నిజం చెప్పిన వేద.. కొత్త డ్రామా స్టార్ట్ చేసిన కైలాష్!
గత కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఎన్నెన్నో జన్మల బంధం`. బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఈ సీరియల్ లో నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా ఖుషీ అనే పాప చుట్టూ తిరిగిన ఈ సీరియల్ గత వారం నుంచి చిత్ర మైన మలుపులు తిరుగుతూ వేద - కైలాష్ ల చుట్టూ నడుస్తోంది.