Read more!

కార్తీకమాసంలో వనభోజనాలు ఎందుకు

 


కార్తీకమాసంలో వనభోజనాలు ఎందుకు?

 Karthika Puranam – 15

 

 

ఆవేళ కార్తీక పౌర్ణమి కావడాన నైమిశారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో  వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరిచెట్టు (A tree with acid fruit used for pickles. Phyllanthus Emblica; Emblic myrobalan ) కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఉంచారు. ఉసిరికలతో హరిని పూజించారు. తర్వాత గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. సాయంకాల సంధ్యావందనాలు పూర్తిచేసుకుని తులసీ బృందావనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మళ్ళీ విష్ణువును కార్తీక దామోదరునిగా ప్రతిష్టించుకున్నారు. ప్రాణ ప్రతిష్టాదులు చేశారు. ''ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'' అంటూ నమస్కరించి దీపారాధన చేశారు. ధ్యానావాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గాంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు, పుష్పాలం కరణ, నమస్కారాలు అనే షోడశోపచారాలతో పూజించారు. విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి, దానిమీద తిలలు మొదలైన ధాన్యాదులు ఉంచి ఆపైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు.

అనంతరం కార్తీక మాసం మొదటినుండి తాము చెప్పుకుంటూ వస్తున్నా స్కాంద పురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్ఠోపా ఖ్యానం, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిళోపాఖ్యానము, మంధరోపాఖ్యానము, శ్రుతకీర్తి ఉపాఖ్యానము, అంబారీషోపాఖ్యానము మొదలైన వానిని పునః మననం చేసుకున్నారు. ఆనక మునులందరూ కూడి, యజ్ఞ దర్శనార్ధం సూతుల వారిచే ప్రవచింపబడే సంపూర్ణ కార్తీక మహా పురాణ శ్రవణార్ధం నైమిశారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు. ఆ రాత్రి శౌనకాది మునివర్యులు కాలాతిక్రమణ కూడా లెక్కచేయక హరినామస్మరణతో, సంకీర్తనతో, నృత్య గానాది ఉపచార సమర్పణలతో గడిపి, భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు.

Kartika Puranam and Hindu rituals, Karthika Vanabhojanam on Karthika Pournami, Karthika Vanabhojanam in Karthika Masam, Karthika Puranam and Vanabhojana Mahotsavam