ఏసీబీ కార్యలయం వద్ద తెరాస ఎమ్మేల్యే.. సర్వత్రా ఆసక్తి

    నోటుకు ఓటు కేసులో తెరాస ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయనున్నదని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి ఈ రోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయాలనుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఏసీబీ కార్యాలయానికి వచ్చానని అన్నారు. కాగా మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా జవాబు చెప్పేందుకు నిరాకరించారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా తాజాగా తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ కీర్తన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా కృష్ణ కీర్తన్ ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు.

వాళ్లేమి టెర్రరిస్టులు కాదు అణచివేయడానికి.. రాఘవులు

  మున్సిపల్ కార్మికులు వారం రోజుల నుండి సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఒక పక్క కార్మికుల సమ్మెతో రోడ్లు మొత్తం చెత్తతో నిండిపోయిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మె ప్రభుత్వం వారిని పట్టించుకోకపోగా వారి సమ్మెను పోలీసుల సాయంతో భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై సీపీఎం నేత బివి రాఘవులు స్పందించి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏం బాలేదని.. వాళ్లేమి టెర్రరిస్టులు కాదు పోలీలుసు, సైన్యాన్ని దించి అణచివేయడానికి అని అన్నారు. మున్సిపల్ శాఖ కేసీఆర్ హయాంలో ఉన్నా కాని సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అన్ని శాఖలకు వేతనం పెంచిన కేసీఆర్ మున్సిపల్ కార్మికులు అడిగిన వేతనం ఇవ్వడానికి ఏమైందని.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే వాళ్లు వేతనం డిమాండ్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కార్మికుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి క‌మ్యూ‌నిస్టు పార్టీ‌ల నాయ‌కులు సిధ్దంగా ఉంటార‌ని తెలిపారు.

నీతి ఆయోగ్ సమావేశం.. సీఎంలు డుమ్మా

  భూసేకరణ బిల్లు నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. అయితే గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న భూసేకరణ బిల్లుకు అధికార ఎన్డీఏ ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలో రాష్టాల ఆమోదం కోసం ఎన్టీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం కొంత మంది నేతలు మాత్రం సముఖత చూపనట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు ఈ బిల్లులోని మార్పులను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఈ బిల్లుపై రాహుల్ గాంధీ పెద్ద హంగామా కూడా చేశారు. అయితే ఈ సమావేశానికి దేశంలోని కొంతమంది ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు హాజరవ్వగా.. కొంత మంది సీఎంలు హాజరుకాలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంతరి అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నందున ఈ సమావేశానికి హాజరు కావటం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి మహాపుష్కరాలు సందర్భంగా సమావేశానికి హాజరవలేదు.

నదుల అనుసంధానంతో ఉపయోగం.. చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నీటిప్రాముఖ్యత-నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నూతన ప్రాజెక్టులకు నాంది పలికిన కేఎల్‌ రావు రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒక స్ఫూర్తి ప్రధాత కావాలని సీఎం ఆకాంక్షించారు. నదుల అనుసంధానంతో ఆర్ధికంగా ఎంతో ఉపయోగం ఉంటుందని.. నదులు అనుసంధానం చేసి ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చన్నారు. సముద్రంలో వృధాగా పోయే వెయ్యి టీఎంసీల గోదావరి నీటిని ఉపయోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్‌ను కరువు నుంచి బయటపడేయ వచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని అన్నారు.

