సేవాపథంలో కంఠంనేని రవిశంకర్


కృష్ణాజిల్లాలో, అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రముఖ తెలుగుదేశం నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రముఖ సంఘ సేవకుడిగా మంచి గుర్తింపు వున్న తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ సమస్యల్లో వున్నవారిని ఆదుకునే విషయంలో నేనున్నాను అంటూ అండగా నిలుస్తూ వుంటారు. ఆయనకున్న ఈ తత్వమే ఆయన్ని ప్రజల మనిషిగా నిలబెట్టింది. ఆయన సేవానిరతి దివిసీమ ప్రాంతంలో ఆయనను ఒక మంచి నాయకుడినిచేసింది. సమస్యల్లో వున్నవారికి ఒక భరోసా, ఒక ఓదార్పు, ఒక మంచి మాట ధైర్యాన్ని ఇస్తూ వుంటుంది. అలాంటి ధైర్యాన్ని ఇవ్వడంలో, నేనున్నానని అండగా నిలవటంలో కంఠంనేని రవిశంకర్‌ ఎప్పుడూ ముందుంటారు.

కృష్ణాజిల్లా  చల్లపల్లిలో యస్.సి.బాలికల హాస్టల్లో ఈనెల 16వ తేదీన కలుషిత ఆహారాన్ని తిన్న ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కంఠంనేని రవిశంకర్ సదరు హాస్టల్‌ని సందర్శించారు. అక్కడి బాలికలకు పండ్లు పంపిణీ చేశారు. హాస్టల్‌లో పరిస్థితులను అక్కడి వార్డెన్‌ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చల్లపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆరుగురు బాలికలను ఆయన పరామర్శించి పండ్లు పండ్లు పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంఠంనేని శివశంకర్, చల్లపల్లి సర్పంచ్, యార్లగడ్డ శ్రీనివాసరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


అలాగే కృష్ణాజిల్లా కోడూరు మండలం పెదగుడిమోటు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అబ్దుల్ కలాం  ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు కంఠంనేని రవిశంకర్ అబ్దుల్ కలాం కుమారుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇమ్రాన్‌ను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయినదని ఆవేదన వ్యక్తంచేశారు.

కంఠంనేని రవిశంకర్ పెదగుడిమోటు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ గ్రామంలోని మహిళలు వృద్ధులు తండోప తండాలుగా ఆయనను చూడటానికి వచ్చారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ గ్రామస్తులకు ఏ విధమైన వైద్యపరమైన సహాయం కావలసి వచ్చినా తాను చేయిస్తానని కంఠంనేని రవిశంకర్ వారికి హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటారని ఆయన ఈ సందర్బంగా అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో  కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంఠంనేని శివశంకర్, కోడూరు జడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, బండే నాగరాజు, జరుగు వెంకటేశ్వరరావు, పరిసే నాగమల్లేశ్వరరావు, ఉప్పాల పోతురాజు, కడవకొల్లు నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

Teluguone gnews banner