English | Telugu

ర‌ష్మిని హైప‌ర్ ఆది తెలిసే కొట్టాడా?

జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌ని సుడిగాలి సుధీర్‌తో పాటు అన‌సూయ కూడా వ‌దిలేయ‌డంతో హైప‌ర్ ఆది కూడా జ‌బ‌ర్ద‌స్త్‌ని వీడి `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`లో సెటిల‌య్యాడు. సుడిగాలి సుధీర్‌తో పాటు అన‌సూయ స్టార్ మాలో సెటిలైపోయారు. అక్క‌డే సూప‌ర్ సింగ‌ర్ షోతో పాటు ప‌లు షోల‌కు యాంక‌ర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`లో సెటిలైన హైప‌ర్ ఆది అక్క‌డ త‌న‌దైన స్టైల్లో పంచ్‌లు వేస్తూ నానా ర‌చ్చ చేస్తున్నాడు. ఇందులోకి రీసెంట్ గా ర‌ష్మీ గౌత‌మ్ కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇద్ద‌రు క‌లిసి ఓ రేంజ్‌లో ర‌చ్చ చేస్తున్నారు.

ఇంద్ర‌జ ప్లేస్‌లో పూర్ణ కంటిన్యూ అవుతోంది. జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలు కాస్త క్రేజ్ త‌గ్గ‌డంతో వాటి సంద‌డి క‌నిపించ‌డం లేదు. కానీ `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` మాత్రం రీసౌండ్ ఇస్తోంది. సుధీర్‌తో మొద‌లైన ఈ షో ఇప్ప‌డు పాపుల‌ర్ అయిపోయింది. ఇందులో లేడీ టీమ్ లీడ‌ర్స్ తో పాటు ఆటో రాం ప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది, బుల్లెట్ భాస్క‌ర్, ఇమ్మానుయేల్‌ వంటి వాళ్లు త‌మ‌దైన స్కిట్ల‌తో అద‌ర‌గొడుతున్నారు. ఈ ఆదివారం జూలై 10 న ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ ని `ఆషాడం అల్లుళ్లు` పేరుతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.

దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ షోకు న‌టి ప్ర‌గ‌తి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ర‌ష్మీని వ‌ర్ష‌ కాసేపు ఆట‌ప‌ట్టించింది. "నువ్వు కూడా ఆషాడానికి వ‌చ్చావు క‌దా అక్కా.. బావ అక్క‌డున్నాడు క‌దా" అని వ‌ర్ష కామెంట్ చేసింది. దీంతో ర‌ష్మీ.. "ఎవ‌రే నీకు అక్క.. వెళ్లి కూర్చో" అని మండిప‌డింది. ఇక ఆదికి క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి అత్త‌ల‌ని కొట్టాల‌ని క‌ర్ర ఇవ్వ‌డంతో దొరికిందే ఛాన్స్ అనుకుని ర‌ష్మీని కొట్టేశాడు.. ఆ త‌రువాత "నేను ర‌ష్మీని" అన‌డంతో ఐతే ఓకే అన్నాడు. దీంతో అక్క‌డున్న వారంతా న‌వ్వేశారు. న‌వ్వులు పూయిస్తున్న ఈ ఎపిసోడ్ జూలై 10 ఆదివారం ప్ర‌సారం కానుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.