mysoora reddy

కాంగ్రెస్ ఆకాశం నుండి ఊడిపడలేదు: మైసూర

  దేశంలో ఉన్నఅన్ని రాజకీయపార్టీలకి తానూ పెద్దన్నగా భావించుకొనే కాంగ్రెస్ పార్టీకి, వై.యస్సార్.పార్టీ నేత యమ్వి.మైసూరారెడ్డి హితబోధచేస్తూ, ముందుగా ఆదుర్లక్షణం వదిలించుకొని, అఖిలపక్ష సమావేశానికి రాకమునుపే తెలంగాణాపై తన అభిప్రాయం ఏమిటో తప్పనిసరిగా తెలియజేయాలని అన్నారు.   “కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను తెలంగాణాపై తమ అభిప్రాయలు చెప్పమనడం కన్నా ముందు తన మనసులో ఏముందో చెప్తే బాగుంటుంది. అయినా, ఆ పార్టీకి మా గోడు చెప్పుకొనేందుకు, అది వినేందుకు అదేమీ కోర్టులో జడ్జి కాదని తెలుసుకోవాలి. కాంగ్రేసు కూడా దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలలో ఒకటే తప్ప దానికేమి ప్రత్యేక హోదా లేదు. కాంగ్రెస్ ఏమి ఆకాశం నుండి ఊడిపడలేదు అని అది గ్రహించాలి. అందువల్ల, ముందు తెలంగాణపై తన అభిప్రాయం చెప్పడం మంచిది. అయినా, అది ఇతర పార్టీలమీద నెపంపెట్టి ఎన్నాళ్ళు ఆడుతుంది నాటకం? కాంగ్రేసుకి తెలంగాణా పరిష్కరించాలానే చిత్తశుద్ది లేదసలు. అందుకే, హోంమంత్రి మారినప్పుడల్లా మళ్ళీ అఖిలపక్షం అని కొత్తనాటకం మొదలుపెడుతుంది. ఇంత వరకు జరిగిన అఖిలపక్షం సమావేశాలలో అదేమి సాదించింది? కోట్లు ఖర్చుచేసి సోదించిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ని అది ఏమూలకు విసిరేసింది? తన ముందు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించకోకుండా ప్రతిపక్షాలను అఖిలపక్షం పేరుతో ఇరికిద్దామని చూస్తె అదే ముందు అందులో ఇరుక్కోక తప్పదు. ఇప్పటికయినా అది నిజాయితీగా తన మనసులో అభిప్రాయం చెప్పాలి,” అని మైసూర కాంగ్రేసుకి హితబోధచేసారు. అయితే, మరొకరి హితబోధలు వినే పరిస్తితిలో కాంగ్రెస్ ఉందా?

Addanki darsi mlas

జగన్ గూటిలోకి ఇద్దరు ప్రకాశం ఎంఎల్ఏలు ?

      ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు యువ కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి), బి. శివ ప్రసాద రెడ్డి (దర్శి)లు జగన్ పార్టీ నేతలతో గత కొంత కాలంగా పూసుకొని తిరుగుతున్నారు.   వచ్చే సంక్రాంతి లోపు వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతల బంధువులు ఇప్పటికే జగన్ పార్టీలో చేరారు. తన నియోజక వర్గానికి చెందిన ప్రజలు తనను జగన్ పార్టీలో చేరాలని వత్తిడి తెస్తున్నారని రవి కుమార్ అన్నారు. ఆయన అనుచరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల రవిని హైదరాబాద్ పిలిచి మాట్లాదారు. అయినా, రవి తన మనసు మార్చుకోలేదు.   శివ ప్రసాద రెడ్డి గతంలో కొంత కాలం జగన్ పార్టీలో ఉన్నారు. అయితే, అవిశ్వాస తీర్మానం సమయంలో ఆయన కాంగ్రెస్ కు ఓటు వేసారు. అయితే, స్థానిక పరిస్తితుల దృష్ట్యా ఆయన జగన్ పార్టీలో చేరడం తప్పక పోవచ్చని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా, ఈ ఇద్దరు ఎంఎల్ఏ లు జగన్ పార్టీలో చేరడం తప్పనిసరి అని తెలుస్తోంది.

