Read more!

యజ్ఞవరాహా వతారము

 

పూర్వముమొకప్పుడు బ్రహ్మ సృష్టి చేయవలెనని సంకల్పించి స్వాయంభువమనువును మానసికంగా సృజించెను .అతనిని సృష్టి కొనసాగింపుమని ఆదేశించెను. మనువు ''తండ్రి !భూమి యంతయు జలములో మునిగియున్నది .దానిపై సృష్టి చేయుటేట్లనని ''యడిగెను .బ్రహ్మ,కుమార !శ్రీమహా విష్ణువు సర్వ శక్తి సంపన్నుడు .

అతని వలననే భూమి ఉద్ధరణకు జరుగవలెను ''అని పలికి ,యిట్లాలోచించేను .''మొదటజలమును సృజించి తరువాత భూమిని సృష్టి౦చినాను .అ దిప్పుడు నీటిలో మునిగియున్నది .దానిని బయటకు దేచ్చుటేట్లు?''అని శ్రీ మహా విష్ణువును ధ్యానించుచుండగా అతని ముక్కురంధ్రములనుండి బొటనవ్రేలంత రూపముతో యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించేను . పుట్టగానే ఏనుగంత శరీరము కలవాడై దిక్కులు పగులునట్లు ఘూర్జర ధ్వని చేసెను .

ఆ మూర్తి జూచి బ్రహ్మయానందించేను .మునులు వేదమంత్రాములతో స్తుతించిరి.వరాహమూర్తి సముద్రాలను కలచివేయుచు భూమిని ఎత్తుదమనుకొన్నసమయములో హిరణ్యాక్షుడు వచ్చి అడ్డుపడెను . హిరణ్యాక్షుడు గదచేత బూని వరాహమూర్తి నెదిరించగా ,అతడు వానిని తన వజ్రసమమైన దంష్ట్ర(కోర) తో చీల్చి వేసి ఆ కొరమీదనే భూమిని నిలుపుకుని సముద్రమునుండి పైకివచెను . దేవతలు,మునులు ఆ వరాహ మూర్తిని యజ్ఞపురుషునిగా తెలుసుకొని అనేక విధములుగా స్తుతించిరి .