అది మన రాజకీయ నాయకులకే చెల్లు

గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మొదటి రోజు అంటే నిన్న రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలవాల్సిన రాజకీయ నేతలు అది చేయకుండా దీని అంతటికి కారణం సీఎం చంద్రబాబే అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనకు దొరికిందే ఛాన్స్ అనుకొని  ప్రతిపక్షనేతలు తొక్కిసలాటకు కారణం ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా అని చూసే జగన్ అయితే ఏకంగా రెచ్చిపోయి బాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపించేవారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రజల గురించి అంత పట్టించుకునే నాయకులైతే పుష్కర ఘాట్ ల దగ్గరకు వచ్చి ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చూసేవాళ్లు.. అది చేయడం చేతకాదు.. ఎవర్నైనా విమర్శించమంటే మాత్రం ముందుంటారు. అంత జాలే ఉన్నట్టయితే బాధితుల కుటుంబాలను పరామర్శించి సహాయం చేసేవాళ్లే. కనీసం అక్కడి పరిస్థితి ఎలా ఉందో కూడా వెళ్లి చూడని నాయకులు కూడా విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉంది. శవాలతో కూడా రాజకీయాలు చేయవచ్చని మన రాజకీయ నేతలను చూసి నేర్చుకోవచ్చనిపిస్తుంది... అది మన రాజకీయ నేతలకే చెల్లు. అయితే ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కూడా ఘాటుగానే సమాధాన మిచ్చారు. ఈ విషయం పై టీడీపీ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ నిన్న రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు కారణం చంద్రబాబే అంటూ దుష్ప్రచారం చేయడంసరికాదని మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనను ఆధారంగా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదన్నారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి నేతలు కూడా శవరాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు ప్రణాళికాబద్ధంగానే ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటపై ప్రతిపక్షాలది అనసవర రాద్దాంతమని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని.. భక్తులకు బాసటగా నిలవాలని అన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరైన రీతిలో స్పందించారని.. భక్తులకు సహాయ చర్యలు అందించాలని తన అభిమానులకు పిలుపునివ్వడం అభినందనీయమని సోమిరెడ్డి అన్నారు. జూపుడి ప్రభాకర్ రావు కూడా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ప్రతిపక్షాలపై ఘాటుగానే మండిపడ్డారు. ప్రమాదం జరిగి ఓవైపు ప్రాణాలు కోల్పోయి ఉంటే బాధితులను ఓదార్చాల్సింది పోయి దాని కారణం సీఎం అంటు.. టీడీపీ అంటూ విమర్సలు చేయడం విడ్డూరమన్నారు. అంతేకాక మేం కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని.. పార్టీ తరుపున ఎవరినైనా వాలెంటీర్లను పంపించారా అని ప్రశ్నించారు. శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్ అని ధ్వజమెత్తారు.

ఏసీబీ ఎదుట వేం నరేందర్ తనయుడు

  ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు ఎవరో ఒకరికి నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లకు తరువాత ఈ కేసులో నిందితులుగా భావించి తెదేపా నేతలైన వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలకు నోటీసులు జారీ చేసి వారిని విచారించింది. ఇప్పుడు ఈ కేసులో వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి కు కూడా సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణ కీర్తన్ రెడ్డి ఈరోజు ఏసీబీ ఎదుటు హాజరయ్యారు. కాగా వేం నరేందర్ కొడుకు కృష్ణ కీర్తన్ రెడ్డి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతను రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహాలతో మాట్లాడినట్టు ఏసీబీ గుర్తించడంతో అతనికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

అర్ధరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో రెండో రోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండు రోజు కూడా భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, తెలంగాణలోని భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఘాట్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. కాగా నిన్న రాజమండ్రిలోని పుష్కర ఘాట్‌ తొక్కిసలాట నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా అక్కడ ఏపీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు కూడా మంగళవారం అర్ధరాత్రి వరకు పుష్కర ఘాట్‌ల వద్ద కలియతిరిగి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల సమాచారం కోసం 8333000020 టోల్‌ఫ్రీ ఫోన్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.

రేవంత్ రెడ్డి గోడ కూల్చేందుకు యత్నం

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ప్రహరీ గోడను కూల్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నేత అనుచరులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ఉంది. దానికి ఉన్న ప్రహరీ గోడను కూల్చేందుకు శంకర్ గౌడ్ అనే టిఆర్ఎస్ నేత అనుచరులు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అధికార ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై ఉన్న కక్ష్య కారణంగానే ఇలాంటి పనులు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీ, టీ ఉద్యోగుల సర్దుబాటు!

