అందుకే నాపై కక్షగట్టారు.. సెబాస్టియన్

  ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్ గురువారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ను పరోక్షంగా విమర్శించారు. కావాలనే ఓటుకు నోటు కేసులో సాక్షి ఛానల్ తనపై బురద చల్లే ప్రయత్న చేస్తుందని.. బైబిల్‌ పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయరాదని ఒకసారి ఏబీఎన్‌ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పానని.. అందుకే నాపై కక్షగట్టి ఇలా కథనాలు రాస్తున్నారని అన్నారు. ఏదో వాయిస్ ను డబ్బింగ్‌ చేసి దానిని రికార్డ్ చేసి నా వాయిస్ అని చెప్పి టెలికాస్ట్‌ చేస్తోందని ఆయన విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని దెబ్బగొట్టలేరని.. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని సెబాస్టియన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ బియ్యం.. జర జాగ్రత్త

  చైనా దేశం టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశమని మనకు తెలుసు. అంతేకాదు నకిలీ ప్రొడెక్టుల ఉత్పత్తులలోనూ చైనా ముందుంటుంది. అందుకే చైనా పేరు చెబితే ప్రముఖ సంస్థలు కూడా తమ ఉత్పుత్తులకు నకిలీతో ఎసరు పెడుదుందని వణికిపోతాయి. అలాంటి చైనా దేశం ఇప్పుడు ఏకంగా మనిషి తిండిని కూడా నకిలీ చేసేసింది. మనం రోజూ తినే బియ్యాన్ని తలపించేలా నకిలీ బియ్యాన్ని తయారుచేస్తుంది చైనా దేశం. దీనిపై సుగ్రీవ దూబే అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చైనా దేశం తయారు చేసే నకిలీ బియ్యం ఆ దేశం నుండి మన దేశం మార్కెట్లలోకి వస్తున్నాయని.. ఈ నకిలీ బియ్యాన్ని అసలు బియ్యంలో కలిపి అమ్ముతున్నారని.. ఈ బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కొరియన్ టైమ్స్ అనే పత్రిక వెల్లడించింది. బంగాళదుంపలు, చిలగడదుంపలు, ప్లాస్టిక్‌ కలిపి.. ప్రాణాంతకమైన ఈ ప్లాస్టిక్‌ బియ్యాన్ని తయారుచేస్తున్నారని.. చైనాలోని తయువాన్‌, షాంక్సీ తదితర ప్రావిన్సుల్లో విక్రయిస్తున్నారని కొరియన్ టైమ్స్ అనే పత్రిక తెలిపింది.

పవన్ కళ్యాణ్ vs కేశినేని నాని

  ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత ప్రశ్నించారు. అంత వరకూ బానే ఉంది చాలా రోజుల తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఎమైందో ఎమో కానీ ఏపీ ఎంపీలను అసలు పార్లమెంట్ లో ఏంచేస్తున్నారు అంటూ నిందిచారు. అందులోనూ ప్రత్యేకంగా కేశినేని నానిని ఉద్దేశించి మరీ విమర్శించారు. అసలే కేశినేని నానికి ఆవేశం ఎక్కువ.. దీనికి తోడు పవన్ కళ్యాణ్ అంత మాటన్న తరువాత ఊరుకుంటాడా... పవన్ కళ్యాణ్ ని పనిలో పనిగా చిరంజీవిని కూడా దులేపాశాడు. కేశినేని నాని పవన్ కళ్యాణ్ ని ఎలా దులిపేశాడో చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను ఓసారి చూడండి.

