భగవంతుడిని కూడా వదలని రామ్ గోపాల్ వర్మ

 

ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ వాళ్లు వీళ్లు అని చూసుకోరు.. అందరి మీద విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు ఆఖరికి దేవుడిని కూడా వదిలిపెట్టలేదు. గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజు జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చాలా మంది రాజకీయ నాయకులు విమర్శించడమే కాకా అంతటికి కారణం చంద్రబాబే అంటూ తిట్టిపోశారు కూడా. కానీ వీరందరికి భిన్నంగా రామ్ గోపాల్ వర్మ దేవుడిని విమర్శించారు. గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో భగవంతుడే తన భక్తులను కాపాడలేక పోయాడు పాపం చంద్రబాబు ఎలా కాపాడగలుగుతాడు.. ఈ విషయంలో అందరూ చంద్రబాబును నిందిస్తున్నారు కానీ దేవుడిని మాత్రం ఎవరూ నిందించడం లేదని అని ట్వీట్ చేశాడు. బహుశా చనిపోయిన భక్తులు బతికున్న భక్తుల కంటే దేవుడిని తక్కువగా ప్రార్ధించారేమో అందుకే దేవుడు కాపాడలేదేమో అని విమర్శించారు.

Teluguone gnews banner