  ప్రస్తుతం ఉన్న పరిస్థితులవల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉద్యోగుల సర్దుబాటుకు సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు.. ఉద్యోగుల సర్దుబాటుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పంపిచే విధంగా సర్దుబాటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంగీకరించారని.. దీనికి సంబంధించిన ఫైలుపై ఇప్పటికే తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఇప్పటికే సంతకం చేయగా.. ప్రస్తుతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వద్దకు ఫైలు వెళ్లినట్లు వినవస్తోంది. మరోవైపు రెండు రాష్ట్రాలలోని ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది.   మరోవైపు ఉద్యోగుల రిలీవింగ్‌ ప్రక్రియ కూడా ఊపందుకుంది. కానీ ఆంధ్రా, తెలంగాణ విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపుల్లో కొంచెం వివాదస్పద సమస్యలు ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్టాల ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులను రిలీవ్ చేస్తానంటుంటే.. మరో పక్క ‘స్థానికత’ ప్రాతిపదికన ఏపీకి కేటాయించినప్పటికీ, ‘పోస్టులు లేవు’ అనే పేరిట కొందరు ఉద్యోగులను చేర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. దీంతో ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగుల సర్దుబాటు’ అంశం తెరమీదకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు ఒకవేళ ‘సర్దుబాట్లు’ చేసుకోవాలని నిర్ణయిస్తే..దానిపై ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాల్సి ఉంటుంది.

పుష్కర సంఘటనపై బాలయ్య ఆవేదన

  రాజమండ్రి పుష్కరాలలో ఈరోజు ఉదయం జరిగిన త్రొక్కిసలాటలో 27మంది భక్తులు చనిపోవడం తనకు చాలా బాధ కలిగిస్తోందని ప్రముఖ సినీ నటుడు మరియు హిందూపురం ఎమ్మేల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గత నెలరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరల కోసం అనేక ఏర్పాట్లు చేసిందని, చాలా జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తన అభిమానులు అందరూ పుష్కరాలకి వచ్చే ప్రజలకు వీలయిన విధంగా సేవలందించాలని ఆయన కోరారు. ప్రజలు, ప్రభుత్వం అందరూ ఒకరికొకరు సహకరించుకొంటూ ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని అన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. తరువాత ఈ ప్రమాదం జరిగిన కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్దకు వెళ్లి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.

శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్.. జూపుడి

  గోదావరి మహా పుష్కరాల్లో భాగంగా రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది వరకు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇదే ఛాన్స్ అనుకొని సీఎం చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పందించిన జూపుడి ప్రభాకర్ రావు ప్రతిపక్షాలకు ఘాటుగానే మండిపడ్డారు. ప్రమాదం జరిగి ఓవైపు ప్రాణాలు కోల్పోయి ఉంటే బాధితులను ఓదార్చాల్సింది పోయి దాని కారణం సీఎం అంటు.. టీడీపీ అంటూ విమర్సలు చేయడం విడ్డూరమన్నారు. అంతేకాక మేం కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని.. పార్టీ తరుపున ఎవరినైనా వాలెంటీర్లను పంపించారా అని ప్రశ్నించారు. శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్ అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ స్నానం వలన అరిష్టం... రేవంత్ రెడ్డి

  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అయితే కేసీఆర్ వదిన చనిపోవడం వలన వారి కుటుంబానికి మైల ఉందని అందుకే కేసీఆర్ పుష్కర స్నానం చేయకూడదని వివరించారు. అయినా కేసీఆర్ పుష్కారం చేశారని.. కేసీఆర్ పుష్కర స్నానం చేయడం వలన రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని విమర్శించారు. మైల ఉన్నందున పుష్కర స్నానం చేయోద్దని వేద పండితులు కేసీఆర్ కు చెప్పినా వినకుండా పుష్కరస్నానం చేశారని.. కేసీఆర్ లక్ష పాపాలు చేసి గోదావరి నదిలో ఒక్క మునక మునిగితే ఆ పాపాలన్నీ హరించుకుపోతాయన్న భ్రమలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.