ysr congress leader konda sureka

తెలంగాణా ముడేసి కొండని లాగాలనిచూసిన కవిత

  వై.యస్సార్.పార్టీ నాయకురాలు కొండాసురేఖ తన తండ్రిని ‘తెలంగాణా సాదిన్చలేకపోతే తలనరుక్కొని చస్తానన్నవాడివి, తెలంగాణా తీసుకురాకపోయినా ఇంకా ఎందుకు బ్రతికే ఉన్నావు? అని అడిగినప్పటినుండీ అయన కుమార్తె కవిత ఆమెపై కోపంతో రగిలిపోసాగింది. మళ్ళీ ఆ మర్నాడే కొండాసురేఖ తన తండ్రిని “దమ్ముంటే రా! ఇద్దరం కలిసి డిల్లీవెళ్లి సోనియాగాంధీ ఇంటిముందే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకొని తెలంగాణా పట్ల ఎవరికెంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకొందాము,” అని మరోసారి తన తండ్రికి సవాలు విసిరినప్పటినుండీ ఆమెపై ప్రతీకారం ఎప్పుడు తీర్చుకొందామా అని తపించిపోతున్న కవితకి, వచ్చేవారం డిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశం ఒకమంచి అవకాశంగా భావించి, కొండాసురేఖకి ఆమె ఇప్పుడు ప్రతిసవాల్ విసిరింది.   “నీవు నిజమయిన తెలంగాణావాదివే అయితే నువ్వూ, నీపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి అఖిలపక్షసమావేశానికి హాజరయి, ఒకనాడు ఏ నోటితో పార్లమెంటులో సమైక్యాంధ్ర కావాలని అడిగేడో అదే నోటితో ఇప్పుడు ఆయన చేత జై తెలంగాణా అనిపించు. మీ పార్టీకి చిత్తశుద్దిఉంటే కోర్టు అనుమతి తీసుకొని అతనిని వెంటబెట్టుకొని అఖిలపక్ష సమావేశానికి హాజరయి అసలయిన తెలంగాణావాదివని నిరూపించుకో” అని కవిత, కొండాసురేఖకు సవాల్ విసిరింది. గానీ, మన కొండ ఇంకా కదలలేదు మెదలలేదు.

Telangana sri Krishna committee

‘శ్రీ కృష్ణ’ నివేదిక ఇక అట కెక్కినట్లేనా?

        తెలంగాణా ఫై శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ‘ముగిసిన అధ్యాయమని’, ఈ నెల 28 న జరిగే అఖిల పక్ష సమావేశం లో దానిఫై చర్చ జరగదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెపుతున్నాయి. షిండే కొత్తగా హోం మంత్రిగా భాద్యతలు చేపట్టడంతో, ఈ సమస్య ఫైన ఓ అవగాహన కల్పించుకోవడానికి మాత్రమే ఈ సమావేశం పరిమితమవుతుందని వారంటున్నారు.   క్రితం సంవత్సరం జనవరి 5 న జరిగిన అఖిల పక్ష సమావేశం లో అప్పటి హోం మంత్రి చిదంబరం ఈ కమిటీ నివేదికను అన్ని పార్టీలకు అందించారు. ఈ నివేదిక ఫై ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి మరోసారి ఇలాంటి సమావేశమే నిర్వహిస్తామని ఆయన ఆ సమావేశంలో ప్రకటించారు. అయితే, ప్రస్తుత సమావేశంలో ‘శ్రీ కృష్ణ’ ఫై చర్చ ఉండదని హోం శాఖ ప్రకటించడంతో ఇక శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అట కెక్కినట్లేనని భావిస్తున్నారు.   ఈ సమావేశం అనంతరం తెలంగాణా ఫై స్పష్టమైన అభిప్రాయం ప్రకటించే అంశం కూడా తమకు తెలియదని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ అంశం ఫై ఏ విషయమూ తెలుసుకోవాలంటే 28 వరకూ ఆగాల్సిందే.

Governor cm pcc chief delhi

ఢిల్లీ లో గవర్నర్, సిఎం, బొత్స

      తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం తేదీ సమీపిస్తుండటంతో కాంగ్రెస్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ ఢిల్లీ లో మకాం వేసారు. ఈ ముగ్గురు కీలక వ్యక్తులు ఒకే సారి రాజధానిలో ఉండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.   తెలంగాణాకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, కేంద్రంలోనూ, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకూ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీనితో ఆ పార్టీ ఫై వత్తిడి పెరిగింది. 28 కి ముందే ఈ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఆ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, ధర్మాన అంశం వంటి పార్టీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.   ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తో చర్చలు జరిపినట్లు తెలిసింది. తెలంగాణా ఫై సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా వారు రాహుల్ కు వివరించినట్లు తెలిసింది. ప్రత్యేక రాష్ట్రమా, ప్యాకేజీనా అనే అంశాలు కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రాత్రికి గవర్నర్, సోనియా, మన్మోహన్ లతో సమావేశం కానున్నారు.

Danam nagendar sharmila

షర్మిలా నా చెల్లెలు..కలుస్తా : దానం

      షర్మిలా తనకు చెల్లెలని, ఆమెకు గాయమైతే పరమర్సిస్తానని మంత్రి దానం నాగేందర్ అన్నారు. అందులో తప్పేంటని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చాలా రోజుల నుండి మీడియా కు దూరంగా ఉన్న దానం ప్రస్తుతం ఈ సంచలన వ్యాఖ్యలతో మరలా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.   వై ఎస్ ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని మంత్రి అన్నారు. అయితే, దానం ఈ ప్రకటన తర్వాత కొంత మంది సన్నిహితులు అలా మాట్లాడటం సరి కాదని ఆయనకు సర్ది చెప్పినట్లు తెలిసింది. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితునిగా మెలుగుతున్న సమయంలో, వేరే పార్టీకి సంభందించిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం సరి కాదని ఆయనకు సలహాలు వచ్చినట్లు సమాచారం.   దానం చేసిన ఈ ప్రకటనను కొంత మంది తమ రాజకీయ అవసరాలకు వాడుకొనే అవకాశం కూడా ఉంది.

Cm convoy stone pelting

కిరణ్ కు తెలంగాణ సెగ: రాళ్ల వర్షం, ఉద్రిక్తత

      ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ఫై వరంగల్ జిల్లా బొమ్మకూరులో తెలంగాణా వాదులు రాళ్ళతో దాడి చేశారు. కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి సిఎం అక్కడికి చేరుకున్నారు.   బొమ్మకూరు లో ఏర్పాటు చేసిన సభ స్థలానికి కిరణ్ వెళ్తుండగా, ఆయన కాన్వాయ్ ను తెలంగాణా వాదులు మధ్యలోనే అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, సిఎం కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. తెలంగాణా ఫై స్పష్టత ఇవ్వాలని వారు సిఎం కాన్వాయ్ ని చుట్టుముట్టారు.   ఈ రాళ్ళ దాడిలో కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు దెబ్బ తిన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాటీ లకు పని చెప్పాల్సి వచ్చింది. దీనితో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్ల ఫై ముఖ్య మంత్రి అధికారులను మందలించినట్లు సమాచారం.

Jagan case brahmananda reddy

బ్రహ్మానంద రెడ్డి ప్రాసిక్యూషన్ కు అనుమతి !

