nagam janardhan reddy

కేసీఆర్ ను ప్రశ్నించిన నాగం

నాగం జనార్ధనరెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. హైదరాబాదులోని బషీర్‌బాగ్‌లో తెలంగాణ బచావో కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభన చేసిన తరువాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా.. పేద రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. అయినా గుడుంబా తాగితే ఆరోగ్యం పాడవుతుందని.. మందు రేట్లు తగ్గించారు.. ఇప్పుడు ఛీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఎప్పటినుండో ఉన్న సెక్రటేరియెట్‌ను కూలగొట్టి బుర్జ్‌ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని.. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ గుడ్ బై చెప్పి వేరే కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన ముందు తెలుగుదేశం పార్టీలో సీనీయర్ మంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తరువాత బీజేపీలోకి మారారు. అయితే ఆపార్టీలో ఆయనకు సరైన ప్రాదాన్య లేకపోయేసరికి ఇప్పుడు వేరు కుంపటి ఏర్పాటు చేసుకుంటున్నారు. 'బచావో తెలంగాణ మిషన్' పేరిట ప్రజావేదిక ఏర్పాటవుతోంది.

cm chandrababu

మనకెందుకు రావడంలేదు.. చంద్రబాబు

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ నియోజక వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన  మాట్లూడుతూ అసలు ఇల్లు కూడా వదిలి బయటకు రాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎమ్మెల్యేగా పోటీచేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా గెలుస్తున్నారు.. ఓటర్లు ఆమెను గెలిపిస్తుంటే.. నిరంతరం కుప్పంలో అభివృద్ధి పనులు చేపడుతూ.. ప్రజల బాగోగులు తెలుసుకుంటూ.. తరుచూ నియోజక వర్గంలో పర్యటించే మనకు ఆశించిన మెజారిటీ ఎందుకు రావడంలేదని చంద్రబాబు పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. అంతేకాదు కొంతమంది నేతలు అహంతో వ్యవహరిస్తున్నారుని.. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ చేపట్టే ఏ కార్యక్రమమైనా కాని కార్యకర్తల ప్రమేయంతోనే సాగాలన్నారు. కాగా పలు సమస్యలను కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకురాగా.. వాటితో తానూ ఏకీభవిస్తున్నానన్నారు.

chandrababu naidu

ఏపీ ఏపీయే.. బీహార్ బీహారే

  ప్రస్తుతానికి ఇప్పుడు ఏపీలో అందరూ చర్చించే అంశం ఏంటంటే అది ప్రత్యేక హోదా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నా.. ఎన్నో ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా నరేంద్ర మోడీ బీహార్ కు పత్యేక ప్యాకేజీ కింద లక్షా ఇరవై వేల కోట్లు ఇస్తానని ప్రకటించడంతో ఇప్పుడు ఏపీ ప్రత్యేకహోదా పై వేడి రాజుకుంది. చంద్రబాబు నరేంద్ర మోడీని కలిసేది కూడా రేపే కావడంతో ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పై  ఉత్కంఠ రేపుతోంది. కాగా అసలు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినా ఊహించిన దానికంటే ఎక్కువ ప్యాకేజీనే ఇచ్చారు మోడీ.. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. మరోవైపు చంద్రబాబు కూడా ఏపీ ప్రత్యేక హోదా పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ప్రత్యేక హోదా ఇంకా ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాలని ఇదే విషయాన్ని మోడీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేసి రాష్ట్ర విభజన చేశారని.. ఏపీకి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలన బిహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ కన్నారెండింతలు ఎక్కువ ప్యాకేజీనే ప్రకటించాలని మోదీకి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరఖండ్ విడిపోగా అప్పుడు కేంద్రం ఉత్తరఖండ్ కు ఇచ్చిన ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీనే ఏపీ ఇవ్వాలని చంద్రబాబు మోడీని కోరనున్నట్టు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్శదర్శి పి.వి.రమేశ్‌ ఆంధ్ర రాష్ట్రానికి కావలసిన అవసరాలు, ప్యాకేజీలో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఎంపీలతో కూడా రెండుమూడుసార్లు భేటీ అయి ఏపీ ప్యాకేజీపై రెండు నివేదికలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ నివేదికలపై చంద్రబాబు పీవీ రమేశ్‌ భేటీ అయి దీనిపై చర్చించి తుది ముసాయిదాను తయారుచేయనున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఏపీకీ ప్రత్యేక ప్యాకేజి విషయంలో ఎలాంటి పేచీ పెట్టకపోయినా ప్రత్యేక హోదాపై మాత్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని ఇప్పుటికే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబుకు నచ్చజెప్పాలని చూస్తున్నట్టు సమాచారం. నీతి ఆయోగ్‌ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే హోదా అంశాన్ని తేల్చుతామని చంద్రబాబుకు నచ్చజెప్పాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. అయితే, చౌహాన్‌ కమిటీ సిఫారసుతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు మోదీపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఏపీ ప్రత్యేక హోదాపై అటు ప్రతిపక్షనేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంతో ఏపీని పోల్చొద్దని.. ఏపీ ఏపీయే.. బీహార్ బీహారే అని.. ఏపీకి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీనిలో భాగంగా వైసీపీ ఈనెల 29న బంద్ కూడా నిర్వహించనుంది. మొత్తానికి ప్రత్యేక హోదా పై స్పష్టత రావాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. చంద్రబాబు మోడీ భేటీలో ప్రత్యేక హోదాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాలి.