అప్పుడు జగన్.. ఇప్పుడు టీ సర్కార్

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు పై జగన్ ఆరోపించడం అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆరోపించడం మొదలుపెట్టింది. గతంలోనే జగన్ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా దాన్ని అడ్డుకోవడానకి చాలా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకత చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. "పట్టిసీమ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టమని, ఈ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని, వాటాలు తేలకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని, గోదావరి మిగులు జలాలను ఉపయోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే ఉందని కేంద్రం, గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల పథకం అక్రమమని.. విభజన చట్టానికి ఇది పూర్తి వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు. అసలు గోదావరి నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా దానికి గోదావరి నది యాజమాన్యం అనుమతి తీసుకోవాలని.. అంతేకాక ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్, కేంద్ర జలసంఘం అనుమతి కూడా తీసుకోవాలని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది.   తాగునీటి అవసరాలకు సీఎం చంద్రబాబు ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టారు. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. అప్పుడు జగన్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత వాసులకు నీటి కొరత లేకుండా చేయలని చూస్తున్న చంద్రబాబుకు కోరికను ఎలాగైనా నెరవేరకుండా చేయాలని చూస్తున్నారు అటు ప్రతిపక్షనేత అయిన జగన్.. ఇటు తెలంగాణ ప్రభుత్వం.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పోస్ట్.. ఎంపీలకు సూటి ప్రశ్న

  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం మరోసారి ఏపీ ఎంపీలను ఉద్దేశించి ట్విట్టర్ లో ప్రశ్నలు సంధించారు. "ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు సవరణ సమయంలో లోక్ సభలో ఎంతమంది ఎంపీలు ఉన్నారని.. నాకున్న సమాచారం ప్రకారం ఐదుగురు ఎంపీలే చర్చలో పాల్గొన్నారు...మిగిలిన ఎంపీలు ఏం చేశారు" అని ప్రశ్నిస్తూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ కు, ఏపీ ఎంపీల మధ్యం కోల్డ్ వార్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా పై ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని.. ప్రత్యేక హోదా గురించి ఎందుకు నిలదీయడం లేదని.. ఎంపీలంతా వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. దీంతో ఎంపీలంతా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ గా మీరేం చేస్తున్నారు అంటూ ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

చంద్రబాబు జపాన్ టూర్.. పలు కీలక ఒప్పందాలు

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారన్నది అందరికి తెలిసిన వాస్తవమే. అసలే రాష్టం విడిపోయిన తరువాత ఆర్ధిక పరంగా కొంత లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులను తీసుకురావడానికి చాలా కృషి  చేస్తున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో సింగపూర్ పర్యటన కూడా చేశారు.. అక్కడ ఎంతో మంది ప్రముఖులు.. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలతో సమావేశమయి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కూడా తన వంతుగా ఏపీ అభివృద్దిలో పాటుపడటానికి గతంలో అమెరికా వెళ్లి అనేక మందిని ఏపీలో పెట్టు బడులు పెట్టడానికి ఒప్పించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఏపీలోకి పెట్టుబడిదారులను తీసుకురావడానికి జపాన్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు జపాన్‌లో పర్యటించిన చంద్రబాబు బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అనేక ప్రముఖ సంస్థలతో భేటీ అయి ఏపీ లో కూడా పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు.   * జేజీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మసియుకి సటోతో చంద్రబాబు బృందం భేటీ అయి పెట్రో కెమికల్‌ కారిడార్‌లో పెట్టుబడులు పట్టాలని కోరారు. అయితే జేజీసీ కార్పొరేషన్‌ రిఫైనరీ, క్రాకర్‌ యూనిట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలపై  ఆసక్తి కనబర్చింది. * సుమిటొమో, మిత్సుబ్యాకింగ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతోనూ చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఏపీకి వచ్చి విశ్వవిద్యాలయాలతో కలిసి కన్సెల్‌టెన్సీ సంస్థలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. * తోషిబా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు. విద్యుత్‌ నిర్వహణపై తోషిబా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. * జపాన్‌ వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి యొసిజే టకజీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణంలో పాల్గొంటామని యొసిజే హామీ ఇచ్చారు. * జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. అనంతరం వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్‌ఉత్పత్తిలో పేరొందిన జేఎప్‌ఈ ఏపీలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి కనబర్చింది.     చివరిరోజు కొమమురా సంస్థ ప్రతినిధులను ఏపీ సీఎం చంద్రబాబు కలిసి చర్చించారు. కెమెరాలు, లెన్స్‌లు, ఆప్టిక్స్‌ కంపెనీగా పేరొందిన కొమమురా కంపెనీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చే సుకోవాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. జపాన్ పర్యటనలో ఈ రోజు చివరిరోజు కాబట్టి పర్యటన అనంతరం చంద్రబాబు బృందం ఢిల్లీ బయలుదేరనుంది.