        జగన్ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అధికారులను విచారించాలన్న సిబిఐ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ సంఘటన జరిగిన సమయంలో రాష్ట్ర మౌళిక వసతుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి ని విచారించడానికి కేంద్రం అనుమతి లభించింది.   దీనితో ఈ కేసు వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ కేసులో ఆయన నాలుగో నిందితునిగా ఉన్నారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న ఆయన వాన్ పిక్ భూ కేటాయింపుల్లో కొందరికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.   ఇప్పటి వరకూ ఎవరికీ లభించని ప్రాసిక్యూషన్ అనుమతి బ్రహ్మానంద రెడ్డికి మాత్రమే లభించింది. ఆయన రైల్వే అధికారి కావడంతో ఈ విషయంలో రైల్వే శాఖ తన వంతు ప్రయత్నాలు చేసింది. బ్రహ్మానంద రెడ్డి వైఎస్ రాజ శేఖర రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో డిప్యుటేషన్ ఫై పెట్టుబడుల శాఖలో కార్యదర్శిగా పని చేశారు.

Shirdi temple bomb warning

1 న షిర్డీ ఆలయాన్ని పెల్చేస్తామని హెచ్చరిక

      నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే షిర్డీ సాయిబాబా ఆలయాన్ని జనవరి 1 వ తేదీన పేల్చివేస్తామనే ఓ హెచ్చరికతో కూడిన లేఖ ఆలయ సిబ్బందికి అందింది. దీనితో కంగారు పడిన ఆలయ డిఇఓ యశ్వంత్ ఆ లేఖను పోలీసుల చేతికి అందించాడు.   ఆ లేఖ ఫై బుల్దానా జిల్లా పోస్టల్ కార్యాలయం ముద్ర ఉంది. ఈ బెదిరింపు లేఖ ఫై అంకుష్ భూసే, బాస్కర్ కదం, బాలు లహుడ్కర్ అనే వ్యక్తుల సంతకాలు ఉన్నాయి. ఇక్కడ బాంబులు పెట్టేందుకు ఒప్పందం కూడా జరిగిపోయిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తాము రూ. 350 కోట్లు తీసుకున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.   ఈ లేఖతో ఆలయ సిబ్బంది లో టెన్షన్ ప్రారంభం అయింది. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వ్యవస్తను మరింత పెంచారు. దీనితో పోలీసులు ఆ లేఖలో సంతకాలు చేసిన వ్యక్తుల గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇది ఆకతాయిల పనే అని మరో వాదన కూడా ఉంది.

Vasanta nageswara rao ysr congress party

వైఎస్ జగన్ పార్టీలోకి వసంత నాగేశ్వరరావు

        కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ఆయన జగన్ గూటిలో చేరారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ ఉదయ భాను పార్టీ కండువా కప్పి వసంతను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, వై ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని అన్నారు.   తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో రాజ శేఖర రెడ్డి తనకు కేడిసిసి బ్యాంకు అధ్యక్ష పదవి కట్టబెట్టారని ఆయన అన్నారు. ఆలాంటి నేత ఋణం తీర్చుకోవడానికే తాను ప్రస్తుతం ఆయన కుమారుడి పార్టీలో చేరుతున్నానని అన్నారు. కొత్త పార్టీలో తాను ఓ సామాన్య కార్యకర్తగా కొనసాగాలని భావిస్తున్నాని వసంత అన్నారు. వసంత గతంలో నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు.

Telangana congress mps

‘28’ తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో సంక్షోభం?

          ఈ నెల 28 న ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశం తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో తీవ్ర పరిణామాలు చోటు చోసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయం ఉండకపోవచ్చని ఈ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు భావిస్తూ ఉండటమే ఇందుకు కారణం.   కనీసం నలుగురు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఈ వలసలు ఉండే అవకాశం లేదు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవ రావు ను తన పార్టీలో చేర్చుకొనేందుకు టిఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను ముందుగా చేర్చుకోగలిగితే, ఇక మిగిలిన వారిని చేర్చుకోవడం పెద్ద కష్టం కాదని కేసిఆర్ అంచనా.   కే.కే.ను వచ్చే 2019 ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ నుండి బరిలోకి దింపాలని కూడా టిఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని సమాచారం. ఆయన తన పార్టీలో ఉంటే, ఢిల్లీ లో రాజకీయాలు నడపటం తేలిక అవుతుందని కేసిఆర్ భావిస్తున్నారు.   అఖిల పక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం లేని పక్షంలో, తెలంగాణా ప్రజల దృష్టిలో తాము దోషిగా నిలబడాల్సి వస్తుందని, ఎన్నికల సమయంలో తాము ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. ప్రత్యెక రాష్ట్రం ఇస్తే, తెలంగాణా లో నక్సల్స్ సమస్య తీవ్రతరం అవడంతో పాటు, కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