Police

హైదరాబాద్ లో పాక్ ఉగ్రవాది కుటుంబ సమేతంగా మకాం

  పాక్ ఉగ్రవాదులు చాప క్రింద నీరులా దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఆ సంగతి ఇదివరకే నిఘావర్ఘాలు గుర్తించినా కొందరు స్థానికులు వారికిస్ సహాయ సహకారాలు అందిస్తుండటంతో వారిని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. పాకిస్తాన్ కి చెందిన మహమ్మద్ నాసిర్ అనే ఉగ్రవాది గత నాలుగు నెలలుగా తన కుటుంబంతో సహా హైదరాబాద్ లోనే ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరికీ తెలియకపోవడం, అనుమానం కలగకపోవడం విచిత్రమే. పహాడీ షరీఫ్ వద్ద గల జల్ పల్లి యునానీ ఆసుపత్రిలో అతని భార్య ఉద్యోగం కూడా సంపాదించడంతో అదే ఆసుపత్రి సెల్లార్ లో గల ఒక గదిలో నాసిర్ కుటుంబం ఉంటోంది. బహుశః అతనికి అంతకంటే సురక్షితమయిన ప్రదేశం మరొకటి ఉండదేమో? అందుకే అతనిపై ఎవరికీ అనుమానం కలుగలేదని భావించాల్సి ఉంటుంది.   హైదరాబాద్ కంటే ముందు వారు హర్యానాలో పానిపట్ అనే పట్టణంలో చాలా ఏళ్ళు నివసించారని అతని భార్య తెలిపింది. ఏడేళ్ళ క్రితమే తాము భారత్ లోకి ప్రవేశించామని ఆమె తెలిపింది. దిల్ శుక నగర్ బాంబు దాడుల కేసులో ప్రధాన నిందితుడు జియా ఉర్ రెహ్మాన్ పారిపోవడానికి మొహమ్మద్ నాసిర్ సహకరించినట్లు పోలీసులు కనుగొన్నారు. పోలీసులు మహమ్మద్ నాసిర్ తో బాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, సిం కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకొన్నారు. వారి ద్వారా పాక్ ఉగ్రవాదుల కుట్రల గురించి మరిన్ని వివరాలు, వారికిస్ సహకరిస్తున్న వారిని పట్టుకొనే అవకాశం ఏర్పడింది.

Kadapa

విద్యార్ధుల మృతికి నిరసనగా నేడు కడప బంద్

  కడప జిల్లాలో ఒక ప్రముఖ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్దునులు సోమవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఒకేసారి ఆత్మహత్య చేసుకొన్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప బంద్ కి పిలుపునిచ్చారు. విద్యార్ధి సంఘాలు కూడా బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. గత 15 నెలల కాలంలో వేర్వేరు జిల్లాలలో ఉన్న అదే కాలేజీ బ్రాంచీలలో ఇంతవరకు మొత్తం 11 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, అయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.   మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్ధుల మృతికి కారనాలేవితో తెలియకుండానే ఆయన ప్రభుత్వాన్ని నిందించడం తప్పని అన్నారు. విద్యార్ధుల మృతిపై విచారణ జరిపించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పోలీసులు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. విద్యార్ధుల మరణాలకి కారకులయిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఆయన తెలిపారు.

