అమితాబ్ కు తప్పిన ప్రమాదం..
మేక్ ఇన్ ఇండియా వీక్' పేరుతో ముంబైలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు, సహాయక బృందాలు అప్రమత్తమవడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెనుప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాగా ముంబైలోని నదీతీరంలో ఉన్న గిర్గౌమ్ చౌపాటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, అమితాబ్బచ్చన్, అమీర్ఖాన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు హాజరయ్యారు.
కాగా ఈ ప్రమాదం జరగడానికి ముందే బిగ్ బీ, హేమమాలిని షోలు జరిగాయి.. వీరికి ప్రమాదం తప్పిందని అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియడం లేదని నిర్వాహకులు చెపుతున్నారు.