చంద్రబాబు మోడీల భేటీ వాయిదా
బీహార్ కు ప్రధాని మోడీ భారీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై చర్చలు ఎక్కవయ్యాయి. దీనిలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంపై రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించి ఏం నిర్ణయం తీసుకుంటారా అని అందరూ రేపటి సమావేశం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటి సమావేశానికి సమయం ఇవ్వలేకపోతున్నామని ఏపీ ప్రభుత్వానికి ప్రధాన కార్యలయం బాంబు లాంటి వార్త పంపింది. దీంతో రేపటి భేటీ కాస్త వాయిదా పడింది. అయితే ఈనెల 25 లేదా 28, 29,31 తేదీల్లో ఏ రోజు వీలైతే ఆరోజు అపాయింట్మెంట్ ఇస్తామని పీఎంవో తెలిపడంతో ఈ నాలుగు తేదీల్లో ఏదో ఒక రోజు చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంది.
మరోవైపు ఇప్పటికే చంద్రబాబు రేపటి భేటీలో ఏపీకి కావాల్సిన అవసరాలపై అధికారులతో చర్చించి దానికి సంబంధించిన ముసాయిదాను కూడా తయారుచేశారు. అంతేకాదు ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్తో పాటు ఏపీకి ఆర్థిక లోటు, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ప్రధానితో బాబు చర్చించాలనుకున్న నేపథ్యంలో భేటీ వాయిదా. మొత్తానికి చంద్రబాబు మోడీ భేటీ అయితేనే కాని ప్రత్యేక హోదాపైన కాని తదితర విషయాలపైన కాని స్పష్టత రాదు. మరి ఈసారైనా భేటీ జరుగుతుందో మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.