సండ్రకు థర్డ్ డిగ్రీ వద్దు

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నా సండ్ర వెంకట వీరయ్యను విచారణ నిమిత్తం ఈరోజు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ అధికారులు సండ్రను రెండు రోజుల పాటు విచారించనున్నారు. అయితే సండ్రను విచారించడానికి ఏసీబీ అధికారులకు కోర్టు కొన్ని సూచనలు చేసింది. సండ్ర ప్రజాప్రతినిధి కాబట్టి అతనికి థర్డ్ డిగ్రీ లాంటివి ఉపయోగించవద్దని.. అతని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపాలని.. అంతేకాక సండ్రకు ఆరోగ్యం బాలేదు కనుకు విచారణ సందర్భంగా ఒక డాక్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు విచారించవచ్చని.. విచారణ చేస్తున్నప్పుడు వేధింపులకు గురిచేయవద్దని తెలిపింది. కాగా ఈ కేసులో సండ్రకు ముందు నోటీసులు జారీ చేసినా అప్పుడు విచారణలో పాల్గొనలేదు. రెండోసారి సెక్షన్ 41(ఏ) ప్రకారం మళ్లీ సండ్రకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే..

పవన్ కళ్యాణ్ కి అవంతీ బంపర్ ఆఫర్

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు తమ బాధ్యతలు విస్మరించి తమ వ్యాపారాల మీదనే శ్రద్ద పెడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకి వారు కూడా అంతే ధీటుగా బదులిస్తున్నారు. తెదేపా అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతీ శ్రీనివాస్ అయితే పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చేరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయదలచుకొంటే తను తన లోక్ సభ పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని, కావాలంటే ఆయన అక్కడి నుండి పోటీ చేసి లోక్ సభకు వెళ్లవచ్చునని ఆఫర్ ఇచ్చేరు. మరి పవన్ కళ్యాణ్ ఆయన ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ ని స్వీకరిస్తారో లేదో?

నేడు డిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, మంత్రులు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ దేశ పర్యటన ఈరోజుతో ముగుస్తుంది. అక్కడి నుండి ఆయన నేరుగా డిల్లీ చేరుకొంటారు. ఆయన కొందరు కేంద్రమంత్రులను కలిసి వారితో పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు అచ్చెం నాయుడు, మాణిక్యాల రావు తదితరులు కూడా ఈరోజు డిల్లీ వెళ్ళబోతున్నట్లు సమాచారం. వారందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రులను రాజమండ్రిలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రావలసిందిగా ఆహ్వానిస్తారు. మళ్ళీ చాలా రోజుల విరామం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళుతుండటంతో ఆయన డిల్లీ పర్యటనపై సర్వత్రా చాలా ఆసక్తి నెలకొని ఉంది.