kiran kumar

కిరణ్ సర్కారుకు 'ధర్మ' సంకటం : మంత్రి డీఎల్ చెప్పినా.. !

    “అది మన ప్రభుత్వానికి ఎంతమాత్రం ఆరోగ్యకరమయిన విషయం కాదు” అని ఆరోగ్యా శాఖామాత్యులు డి.యల్. రవీంద్రరెడ్డిగారు ఎంతగా మొత్తుకొంటున్నా వినకుండా, అతని హెచ్చరికలు పెడచెవినపెట్టి అధర్మం అని తెలిసికూడా సిబీఐ చార్జ్ షీట్లో పేరువేసుకొన్న తనమంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుగారిని వెనకేసుకొస్తూ, ఆయనపై సిబీఐ ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి నిరాకరిస్తూ కాబినెట్ లో నిర్నయించేసి, ‘మేము సంతకాలు పెట్టేసాక గవర్నర్ సంతకం చేయక చస్తాడా?’ అనుకొంటూ నిర్భయంగా ఆ ఫైలును ఆయన ఆమోదం కోసం పంపించేరు విజ్ఞులయిన మన ముఖ్యమంత్రి గారు.   ఆ ఫైలు ఆయన చేతిలో పడినప్పటినుండీ ఆయనకు రాహుకాలం మొదలయినట్లయింది. ఆయన హైదరాబాదులో ఉంటె విపక్షాలు మరియు తెలంగాణా వాదులూ, డిల్లీ వెళ్తే అక్కడ మీడియా వాళ్ళు ‘మీరలా ఆ ఫైలుని కోడి గుడ్లు పొదిగినట్లు పొదుగుతూ ఎన్ని రోజులు కూర్చోంటారంటూ’ ఆయనపై దాడిచేస్తుంటే ఆబాధ బరిన్చలేకో మరేమో గానీ, దానిని మళ్ళీ కిరణ్ సర్కారుకే తిప్పి పంపేసారు “మీ తిప్పలు మీరు పడండి’ అంటూ. "మళ్ళీ మీరు నాకా ఫైలు పంపేముందు కనీసం ఈసారయినా న్యాయనిపుణుల సలహా తీసుకోమని" ఒక నోట్ (ఉచిత సలహా) కూడా దానిపైన బరబారా వ్రాసేసి చేతులుదులుపుకొని ‘హమ్మయ్యా!’ అని ఊపిరితీసుకొన్న గవర్నర్ గారు మళ్ళీ సోనియమ్మ పిలపందుకొని హడావుడిగా డిల్లీ బయలుదేరిపోయారు.   గోడకోట్టిన బంతిలా వెనక్కొచ్చిన ఆ ఫైలుని చూసి కిరణ్ కుమార్ రెడ్డి తలపట్టుకొంటే, వెనకనుండి “చూసారా... నేను ఆ రోజే మరీమరీ చెప్పినా వినకుండా పంపేరు..” అంటూ మన డి.యల్. రవీంద్ర రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కతూ ముసిముసి నవ్వులు చిందిస్తూ కనిపించేరు.   మరో గంటో గడియలోనో అయన ‘ధర్మాన ఫైలు మరియు న్యాయసూత్రాలు’ అనే అంశంపై చర్చించేందుకు మన టీవీ తెరలపైకి రాబోతున్నారు.