రావాలని ఉన్నా రాలేకపోతున్నా.. పవన్ కళ్యాణ్

    గోదావరి మహా పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల తొక్కిసలాటలో సుమారు 30 మంది వరకూ మృతి చెందారు. పుష్కరాల్లో తొక్కిసలాటపై జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కరాల సందర్భంగా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ అన్నారు. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలని ఉన్నా.. తాను అక్కడకు వస్తే మళ్లీ తోపులాట జరిగే ప్రమాదం ఉంటుందని.. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అందుకే అక్కడకు రాలేకపోతున్నాని ట్విట్టర్ తెలిపారు. నేను రాలేకపోయనా నా అభిమానులు మాత్రం సహాయచర్యల్లో పాల్గొనాలని సూచించారు.

సండ్రకు బెయిల్ మంజూరు

  ఓటుకు నోటు కేసులో అయిదవ నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సండ్ర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం నిన్న వాదోపవాదనలు జరిపినప్పటికీ మళ్లీ ఈరోజుకు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని, నియోజకవర్గం దాటి వెళ్లవద్దని కోర్టు షరతులు విధించింది. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సండ్రకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. కేసు కీలక దశలో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దని ఏసీబీ అధికారులు ఏసీబీని కోరారు. అయితే ఆ తరువాత సండ్రని రెండు రోజుల కస్టడీకి తీసుకొని కూడా విచారించారు. కానీ సండ్ర తరఫు న్యాయవాది రవీంద్ర కుమార్.. రెండు రోజుల ఏసీబీ విచారణకు సండ్ర అన్ని రకాలుగా సహకరించాడని.. సండ్రకు సంబంధించి ఇంకెవర్నీ విచారించే అవసరం లేదని తన అన్నారు. విచారణ నిమిత్తం ఎప్పుడు అవసరమైన హాజరవుతారని చెప్పారు. దీంతో ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేసింది.

కంటతడి పెట్టిన చంద్రబాబు..

  ఈరోజు గోదావరి మహాపుష్కరాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రారంభమయిన తొలి రోజే అపశృతి జరిగింది. రాజమండ్రిలోని ఘాట్ వద్ద తోపులాట జరిగి సుమారు 27 మంది మృతి చెందారు. అయితే అనుకున్నదానికంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో తోపులాట జరిగి ఈ ప్రమాదం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పదించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పుష్కరాల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అనుకోని సంఘటన జరగడం.. ఇంత మంది మృతి చెందడం మనసు కలిచి వేస్తుందని కంటతడి పెట్టారు. ఎక్కడ లోపం ఉందో పుష్కరాలు పూర్తయ్యాక విచారణ జరిపిస్తామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

సినీ సంగీతానికి ఎం.యస్.విశ్వనాథన్ ఇక లేరు..

  ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలో మల్లార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో 1200 చిత్రాలకు సంగీతం అందించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.యస్.విశ్వనాథన్ గారు. తెలుగులో కేవలం 31 సినిమాలకే సంగీతం అందించినప్పటికీ ఆయన అందించిన బాణీలతో తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఫిలిం ఫేర్ జీవిత కాల పురస్కారం(2001), పరమాచార్య అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమయిన కలైమణి అవార్డు వంటి అనేక అవార్డులు ఆయన అందుకొన్నారు. అలాంటి ఎన్నో అద్భుతమైన బాణీలు అందించిన ఎం.యస్.విశ్వనాథన్ మరణంతో సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ఏపీ సీఎం చంద్రబాబు ఎం.యస్.విశ్వనాథన్ మృతికి సంతాపం తెలిపారు. ఎం.యస్.విశ్వనాథన్ దేశం గర్వించదగ్గ కళాకారుడని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.   https://www.youtube.com/playlist?list=PLvS3k4MyaWFfomd76mt2iP6Rr2NkXRdAR

పవన్ కళ్యాణ్ తరువాత టార్గెట్ జగనా..!