Dawood Ibrahims

దావుద్ ఇబ్రహీం కోసం కేంద్రం పక్కా ప్రణాళిక

  మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఎన్నో సంవత్సరాల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ అక్కడే ఉండి అనేక మారణహోమాలకి పాత్ర వహించాడు. ఇప్పుడు దావుద్ ఇబ్రహీంను అరెస్ట్ చేయడానికి మోడీ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్దం చేస్తుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దావూదా కు సాయం చేసే దేశాలు గుర్తించి ఆ దేశాల్లో దావూద్ ఇబ్రహీం కాలుపెట్టకుండా ఉండేదుకు తగిన చర్యలు తీసుకోనుంది. అంతేకాదు దావూద్ ఇబ్రహీం ఆర్థిక మూలాలు కూడా గుర్తించి.. వాటిని దెబ్బకొట్టాలని భావిస్తోంది.   దావుద్ ఇబ్రహీంపై పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు భారత్ నిఘా వర్గాల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని వీటిని ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాకిస్థాన్‌కు అందజేసేందుకు న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని డైలీ మెయిల్ అనే పత్రికా ఓ కథనంలో ప్రచురించింది. అంతేకాదు దావుద్ ఇబ్రహీంకు నివాసాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించామని భారత నిఘా సంస్థలు తెలిపాయి.

tdp shobha rani

కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు

  తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. కేసీఆర్ కు ఇప్పటికే కాలేయం పాడైందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు అతి తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి తీసుకొచ్చి.. ఇప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్ మాఫియా చేతిలో పెట్టబోతున్నారని.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా త్వరలో మేము బయటపెడతామని ఆమె ఆరోపించారు. అంతేకాదు వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే కెసిఆర్ చేశారని గుర్తుంచుకోవాలన్నారు.

cm chandrababu

బెజవాడ బిజీవాడ

ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు రోజులు విజయవాడలో ఉండే పాలన కార్యక్రమాలు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. ఒక్క చంద్రబాబే కాదు ముఖ్యమైన అధికారులు కూడా విజయవాడలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది విజయవాడలోనే ఉండి అన్నిపనులు చూసుకుంటున్నారు. అంతేకాదు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుండి ఇక్కడి వచ్చి ఉంటున్నారు. ఇంకా ఇరవై వేల మంది ఉద్యోగులు ఇక్కడికి తరలిరావాల్సి ఉంది. అయితే రాజధాని పూర్తయ్యేంత వరకూ తాత్కాలిక రాజధాని అయిన విజవాడలోనే వారికి కార్యలయాలు కాని వసతి గృహాలు కాని కేటాయించనున్నారు. దీనికోసం జవహర్ కమిటీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు చంద్రబాబు వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే ఉండి అక్కడి నుండే అన్ని సమీక్షలు, భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీంతో బెడవాడ కాస్త ఒక్కసారిగా బిజీవాడగా మారింది. సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చే మంత్రులు, అధికారులు పోలీసులతో క్యాంప్‌ ఆఫీస్‌ సందడిగా మారిపోయింది. అంతేకాదు  దేశ, విదేశ వ్యాపార ప్రతినిధులు కలిసేందుకు కూడా బెజవాడ నుంచే అపాయింట్‌మెంట్స్‌ ఇచ్చారు. మొత్తానికి తాత్కాలిక రాజధాని అయిన బెజవాడ ఇప్పటికే చాలా బిజీబిజీ అయిపోవడంతో మిగిలిన శాఖలు కూడా త్వరగా ఇక్కడకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి.

narendra modi

బీహార్ కు మోడీ రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్

  భారత ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రానికి భారీ ప్యాకేజీను ఇస్తున్నట్టు ప్రకటించారు. బీహార్ లో జరిగిన ఆరా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్యాకేజీ వల్ల బీహార్ రాష్ట్ర పూర్తిగా అభివృద్ధి చెందాలని.. బీహారీల దశదిశ మారుతుందని తాను భావిస్తున్నానన్నారు. రైతుల సంక్షేమంతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమన్నారు. బీహార్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలే మార్చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు మరో రూ.40వేల కోట్ల రూపాయలను బీహార్ ప్రాజెక్టుల కోసం అదనంగా ఖర్చుపెడతామని ప్రధాని మోడీ చెప్పారు. కాగా ఈ బీహార్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.25వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనం చేశారు. 23 స్కిల్ ట్రెయినింగ్ సెంటర్లు ప్రారంభించారు.     మరోవైపు ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు త్వరలో బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ ఈ ప్యాకేజీ ఇచ్చారని రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి.

vote for note scam

కేటీఆర్ గన్‌మన్‌, డ్రైవర్లకు అరెస్ట్ వారెంట్లు!

