ఆర్య వర్ధన్ కు లభించిన బలమైన సాక్ష్యం ఏంటది?
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె కీలక జంటగా నటించారు. ఇతర పాత్రల్లో జయలలిత, బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, రామ్ జగన్, విశ్వమోహన్, రాధాకృష్ణ, అనూషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమాదేవి, సందీప్ తదితరులు నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఆద్యంతం చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతూ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది.