జీహెచ్‌ఎంసీ కార్మికులకు కేసీఆర్ వరాలు

 

మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని వారం రోజులకు పైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి చేసిన డిమాండ్ లకు సీఎం కేసీఆర్ ఒప్పుకోవడంతో నిన్న సమ్మె విరమించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి జీతాల పెంపుతో పాటు కొన్ని వరాలు కూడా ప్రకటించడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వందే అని.. జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగే కొద్దీ కార్మికుల జీతాలు పెంచుతామని హామీఇచ్చారు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆర్టీసీ కార్మికులకు పెంచిన వేతనాలకుంటే ఇప్పుడు జీహెచ్‌ఎంసీ కార్మికులకు ఎక్కువ వేతనాలు పెంచామని తెలిపారు. అంతేకాక కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని దశలవారీగా, ఉచితంగా చేపడతామని.. ముందుగా అసలు ఇల్లు లేని వారికి ప్రాధాన్యం ఇస్తామని.. ప్రతి సంవత్సరం కనీసం వెయ్యి మందికిపైగా కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి, ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్నీ బాగానే ఉన్నా ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు మున్సిపల్ కార్మికుల సమ్మె వెనుక ఆంధ్రా పార్టీల హస్తముందని కేసీఆర్ అనడం గమనార్హం.

Teluguone gnews banner