ఏపీ ప్రభుత్వం లక్ష టాబ్లెట్ లు.. 100 కోట్లు

* లక్ష టాబ్లెట్ లు.. 100 కోట్లు * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ-మెయిలింగ్ సిస్టమ్ * వారం రోజులపాటు ట్రెయినింగ్ * స్కూళ్లకు కూడా టాబ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత సమర్ధుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఉన్న ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది.. ఐటీ రంగంలో హైదరాబాద్ అంత ముందుండటానికి వెనుక కారణం చంద్రాబాబే. ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా టెక్నాలజీని ఉపయోగించడానికి నడుంకట్టారు. దీనికోసం సుమారు 100 కోట్ల వ్యయంతో లక్ష టాబ్లెట్ లను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెటింగ్, రెవిన్యూ, ఎక్సైజ్, ఇరిగేషన్, కమర్షియల్ టాక్సెస్, అగ్రికల్చర్ వంటి డిపార్ట్ మెంట్ లకు 32,000 టాబ్లెట్ లను ఇవ్వనుంది. మరో 6,700 టాబ్లెట్ లను ఆడిపార్ట్ మెంట్లలోని సీనియర్ ఉద్యోగులకు ఇవ్వనుంది. అయితే టాబ్లెట్ లు కొనడం దగ్గరనుండి వాటిని అఫీషియల్స్ కు అందజేయడం.. వారికి ఆన్ లైన్ సర్వీసు ప్రొవైడ్ చేయడం వంటి పూర్తి బాధ్యతలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ చూసుకుంటుంది. అయితే ఐటీ డిపార్ట్ మెంట్ 7,8 లేదా 9 అంగుళాలు, అడ్వాన్స్ డ్ ఫిచర్స్ కలిగిన టాబ్లెట్ ను కొనుగోలు చేయనుందని... వీటికి ఇంటర్నెట్ సర్వీసు ఉండటం ద్వారా ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవచ్చని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. మొదటి విడతలో ప్రతి జిల్లాకు 2,000 టాబ్లెట్ లు ఇస్తామని, రెండో విడతలో భాగంగా ప్రతి మండలానికి 10 నుండి 20 టాబ్లెట్ లు ఇస్తామని అది కూడా కేడర్ ను బట్టి ఇస్తామని తెలిపారు. టాబ్లెట్ ఉపయోగించే విధానం, ఎలా ఆపరేట్ చేయాలి లాంటి డౌట్ లకు ఒక వారం రోజుల పాటు క్లాసులు కూడా నిర్వహిస్తామని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఈ-మెయిల్ సిస్టమ్ ద్వారా నడవాలని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఈ టాబ్లెట్ లను కేవలం ప్రభుత్వ కార్యలయాలకు మాత్రమే కాదు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు కూడా అందించాలని.. రాష్ట్రంలో మొత్తం 62,000 టాబ్లెట్ లను స్కూళ్లకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

పుష్కరాలకు రాంచరణ్ విమానాలు

    గోదావరి పుష్కరాలు మొదలవుతున్నాయి.. పదిరోజుల పాటు జరిగే ఈ పుష్కరాలలో పాల్గొనడానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అయితే పుష్కరాలేమో కానీ ప్రయాణికులకు మాత్రం ట్రావెలింగ్ లో కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా పుష్కరాలకు వెళ్లడానికి ప్లానింగ్ లో ఉన్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతోనే విమానంలో పుష్కరాలకు వెళ్లే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంతకీ అంత ఆఫర్ చేసింది ఎవరు అనుకుంటున్నారా.. ట్రూ జెట్ విమాన సంస్ధ. హీరో రాంచరణ్ అంబాసిడర్ గా ఉన్న ట్రూ జెట్ విమాన సంస్ధ గోదావరి పుష్కరాలకు తమ సర్వీసులను అందించనున్నాయి. పుష్కరాల సందర్భంగా అక్కడ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ దృష్ట్యా అతి తక్కువ ఖర్చుకే విమాన సర్వీసులు ఇస్తున్నామని ట్రూ జెట్ విమాన సంస్ధ ఎండీ ఉమేష్ తెలిపారు. ఈ సర్వీసులు ఈ నెల 12వ తేదీ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నుండి రాజమండ్రి వరకు మొదలవుతాయని అన్నారు. అంతేకాక జులై 26వ తేదీ నుండి ఔరంగాబాద్, హుబ్లీ, తిరుపతి నుండి కూడా సర్వీసుల కల్పిస్తామని ఉమేష్ అన్నారు. తక్కువ ధర.. ఎక్కువ మంది ప్రయాణికులతో బిజినెస్ లో ఎదుగుదల సాధించవచ్చని నమ్ముతున్నానని.. వచ్చే మార్చి లోపు మరో పది నగరాలలో విస్తరించాలని.. మెట్రో నగరాలలో ఇప్పటికే విమానాలు రద్దీ బాగానే ఉన్నా ప్రాంతీయ ప్రాంతాల్లో ఇంకా వాటిని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆదిశగా మేము మా సర్వీసులను విస్తరింపచేయడానికి చూస్తున్నామని ఉమేష్ స్పష్టం చేశారు.