  ఓటుకు నోటు కేసులో కేటీఆర్ గన్‌మన్‌, డ్రైవర్లకు నోటీసుల ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరు విచారణకు హాజరుకాని నేపథ్యంలో ఏపీ సీఐడీ తదుపరి చర్యలకు సన్నద్దమవుతోంది. ఇద్దరికి అరెస్ట్ వారెంట్ లు జారీచేసే యోచనలో ఉంది. ఈ కేసు వ్యవహారంలో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్యను బెదిరించారనే ఆరోపణలపై వీరిద్దరికి నోటీసులు జారీ చేశారు.. మొదట నోటీసులు ఇచ్చేందుకు కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి.. తరువాత ఇంటికి వెళ్లినా కానీ వారు మాత్రం అందుబాటులో దొరకలేదు. దీంతో ఏపీ అధికారులు తెలంగాణ ఐఎస్‌డబ్ల్యూ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ వద్దకెళ్లి నోటీసులు అందించి, రశీదులు తీసుకొని సోమవారం ఎట్టిపరిస్థితిలోనూ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ జానకీరాం, సత్యనారాయణ మాత్రం నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు హాజరుకాకపోవడంతో ఏపీ సీఐడీ అధికారులు వారిద్దరికి కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

Radhika Apte

గూగుల్ సెర్చ్ లో రాధికా ఆప్టే టాప్ ప్లేస్

  లెజెండ్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన అందాలతార రాధికా ఆప్టే. సినిమాల పరంగా కాని.. వివాదల పరంగా కానీ మొత్తానికి తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులర్ అయింది. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పడానికి అసలు మొహమాట పడని ఈ భామ అందాల ఆరబోతలో కూడా అస్సలు మొహమాట పడదు. అందుకే బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా తన సత్తా చాటుకుంటుంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు మరాఠీ భాషల సినిమాల్లో మధ్యలో షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సినీ పరిశ్రమలోనే కాదు గూగుల్ సెర్చ్ లో కూడా రాధికా ముందు వరుసలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. అహల్య అనే 15 నిమిషాల షార్ట్ ఫిలింలో నటించిన రాధికా విచ్చలవిడిగా అందాలను ఆరబోసింది.. దీనికి తోడు తను నగ్నంగా నటించిందంటూ వీడియో క్లిప్ బయటికి పొక్కాయి.. అది కాస్త సద్దుమణిగేలోపే బాత్‌రూమ్‌లో నగ్నంగా సెల్ఫీలు తీసుకొన్నప్పటి ఫొటోలు బయటకువచ్చాయి ఇక చెప్పేదేముంది ఎక్కడ చూసినా రాధిక ఆప్టే గురించే సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో రాధికా అందరిని వెనక్కి నెట్టేసి గూగుల్ సెర్చ్ లో ముందు వరుసలో నిలిచింది. అయితే గూగుల్ సెర్చ్ లో మొదటిస్థానం మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం మొదటిస్థానంలో రావడం విశేషం.

supreme court

సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు లేఖ

  సుప్రీంకోర్టును బాంబులు పెట్టి పేల్చేస్తామని బెందిరింపులు రావడంతో కోర్టు చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలియని ఒక ఈ మెయిల్ ఐడి నుండి ఈ బెదిరింపు లేఖ వచ్చిందని.. దీంతో సుప్రీంకోర్టులోకి వచ్చేవారిని.. వెళ్లేవారిని క్షుణ్ణంగా పరిశీలుస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఒక్క న్యాయమూర్తులను తప్ప మిగిలిన న్యాయవాదులతో సహా అందరినీ పరిశీలిస్తున్నామని.. అంతేకాదు ఈ మెయిల్ ఎక్కడినుండి వచ్చిందో అని కూడా ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.   అయితే యాకుబ్ మెమెన్ ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు వ్యవహారంలో కొద్దిరోజుల క్రితం న్యాయమూర్తి దిపక్ మిశ్రాకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు బులెట్ ఫ్రూఫ్ కారుతో పాటు ఇంటి చుట్టూ గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనిలో భాగంగానే సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు భావిస్తున్నారు. ఎందుకంటే యాకూబ్ మెమెన్ కేసులో తీర్పు నిమిత్తం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. దీనిలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి. పంత్, జస్టిస్ అమితావ్ రాయ్ ఉండగా వీరు ముగ్గురు అర్దరాత్రి సుప్రీం కోర్టులో యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్ పై చర్చించి ఆ ఆర్జీని తిరస్కరించి ఉరి శిక్ష అమలు చేశారు. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు బెదిరింపులు వచ్చినట్టు తెలుపుతున్నారు.

chandrababu naidu

దారితప్పిన చంద్రబాబు హెలికాఫ్టర్..

