుంది.   తేనే తీసిన చేతిని నాకడం ఎంత సహజమో, చెరువులో చేపలు నీళ్ళు తాగడం ఎంత సహజమో అధికారం, రాజకీయ అండదండలు, పలుకుబడి ఉన్న అటువంటి వ్యక్తులు వాటిని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం కూడా అంతే సహజం. అయితే, అది ఆశ నుండి అత్యాశగా, దురాశగా మారినప్పుడు ఎవరో ఒకరు వేలెత్తి చూపకమానరు.   మరి తెదేపా నేత పయ్యావుల కేశవ్ విషయంలో అదే జరిగిందని వైకాపా నేత గురనాథ రెడ్డి ఆరోపణలు సందిస్తుంటే, ఆ ఇద్దరి నేతల మద్య షరా మామూలుగానే మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరడం, ముందు దానిని మీడియా స్క్రోలింగు బారుకి తగిలించేసి ఆనక నలుగురుని పిలిచి చర్చలు పెట్టడం షరా మామూలే.   ఇటీవలే, వైకాపా నేత గురనాథ రెడ్డి పయ్యావుల కేశవ్ పై తన తొలి అస్త్రం సందిస్తూ, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో ఆయనకీ వ్యాపార లావాదేవీలున్నాయని బాంబు పేల్చారు. ఇంకేముంది? ఇటీవల మన రాజకీయ నాయకులకు బాగా అలుసయిపోయిన కాణిపాకం వినాయక స్వామికి మళ్ళీ పనితగిలింది. పయ్యావుల కేశవ్ గురునాధరెడ్డికి సవాలు విసురుతూ “నాకు గాలితో ఎటువంటి వ్యాపారలావదేవీలు లేవని నేను కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి నువ్వు చేస్తున్న ఆరోపణలు నిజమేనని నువ్వు కూడా ప్రమాణం చేయగలవా? నాపై చేసిన ఆరోపణలకు నేను ఎటువంటి విచారణకయినా నేను సిద్ధం. మరి నీ వ్యాపార లావాదేవీలపై విచారణకు సిద్ధమేనా? నేను గాలిని ఏదో పెళ్లి సందర్భంలో కలుసుకొన్నాను. అధిపట్టుకొని నాకు ఆయనకీ ముడిపెట్టేయడమేనా?” అని ప్రశ్నించారు.   ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, ఖండన ముండనాలన్నీ మీడియాకు మరో మంచి మసాలా వార్తా దొరికే వరకు కనిపిస్తుంటాయి. ఆ తరువాత షరా మామూలే మళ్ళీ!

బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలంటూ వార్తలు

        నందమూరి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఇంకా సమసిపోలేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విజయవాడలో ఓ జ్యుయలరీ షాపు ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఎన్టీఆర్ కు అభిమానులే మోటార్ బైక్ లతో ర్యాలీగా తీసుకెళ్లారు. అయితే ఆయనకు సినీ అభిమానులు తప్ప తెలుగుదేశం పార్టీ నేతలుగాని, కార్యకర్తలు గానీ ఎవరూ స్వాగతం పలకకపోవడం పట్ల ఆ కుటుంబంలో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతోంది.   టిడిపి కార్యకర్తలు జూనియర్ పర్యటనకు దూరంగా ఉండాలని బాలకృష్ణ సన్నిహితులు సంకేతాలు ఇచ్చారని కధనాలు రావడం ఆసక్తికరంగా ఉంది. నిజంగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.ల మధ్య అంతరం ఏర్పడిందా? అయితే ఇది వరకే తనకు సన్నిహితుడు అయిన  కొడాలి నాని పార్టీని వీడి జగన్ పార్టీలో చేరినా జూనియర్ టీడీపీకే మద్దతు పలికారు. తన తాత పార్టీకే తన మద్దతు అని, అది తెలుగువారి ఆత్మగౌరవం అని ప్రకటించారు.

అసెంబ్లీ లో కాంగ్రెస్, టిడిపిలకు ఝలక్

        కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశం లను నుంచి ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా గీత దాటారు. కాంగ్రెస్ నుంచి అవిశ్వాసానికి అనుకూలంగా మద్దాల రాజేష్, పేర్నినాని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి , బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, అమరనాథ్ రెడ్డి, సాయిరాజ్, జోగి రమేశ్, సుజయ్ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్లనానిలు ఓటు వేశారు. వీరంతా కాంగ్రెస్ నుంచి వైఎస్ ఆఆర్ సీపీ వైపు వెళ్లిన వారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తమ పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించారు.   ఇక తెలుగుదేశం  నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు. రెబెల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, రామకోటయ్య, వేణుగోపాల చారి ఓటింగ్ దూరంగా ఉన్నారు. కొడాలి నాని, వనితలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. మరి వీరిపై ఆయా పార్టీలు చర్యలు తీసుకుంటాయా?