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను.. వారి తరపున నేను ప్రశ్నిస్తా అని అప్పుడెప్పుడో చెప్పారు. కానీ ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని చెప్పనైతే చెప్పారు కానీ చెప్పిన తరువాత దాదాపు కొంత కాలం అసలు ఆయన ఆ ఊసే ఎత్తలేదు. ఇదే విషయంపై అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద చాలా మంది చాలా విమర్శలే చేశారు. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ కు ఏమైందో తెలియదు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఏపీ మంత్రులందరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మొదట తెలుగుదేశం పార్టీ నేతలను ఆయన నిలదీశారు. వారి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దానికి టీడీపీ ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ కి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఓ సమయంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారిపోతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ చంద్రబాబు జోక్యం చేసుకొని సర్ధిచెప్పడంతో పరిస్థితి నెమ్మదించింది.   ఆ తరువాత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గాలికొదిలేసిందని.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పిస్తానని హామి చేసిందని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ విషయంలో బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడింది.. కానీ ఏపీకీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడంలేదని ఎద్దేవ చేశారు. లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుటివరకు టీడీపీ నేతలను.. కాంగ్రెస్ నేతలను ప్రశ్నించగా తరువాత ఎవరిని ప్రశ్నిస్తారు అని విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తరువాత టార్గెట్ మాత్రం వైకాపా అధ్యక్షుడు జగనే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో... రానున్న పార్లమెంటు సమావేశాల్లో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి మరింత ఘాటుగా మాట్లాడవచ్చునని భావిస్తున్నారు.

తెలంగాణకు పుష్కర పాట్లు..

  ఆంధ్రరాష్ట్రంలోనూ.. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ గోదావరి మహా పుష్కరాలు మొదలయ్యాయి. ఆంధ్రరాష్ట్రంలో ఈ పుష్కరాలకు ఎలాంటి నీటి కొరత లేదు కానీ పాపం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీటి కష్టాలు వచ్చిపడ్డాయి. గోదావరి మహా పుష్కరాలలో స్నానం చేద్దామంటే భక్తులకు నిరాశేమిగిలింది. తెలంగాణలో కొన్ని చోట్ల గోదావరి జలాలు ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రం నీళ్లు లేక నేల ఎండిపోయి ఉండటం గమనార్హం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలోనూ, గోదావరి, మంజీర, హంద్రీ నదుల త్రివేణీ సంగమస్థలి అయిన నిజామాబాద్‌ జిల్లా కుందకుర్తిలోనూ గోదావరి నీరు లేక బోసిపోయి కనిపిస్తోంది.   మరోవైపు సీఎం కేసీఆర్ పుష్కరాలు సమయం కాబట్టి వాటికోసమైనా నీటిని విడుదల చేయాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కోరారు. ఇదే విషయం పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఫడ్నవిస్ కు చెప్పరు కానీ.. నీరు వదలాల్సిన చోట తగినంత నీరు నిల్వ లేదని అందువల్ల తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నదని.. నీటిని విడుదల చేయలేమని చెప్పారు. ఒకవేళ పుష్కరాలు పూర్తయ్యే లోపు తగిన నిల్వ లభిస్తే జలాలను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రభత్వానికి ఏం చేయాలో తెలియక ప్రత్యేకంగా ఘాట్ లు.. షవర్లు ఏర్పాటు చేసి భక్తులు స్నానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని చిన్న రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటినే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరఘాట్లకు మళ్లిస్తోంది. ఈ పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రతి రోజూ 3 వేల క్యూసెక్కుల చొప్పున పుష్కరాలు పూర్తయ్యేంత వరకు మొత్తం 6 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. అలాగే కడెం ప్రాజెక్టు నుంచి, ఎల్లంపల్లి నుంచీ నీటిని విడుదల చేయనున్నారు.