BJP wins in Gujarat assembly polls

గుజరాత్ ఎన్నికల్లో మోడీ హాట్రిక్

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడో సారి మోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 116 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 60 స్థానాలు, జీపీపీ రెండు, ఇతరులు నాలుగు స్థానాలను గెలుచుకున్నారు. గురువారం ఉదయం రాష్ట్రంలోని 33 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 1,666 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మణినగర్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 85వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో మోడీ విజయం సాధించారు. ఆయన కుడి భుజంగా చెప్పుకునే మాజీ హోంమంత్రి అమిత్ షా నరన్‌పూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. మరోవైపు బీజేపీ నుంచి విడిపోయి బీపీపీ పార్టీ స్థాపించిన కేశుభాయ్ పటేల్ విశవదర్‌లో గెలుపొందారు. తనను గెలిపించి గుజరాత్ ప్రజలు ఉజ్వల భవిష్యత్తుకు మరోసారి పట్టం గట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. విజయం సాధించిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మరోసారి పట్టం గట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ఉజ్వల భవిష్యత్తుకు తాను కృషి చేస్తానని వాగ్ధానం చేశారు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని మోడీ తల్లి హీరాబెన్ అన్నారు. ఇవాళ ఆమె మోడీ విజయం సాధించిన సందర్భంగా మాట్లాడారు. తన కొడుకు పీఎం అవుతారన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీ దేశానికి చేయాల్సింది చాలా ఉంది అని వ్యాఖ్యానించారు. కాగా, మోడీ ప్రధాని కావాలని చాలా మంది కోరుకుంటున్నారని మోడీ సోదరుడు పంకజ్ మోడీ తెలిపారు.  

 sharmila padayatara

నాకేలా ఇన్ని కష్టాలు...!

      వై.ఎస్. విజయమ్మ తన బిడ్డ షర్మిలను కలుసుకొని మాట్లాడుతున్న సందర్భంలో బోరున విలపించారు. 'ప్రభువా! నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావ్ ...' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ పాదయాత్రికురాలు షర్మిల తన అన్నాను కలిసేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన సంఘటన ఇది. మొదటినుంచి వైఎస్ కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం ప్రారంభించాలన్న దైవ ప్రార్దనతోనే మొదలయ్యే సంప్రదాయం నెలకొని ఉంది. గత రెండు దశాబ్దాలుగా పులివెందుల చర్చి పాస్టర్ సాల్మన్ ప్రభుతులు వైఎస్ కుటుబం చేపట్టే ఏ కార్యక్రమాన్ని అయినా ప్రార్థనతో మొదలుపెట్టి 20 నిముషాల పాటు ప్రభువుకు నివేదిస్తారు. ఆ తరువాత వారికి ప్రభువును వచ్చే సంకేతాలను బట్టి ఆయా కార్యక్రమాలను కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకొనే ఆనవాయితీ నెలకొని ఉంది.  ఆ ప్రకారమే యథావిధిగా షర్మిల తన అన్నను కలిసేందుకు జైలుకు వెళ్ళే ముందు యథావిధిగా పులివెందుల సీఎస్ ఐ చర్చి ఫాస్టర్ ప్రార్థన నిర్వహించారట. ఆ ప్రార్థనలో షర్మిల జైలుకు వెళ్ళే విషయమై ప్రభువునుంచి అనుకూల సంకేతాలు రాకపోవడంతో విజయమ్మ షర్మిలను ఆపే ప్రయత్నం చేశారట. కానీ అప్పటికే షర్మిల తీసుకున్న నిర్ణయం ప్రకారం జగన్ ను కలిసేందుకే మొగ్గుచూపడంతో తీవ్ర నిరాశకు గురైన విజయమ్మ బోరున విలపిస్తూ నా కుటుంబానికే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు ప్రభువా అని కన్నీటిపర్యంతం అయ్యారట.  అక్కడే ఉన్న ఫాస్టర్లతొ ఆమె తన దుఃఖాన్ని పంచుకుంటూ గతంలో తన భర్త కూడా ప్రభువు నిర్ణయానికి వ్యతిరేకంగా హెలికాఫ్టర్ ప్రయాణం చేయడంతో అకస్మాత్తుగా మరణానికి గురయ్యారనే విషయాన్ని గుర్తుకు తెస్తూ మళ్ళీ ప్రభువు నిర్ణయానికి వ్యతిరేకంగా షర్మిల ఈ రోజు జైలుకు వెళ్ళడం ఉదంతాన్ని ఆమె ఆ ఫాస్టర్లతొ మొరపెట్టుకున్నారట. నా కొడుకు, భర్త మరణం తరువాత పట్టుమని పదిరోజులు కూడా మాతో గడపలేదు. ఓదార్పు యాత్రలంటూ ఎప్పుడు ప్రజల్లోనే తిరిగేవాడు. మధ్యలో అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళాడు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో ఉండలేకపోతున్నారు. కూతురు కూడా పాదయాత్ర చేపట్టి కాలికి దెబ్బ తగిలించుకుంది. ఇప్పుడేమో కోడలిని పాదయాత్రను కొనసాగించమంటున్నారు. అసలు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని ఆమె బోరున విలపించారట.

