రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
పద్మ అవార్డలు ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐగుగురికి పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్, 40 మందికి పద్మశ్రీ అవార్డులు అందించారు. సీనినటుడు రజినీకాంత్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు.