English | Telugu

రాజువయ్యా..మహరాజువయ్యా..

కొంతమందికి తీసుకునే అలవాటు ఉంటే ఇంకొంతమందికి ఇచ్చే అలవాటు ఉంటుంది. రెండో కోవలోకి వస్తారు మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల అతని కొడుకు రికీ. ఈసారి ఒక స్వచ్చంద కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా నిర్వహించి మళ్ళీ తన అభిమానుల మనసులను దోచుకున్నాడు. హైదరాబాద్ లోని చెంగిచెర్లలో ఉన్న 70 మంది నిరుపేద పిల్లలకు పీజ్జాలు, పుస్తకాలను పంపిణీ చేసాడు. ఆ తర్వాత కాసేపు ఆ ఇద్దరూ కలిసి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ స్కూల్లో చదువు ఎలా చెప్తున్నారు, ఎలా చదువుకుంటున్నారనే విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపమ్, రిక్కీ ఇద్దరూ కలిసి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేశారు. ఇక అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా కార్తీకదీపం గురుంచి ప్రత్యేకంగా ముచ్చట్లు చెప్పారు.

ఇప్పటికీ ఇంకా ఆ సీరియల్ ని ఫాలో అవుతున్నామన్నారు. కార్తీక దీపం సీరియల్ లో మీరిద్దరూ చాలా బాగా నటించారు . ఈసారి మాత్రం తప్పనిసరిగా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ని కూడా తీసుకురావాలి అని మరీ మరీ చెప్పారు. కార్తీక దీపం సీరియల్ నుంచి బయటకి వచ్చేశాక డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటినుంచే ఇవ్వడం అనేది అలవాటు చేస్తే వాళ్లకు కూడా తెలుస్తుంది తనకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి అలాంటి సౌకర్యాలు లేక బయట ఎంతమంది బాధ పడుతున్నారు అనే విషయాలు . అందుకే రిక్కీకి ఇవన్నీ తెలియాలనే తీసుకెళ్ళాను అన్నాడు డాక్టర్ బాబు. ఇక కార్తీక దీపం బుల్లి తెర మీద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. నిరుపమ్ ఇప్పటికే ఎన్నో షోస్ లో కనిపించాడు. చాలా సీరియల్స్ లో నటించాడు. ఈయన భార్య మంజుల కూడా బుల్లితెర నటే. ఇప్పుడు ఈ కార్తీకదీపం సీరియల్ లో కొత్త క్యారెక్టర్స్ గా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ, మానస్ నాగులపల్లి, మనోజ్ కుమార్, సుష్మా కిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక నిరుపమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ఎవరితో అనే విషయాలు ఇప్పటివరకు ఇంకా రెవీల్ చేయలేదు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.