మళ్లీ మాట మార్చిన పాకిస్థాన్..
posted on Apr 15, 2016 @ 10:20AM
మన ప్రత్యర్ధ దేశమైన పాకిస్థాన్ ఎప్పుడూ మాట మారుస్తూనే ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు అర్ధమైంది మనకి. నాలుకకి నరం లేనట్టు మాట్లాడే పాకిస్థాన్ ఒకసారి ఒక మాట మాట్లాడితే.. ఆవెంటనే మరో మాట మాట్లాడుతుంది. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది పాక్. గతంలో భారత్-పాక్ కు మధ్య ధ్వైపాక్షిక చర్చలు జరగాల్సి ఉంది. అయితే అదే సమంయలో పఠాన్ కోట్ పై దాడి జరగడంతో అప్పుడు ఆచర్చలకు బ్రేక్ పడింది. దీంతో అప్పటి నుండి పాక్-భారత్ ల మధ్య చర్చలపై డౌట్ ఉండేది. అసలు జరుగుతాయా లేదా అన్న సందేహాలు ఉండగా పాక్ ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే తప్ప చర్చలు జరిగేది లేదని మన ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాదు భారత్ తో ద్వైపాక్షిక చర్చలు నిలిచిపోయినట్లేనని భారత్ లో ఆ దేశ రాయబారి అబ్దుల్ బాసిత్ గత వారంలో ప్రకటించారు. అందుకు పూర్తి భిన్నంగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా నిన్న ఇస్లామాబాదులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన జకారియా, ఈ విషయంలో ద్వారాలు మూసుకుపోలేదని ప్రకటించారు. మొత్తానికి పాకిస్థాన్ తాము చేసిన వ్యాఖ్యలపై తమకే నిలకడ లేకుండా మాట్లాడుతున్నారు.