ఎవరికి భయపడను.. డీఎస్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రోజు డీఎస్ తెరాస పార్టీలోకి చేరారు. గత వారం క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డీఎస్ ఈరోజు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ డీఎస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలా పార్టీలోకి చేరారో లేదో అప్పుడే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ వాదులందరిని ఏకతాటిపై నడిపి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం నిరాహార దీక్ష చేశారు అని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలని.. తెలంగాణ ప్రజలు సోనియా రుణం తీర్చుకోలేరని అన్నారు. తాను పార్టీ వీడుతున్నందుకు చాలా మంది విమర్శిస్తున్నారు.. "అలాంటివి తానేమి పట్టించుకోనని.. ఎవరికి భయపడేది లేదని.. తానేదో పదవులు ఆశించి టీఆర్ఎస్ లోకి రాలేదని.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో తాను కూడా పాటుపడటానికే" అని చెప్పారు. డీఎస్‌తో పాటు ఏవీ సత్యనారాయణ, డి. సురేందర్, ఆర్. సత్యం, బోయినపల్లి కృష్ణమూర్తి, సతీశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు.

రేవంత్ కు అవే సాకులు.. సండ్రకు అవే సాకులు

  రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయకుండా చేయడానికి తెలంగాణ ఏసీబీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిందో మనందరికీ తెలుసు. విచారణ కీలక దశలో ఉందని.. సాక్ష్యులను బెదిరిస్తారని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఏవేవో సాకులు చెప్పి బెయిల్ రాకుండా చేద్దామని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చి హైకోర్టు ఏసీబీకి షాకిచ్చింది. ఇప్పుడు సండ్ర విషయంలో కూడా ఏసీబీ అదే చేస్తుంది. ఈరోజు ఈకేసులో నాలుగో నిందితుడైన సండ్ర బెయిల్ విషయంపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. దానిలో ఈ కేసులో సాక్ష్యాలను సండ్ర తారుమారు చేసారని అనుమానంగా ఉందని.. ఆదిశలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారని.. కేసు కీలక దశలో ఉంది కాబట్టి సండ్రకు బెయిల్ ఇవ్వద్దని ఏసీబీ కౌంటర్ లో పేర్కొంది. మొత్తానికి రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి ఎలాంటి కుంటి సాకులైతే చెప్పిందో అలాంటి కుంటి సాకులనే సండ్రకు చెప్పి బెయిల్ రాకుండా చేయడానికి చూస్తుంది ఏసీబీ. పాపం ఈసారైనా ఏసీబీ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.

హీరో ఇంటిలో ఏనుగుదంతాలు.. ఉద్యమకారుల ఆందోళనలు

  ఏనుగు దంతాలు ఇంటిలో పెట్టుకున్నాడన్న ఆరోపణలతో మళయాల హీరో జయరామ్ కు కష్టాలు ఎదురయ్యాయి. ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వన్యప్రాణుల హక్కుల ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. వివరాలు ప్రకారం.. జయరామ్ కు ఒక పెంపుడు ఏనుగు ఉండేది.. అనారోగ్యం కారణంగా అది మరణించడంతో ఏనుగు దంతాలను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. దీనికి అప్పుడు కేరళ అటవీ శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ విషయం బయటపడటంతో జయరామ్ కు ఒక న్యాయం, మిగిలిన వారికి మరో న్యాయమా అంటూ వన్య ప్రాణుల హక్కుల ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కావడంతో ఈ విషయం లో జోక్యం చేసుకోవాల్సిందిగా కేరళ ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రధాని మోదీకి లేఖ రాశారు.