Narendra Modi PM

నా కుమారుడు ప్రధాని అవుతాడు: నరేంద్ర మోడి తల్లి

      గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ప్రత్యర్ధి శ్వేతా భట్ పై 85 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మోడీకి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా, ఓ పోలీసు అధికారి భార్య అయిన శ్వేతా భట్ ను పోటీకి నిలమెట్టినా మోడీ విజయాన్ని, మెజార్టీని నిలువరించలేకపోయారు. ”నా కుమారుడు ఖచ్చితంగా ప్రధాని అవుతాడు” అని నరేంద్ర మోడి తల్లి హీరా బెన్ మీడియాతో అన్నారు. గుజరాత్ ఫలితాలు వెలువడుతుండగానే అహ్మదాబాద్ లోని మోడీ ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఇక పోరుబందరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన గుజరాత్ పీసీసీ ఛీఫ్ అర్జున్ మోడ్వాడియా ఓటమి పాలయ్యారు. గుజరాత్ లోని 182 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలలో గెలిచిన బీజేపీ 3 స్థానాల్లో అధిక్యంలో ఉంది. 52 స్థానాల్లో గెలిచన కాంగ్రెస్  3 స్థానాలలో అధిక్యంలో ఉంది. రెండు స్థానాలలో జీపీపీ విజయం సాధించగా, నాలుగు స్థానాలలో ఇతరులు గెలిచారు.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ దే..!

      హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్రసింగ్ తీరిగి సీఎం కూర్చీని ఎక్కనున్నారు. ఓట్ల లెక్కింపులో మొదటిలో కాంగ్రెస్, బిజెపి హోరాహోరిగా పోటి పడినప్పటికీ...తరువాతీ రౌండ్లలో కాంగ్రెస్ ముందుకు దూసుకుపోయింది. మొత్తం 63 స్థానాల్లో కాంగ్రెస్ 34 స్థానాలు గెలిచి 2 చోట్ల ఆధిక్యంలో ఉంది, బిజెపి 24 స్థానాలలో గెలిచి 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. తమ ఓటమని అంగీకరిస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం బిజెపి నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ అన్నారు. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేస్తామన్నారు. హమీర్ పూర్ నుంచి పోటిచేసిన ధుమాల్ తన సమీప ప్రత్యర్ధి సరెంధర్ పై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వీరభద్రసింగ్ గెలుపు పై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం సొనియాదేనన్నారు.  

మణినగర్‌లో మోడి విక్టరీ

      మణినగర్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోడి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్‌పై 85 వేల ఓట్ల మెజార్టీతో నరేంద్రమోడి గెలుపొందారు. మరోవైపు గుజరాత్‌లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్‌లో స్పందించారు. ఇక అంతా ముందు చూపేనని.. వెనుక చూపు లేదని ట్వీట్ చేశారు. గుజరాత్ లో 112 స్థానాలలో బీజేపీ, 64 స్ధానాలలో కాంగ్రెస్ , 4 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 26 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 6 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు.  

గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడిదే హవా

    గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి పదవిని అధిష్టించేందుకు ముఖ్యమంత్రి నరేంద్రమోడి స్పష్టమయిన అధిక్యతను దక్కించుకున్నాడు. మొదట పోలింగ్ సరళి ఈ సారి బీజేపీ కొన్ని స్థానాలు నష్టపోతున్నట్లు కనిపించినా చివరకు వచ్చేసరికి పుంజుకుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన మాదిరిగానే మోడి గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే దిశగా సాగుతున్నారు. గుజరాత్ లో 111 స్థానాలలో బీజేపీ, 58 స్ధానాలలో కాంగ్రెస్ , 3 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మొదట ముందంజలో ఉన్న బీజేపి తరువాత వెనకబడింది. 24 స్థానాలలో బీజేపీ, 36 స్థానాలలో కాంగ్రెస్, 5 స్థానాలలో ఇతరులు ముందంజలో ఉన్నారు. గుజరాత్ లో 13 స్థానాలలో,  హిమాచల్ ప్రదేశ్ లో 3 స్థానాలలో ఫలితాలు రావాల్సి ఉంది.

గుజరాత్ లో వికసిస్తున్న కమలం

  కొద్ది నెలల క్రితం జరిగిన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలపట్లగానీ, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంతో బాటు ఎన్నికలకివెళ్ళిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఫలితాలగురించి గానీ పెద్దగా ఆసక్తి చూపని దేశవాసులు ముందుగానే ఊహించిన ఫలితాలకోసం గుజరాత్ వైపు ఆసక్తిగా చూస్తున్నారంటే అందుకు కారణం ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీయేనని చెప్పక తప్పదు.   అభివృద్ధి మంత్రం జపిస్తున్న మోడీని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అతని చేతిలో ఘోరపరాభవం తప్పదనీ తెలిసికూడా గుజరాత్ లో అతనిని డ్డీ కొనక తప్పలేదు. డ్డీ కొన్నపుడయినా తన స్వంత మేనిఫెస్టో గురించి చెప్పుకొనే బదులు, అతను రాష్ట్రంలో సాదించిన అభివృద్ధి గురించే తన ఎన్నికల సభల్లోనూ ప్రస్తావించక తప్పక పోవడం కాంగ్రేసుకి మింగుడుపడని మరో విషయం. సాక్షాత్ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ సైతం రాష్ట్రంలో కొన్నిచోట్ల అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవడం మోడీ యొక్క తొలివిజయంగా చెప్పవచ్చును. అందుకే ఫలితాలు కూడా అందుకు అనుకూలంగానే వెలువడుతున్నాయిప్పుడు.   ఇప్పుడే అందిన తాజా వార్తల ప్రకారం గుజరాత్ లో బీజేపీకి ౧౧౪ స్థానాలలొ ఆదిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో ఆదిక్యతలో ఉంది. మోడీని ఇబ్బందిపెట్టగల సమర్థుడు, అతని ఓట్లను చీల్చి కాంగ్రేసు తో ప్రభుత్వం ఏర్పరచగల ఒకే ఒక్కనేత అని భావించిన కేషుభాయి పటేల్ యొక్క గుజరాత్ పరివర్తన్ పార్టీ కేవలం అంచనాలకు పూర్తీ విరుద్దంగా కేవలం 82 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 3 స్థానాలలో మాత్రమే ఆదిక్యతలో ఉండటం కూడా మోడీ ఎఫెక్టేనని చెప్పక తప్పదు. గానీ,   కాంగ్రెస్ పార్టీ ముందే ఊహించినట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం ముందంజలో ఉంది. అక్కడ ఆ పార్టీకి 39 స్థానాలలో ఆదిక్యం ఉండగా, బీజీపీ మాత్రం కేవలం 22 స్థానాలలో ఆదిక్యత కనబరుస్తూ వెనక బడిపోయింది.