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పింది. ఈ విషయం ఎవరో కాదు స్వయంగా చంద్రబాబే తెలిపారు. నిన్న సాయంత్రం హెలికాఫ్టర్ లో కడపకు బయలు దేరిన ఆయన 30 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాల్సింది పది నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారట. ఈ విషయాన్ని కడప విమానాశ్రయంలో స్వయంగా చంద్రబాబు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా అనంతరం ఆయన కర్నూలులో రెండు భారీ ప్రాజెక్టులకు జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో కర్నూలు అల్ర్టా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టుకు, ఓర్వకల్లు మండలంలోని పుడిచర్లలో పరిశ్రమల హబ్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రూ.3300 కోట్లతో 6 స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని.. వీటి ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంచవచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు రైతుల రుణమాఫీలు చేశామని.. అలాగే గొర్రెల, మేకల పెంపకందారుల రుణాలను మాఫీ చేస్తామన్నారు.

తరువాత నేనే సీఎం.. జగన్

  మరో మూడేళ్లలో తనే సీఎం అవుతాడంటా ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరో రెండేళ్ల వరకే చంద్రబాబు సీఎంగా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అవుతానని జోస్యం చెపుతున్నారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పులివెందులలోని తన ఇంట్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో మూడేళ్లు ఆగండి.. ముఖ్యమంత్రిగా నేనే వస్తా. మీ సమస్యలు తీరుస్తా'' అని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నానని.. తనతో పాటు అందరూ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని అన్నారు. అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించనున్న నేపథ్యంలో అందరూ బంద్ లో పాల్గొనాలని.. బంద్ విజయవంతంగా అయ్యేలా అందరూ కృషిచేయాలని కోరారు.

ఓటుకి నోటు కేసులో మరో ఇద్దరికీ నోటీసులు

  ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారుల దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతీ పదిపదిహేనురోజులకు ఒకసారి ఎవరో ఒకరికి నోటీసులు ఇస్తూ, అందరూ ఊహిస్తున్నట్లుగా ఈ కేసును అటకెక్కించేయలేదని, అది ఇంకా సజీవంగానే ఉందనే భావన ప్రజలకి కలిగేలా చేస్తున్నట్లున్నారు. మళ్ళీ నిన్న మాజీ కాంగ్రెస్ ఎంపీ డీకె. ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసనాయుడికి, అతని స్నేహితుడు విష్ణు చైతన్యకి ఏసిబి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విషయంలో విచారించేందుకు వారిద్దరినీ మంగళవారం తమ ముందు కావలసిందిగా ఆదేశిస్తూ సెక్షన్:160వ క్రింద నోటీసులు అందజేశారు. బెంగూళూరులో నివాసముంటున్న శ్రీనివాసనాయుడు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఏసిబి అధికారులు అక్కడ ఉన్న ఆయన సిబ్బందికి నోటీసులు అందజేసి వెనక్కి తిరిగి వచ్చారు. వారిరువురూ ఈ కేసులో సాక్షులని భావించడం చేతనే ఏసిబి అధికారులు వారికి నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.

బ్యాంకాక్ లో బాంబు ప్రేలుడులో 27 మంది మృతి

  థాయ్ ల్యాండ్ రాజధాని సెంట్రల్ బ్యాంకాక్ లోని సుప్రసిద్ధ రాచ ప్రసాంగ్ అనే ప్రాంతంలో ఒక హిందూ దేవాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏడు గంటలకు భారీ బాంబు ప్రేలుడు జరిగింది. ఆ ప్రేలుడుకి 12మంది అక్కడిక్కడే మరణించగా మరో 78మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మరో 15 మంది చికిత్స పొందుతూ మరణించారు. బాంబుని మోటార్ సైకిల్ పై అమర్చి దేవాలయం సమీపంలో నిలిపి ఉంచి బాగా రద్దీగా ఉన్న సమయంలో ప్రేలుడు జరపడంతో చాల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 15మంది చనిపోయారు. ఆలయాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు మరో బాంబుని కనుగొని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది, లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేది. థాయ్ ల్యాండ్ లో కొందరు ముస్లిం తీవ్రవాదులు అప్పుడప్పుడు ఇటువంటి దాడులకు పాల్పడుతూ తమ ఉనికిని చాటుకొంటున్నారు. బహుశః వారే ఈ ప్రేలుళ్ళకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరూ ఆ ప్రేలుళ్ళకు తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.

చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్

  భారత ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈనెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన చట్టంలోని హామీల అమలుపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు పట్టుదలతో వున్నారు. ఈ విషయం మీద అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం వుంది. ఈ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని నుంచి ఏపీకి అవసరమైన వాటిని సాధించగలరన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది.